-
శిరీష శ్రమ ఫలించింది!
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్) : పట్టుదలకు శ్రమ తోడైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని మరోసారి రుజువైంది. సామాన్య కుటుంబంలో జన్మించి సాధారణ విద్యార్థిగా కొనసాగిన ఆమె ఉన్నత లక్ష్యాన్ని చేరుకొని అందరి చేత శభాస్ అనిపించుకుంటోంది. ఇటీవల వెల్లడైన సివిల్ జడ్జి ఫలితాల్లో గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామం కీర్తినగర్కు చెందిన శిరీష పేరు ఉండడంతో ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయానికి రక్షణగా .. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, రోజురోజు మహిళలపై జరుగుతున్న ఘోరాలకు చలించిపోయిన శిరీష ఏనాటికైనా న్యాయశాస్త్రంలో ప్రతిభ చాటాలని నిర్ణయించుకుంది. సైన్స్ కోర్సులో భవిష్యత్ ఉందని తెలిసినా పేదలు, మహిళలకు న్యాయం చేయాలంటే న్యాయ శాస్త్రమే సరైన వేదికగా భావించి ఆ రంగం వైపే అడుగులు వేసింది. ముగ్గురు సంతానంలో ఒకరు.. వరంగల్ పాపయ్యపేట చమన్కు చెందిన కటుకోజ్వల సర్వమంగళచారి – రమాదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో శిరీష 10వ తరగతి వరకు ఆంధ్రా బాలిక హైస్కూల్లో చదివి ఇంటర్, బీఫార్మసీ వరకు హన్మకొండలోనే చదివారు. మూడేళ్ల క్రితం గీసుగొండ మండలం గొర్రెకుంట కీర్తినగర్కు చెందిన హైకోర్టు న్యాయవాది పూసల శ్రీకాంత్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే శిరీషకు కుడా న్యాయశాస్త్రం వైపే వెళ్లాలనే ఆలోచన ఉండండంతో భర్త ప్రోత్సహించారు. దీంతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, హైదరాబాద్ బషీర్బాగ్ పీజీ కాలేజీలో ఎల్ఎల్ఎం చేశారు. ఆ తర్వాత 2014 నుంచి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే తన లక్ష్యసాధనకు శ్రద్ధగా కృషి చేశారు. 2019 మే లో జరిగిన ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులై ఆగష్టులో జరిగిన మెయిన్స్కు హాజరయ్యారు. సెప్టెంబర్లో నిర్వహించిన ఇంటర్వూలో పాల్గొన్నారు. దీంతో 18న ప్రకటించిన సివిల్ జడ్జి ఫలితాలోల్ల శిరీష ఎంపికయ్యారు. ఆనందంగా ఉంది.. నా శ్రమ ఫలించడంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు కష్టపడి డిగ్రీ వరకు చదివిస్తే పీజీ చేసేలా నా భర్త శ్రీకాంత్ ప్రోత్సహించారు. నిజంగా పట్టుదల ఉంటే ఏది సాధ్యం కాదనిపిస్తోంది. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పేదలు, మహిళలకు మెరుగైన న్యాయసాయం అందేలా కృషి చేస్తా. –కటుకోజ్వల శిరీష -
నటుడు, జనసంక్షేమ నేత కోన ప్రభాకరరావు
క్రీడాకారుడుగా, సినీనటుడిగా, రాజకీయనేతగా మూడు విభిన్నరంగాల్లో తనదైన శైలితో రాణించిన కోన ప్రభాకరరావు తాను నిర్వహించిన పదవులకు వన్నెతెచ్చారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమాలో ప్రతిభను చాటి, రాజకీయాల్లోకి వచ్చిన తొలి నటుడిగా గుర్తింపు పొందారు. కోన ప్రభాకరరావు స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. 1910 జూలై 10న జన్మించారు. అప్పటి మద్రాస్ లయోలాలో డిగ్రీ, పుణేలోని ఐఎల్ఎస్ లా కాలేజిలో న్యాయవాద కోర్సు చేశారు. ఆంధ్ర టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నవయసులోనే కళలంటే ఆపేక్ష కలిగిన ప్రభాకరరావు నటుడిగా రాణించాలని తపనపడ్డారు. స్వస్థలంలో 1940 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే నాటక సంఘాలు, నటులతో అనుబంధం పెంచుకున్నారు. దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో తన పద్యగానంతో కళాభిమానుల్ని రంజింపజేశారు. 1946లో తాను హీరోగా ‘మంగళసూత్రం’ అనే సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎల్వీ ప్రసాద్ నటించిన ‘ద్రోహి’ సినిమాలో బుర్రమీసాలు, బుగ్గన గాటు, పులిపిరితో కనిపించే విలన్కు భిన్నంగా సూటూబూటుతో పాలిష్డ్ విలన్గా అద్భుతంగా నటించారు. 1951లో ‘సౌదామిని’ సినిమాను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ‘నిరపరాధి’, ‘నిర్దోషి’తో సహా 28 సినిమాల్లో నటించారు. ‘రక్తకన్నీరు’ నాగభూషణంను సినీ రంగానికి పరిచయం చేశారు. కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావుతో గల పరిచయంతో ప్రభాకరరావు రాజకీ యాల్లోకి వచ్చారు. 1967లో బాపట్ల నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నిక య్యారు. 1983 వరకు ఓటమి ఎరుగని నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్ర శాసనసభ స్పీకరు, ఆర్థికమంత్రి సహా పలు మంత్రి పదవులను చేపట్టారు. బాపట్లకు తాగునీరు, సాగునీటి వసతిని కల్పించిన ఘనత ప్రభాకరరావుదే. చివరిభూములకు సాగు నీటికని పంటకాల్వలకు సిమెంట్ లైనింగ్ను తొలిసారిగా అమలుచేశారు. 1963లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి విద్యాసంస్థలను నడిపిస్తూ మార్గదర్శనం చేశారు. 1983లో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులయిన ప్రభాకరరావు, సిక్కిం, మహారాష్ట్ర గవర్నరుగానూ పనిచేశారు. వివిధ నాట్య రీతుల్లో ప్రసిద్ధులైన రంగరాజన్, వెంపటి చిన సత్యం, బ్రిజుమహరాజ్, పాణిగ్రాహి వంటి నాట్యగురువులు, నర్తకీమణులను రప్పించి సికింద్రాబాద్ రైల్ కళారంగ్లో ఆ నాలుగు ఫార్మాట్లలోనూ ‘శ్రీకృష్ణపారిజాతం’ నృత్య రూపకాన్ని ప్రదర్శింపజేశారు. 1990 అక్టోబర్ 20న గుండెపోటుతో కన్నుమూశారు. కళా, రాజకీయరంగాల్లో ప్రభాకరరావు వారసత్వం కొనసాగుతోంది. ఆయన కుమా రుల్లో ఒకరైన కోన రఘుపతి బాపట్ల నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రఘుపతి కుమార్తె కోన నీరజ సినీరంగంలో స్టైలిస్ట్గా ఉన్నారు. రఘుపతి సోదరుడి కొడుకు కోన వెంకట్ సినీరంగంలో రచయితగా జైత్రయాత్ర సాగిస్తున్నారు. (నేడు కోన ప్రభాకరరావు వర్ధంతి) - బి.ఎల్.నారాయణ సాక్షి, తెనాలి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement