-
‘డ్రా’తో గట్టెక్కిన ఆంధ్ర
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు లీగ్ దశను ‘డ్రా’తో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా కేరళతో జరిగిన చివరిదైన ఏడో లీగ్ మ్యాచ్ను ఆంధ్ర జట్టు పోరాడి ‘డ్రా’ చేసుకుంది. చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు సాధించి ‘డ్రా’తో గట్టెక్కింది. 242 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కేరళ జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్ర జట్టుకు ఒక పాయింట్ లభించాయి. అశ్విన్ హెబ్బర్ (165 బంతుల్లో 72; 12 ఫోర్లు, 1 సిక్స్) సంయమనంతో ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కరణ్ షిండే (82 బంతుల్లో 26; 5 ఫోర్లు), షేక్ రషీద్ (93 బంతుల్లో 36; 6 ఫోర్లు), షోయబ్ ఖాన్ (93 బంతుల్లో 11; 2 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి ఆంధ్ర జట్టుకు ఓటమి తప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 272 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ తొలి ఇన్నింగ్స్ను 514/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. -
ICC ODI World Cup 2023, India vs Netherlands: భారత్ 9/9
సంపూర్ణం... లీగ్ దశలో భారత్ జైత్రయాత్ర! నెదర్లాండ్స్ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్ ప్రాక్టీస్తో టీమిండియా ముగించింది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి ఫిఫ్టీలతో.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్; కేఎల్ రాహుల్ సెంచరీలతో డచ్ బౌలర్లను నెట్ ప్రాక్టీస్లో ఆడుకున్నంత ఈజీగా ఆడేశారు. అనంతరం ఏకంగా 9 మంది భారత బౌలర్లు నెదర్లాండ్స్ బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. చివరకు భారీ విజయ సాధించిన రోహిత్ శర్మ బృందం అజేయంగా లీగ్ దశను పూర్తిచేసి బుధవారం న్యూజిలాండ్తో సెమీఫైనల్ పోరుకు సై అంటోంది. బెంగళూరు: వన్డే ప్రపంచకప్లో భారత్ వంద శాతం అంకితభావంతో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో లీగ్ దశను అజేయంగా దాటింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై జయభేరి మోగించింది. క్రికెట్ కూనపై టాస్ గెలవగానే బ్యాటింగ్కు దిగిన భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు శతకాన్ని... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయ సెంచరీని సాధించారు. రోహిత్ శర్మ (54 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్లు), కోహ్లి (56 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజ నిడమనూరు (39 బంతుల్లో 54; 1 ఫోర్, 6 సిక్స్లు) మెరిపించాడు. బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా 2 వికెట్లు తీస్తే... కోహ్లి, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్తో భారత్ ఆడుతుంది. ఐదుగురూ చితగ్గొట్టారు... ఓపెనర్లు రోహిత్ బౌండరీలతో... శుబ్మన్ సిక్సర్లతో భారత్ 10 ఓవర్లలోనే 91/0 స్కోరు చేసింది. 30 బంతుల్లోనే గిల్ ఫిఫ్టీ పూర్తవగానే నిష్క్రమించాడు. 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి వచ్చాక కెపె్టన్ రోహిత్ 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికే అతనూ పెవిలియన్ చేరాడు. కోహ్లి, అయ్యర్ జోడీ కూడా పాతుకుపోవడంతో డచ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 53 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకోగా, భారత్ స్కోరు 29వ ఓవర్లో 200 దాటింది. అక్కడే కోహ్లి వికెట్ పడింది. ఇక్కడితో అర్ధశతకాల ఆట ముగియగా... శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాల బ్యాటింగ్ను చూపెట్టారు. 48 బంతుల్లో అయ్యర్, 40 బంతుల్లో రాహుల్ అర్ధశతకాలు సాధించారు. 42వ ఓవర్లో భారత్ 300 పరుగులు చేయగా... ఆ తర్వాత రాహుల్ ఆట పూర్తిగా మారింది. పరుగుల వేగం పుంజుకుంది. అయ్యర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఆఖరి 8.2 ఓవర్లలోనే భారత్ 110 పరుగులు చేసింది. 49వ ఓవర్లో అయ్యర్ మూడు సిక్స్లు, ఒక బౌండరీతో 25 పరుగులు పిండుకుంటే... ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదిన రాహుల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. దీంతో భారత్ స్కోరు 400 మార్క్ దాటింది. ఐదో బంతికి రాహుల్ అవుటయ్యాడు. రాహుల్, అయ్యర్ 208 పరుగులు జోడించి ప్రపంచకప్ చరిత్రలో నాలుగో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు సృష్టించారు. కూన కుదేల్ లక్ష్యం కొండంత ఉన్నా దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా నెదర్లాండ్స్ బ్యాటర్లు తమ వంతుకు వచ్చిన ఆటే ఆడారు. మ్యాక్స్ ఒ డౌడ్ (30), అకెర్మన్ (35), సైబ్రాండ్ (80 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. విజయవాడలో జని్మంచి నెదర్లాండ్స్లో స్థిరపడ్డ తేజ నిడమనూరు మిడిలార్డర్లో కాసేపు భారీ సిక్సర్లతో మురిపించాడు. అయ్యర్, కీపర్ రాహుల్ మినహా 9 మంది భారత తరఫున బౌలింగ్కు దిగారు. ప్రధాన బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక చేయివేశారు. తేజ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తికాగానే ఆ మెరుపులకు రోహిత్ స్వయంగా బౌలింగ్ చేసి ముగింపు పలికాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వెస్లీ (బి) లీడే 61; గిల్ (సి) తేజ (బి) మీకెరన్ 51; కోహ్లి (బి) మెర్వ్ 51; అయ్యర్ (నాటౌట్) 128; రాహుల్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 102; సూర్యకుమార్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–100, 2–129, 3–200, 4–408. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–52–0, వాన్ బిక్ 10–0–107–0, అకెర్మన్ 3–0–25–0, మీకెరన్ 10–0–90–1, వాన్డెర్ మెర్వ్ 10–0–53–1, బస్ డి లీడే 10–0–82–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; ఒ డౌడ్ (బి) జడేజా 30; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 35; సైబ్రాండ్ (బి) సిరాజ్ 45; ఎడ్వర్డ్స్ (సి) రాహుల్ (బి) కోహ్లి 17; లీడే (బి) బుమ్రా 12; తేజ (సి) షమీ (బి) రోహిత్ 54; వాన్ బిక్ (బి) కుల్దీప్ 16; మెర్వ్ (సి) షమీ (బి) జడేజా 16; ఆర్యన్ (బి) బుమ్రా 5; మీకెరన్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 13; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 250. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–111, 5–144, 6–172, 7–208, 8–225 9–236, 10–250. బౌలింగ్: బుమ్రా 9–1–33–2, సిరాజ్ 6–1–29–2, షమీ 6–0–41–0, కుల్దీప్ 10–1–41–2, జడేజా 9–0–49–2, కోహ్లి 3–0–13–1, గిల్ 2–0–11–0, సూర్యకుమార్ 2–0–17–0, రోహిత్ 0.5–0–7–1. 9: ఒకే ప్రపంచకప్లో భారత్ వరుసగా 9 మ్యాచ్ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. 2003 ప్రపంచకప్లో భారత్ వరుసగా 8 మ్యాచ్ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా జట్టు 2003, 2007 ప్రపంచకప్లలో వరుసగా 11 మ్యాచ్ల్లో గెలిచి చాంపియన్గా నిలిచింది. 7: వన్డేల్లో 400 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం భారత్కిది ఏడోసారి. దక్షిణాఫ్రికా జట్టు అత్యధికంగా 8 సార్లు ఈ మైలురాయిని దాటింది. 9: ప్రపంచకప్ మ్యాచ్లో తొలిసారి భారత్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ వేయించింది. గతంలో ఇంగ్లండ్ (1987లో శ్రీలంకపై), న్యూజిలాండ్ (1992లో పాకిస్తాన్పై) జట్లు మాత్రమే తొమ్మిది మంది బౌలర్లకు అవకాశం ఇచి్చంది. 24: ఈ ఏడాది వన్డేల్లో భారత్ సాధించిన విజయాలు. 1998లోనూ భారత్ అత్యధికంగా 24 వన్డేల్లో గెలిచింది. 60: ఒకే ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ (60) నిలిచాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 58 సిక్స్లు కొట్టాడు. 215: ఈ ఏడాది భారత జట్టు 30 వన్డేలు ఆడి కొట్టిన సిక్స్లు. 2019లో వెస్టిండీస్ అత్యధికంగా 209 సిక్స్లు కొట్టింది. -
ఫిఫా అండర్-17 వరల్డ్ కప్.. లీగ్ దశలోనే భారత్ అవుట్
భువనేశ్వర్: ప్రపంచ అండర్–17 మహిళల ఫుట్బాల్ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో 0–8తో ఓడిన భారత్... శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో 0–3తో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. మొరాకో తరఫున దోహా ఎల్ మదానీ (51వ ని.లో), యాస్మీన్ జౌహర్ (62వ ని.లో), జెనా షరీఫ్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్ ఈనెల 17న జరిగే నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్లో బ్రెజిల్తో ఆడుతుంది. బ్రెజిల్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతం బ్రెజిల్, అమెరికా నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో... మూడు పాయింట్లతో మొరాకో రెండో స్థానంలో ఉంది. -
భారత్ను గెలిపించిన రూపిందర్
మలేసియాపై విజయంతో అగ్రస్థానం ఆసియా హాకీ చాంపియన్స ట్రోఫీ క్వాంటన్ (మలేసియా): అందుబాటులో ఉన్న కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లతోనే బరిలోకి దిగినప్పటికీ ఆసియా చాంపియన్స ట్రోఫీ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆతిథ్య మలేసియా జట్టుతో బుధవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. రూపిందర్ పాల్ సింగ్ (12వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. మలేసియా జట్టుకు రజీ రహీమ్ 18వ నిమిషంలో ఏకై క గోల్ను అందించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో రూపిందర్ 10 గోల్స్ చేయడం విశేషం. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్ నాలుగు విజయాలు, ఒక ‘డ్రా’తో కలిపి మొత్తం 13 పారుుంట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఇప్పటికే సెమీస్కు చేరుకున్న టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరో గురువారం చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లు ముగిశాక తెలుస్తుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం సెమీఫైనల్స్ జరుగుతారుు. గురువారం జరిగే లీగ్ మ్యాచ్ల్లో పాకిస్తాన్తో చైనా; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతారుు. మలేసియా 9 పారుుంట్లతో రెండో స్థానంలో, కొరియా 7 పారుుంట్లతో మూడో స్థానంలో, 6 పారుుంట్లతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉన్నారుు. ప్రస్తుత సమీకరణాల ప్రకారం కొరియా లేదా పాకిస్తాన్తో భారత్ సెమీస్లో ఆడే అవకాశాలున్నారుు. మలేసియాతో జరిగిన మ్యాచ్లో చివరి 27 సెకన్లలో భారత్ పెనాల్టీ కార్నర్ను సమర్పించుకుంది. అరుుతే మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ డ్రాగ్ ఫ్లిక్ స్కూప్ షాట్ను భారత గోల్కీపర్ ఆకాశ్ నిలువరించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. -
టైటిల్ లక్ష్యంగా బరిలోకి...
క్వాంటాన్ (మలేసియా): రెండేళ్ల విరామం తర్వాత మరోసారి జరుగుతున్న ఆసియా చాంపియన్స ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. నేటి నుంచి ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నారుు. భారత్తోపాటు పాకిస్తాన్, చైనా, జపాన్, మలేసియా, దక్షిణ కొరియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారుు. గురువారం జరిగే తొలి మ్యాచ్లో జపాన్తో భారత్ ఆడనుంది. డిఫెండింగ్ చాంపియన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ ఈనెల 23న తలపడుతుంది. ఆరు జట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటారుు. 2011లో తొలిసారి జరిగిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలువగా... 2012, 2013లలో పాకిస్తాన్ టైటిల్ సాధించింది. గోల్కీపర్ శ్రీజేష్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో గాయాల కారణంగా మన్ప్రీత్ సింగ్, ఎస్వీ సునీల్, రఘునాథ్ తదితర కీలక ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
Advertisement