-
లిక్విడిటీ సంక్షోభం: కాఫీ డే రూ. 470 కోట్ల డిఫాల్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మొత్తం రూ. 470.18 కోట్ల రుణాలు, వడ్డీల చెల్లింపులో డిఫాల్ట్ అయినట్లు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) వెల్లడించింది. నగదు కొరత సంక్షోభం వల్లే రుణాలపై వడ్డీల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలిపింది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న క్యాష్ క్రెడిట్కు సంబంధించి రూ. 216 కోట్లు, వాటిపై రూ. 5.78 కోట్ల వడ్డీ, అలాగే రూ. 200 కోట్ల ఎన్సీడీలు, నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల చెల్లింపులు, వాటిపై రూ. 48.41 కోట్ల వడ్డీ ఉన్నట్లు సంస్థ పేర్కొంది. సీడీఈఎల్కు మొత్తం రూ. 495.18 కోట్ల రుణాలు ఉన్నాయి. -
జీరో వడ్డీ స్కీమ్లు వద్దు
ముంబై: ఖరీదైన సెల్ఫోన్ కావాలా.. ముందుగా పైసా చెల్లించక్కర్లేదు! పైగా ఎలాంటి వడ్డీ లేకుండానే సమాన నెలసరివాయిదా(ఈఎంఐ)లలో డబ్బు కట్టేయొచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు! ఇటీవలి కాలంలో ఇలాంటి జీరో వడ్డీ ఈఎంఐ స్కీమ్లు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. మొబైల్ ఫోన్లకే కాదు టీవీలు, ఫ్రిజ్లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయ సంస్థలు ఈ తరహా స్కీమ్లతో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు వీటన్నింటికీ ఆర్బీఐ చెక్ చెప్పింది. కన్సూమర్ గూడ్స్ కొనుగోళ్లకు సంబంధించి జీరో శాతం వడ్డీరేట్ల పథకాలను నిషేధిస్తున్నట్లు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో పండుగ సీజన్లో అమ్మకాల జోష్పై నీళ్లుచల్లినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వినియోగదారుల మేలుకే... కాగా, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై కూడా ఎలాంటి అదనపు చార్జీలనూ వసూలు చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘ఒక ఉత్పత్తి అమ్మకానికి సబంధించి వడ్డీరేట్ల స్వరూపాన్ని బ్యాంకులు దెబ్బతీయకూడదు. ఇలాంటి చర్యల వల్ల ధరల విధానంలో పారదర్శకత లేకుండా పోతుంది. వినియోగదారుడు అన్ని అంశాలూ తెలుసుకొని అంతిమంగా తగిన నిర్ణయం తీసుకోవాలంటే వాస్తవ ధర అనేది చాలా ముఖ్యం’ అని ఆర్బీఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలు జీరో వడ్డీరేట్లు అనే విధానమే పూర్తిగా తప్పుదోవపట్టించే అంశమని కూడా ఆర్బీఐ అంటోంది. ‘ఏదైనా ఉత్పత్తి, సంబంధిత విభాగం విషయంలో ప్రాసెసింగ్ చార్జీలు, ఎంత వడ్డీరేట్లు విధిస్తున్నారనేది కచ్చితంగా, పారదర్శకంగా తెలియజేయాల్సిందే. కస్టమర్లకు ఏదో ఒక ఆశజూపి వాళ్ల జేబు గుల్ల చేసేందుకే ఇలాంటి ‘జీరో’ స్కీమ్లు పుట్టుకొస్తున్నాయని కూడా ఆర్బీఐ వ్యాఖ్యానించింది. వాస్తవానికి జీరో వడ్డీ కింద ఆఫర్ చేస్తున్న ఈఎంఐ స్కీమ్లలో ప్రాసెసింగ్ చార్జీల రూపంలో వడ్డీని నిగూఢంగా ఉత్పత్తి ధరకే జతచేసి విక్రయ సంస్థలు మాయ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి డబ్బు చెల్లించి కొనుగోలు చేయలేని వినియోగదారులు అసలు ఉత్పత్తి ధరను పట్టించుకోకుండా... వడ్డీలేకుండా సులభ వాయిదాలకు మొగ్గుచూపుతున్నట్లు ఆర్బీఐ పరిశీలనలో వెల్లడైంది. ఇదేకాదు.. కొన్ని బ్యాంకులు కూడా ఇలాంటి మసిపూసే కొన్ని చర్యలకు పాల్పడుతున్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఏదైనా ఉత్పత్తి కొనుగోలు కోసం కస్టమర్లకు ఆఫర్ చేసే రుణంపై విధించే వడ్డీరేటులోనే అదనపు రుసుము(ప్రాసెసింగ్, కమిషన్ చార్జీ ఇతరత్రా) వడ్డింపులను కలిపి ఈఎంఐలను వసూలు చేస్తున్నాయనేది ఆర్బీఐ పరిశీలన. రిటైల్ ఉత్పత్తులకు విభిన్న వడ్డీరేట్లు వద్దు... ఒకే విధమైన ప్రొడక్ట్, సమాన కాలవ్యవధిగల రుణాలకు ఒక్కో కస్టమర్కు ఒక్కో విధమైన వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులపై కూడా ఆర్బీఐ దృష్టిసారించింది. ఇటువంటి డిఫరెన్షియల్ వడ్డీరేట్ల విధానాన్ని రిటైల్ ఉత్పత్తులకు ఇచ్చే రుణాలకు వర్తింపజేయరాదని కూడా ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ముఖ్యంగా రిటైల్ ఉత్పత్తుల విషయంలో కస్టమర్ రిస్క్తత్వంతో సంబంధంలేకుండా ఒకేవిధమైన(ఫ్లాట్) వడ్డీరేటును అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ఏదైనా వడ్డీరేట్ల తగ్గింపు ఆఫర్లపైనా కొరఢా ఝుళిపించింది. కస్టమర్లకు ఉత్పత్తి కొనుగోలు కోసం ఇచ్చే రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని అందించాలంటే... విక్రయ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్లను పరిగణనలోకి తీసుకున్నాకే రుణ మొత్తాన్ని మంజూరు చేయాలని స్పష్టీకరించింది. రుణ చెల్లింపుపై ఏదైనా మారటోరియం వంటి ప్రయోజనం ఉంటే... బ్యాంకులు ముందుగానే తగిన రీపేమెంట్ షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు అనేది కూడా మారటోరియం వ్యవధి తర్వాత నుంచే ఉండాలని... వడ్డీరేటును పూర్తి కాలవ్యవధికి సర్దుబాటు చేయకూడదని కూడా నోటిఫికేషన్లో తెలిపింది. ఉత్పత్తిపై డీలర్లు, తయారీ కంపెనీలు అందించే డిస్కౌంట్లు, ప్రయోజనాలను కస్టమర్లకు పూర్తిగా లభ్యమయ్యేలా రుణాలను అందించే బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ పేర్కొంది. డెబిట్ కార్డులపై... కొన్ని విక్రయ కేంద్రాల(పాయింట్ ఆఫ్ సేల్స్) వద్ద ఏదైనా ఉత్పత్తి/సేవల కొనుగోలు కోసం డెబిట్ కార్డుల ద్వారా సొమ్ము చెల్లిస్తే... ఆ మొత్తం లావాదేవీపై కొంత శాతాన్ని అదనపు ఫీజుకింద వసూలు చేస్తున్న ఉదంతాలు కూడా ఆర్బీఐ దృష్టికెళ్ళాయి. ఇలాంటి రుసుములు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. అదనపు చార్జీలను వడ్డించే విక్రయ సంస్థలతో బ్యాంకులు ఒప్పందాలను తెగదెంపులు చేసుకోవాలని ఆదేశించింది. ఇటువంటి చర్యలు, ఉత్పత్తుల విక్రయం అనేది పారదర్శక, నిష్పాక్షిక ధరల విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనదని... వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసేదని కూడా ఆర్బీఐ వ్యాఖ్యానించింది. వీటివల్ల రుణాలు, వడ్డీరేట్లకు సంబంధించిన మూల ఉత్తర్వుల్లోని నిబంధనలను తుంగలోకి తొక్కినట్లవుతుందని పేర్కొంది. కస్టమర్ల హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవహరించవద్దని బ్యాంకులకు ఆర్బీఐ హితవుపలికింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement