-
బడ్జెట్ 2018: టీవీ, ఫ్రిజ్, ఏసీ ధరలు తగ్గుతాయా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్పై వ్యాపారవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఫిబ్రవరి 1న(గురువారం) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని పూర్తిస్థాయి బడ్జెట్లో తమకెలాంటి రాయితీలు లభించనున్నాయోననే ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు తమకు కల్సించాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై పలు అంచనాలను వ్యక్తపరుస్తున్నాయి. పన్నులను తగ్గించాలని, స్థానిక తయారీదారులకు ప్రోత్సాహకాలను కల్పించాలని గృహోపకరణాల తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తద్వారా సరసమైన ధరలకు గృహోపకరణాలన్నింటినీ వినియోగదారులకు అందించాలంటున్నాయి.. కన్స్యూమర్ డ్యూరబుల్స్, హోమ్ అప్లైన్సెస్ కు చెందిన పలు కంపెనీలు ఈమేరకు తక్కువ పన్ను రేట్లు, రాయితీలు, కల్పించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా పానసోనిక్, గోద్రెజ్ గృహోపకరణాలు, ఇంటెక్స్, ఫిలిప్స్ తదితర కంపనీలు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని కోరుకుంటున్నాయి. అలాగే ఇంధన సామర్థ్య ఉత్పత్తుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని హోం అప్లైన్సెస్ & కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కోరుకుంటోంది. ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎసీలు లాంటి ఉపకరణాలు ప్రస్తుతం విలాసవస్తువుల కిందికి రావని.. ఈ నేపథ్యంలో వీటిని మరింత సరసమైన ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని గోద్రెజ్ అప్లైన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. మరోవైపు స్థానిక తయారీదారులకు ప్రోత్సాహమిచ్చేలా దిగుమతులపై సుంకాన్ని పెంచాలని మరో సంస్థ పానసోనిక్ కోరుతోంది.స్మార్ట్ఫోన్లు, టీవీలు తదితర ఉత్పత్తులపై పెంచినట్టుగానూ గృహోపకరణాలపై కూడాబీసీడీ (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) పెంచాలని పానసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఇంటెక్స్కోరుతోంది. మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించే అన్ని భాగాలపై ఉన్న అధిక జిఎస్టీ రేట్లతో ఖర్చుపెరిగి భారతదేశంలో ఫోన్ల తయారీని దెబ్బతీస్తుందని ఇంటెక్స్ సీఈవో రాజీవ్ జైన్ అభిప్రాయపడ్డారు. అలాగే అన్ని పూర్తిస్థాయి లైటింగ్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలని ఫిలిప్స్ లైటింగ్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ జోషి చెప్పారు. మరోవైపు మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ముందుకు రానున్న బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్ధిక వృద్ధే ప్రధాన టార్గెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల స్పష్టం చేసినప్పటికీ రానున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సర్కార్ ప్రజాకర్షక బడ్జెట్తో వస్తోందన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. -
ఈ బడ్జెట్ లో పన్నులు బాగా తగ్గుతాయా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో విమర్శల పాలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్థికబడ్జెట్ లో పన్నుల కోతను ప్రతిపాదించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న సార్వత్రిక బడ్జెట్పై పలు అంచనాలున్నాయి. వివిధ రంగాలు ప్రభుత్వం నుంచి పలు ప్రోత్సాహకాలు, సంస్కరణలు రానున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కార్పొరేట్ పన్నుల తగ్గింపును, వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబు పరిమితి పెంపుపై విశ్లేషకులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1 న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న 2017 ఆర్థిక బడ్జెట్ లో కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పన్నులు, ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు తదితర అంశాలను ప్రస్తావిస్తున్నారు. వినిమయ శక్తి దారుణంగా పడిపోయిందన్న నివేదికల నేపథ్యంలో వినియోగదారుల కొనుగోలు శక్తికి బూస్ట్ ఇచ్చే లా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండనునన్నాయని భావిస్తున్నారు. అలాగే ఇన్ఫ్రా, హౌసింగ్, పట్టణాభివృద్ధి వంటి రంగాలకు కొత్త పెట్టుబడులు పెరుగనున్నాయంటున్నారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థకూ మేలు చేకూరనుంది. అంతేకాకుండా బడ్జెట్లో ప్రభుత్వ బ్యాంకులకు కొత్త పెట్టుబడులను ప్రకటించే అవకాశముంది. రాబోయే కాలంలో ఆర్ధిక వృద్ధిపై నెలకొన్న సందేహాల నేపథ్యంలో ప్రభుత్వం విశ్వసనీయత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టవచ్చని ఖైతాన్ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాల్ కొఠారి తెలిపారు. వస్తువులు మరియు సేవల డిమాండ్ ను మెరుగుపరిచేందుకుగాను వ్యక్తిగత ఆదాయం పన్ను స్లాబ్ లేదా రేటు ను తగ్గించే అవకాశం ఉందన్నారు. అలాగే ఆదాయ పన్ను మినహాయింపును రెట్టింపు చేసే అవకాశంఉందని మరికొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. యూనియన్ బడ్జెట్ లో ఒక మోస్తరు పన్ను రేట్లును, విస్తృత ఆధారిత పన్ను వ్యవస్థను రాబయే ఒకటి రెండు సంవత్సరాలకు అంచనా వేస్తున్నామని ముంబైకి చెందిన ఎనలిస్టు సంజీవ్ ప్రసాద్ తెలిపారు. కాగా నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నవంబర్ 2016 నాటికి 26.2 శాతం భారీగా పెరిగింది. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ పన్నుల నికర ఆదాయం గత ఏప్రిల్-డిసెంబర్లో 25 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement