-
సంపూర్ణ స్వావలంబనేది?
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో మహిళ సంఘాల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో అంతరం కనిపిస్తోంది. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సంఖ్య భారీగా కనబడుతున్నా ఆర్థిక స్వావలంబనను కొన్ని సంఘాలు మాత్రమే సాధించగలుగుతున్నాయి. మిగతా సంఘాలు వెనకబడుతున్నాయి. బ్యాంక్ లింకేజీకే అర్హత సాధించని పరిస్థితి వేలాది ఎస్హెచ్జీలది. ఒకవేళ అర్హత సాధించినా రుణంపొందినవి 40 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. రుణ ప్రయోజనం పొందడంలో సంఘాల సంఖ్య గతేడాదితో పోల్చితే భారీగా తగ్గింది. ఏటేటా సంఘాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సంపూర్ణ స్వావలంబన సాధించడంలో గ్రామీణాభివృద్ధి సంస్థ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక పరిపుష్టి ఏదీ.. మహిళ స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళలు సైతం పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నా.. ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ సంఘాల్లో చేరుతున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. రుణ చెల్లింపుల్లో పలు సంఘాలు వెనుకబడటం, వీటి కారణంగా గ్రామాఖ్య సంఘాలు, వాటి నుంచి మండల సమాఖ్యలు ఇలా ఒకదానికొకటి వెనుకబడుతున్నాయి. అదే సమయంలో మహిళ సంఘాల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాల్సిన సిబ్బంది చేతివాటం కారణంగా మహిళ సంఘాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఒక సంఘానికి రుణం మంజూరు చేసేందుకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇందులో కిందినుంచి పైవరకు పంపకాలు ఉండడంతోనే పరిస్థితులు ఇలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మహిళ సంఘాలు తీసుకున్న రుణంపై పావలా వడ్డీ చెల్లిస్తుండగా, వాటిని తిరిగి సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. అయితే రెండేళ్లుగా పావలా వడ్డీ జమ కాకపోవడంతో పలు సంఘాలు ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నాయి. జిల్లాలో సుమారు రూ.30కోట్ల వరకు పావలా వడ్డీ కింద మహిళ సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. రుణ లక్ష్యంలో 62 శాతమే ప్రగతి.. మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 2017–18 సంవత్సరం కోసం ప్రభుత్వం నిర్దేషించిన రుణ లక్ష్యంలో కేవలం 62 శాతం మాత్రమే ప్రగతి కనిపిస్తోంది. బ్యాంక్ లింకేజీ కింద అనేక సంఘాలు రుణం పొందేందుకు అర్హత సాధించినప్పటికి చివరికి 40 శాతం సంఘాలకు మాత్రమే ఈ ప్రయోజనం దక్కింది. మిగతా 60 శాతం సంఘాలు రుణం పొందలేకపోయాయి. 2016–17 కంటే 2017–18కి బ్యాంక్ లింకేజీ కింద రుణ లక్ష్యం భారీగా పెంచినప్పటికీ ప్రగతి మాత్రం అందుకోలేకపోయింది. గతేడాది 99.87 శాతం ప్రగతి సాధించగా, ఈఏడాది 62 శాతానికే పరిమితం కావడం గమనార్హం. గతేడాదితో పోల్చితే రుణ ప్రయోజనం పొందిన సంఘాల సంఖ్య అమాంతంగా తగ్గిపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు ఈ అవాంతరాన్ని సరిదిద్దాల్సి ఉండగా, సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే పరిస్థితి ఇలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రికవరీ కాకపోవడంతోనే.. జిల్లాలో ఈ ఏడాది మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రుణ మంజూరులో ప్రధాన బ్యాంకులు సహకరించలేదు. ఈ కారణంగానే రుణ మంజూరులో తక్కువ శాతం నమోదైంది. అదే సమయంలో గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో బ్యాంక్ లింకేజీ తక్కువగా ఉండటం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. గతంలో రుణం తీసుకున్న సంఘాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ లింకేజీకి అర్హత సాధించలేకపోయాయి. రికవరీ పూర్గా ఉండటం కూడా వీటన్నింటికి కారణమైంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. – రాజేశ్వర్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
రుణ ం..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో బ్యాంకు లింకేజీ రుణం కావాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి తోడు.. ఏదైనా పూచీకత్తు పెట్టుకుని బ్యాంకులు ఇచ్చే రుణం తీసుకుని స్వయం ఉపాధి చేపడదామని భావించే వారికి ఆ రుణం అందని ద్రాక్షగానే మారుతోంది. ఆరుగాలం శ్రమించే అన్నదాతల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు రుణం తీసుకోవడం గగన ంగా మారిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అసలు లక్ష్యంగా పెట్టుకున్న దానికి, మంజూరుచ్చిన, గ్రౌండింగ్ చేసిన దానికి, సబ్సిడీ లబ్ధిదారుడి ఖాతాలో జమ చేసేదానికి పొంతన లేకుండా పోతోంది. వేల సంఖ్యలో లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుంటుంటే లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో నగదు జమయ్యే వారి సంఖ్య పదులు దాటడం లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఇచ్చే రుణ సదుపాయం 2013-14 సంవత్సరంలో జిల్లా మొత్తం మీద కేవలం ఒక్కరికంటే ఒక్కరికే వచ్చిందంటేనే రుణ పరపతి ప్రక్రియ జిల్లాలో ఎంత అధ్వానంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో ఖరారు కావాల్సిన మార్గదర్శకాలు (యాక్షన్ప్లాన్) ఆలస్యంగా రావడం, వచ్చిన తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ముఖ్యంగా బ్యాంకర్లు రుణం మంజూరు చేయడంలో విధిస్తున్న కొర్రీలు లబ్ధిదారులకు కష్టాలనే మిగులుస్తున్నాయి. రైతులకే రుణాలివ్వలేదు ముఖ్యంగా జిల్లాలో బ్యాంకుల ద్వారా రైతులకివ్వాల్సిన రుణాలు కూడా సక్రమంగా అందలేదు. జిల్లా రుణకమిటీ (డీసీసీ) లెక్కల ప్రకారం 2014-2015 ఖరీఫ్లో రైతులకు అందిన రుణాలు కేవలం 66 శాతమే. అంటే జిల్లాలో రుణాలు అవసరమున్న 100 రూపాయల్లో బ్యాంకులు రుణాలిచ్చింది 64 రూపాయలే. మిగిలిన 36 రూపాయల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్న మాట. గత ఖరీఫ్లో మొత్తం రూ.1226 కోట్ల రుణాలను రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇచ్చింది మాత్రం 816 కోట్లే. ఇక, రబీలో లక్ష్యంగా పెట్టుకున్న దానికన్నా 2రెట్లు అధికంగా రుణాలిచ్చామని లెక్కల్లో చూపిస్తున్నా... అందులో సగం రెన్యువల్ రుణాలేనని అధికారులే అంటున్నారు. ఇక, వ్యవసాయ టెర్మ్ రుణాలయితే 41.55 శాతమే రైతులకు చేరాయి. ఈ ఏడాది మొత్తం 460 కోట్ల రూపాయలను రుణలక్ష్యంగా పెట్టకోగా, అందులో రుణాలిచ్చింది 191 కోట్లే. వ్యవసాయ అనుబంధ రుణాలు కూడా 50శాతం తక్కువగానే లక్ష్యాన్ని చేరాయి. మొత్తం 123 కోట్ల రూపాయలను వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఇచ్చి రూ.60 కోట్లలోపే. చిన్నతరహా పరిశ్రమల కోసం ఇచ్చే రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలు కూడా ఈ ఏడాది 70శాతం మించలేదని లెక్కలు చెపుతున్నాయి. బ్యాంకర్లు చూపించే లెక్కల్లో ఒక్క విద్యా రుణాలను మాత్రమే లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 46 కోట్ల రూపాయలను విద్యార్థుల చదువుల నిమిత్తం రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.58 కోట్లు ఇచ్చారు. అదొక్కటి మినహా ఏ రంగంలోనూ లక్ష్యానికి దరిదాపుల్లో కూడా రుణాలివ్వకపోవడం గమనార్హం. స్వయం ఉపాధి.. సట్టుబండలేనా? ఇక, స్వయం ఉపాధి విషయానికి వస్తే... జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రుణ సౌకర్యం అందించే ప్రక్రియ అభాసుపాలవుతోందనే చెప్పాలి. లబ్ధిదారుల ఎంపిక నుంచి రుణం మంజూరు వరకు అడుగడుగునా నిర్లక్ష్యం, ఉదాసీనత కనిపిస్తున్నాయి. అసలు ఇంతవరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది బీసీ నిరుద్యోగులకు ఇచ్చే రుణాల లక్ష్యాన్ని కూడా నిర్ధారించుకోలేదంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, గత ఏడాది అయితే మొత్తం 556 మందికి రూ.20 కోట్ల వరకు రుణాలివ్వాల్సి ఉండగా, కేవలం ఒక్కరంటే ఒక్కరికి మాత్రం రూ.3.75లక్షల రుణం మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది 1701 మందికి రూ.17 కోట్ల రుణం ఇవ్వాలి ఉండగా, అందులో కేవలం 958 మందికి రూ.9కోట్లు సబ్సిడీ జమ చేశారు. ఇక, గిరిజనుల విషయానికి వస్తే మొత్తం 2,225 మందికి 27.43 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వలేదు. గత ఏడాది గ్రౌండింగ్ చేసి, గ్రామసభల ద్వారా ఎంపిక చేసిన వారికీ మొండిచేయే చూపించారు. ఇందులో చాలా మంది గిరిజన నిరుద్యోగులు తమ వాటా మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసి రుణం కోసం ఇప్పటికీ బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండడం గమనార్హం. చేనేతకేదీ చేయూత! జిల్లాలోని చేనేత కార్మికుల రుణ మంజూరైతే, ప్రతి యేటా నిరాదరణకు గురవుతోంది. మా ర్కెట్ సదుపాయాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్న జిల్లాలోని చేనేతలను ఆదుకోవడంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు జిల్లా యం త్రాంగం కూడా విఫలమవుతోందనే చెప్పాలి. ఈ ఏడాది జిల్లాలోని 4400 చేనేత యూనిట్లకు క్రెడిట్ కార్డు పథకం ద్వారా రూ.22 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా, అందులో ఒక్కరికి కూడా సబ్సిడీ జమచేయలేదు. కేవలం 336 యూని ట్లకు రుణం మంజూరు చేసి, గ్రౌండింగ్ చేసినట్టు లెక్కల్లో చూపెడుతున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు వ్యవసాయ, వ్యాపార రంగాల్లో శిక్షణనిచ్చి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చే కార్యక్రమం కూడా నత్తనడకన సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 750 మందిని ఎంపిక చేసి ఈ ఏడాది వారికి స్వావలంబన చేకూర్చాలన్న లక్ష్యం 45 శాతం మాత్రమే నెరవేరింది. అందులో బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం పొందిన యువకులు కేవలం 110 మంది మాత్రమే. తీరు ఎప్పుడు మారేనో? జిల్లాలో రుణపరపతి ప్రక్రియ నత్తనడకన, ఉదాసీనంగా నడవడం ఈ ఏడాదే కొత్తేం కాదు. ఏళ్ల తరబడి యాక్షన్ప్లాన్లు రూపొందించుకోవడం, ఆ తర్వాత వాటిని అమలుచేయకపోవడం అనేది జరుగుతూనే ఉంది. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో కూడా రుణం గగనంగానే ఉండడం లబ్ధిదారులకు మింగుడుపడడం లేదు. ఈ తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఇచ్చే రుణాలను ఇప్పించడంలో అటు రాజకీయ పార్టీల పెద్దలు, ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ చూపాలని, బ్యాంకర్లు కూడా కొర్రీలు పెట్టకుండా వీలున్నంత మేలు చేకూర్చాలనేది అటు రైతు సంఘాలు, ఇటు యువజన, ప్రజాసంఘాల వాదన. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణపరపతి అమలు(రూ.కోట్లలో) సీజన్/రంగం లక్ష్యం మంజూరైంది par శాతంఙఖరీఫ్ 1226.52 816.91 66.6 రబీ 525.62 1159.25 220.55 టర్మ్లోన్లు 460 191.13 41.55 వ్యవసాయ అనుబంధ 123 58.8 47.87 చిన్నతరహా పరిశ్రమలు 779 593.48 76.18 ఎస్హెచ్జీలు 810 524.19 64.67 విద్యా రుణాలు 46.51 58.26 125.26
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement