-
అంచనాలను అందుకుంటా!
లాహ్లి (రోహ్టక్): వెస్టిండీస్తో జరిగే తన వీడ్కోలు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. తన అభిమానులు, ఆప్తుల అంచనాలను అందుకోగలననే నమ్మకం ఉందని అతను చెప్పాడు. ‘వెస్టిండీస్ జట్టు కూడా పటిష్టంగానే ఉంది కాబట్టి సిరీస్ బాగా జరగొచ్చు . నా చివరి రెండు టెస్టుల కోసం ఎదురు చూస్తున్నాను. చక్కటి క్రికెట్ ఆడి నా అభిమానులు, శ్రేయోభిలాషుల అంచనాలను అందుకోగలనని నమ్ముతున్నాను’ అని మాస్టర్ వ్యాఖ్యానించాడు. ముంబై జట్టు గెలుపు పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వికెట్పై పరుగులు అంత సులభంగా రాలేదని రంజీ మ్యాచ్ను విశ్లేషించాడు. ‘ఇది క్లిష్టమైన వికెట్. పరుగులు సునాయాసంగా దక్కలేదు. అయితే బౌలర్లకు అనుకూలించే పిచ్పై బ్యాటింగ్ చాలా సరదాగా అనిపించింది. అవుట్ఫీల్డ్ కూడా నెమ్మదిగా ఉండటంతో 240 పరుగుల లక్ష్యం కూడా 280గా కనిపించింది. నేను అనుకున్న తరహాలో ఆడగలిగాను’ అని సచిన్ పేర్కొన్నాడు. తనతో కలిసి ఆడే కుర్రాళ్లకు సహజంగానే సూచనలు ఇస్తానని, ఈ మ్యాచ్లోనూ అదే చేశానని సచిన్ చెప్పాడు. ‘నాన్స్ట్రైకర్ ఎండ్ నుంచి నేను పరిశీలించిన వాటిని ఆటగాళ్లతో పంచుకుంటాను. అంతకుమించి మరేమీ ప్రత్యేకంగా లేదు. ప్రతీసారి అది పని చేయకపోవచ్చు కానీ అది కూడా సరదాగా అనిపిస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటే తీవ్ర ఒత్తిడి మధ్య కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది’ అని ఈ ముంబై దిగ్గజం అన్నాడు. -
సచిన్ 55 బ్యాటింగ్
లాహ్లి: వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్కు ముగింపు పలకనున్న సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్లో అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్కు సన్నాహకంగా హర్యానాతో రంజీ ఆడుతున్న మాస్టర్ నిలకడైన ఆటతీరుతో జట్టును విజయం ముంగిట చేర్చాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు పరుగులకే అవుటైనా రెండో ఇన్నింగ్స్లో మాత్రం అజేయ అర్ధ సెంచరీ (122 బంతుల్లో 55 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో అభిమానులకు కనువిందు చేశాడు. ఉదయం నుంచి సచిన్ బ్యాటింగ్ కోసం ఆరు వేల మంది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా వారినే మాత్రం నిరాశపరచకుండా తన క్లాస్ షాట్లతో అలరించాడు. బౌన్సీ పిచ్పై ప్రమాదకరంగా వస్తున్న బంతులను ఆచితూచి ఓపిగ్గా ఆడాడు. ఫలితంగా ముంబై తమ రెండో ఇన్నింగ్స్లో 75 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. చివరి రోజు ఆట మిగిలి ఉండగా విజయానికి ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో సచిన్తో పాటు ధావల్ కులకర్ణి (6) ఉన్నాడు. అంతకుముందు హర్యానా తమ రెండో ఇన్నింగ్స్లో 70.2 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయ్యింది. హెచ్వీ పటేల్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు; 3 సిక్స్) వేగంగా ఆడాడు. జహీర్, ధబోల్కర్ నాలుగేసి వికెట్లు తీశారు. అనంతరం 240 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై ఒక్క పరుగుకే తొలి వికెట్ను కోల్పోయినా... కౌస్తుబ్ పవార్ (136 బంతుల్లో 47; 5 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 40; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఇక సచిన్ రాకతో మైదానం హోరెత్తింది. ఆశిష్ హుడా బౌలింగ్లో చక్కటి కవర్ డ్రైవ్ సాధించిన సచిన్ తన పాత రోజులను గుర్తుచేశాడు. అయితే తన ఆటతీరులో ఎలాంటి దూకుడు లేకున్నా పరిస్థితిని అంచనా వేసి నిదానంగా పరుగులు రాబడుతూ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 115వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement