-
ఆశోకవనంలో ‘కల్యాణం’ చేసుకోబోతున్న విశ్వక్ సేన్
‘ఫలక్నుమాదాస్’, ‘హిట్’ చిత్రాల ఫేమ్ విశ్వక్సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా షురూ అయింది. విద్యాసాగర్ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్పై బాపినీడు.బి, సుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విష్వక్ సేన్ తల్లి దుర్గ క్లాప్ కొట్టారు. బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ –‘‘లవ్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో, సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. వినోదం సహా అన్ని అంశాలున్న ఎంటర్టైనర్ ఇది. విష్వక్ నటించిన, నటిస్తోన్న చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా’’ అన్నారు. -
'లాలిజో..లాలిజో' ట్రైలర్ ఆవిష్కరణ
సంభీత్, నేహారత్నాకరన్ హీరో హీరోయిన్లుగా జై శ్రీ సంతోషిమాత ప్రొడక్షన్ పతాకంపై మోహన్ శ్రీ వత్సస దర్శకత్వంలో షంఖు, కిరణ్లు నిర్మిస్తోన్న సినిమా 'లాలిజో లాలిజో'. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. హీరో సంభీత్, హీరోయిన్ నేహారత్నాకరన్లు ట్రైలర్ని ఆవిష్కరించగా, పాటల రచయిత కాసర్ల శ్యామ్ లోగోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..ఈ చిత్రం మా పాపలాంటిది. మా పాప చాలా అందంగా, అద్భుతంగా వచ్చింది. మాకు మంచి గుర్తింపు తెస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఇది థ్రిల్లర్ కాదు, ప్యూర్ లవ్ స్టోరీ. మనకు తెలియకుండానే మన నాలుక మీద తిరిగే అందమైన ప్రేమ కథ ఇది. ఇది ఊహించని లవ్ స్టోరీ. దయచేసి రిలీజ్ రోజు మొదటి షో చూడండి. బాగాలేకపోతే సినిమా చూడవద్దని అందరికీ చెప్పండి. బాగుంటే పదిమందికి మంచి చిత్రమని చెప్పండి...అన్నారు. పాటల రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి అవార్డు వస్తుందని, రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు. -
ఇప్పుడు వెండితెరపై...
బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా నడుస్తున్న ప్రస్తుత టైమ్లో మేల్ యాంకర్గా తానేంటో ప్రూవ్ చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు రవి. ఇప్పటివరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రవి హీరోగా వెండితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. రవి హీరోగా అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో మత్స్య క్రియేషన్స్ పతాకంపై ‘ఇది మా ప్రేమకథ’ పేరుతో ఓ చిత్రం రూపొందింది. ‘1 ఈజ్ గ్రేటర్ దేన్ ’ అన్నది ఉప శీర్షిక. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్. రవి సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రవి ఫస్ట్ లుక్ను త్వరలో ఓ సెలబ్రిటీ విడుదల చేయ నున్నారు. ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి. -
అల్లుతో అందాల భామ!
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో నటించిన మెహరీన్ గుర్తుందా? అందం, అభినయ పరంగా ఆ చిత్రంలో మంచి మార్కులే కొట్టేసింది. అందుకే మెహరీన్ రెండో సినిమా దక్కించుకోగలిగింది. అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఏంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో ఆ మధ్య ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఎస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన మెహరీన్ని కథానాయికగా ఎంపిక చేశారు. ‘‘ఈ చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా తగిన ప్రాధాన్యం ఉంటుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో మెహరీన్ బాగా నటించడంతో తీసుకున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘మంచి కాన్సెప్ట్తో సాగే చిత్రం ఇది. లవ్ ఎంటర్టైనర్. అల్లు శిరీష్, మెహరీన్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అని దర్శకుడు చెప్పారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రదర్శకుడు ఎంవీఎన్ రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు మా అన్నయ్య అల్లు అర్జున్తో ‘బన్నీ’ తీశారు. ఇప్పుడు ఆయన తనయుడి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement