-
నాలుగేళ్లుగా ఫుడ్ డెలివరీ చేస్తున్నా! ఇప్పుడిలా వరల్డ్కప్ జట్టు క్యాంపులో..
ICC ODI World Cup 2023: ‘‘నా కెరీర్లో అత్యంత విలువైన క్షణాలు ఇవే. నేనింత వరకు కనీసం.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ థర్డ్ డివిజన్ లీగ్లో కూడా ఆడలేదు. నాలుగేళ్లపాటు ఐదో డివిజన్లో ఆడాడు. ఈసారి నాలుగో డివిజన్లో ఆడేందుకు రిజిస్టర్ చేసుకున్నాను. నెదర్లాండ్స్ నెట్ బౌలర్గా ఎంపికయ్యానని తెలియగానే.. ఎట్టకేలకు నా ప్రతిభను గుర్తించే వాళ్లు కూడా ఉన్నారనే భావన కలిగింది’’ అని తమిళనాడుకు చెందిన లోకేశ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన లోకేశ్కు క్రికెటర్గా ఎదగాలని ఆశయం. వేలాది మందిలో నలుగురు.. అందులో ఒక్కడు ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం పేసర్గా తన ప్రయాణం మొదలుపెట్టాడతడు. అయితే, కాలక్రమంలో చైనామన్ స్పిన్నర్గా మారాడు. తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటున్న లోకేశ్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాలనేది చిరకాల కోరిక. అక్కడ ప్రతిభ నిరూపించుకుంటే.. అదృష్టం కలిసివస్తే ఏదో ఒకరోజు టీమిండియాకు కూడా ఆడొచ్చనే ఆశ. ఈ క్రమంలో.. వన్డే వరల్డ్కప్-2023 ప్రాక్టీసులో భాగంగా తమకు భారత నెట్ బౌలర్లు కావాలని నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ప్రకటన అతడిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో తన అర్హతలను జోడిస్తూ అప్లికేషన్ పెట్టుకోగా.. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా ఎంపికయ్యాడు. ఆటగాళ్లకు పరిచయం చేస్తూ హైదరాబాదీ రాజమణి ప్రసాద్, రాజస్తాన్ హైకోర్టు ఉద్యోగి హేమంత్ కుమార్, హర్యానాకు చెందిన హర్ష్ శర్మలతో పాటు నెదర్లాండ్స్ క్యాంపులో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మొదటి ట్రెయినింగ్ సెషన్లో భాగంగా.. ఈ నలుగురిని తమ ఆటగాళ్లకు పరిచయం చేసింది మేనేజ్మెంట్. కాగా పొట్టకూటి కోసం లోకేశ్ కుమార్ స్విగ్గీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ ఇచ్చిన ఆఫర్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆత్మీయ స్వాగతం పలికారు.. డచ్ ఫ్యామిలీలో ఒకడినని ‘‘నెదర్లాండ్స్ జట్టు సభ్యులు నన్ను తమలో ఒకడిగా భావించి ఆత్మీయ స్వాగతం పలికారు. నెట్ బౌలర్ల పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది మీ జట్టు.. ఇక్కడ మీరు స్వేచ్ఛగా ఆడవచ్చు అని మమ్మల్ని ప్రోత్సహించారు. నాకైతే ఇప్పుడే డచ్ ఫ్యామిలీలో సభ్యుడినయ్యానన్న భావన కలిగింది’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘‘కాలేజీ చదువు తర్వాత నా దృష్టి మొత్తం క్రికెట్ మీదే పెట్టాను. నాలుగేళ్లపాటు మొత్తం అంతా క్రికెట్ కోసమే. అయితే, 2018లో ఏదైనా ఉద్యోగం చేయాలని భావించాను. గత నాలుగేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను. అలా నాకు కావాల్సిన డబ్బు నేను సంపాదించుకుంటున్నాను. ఇది తప్ప నాకు మరో ఆదాయ వనరు లేదు. వీకెండ్స్లో మ్యాచ్లు ఉంటాయి కాబట్టి వీక్డేస్లోనే పనిచేస్తాను’’ అంటూ తన ఆర్థిక స్థితి గురించి లోకేశ్ చెప్పుకొచ్చాడు. నెదర్లాండ్స్ క్రికెట్పై నెటిజన్ల ప్రశంసలు కాగా ఐదోసారి వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టు.. ప్రస్తుతం బెంగళూరులోని ఆలూరులో ట్రెయినింగ్ క్యాంపు నిర్వహిస్తోంది. మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డచ్ టీమ్.. సెప్టెంబరు 29న పాకిస్తాన్తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో భారత నెట్ బౌలర్లను నియమించుకుని కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో లోకేశ్ లాంటి ఆశావహులకు ఛాన్స్ ఇచ్చిన నెదర్లాండ్స్ మేనేజ్మెంట్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నెట్ బౌలర్కే ఇంత హైప్ అవసరమా అంటే.. కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోవచ్చు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్గా ఎంట్రీ ఇచ్చి.. ప్రతిభ నిరూపించుకుని టీమిండియాకు ఎంపికై సత్తా చాటిన అతడు లోకేశ్ లాంటి వాళ్లకు ఆదర్శం. చదవండి: నెక్ట్స్ సూపర్స్టార్.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా Our first training session in India for the #CWC23 began with a small induction ceremony for our four new net bowlers from different parts of India. 🙌 pic.twitter.com/ug0gHb73tn — Cricket🏏Netherlands (@KNCBcricket) September 20, 2023 -
WC: స్విగ్గీ డెలివరీ బాయ్, హైకోర్టు ఉద్యోగి.. నెదర్లాండ్స్ నెట్బౌలర్లుగా మనోళ్లు
ICC ODI WC 2023- Netherlands Net Bowlers: ‘‘మాకు భారత నెట్ బౌలర్లు కావాలి.. ఈ అర్హతలు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు..’’ వన్డే వరల్డ్కప్-2023 సన్నాహకాల్లో భాగంగా భారత్లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ జట్టు ఇచ్చిన ఈ ప్రకటన గుర్తుండే ఉంటుంది. భారత పౌరుడై.. 18 ఏళ్లకు పైబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంలో బౌలింగ్ చేయగల పేసర్లు.. గంటకు 80 కి.మీ వేగంతో బంతిని విసరగల స్పిన్నర్లకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా డచ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ఈ ప్రకటనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హులైన నలుగురిని తమ నెట్ బౌలర్లుగా ఎంచుకుంది. తమ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు లెఫ్టార్మ్ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను సెలక్ట్ చేసుకుంది. ఇందులో స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా ఉన్నాడు. ఆ నలుగురి వివరాలివే! 1. రాజమణి ప్రసాద్.. లెఫ్టార్మ్ పేసర్ ►హైదరాబాద్, తెలంగాణ ►హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడిన అనుభవం ►ప్రస్తుతం చెన్నై సూపర్కింగ్స్ నెట్ బౌలర్గా ఉన్నాడు. 2. హేమంత్ కుమార్- లెఫ్టార్మ్ పేసర్ ►చురు, రాజస్తాన్ ►రాజస్తాన్ హైకోర్టులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ►2022, 2023 సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ అతడిని నెట్బౌలర్గా నియమించుకుంది. 3. హర్ష్ శర్మ.. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ►కురుక్షేత్ర, హర్యానా ►నార్త్జోన్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ విజేత.. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ రన్నరప్ ►2022లో ఆర్సీబీ క్యాంపులో నెట్బౌలర్గా సేవలు అందించాడు. 4. లోకేశ్ కుమార్- మిస్టరీ బౌలర్ ►చెన్నై, తమిళనాడు ►జీవనోపాధి కోసం పగలంతా స్విగ్గీలో లోకేశ్ పని ►ఐపీఎల్లో ఆడాలనే ఆశయం ►ఎనిమిదేళ్ల క్రితం పేసర్గా మొదలైన లోకేశ్ ప్రస్తుతం మిస్టరీ స్పిన్నర్గా మారాడు. ఇదిలా ఉంటే... హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్తో సెప్టెంబరు 29న నెదర్లాండ్స్ తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: నెక్ట్స్ సూపర్స్టార్.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా Thank you for the overwhelming response to our net bowlers hunt, India. Here the 4 names who will be part of the team's #CWC23 preparations. 🙌 @ludimos pic.twitter.com/arLmtzICYH — Cricket🏏Netherlands (@KNCBcricket) September 19, 2023 Our first training session in India for the #CWC23 began with a small induction ceremony for our four new net bowlers from different parts of India. 🙌 pic.twitter.com/ug0gHb73tn — Cricket🏏Netherlands (@KNCBcricket) September 20, 2023 -
తెలంగాణ ఎన్నికల అదనపు కమిషనర్గా లోకేష్ కుమార్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సీఈసీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ అదనపు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా లోకేష్ కుమార్ను నియమించింది. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ గవర్నర్ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్గా 2006 బ్యాచ్కు చెందిన IAS అధికారి రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. అలాగే ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. 2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి Md. ముషారఫ్ అలీ ఫరూఖీకి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ పదవిని కేటాయించారు. చదవండి: తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా -
లోకేశ్కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా వెళ్లనుండటంతో కొత్త కమిషనర్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. లోకేశ్కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్లు దాటింది. మరో రెండు నెలలైతే నాలుగేళ్లు పూర్తయ్యేవి. రాష్ట్ర అసెంబ్లీకి మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో బదిలీలు అనివార్యంగా మారాయి. కొత్త కమిషనర్గా ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందనరావు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వాటర్బోర్డు ఎండీ దానకిశోర్, మేడ్చ ల్ జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా పని చేసిన హరిచందన పేరు కూడా ప్రచారంలో ఉంది. ఏ పేర్లు వినబడినప్పటికీ, అన్నీ ఊహాగానాలే తప్ప నియామకం జరిగేంతదాకా చెప్పలేమని ప్రభుత్వ తీరు తెలిసిన వారు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎక్కువ కాలం జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధిక కాలం కమిషనర్గా ఉన్న డీఎస్ లోకేశ్కుమార్ తన పనేమిటో తాను.. అన్నట్లుగా పనులు చేసుకుంటూ పోయారు. బయట హడావుడి, హంగామా లేకుండా అంతర్గతంగా పనులు చేయించడంలో తనదైన ముద్ర వేశారు. తరచూ ఫోన్ కాన్ఫరెన్స్లు, గూగుల్ మీట్ వంటి వాటితో ఎప్పటికప్పుడు పనులు చేయించేవారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినా జీహెచ్ఎంసీలో నెలనెలా జీతాలకు ఇబ్బందులెదురైనప్పటికీ, నయానో భయానో ట్యాక్స్ సిబ్బందితో, ఇతరత్రా పన్నుల వసూళ్లు జరిగేలా చూసేవారు. ఎస్సార్డీపీతో సహా వివిధ ప్రాజెక్టుల పనులు కుంటుపడకుండా చేయగలిగారు. ఎవరెన్నివిమర్శలు చేసినా, క్షేత్రస్థాయిలో తిరగరనే ఆరోపణలున్నా పట్టించుకునేవారు కాదు. ఎలాంటి హడావుడి లేకుండానే నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించేవారు. ప్రభుత్వం నుంచి, పైఅధికారుల నుంచి అందిన ఆదేశాలకనుగుణంగా పనులు చేసేవారని చెబుతారు. ఎలాంటి సమాచారం, ప్రచారం లేకుండానే నిశ్శబ్దంగా తాను చేయాల్సిన పనులేవో చేసుకుంటూపోయేవారు. చదవండి: అంతర్గత విబేధాలు.. సైలెంట్ మోడ్లోకి ఎమ్మెల్యే రఘునందన్ రావు -
తెలంగాణ: సమీపిస్తున్న ఎన్నికలు.. కీలక పోస్టులకు సీఈసీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఖాళీగా ఉన్న రెండు ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీ రవికిరణ్ స్థానంలో డీఎస్ లోకేష్ కుమార్ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా, మరో సీనియర్ IAS అధికారి సర్ఫరాజ్ అహ్మద్ను జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్కు బుధవారం లేఖ రాసింది. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా ఐఏఎస్ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ కలాహలం కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు, నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సన్నద్దతపై వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
చంద్రబాబు వల్లే అన్యాయం
గుడాల గోపికి అడుగడుగునా బ్రహ్మరథం
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
జనసేన, టీడీపీకి రాంరాం
సంక్షేమం సగం బలం
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement