-
మళ్లీ జియో ఫైనాన్స్ డీలా
ముంబై: వరుసగా రెండో రోజు జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మరోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. బీఎస్ఈలో రూ. 12.5 కోల్పోయి రూ. 239 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయి నష్టంతో రూ. 237 దిగువన స్థిరపడింది. సోమవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్ను తాకిన సంగతి తెలిసిందే. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ గత నెలలో జరిగిన ధర నిర్ధారణ ట్రేడింగ్లో రూ. 262 ధర వద్ద స్థిరపడింది. తదుపరి ఈ కౌంటర్లో స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం(21) నుంచి 10 రోజులపాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో సాధారణ ట్రేడింగ్కు తెరతీశాయి. ఫలితంగా రోజుకి 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలుకానుంది. తొలి రోజు 5 శాతం పతనమై రూ. 250 సమీపంలో నిలిచింది. ఇండెక్సులలో.. ధరలో నిలకడను తీసుకురావడం, హెచ్చుతగ్గులను పరిమితం చేయడం వంటి లక్ష్యాలతో స్టాక్ ఎక్సే్ఛంజీలు జియో ఫైనాన్షియల్ను ప్రధాన ఇండెక్సులలో తాత్కాలికంగా భాగం చేశాయి. విలీనాలపై సవరించిన తాజా నిబంధనల అమలులో భాగంగా సెన్సెక్స్లో 31వ, నిఫ్టీలో 51వ షేరుగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజానికి ఈ షేరుని లిస్టింగ్ తదుపరి మూడు రోజులకు సెన్సెక్స్, నిఫ్టీల నుంచి తొలగించవలసి ఉంది. అయితే వరుసగా సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో ఈ షేరుని ఆగస్ట్ 29వరకూ సెన్సెక్స్, నిఫ్టీలలో కొనసాగించనున్నట్లు ఇండెక్సుల కమిటీ పేర్కొంది. అప్పటికి కూడా సర్క్యూట్ బ్రేకర్లను తాకడం కొనసాగితే.. మరోమారు ఇండెక్సుల నుంచి తొలగింపు వాయి దా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎల్ఐసీకి షేర్లు ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్లను జియో ఫైనాన్షియల్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ 1 ఆర్ఐఎల్ షేరుకిగాను 1 జియో ఫైనాన్షియల్ను కేటాయించింది. ఫలితంగా ఆర్ఐఎల్లోగల వాటాలకుగాను ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా వెల్లడించింది. ఆటుపోట్ల మధ్య మార్కెట్ అక్కడక్కడే ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు బలపడి 65,220 వద్ద నిలిచింది. 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 19,346 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్ 147 పాయింట్ల వరకూ పుంజుకుని 65,396కు చేరింది. నిఫ్టీ సైతం 19,443–19,381 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూఎస్లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,165 లాభపడితే 1503 డీలాపడ్డాయి. పిరమిడ్ టెక్నో ఐపీవో సక్సెస్ ఇండ్రస్టియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు మంగళవారాని(22)కల్లా 18 రెట్లుపైగా సబ్్రస్కిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 75.6 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 13.83 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఈ ఆఫర్తో కంపెనీ రూ. 153 కోట్లు సమకూర్చుకుంది. రూపాయి రికవరీ 14 పైసలు అప్; 82.99 వద్ద ముగింపు న్యూఢిల్లీ: డాలరు మారకం విలువ తగ్గిన నేపథ్యంలో దేశీ కరెన్సీ రూపాయి ఆల్టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్తో పోలిస్తే 14 పైసలు బలపడి, 82.99 వద్ద ముగిసింది. అమెరికా డాలరు బలహీనత దీనికి కారణం. -
ఈ ఏడూ.. పసిడి వెలవెల!
♦ 2017లో పెరిగే అవకాశం ♦ రాయిటర్స్ సర్వే వెల్లడి ♦ ఫెడ్ ఎఫెక్ట్ ప్రధానమని విశ్లేషణ లండన్: బంగారం ధర ఈ ఏడాదీ దిగువ స్థాయిలోనే ఉంటుందని రాయిటర్స్ నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. ఇదే జరిగితే ఇలాంటి పరిమాణం ఇది వరుసగా నాలుగో ఏడాది సంభవించినట్లు అవుతుంది. పసిడి ధర 2015 ఏడాదిలో వార్షికంగా 10% మేర దిగజారింది. గడచిన రెండు వారాల్లో 41 మంది విశ్లేషకులు, ట్రేడర్ల అభిప్రాయాలను సర్వేలో తీసుకున్నారు. ముఖ్యాంశాలను చూస్తే... వార్షికంగా 2016లో పసిడి సగటు ధర ఔన్స్ (31.1 గ్రా) 1,118 డాలర్లుగా ఉంటుంది. 2009 తరువాత ఇంత తక్కువ స్థాయి సగటు ఇదే తొలిసారి. ప్రస్తుతం అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ పసిడి ధర ఔన్స్కు 1,095 స్థాయిలో కదలాడుతోంది. గత ఏడాది పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. ఈ అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్లో ఫెడ్ ఫండ్ రేటు అరశాతం పెరిగింది. ఈ ఏడాది మరో నాలుగుసార్లు ఫెడ్ రేటు పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ పరిణామం పసిడికి పెద్ద ప్రతికూలతే. చైనా మందగమనం, స్టాక్ మార్కెట్ల నష్టాలు, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండే అవకాశాల వంటివి పసిడికి వన్నె తెస్తాయన్న ఆశవున్నా... ఆయా అంచనాలను ఫెడ్ రేటు పెంపు అంచనాలు దెబ్బతీసే అవకాశం ఉంది. 2017పై ఆశ... అయితే వచ్చే ఏడాది తిరిగి పసిడి కళకళలాడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 2011 రికార్డు స్థాయిల నుంచి పూర్తిగా కనిష్ట స్థాయిలకు పడిపోయి... తిరిగి వార్షికంగా సగటున 1,209 డాలర్లకు ఎగిసే వీలుందని అభిప్రాయపడింది. గ్లోబల్ వృద్ధి మందగమనం భయాలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకుల వంటి అంశాలు పసిడి పెరుగుదలకు దోహదపడే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్థిక అస్థిరత్వ పరిస్థితులు... పసిడికి తిరిగి భద్రతాపరమైన మెటల్ హోదా కట్టబెడతాయని ఫస్ట్మార్కెట్ అనలిస్ట్ జేమ్స్ మోర్ పేర్కొన్నారు. వెండి విషయానికి వస్తే... ప్రస్తుతం నెమైక్స్లో 14 డాలర్ల వద్ద కదలాడుతున్న వెండి, వార్షికంగా సగటున 14.80గా ఉంటుందని సర్వే పేర్కొంది. గత ఏడాది ఈ ఇండస్ట్రియల్ మెటల్ ధర 11 శాతం పడింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్కు ఎందుకు తావులేదు?
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
సాక్షి కార్టూన్ 11-05-2024
చంద్రబాబు అండ్ కో దొంగ మాటలు..
చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..
టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరుగార్చిన దద్దమ్మ..
‘వరుణ్ విషయంలో బీజేపీని సవాల్ చేయలేను’
సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
నువ్వా నన్ను విమర్శిస్తావ్.. దేవినేని ఉమాకు అబ్బయ్య చౌదరి కౌంటర్
కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు: సజ్జల రామకృష్ణా రెడ్డి
తప్పక చదవండి
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement