-
లెవీ విధానాన్ని పునరుద్ధరించాలి
* కేంద్రానికి తెలంగాణ రైస్ మిల్లర్ల డిమాండ్ * ఇందిరా పార్కులో మహా ధర్నా హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం లేవీ విధానాన్ని పునరుద్ధరించాలని, రైస్మిల్లర్ల నుంచి ఎఫ్సీఐ ద్వారా లేవీ సేకరించాలని తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ, వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం లేవీ రద్దు చేయడంతో బియ్యం మిల్లుల నిర్వాహణ కష్టంగా మారి మిల్లులు మూసుకునే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. ధర్నాలోరైస్ మిల్లుల యజమానులతోపాటు వాటిపై ఆధారపడ్డ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేంధర్రెడ్డి మాట్లాడుతూ లేవీ విధానంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను మూతపడేలా చేస్తోందని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ లేవీ విధానం కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ మిల్లర్ల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వరని, మంత్రులేమో పనిచేయరని విమర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ కొత్త పరిశ్రమలను తెస్తామంటున్న ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కాపాడడంలో విఫలమైందన్నారు. తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్రెడ్డిలు మాట్లాడుతూ గతంలో ఉన్న 75 శాతం లేవీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2015-16కు పునరుద్ధరించి రైతులు, రైస్ మిల్లులను ఆదుకోవాలన్నారు. ఈ పంట సంవత్సరానికి కస్టమ్ మిల్లింగ్ చార్జీలను క్వింటాల్ ధ్యానం మిల్లింగ్కు పచ్చి బియ్యం (రా రైస్)కు రూ. 75, బాయిల్డ్ బియ్యానికి రూ. 100 చొప్పున చెల్లించాలని కోరారు. మిల్లుల్లో ధ్యాన్యాన్ని టెస్ట్ మిల్లింగ్ చేయించి రా రైస్ దిగుబడి శాతాన్ని నిర్ణయించాలన్నారు. సూపర్ ఫైన్ బియ్యం అమ్మకంపై వ్యాట్ను 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, మండవ వెంకటేశ్వర్రావు, దక్షిణ భారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, ఏపీ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కొంపముంచనున్న..కొత్త లెవీ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బియ్యం సేకరణ (లెవీ) విధానం ఒకే విధంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అటు రైతులకు.. ఇటు చిన్నమిల్లర్లకు ఆశనిపాతంగా మారనుంది. పాత పద్ధతి ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి రైస్మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75శాతం ప్రభుత్వానికి లెవీగా పెట్టేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విధానంలో కేవలం 25శాతం మాత్రమే లెవీగా సేకరించనున్నారు. దీంతో మిల్లర్లు ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కంటే, మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసే ధాన్యమే ఎక్కువ. గ్రామాల్లో వరి కల్లాల వద్ద నేరుగా వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం మొత్తం చేరేది కూడా మిల్లులకే. లెవీ తగ్గింపుల వల్ల అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం మిల్లర్లకు ఉండదు. ప్రతికూల పరిస్థితులనుంచి బయటపడేందుకే.. దేశ వ్యాప్తంగా లెవీ సేకరణ అధికంగా జరుగుతోందని, దీనివల్ల అధిక నిల్వలు పేరుకు పోవడం, వృథా పెరగడం, కేంద్రం నిధులు ఎక్కువగా వినియోగించాల్సి రావడం, ఎక్కువ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వాల్సి రావడం వ ంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడేందుకు లెవీ సేకరణ తగ్గిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి దాకా కస్టమ్ మిల్లింగ్, 30శాతం నుంచి 75శాతం వరకు మిల్లరునుంచి లెవీ సేకరణ జరుగుతోంది. మన రాష్ట్రంలో మాత్రం 75శాతం లేవీ సేకరణ అమలులో ఉంది. నూతన లేవీ విధానంలో రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని పాత పద్ధతిలోనే 75శాతం, లేదంటే కనీసం 50శాతం లేవీ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయినా, ఇది సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిందని, దీంతో ఇటు మిల్లర్లకు, అటు రైతులకు ఇబ్బంది తప్పదని రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 350రైస్మిల్లులు ఉన్నాయి. వీటిలో ఆధునిక టెక్నాలజీవి 150 వరకు ఉండగా, చిన్నాచితకవి 200 వరకు ఉన్నాయి. అదే విధంగా 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో రికార్డు స్థాయిలో 24.52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇక, ముందు ఇంతస్థాయిలో సేకరణ జరిగే వీలులేదు. లేవీ 25 శాతం లెవీ పెట్టి, బహిరంగ మార్కెట్లో 75శాతం విక్రయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆధునిక టెక్నాలజీ లేని మిల్లులు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడేందుకు, ప్రభుత్వం నుంచి అమితుమీ తేల్చుకునేందుకు సోమవారం కోదాడలో రాష్ట్రస్థాయి మిల్లర్ల సమావేశం జరగనుంది. కొత్త విధానంతో ఇవీ..నష్టాలు పాత లెవీ విధానంలో మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం ప్రభుత్వం లెవీగా తీసుకునేది. నూతన లెవీ విధానం వల్ల మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో లెవీగా 25శాతం తీసుకోనున్నారు. కొత్త విధానం వల్ల రైతులకు, మిల్లర్లకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతుల నుంచి మిల్లర్లు ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలుచేయరు. దీంతో మద్దతు ధర లభించే అవకాశం లేదు. ప్రభుత్వ గోదాములు తక్కువగా ఉండటం వల్ల సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. అటు మిల్లర్లు కొనుగోలు చేయక, ఇటు ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువ. లో టెక్నాలజీ ఉన్న మిల్లులు బియ్యం విక్రయించుకోవాలంటే నానా ఇబ్బందులు పడతారు. ఉత్తమ టెక్నాలజీ ఉన్న మిల్లుల్లో కూడా బియ్యం ఉత్పత్తి పెరగడం కూడా బహిరంగ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. రైతులకు, మిల్లులకు తీరని నష్టం కేంద్ర తెచ్చిన లెవీ విధానం వల్ల రైస్మిల్లర్లకు, రైతులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం 75 శాతం బియ్యాన్ని ప్రభుత్వం లెవీ రూపంలో మిల్లర్ల నుంచి కొనుగోలు చేసేది. ప్రస్తుతం 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీంతో మిల్లర్లు ఎక్కువగా నష్టపోతారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటే మిల్లర్ల వద్ద ప్రభుత్వం లెవీ రూపంలో తీసుకుంటేనే కుదురుతుంది. బియ్యానికి డిమాండ్ లేనప్పుడు, సరైన ధర మార్కెట్లో లభించదనుకున్న సమయంలో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం ఆశించిన మేరకు ఉండదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించదు. డిమాండ్ ఉంటేనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడానికి మిల్లర్లు సిద్ధపడతారు. మిల్లులు కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. - గంపా నాగేందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement