-
24 గంటల్లోనే చేదించారు
- ఇద్దరు నిందితులు అరెస్ట్ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర శివారులో ఆదివారం జరిగిన న్యాయవాది ఉదయ్ కుమార్ హత్యకేసును పోలీసులు చేధించారు. భూవివాదమే హత్యకు దారితీసినట్టు పోలీసులు తేల్చారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అడ్డకేట్ ఉదయ్కుమార్ హత్యకేసును సవాల్గా స్వీకరించిన పోలీసులు 24 గంటల్లోనే చేదించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కీసరపోలీస్స్టేషన్లో మల్కాజ్గిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీఫీ రఫిక్, కీసర సి.ఐ గురువారెడ్డిలు నిందితుల వివరాలను ,హత్యజరిగిన తీరును వివరించారు. వివరాల్లోకి వెళ్లితే కాప్రా ఆఫీసర్స్కాలనీలో నివాసం ఉండే ఉదయ్కుమార్ మల్కాజ్గిరి కోర్టులో జూనియర్న్యాయవాదిగా పనిచేస్తుండేవాడు. ఉదయ్కుమార్ తండ్రి నకులుడు ఆర్మిరిటైర్డ్ ఆఫిసర్. ఆర్మీలోపనిచేసిన సమయంలో నకలుడికి ఆర్మి వెల్పేర్అసోషియేషన్ నుండి 1975 లో జవహార్నగర్ పంచాయతీపరిధిలోని చెన్నాపూర్ గ్రామంలో సర్వేనెంబ 700 లో సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.కాగా జహహార్నగర్ ఆర్మివెల్పేర్అసోషియేషన్స్థలాలకు , ప్రభుత్వానికి మద్య ఈ భూములకు సంబందించి కోర్టులో కేసు నడుస్తున్నందునా నకులుడికి పట్టా సర్టిపికేటు రాలేదు.నకులుడికి వేల్పేర్ అసోషియేషన్ నుండి వచ్చిన 5 ఎకరాల్లో గత కొన్నేళ్ల గా జవహర్నగర్కు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి నకులుడివద్ద నుండి లీజ్కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆంజనేయులు ఈస్థలాన్ని కారుచౌకగా కొట్టేయలని పథకం వేసి అల్లుడైన లోకేష్(గుంటూరువాసి)చే ఏప్రిల్ 2016లో నకులుడికి రూ 25 లక్షల నగదు చెల్లించి సదరు భూమిని నోటరీ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నకులుడు కుమారుడైన అడ్వకేట్ జవహర్నగర్లో గల వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తనకు తెలియకుండా కారుచౌకగా తమ తండ్రి వద్ద నుండి ఏవిధంగా భూమిని కొనుగోళు చేసుకుంటారని లోకే ష్తో వాదనకుదిగాడు. ఇచ్చిన డబ్బులను తిరిగి తీసుకొని తమ భూమిని తమకు ఇవ్వాలని లోకేష్ పై ఉదయ్కుమార్ గతరెండు మాసాలుగా ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈనేపద్యంలోనే ఉదయ్కుమార్ అడ్డును తొలగించుకోవాలని లోకేష్ పన్నాగం పన్నాడు. శనివారం మద్యాహ్న ం 1 గంట సమయంలో జవహర్నగర్లోగ ల తమ తండ్రికి చెందిన వ్యవసాయభూమి వద్దకు వెళ్లిన ఉదయ్కుమార్ను చూసిన లోకేష్ అతడితో గొడవకు దిగాడు. తాను కొనుగోళు చేసిన భూమి వద్దకు మళ్లి ఎందుకువచ్చావని వెంటతెచ్చుకున్న పదునాటి కత్తితో ఉదయ్కుమార్ మెడమీద కొట్టడంతో ఉదయ్కుమార్ ఒక్కసారిగా క్రిందపడిపోయాడని దీంతో నిందితుడు లోకేష్ మరో రెండు మూడుసార్లు క్రింద పడిపోయిన ఉదయ్కుమార్ మెడపై కత్తితోదాడి చేయడంతో ఉదయ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని అక్కడి నుండి తరలించేందుకు లోకేష్ పక్కనే వ్యవసాయం చేస్తున్న సుమన్రెడ్డి సహయం కోరగా అంగికరించిన సుమన్ మృతిచెందిన ఉదయ్కుమార్ మృతదేహాన్ని లోకేష్, సుమన్రెడ్డిలు ఇద్దరు కలిసి ఉదయ్కుమార్ కారు వెనక సీట్లో పెట్టి అక్కడినుండి సుమన్రెడ్డి వెళ్లిపోయాడు. అనంతరం లోకేష్ తన ద్వీచక్రవాహానం పై జవహర్నగర్లోగల పెట్రోల్బంక్ వద్దకు వెళ్లి రూ 500 ల పెట్రోల్ను ఒక డబ్బాలో కొనుగోళు చేసుకొని సంఘటనాస్థలానికి చేరుకొని రాత్రి 7 గంటల సమయంలో మారుతికారును నడుపుకుంటూ కీసరదాయర గ్రామశీవారుకు తీసుకువచ్చి మృతదేహాంతోపాటు, కారు మీద పెట్రోల్ పోసి నిప్పటించాడు. కారుకు నిప్పటించే సమయంలో హఠాత్తుగా నింధితుడి లోకేష్ కుడా మంటలు అట్టుకోవడంతో అతడు కుడా గాయపడ్డాడు. తన షర్ట్ను అక్కడే విప్పి కాలీనగాయాలతో లోకేష్ కీసరదాయర గ్రామం మీదుగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈసిఐఎల్కు చేరుకున్నాడని అక్కడి నుండి చికిత్సనమిత్తం గాంధి ఆసుపత్రికి చేరుకున్నాడన్నారు. లోకేష్కుడా 45 శాతం మేర కాలిందని అతడి పరిస్థితికుడా కొంత మేర విషమంగా ఉందని దీంతో అతడిని అరెస్టుచేయలేదని , మృతదేహాన్ని తరలించేందుకు సహకరించిన నిందితుడు సుమన్న్రెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హజరుపరడచం జరిగిందన్నారు. కాగా ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా కారుతో సహాకాలిపోయి వెముకలు మాత్రమే మిగిలిన అడ్వకేట్ ఉదయ్కుమార్ హత్యకేసును గ్యాస్సీలిండర్నెంబర్ ఆధారంగా కేవలం 24 గంటలోపే చేధించిన కీసర సి.ఐ గురువారెడ్డి, ఎస్.ఐ అనంతచారి, విష్ణువర్థన్రెడ్డి, సిబ్బంది డీసీపీ,ఏసీపీ రఫిక్లు అభినందించారు.కాగా నింధితుడి ద్వీచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని హత్యకు ఉపయోగించిన కత్తిని నిందితుడు రహాస్యప్రాంతంలో దాచిపెట్టడాన్ని నిందుతుడు ఆసుపత్రిలో కోలుకోగానే హత్యకుఉపయోగించిన కత్తిని కుడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులుతెలిపారు. నింధితులను కఠినంగా శిక్షించాలి: కాగా అడ్వకేట్ ఉదయ్కుమార్ను దారుణంగాహత్యచేసిని నింధులను కఠినంగా శిక్షించాలని మల్కాజ్గిరి బార్అసోషియేషన్సభ్యులు డీమాండ్చేశారు. ఈమేరకు కీసరపోలీస్స్టేషన్ కు చేరుకున్న బార్అసోషియేషన్సభ్యులు డీసీపీ రాంచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఉదయ్కుమార్హత్యకేసులో భూమాఫియా ఉన్నదని పెద్ద వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నంచేస్తున్నారని నిందితులు ఎంత పెద్ద వారైన పోలీసులు వారందరిని కుడా అరేస్టుచేయాలని డీమాండ్చేశారు. ఈ మేరకు సీపీ నికుడా త్వరలోకలిసి తాము ఫిర్యాదుచే స్తామన్నారు. -
భూవివాదమే ప్రాణం తీసిందా..?
ఆయనో న్యాయవాది.. పేరు ఉదయ్కుమార్. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. దీంతో ఆయనకు ప్రభుత్వం శామీర్పేట మండలం జవహర్నగర్ పంచాయతీ పరిధిలోని చెన్నాపూర్ సర్వేనెంబర్ 700లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ భూమి విషయంలో కొంతమందితో అతడికి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కీసర మండలం కీసరదాయర శివారులో చంపేసి కారులో మృతదేహాన్ని ఉంచి దహనం చేశారు. శనివారం అతనికి భార్య అనేకసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చివరకు ఆదివారం ఉదయం కారులో అతడిని దహనం చేసిన విషయం బయట పడింది - కీసర * న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులు * తన తండ్రి మాజీ సైనికుడి పొలం విషయమై గొడవలు * కీసరదాయర శివారులో ఘటన * వివరాలు సేకరించిన డీసీపీ, ఏపీసీ * కలకలం సృష్టించిన ఉదయ్కుమార్ హత్య కీసర: న్యాయవాది ఉదయ్కుమార్(45) హత్య జిల్లాలో ఆదివారం కలకలం రేపింది. మండల పరిధిలోని కీసరదాయర శివారులో దుండగులు ఆయనను చంపేసి కారులో మృతదేహం ఉంచి కాల్చేశారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రఫీక్ తదితరులు పరిశీలించారు. పోలీసులు జాగిలాలతో వివరాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి కీసర రహదారిలో ఉన్న ఓ నీళ్లసంపు వద్దకు వెళ్లింది. కాప్రా శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీకి చెందిన ఉదయ్కుమార్, జగదీశ్వరి దంపతులు. ఉదయ్కుమార్ ఈసీఐఎల్లోని ఓ సీనియర్ న్యాయవాది వద్ద పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా, శని వారం మధ్యాహ్నం తన మారుతీ కారులో వెళ్లిన ఉదయ్కుమార్ తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆయన ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం కీసరదాయర గ్రామ శివారులో ఓ కారులో వ్యక్తి మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలంలో ఓ చెప్పుల జత, సగం చినిగిపోయిన దుండగుడిదిగా భావిస్తున్న చొక్కా, అగ్గిపెట్టె, కారులో కాలిపోయిన మృతుడికి సంబంధించిన సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారి గొడవే కారణమా..? భూవివాదమే న్యాయవాది ఉదయ్కుమార్ హత్యకు దారి తీసి ఉంటుందని కుటుంబీకులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయ్కుమార్ తండ్రి నకులుడు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయనకు సర్కార్ శామీర్పేట మండలం జవహర్నగర్ పంచాయతీ పరిధిలోని చెన్నాపూర్ సర్వేనెంబర్ 700లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఇటీవల సదరు భూమిలోకి వెళ్లే రహదారి విషయంలో కొందరితో వివాదం నెలకొందని కుటుం బీకులు తెలి పారు. 5 నెలల క్రితం ఉదయ్కుమార్ తండ్రి నకులుడిపై కొందరు దాడిచేసి గాయపర్చారని.. ఈ నేపథ్యంలో ఉదయ్కుమార్ హత్య జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశసేవ చేస్తే పుత్రశోకం మిగిలింది కుమారుడి హత్యతో నకులుడు షాక్కు గురయ్యాడు. ఘటనా స్థలంలో ఆయన గుండెలుబాదుకుంటూ రోదించాడు. దేశసేవ చేసిన తనకు పుత్ర శోకం మిగిల్చారని ఆయన రోదించిన తీరు అక్కడున్న వారికి కంటతడి తెప్పించింది. మాంసపు ముద్దగా మారిన తన భర్త ఉదయ్కుమార్ను చూసి మృతుడి భార్య జగదీశ్వరి గుండెలుబాదుకుంటూ రోదించింది. అయితే, ఇటీవల ఉదయ్కుమార్ ఓ కేసు విషయంలో కీసర ఠాణాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఉదయ్కుమార్, జగదీశ్వరి దంపతులకు సంతానం లేదు. మల్కాజిగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు పోలీసులను డిమాండ్ చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఆ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు, రూ.1.8 లక్షల బోనస్ కూడా
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement