-
3 నిమిషాలు ముందు వెళ్లాడని జీతం కట్
టోక్యో/కోబె : రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిని, అతి త్వరగా తేరుకుని.. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన జపాన్ను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటాయి. అక్కడ నియమాలు, నిబంధనలు పక్కాగా అమలు చేస్తారు. అయితే, ఓ అరవై నాలుగేళ్ల వృద్ధ ఉద్యోగి పట్ల అక్కడి అధికారుల తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. విరామానికి ముందే లంచ్కి వెళ్లాడని సదరు ఉద్యోగికి ఒకరోజు వేతనంలో సగం కోత విధించారు. దాంతో పాటు మీడియా ముందు గురువారం అతనితో క్షమాపణలు చెప్పించారు. కోబె సిటీ అధికార ప్రతినిధి తెలిపిన వివరాలు.. కోబె వాటర్వర్క్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి లంచ్ విరామానికి (మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు) మూడు నిమిషాలు ముందు బాక్స్ తెచ్చుకోవడానికి వెళ్లాడు. అలా అతను 7 నెలల కాలంలో 26 సార్లు నిబంధనలను అతిక్రమించాడు. ‘ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తూ ఇలా చేయడం నిజంగా విచారకరం’అంటూ మీడియా సమావేశంలో డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు మాటిమాటికి సిగరెట్ తాగడానికి వెళితే అప్పుడు నిబంధనల ఉల్లంఘన గుర్తుకు రాదా అని అధికారుల తీరుపై కొందరు ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ వాలకం చూస్తుంటే టాయ్లెట్కు కూడా పోనిచ్చేలా లేరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, లంచ్ విరామంలో కాకుండా పని వేళల్లో భోజనానికి వెళ్తున్నాడనే కారణంతో ఫిబ్రవరిలో ఓ ఉద్యోయోగిని నెల రోజుల పాటు విధుల నుంచి తొలగించారు. -
స్కూలు విద్యార్థి అదృశ్యం
సాక్షి, శృంగవరపుకోట : విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఓ బాలుడి అదృశ్యం కలకలం రేపింది. స్థానిక రామన్ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చక్రధర్ శనివారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో చక్రధర్ అదృశ్యమయ్యాడు. సాయంత్రమైనా కూమారుడు ఇంటికి రాకపోడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో ఆరా తీశారు. ఎంతకూ తమ కుమారుడి ఆచూకీ తెలియక పోవడంతో కుమారుడి అదృశ్యంపై చక్రధర్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇక లంచ్ చల్లారదు!
పొద్దున్నే లేచి, లంచ్బాక్సులు కట్టుకుని ఆఫీసులకు పరుగు తీస్తాం. తీరా లంచ్ టైమ్లో బాక్స్ తెరిస్తే చల్లారి పోయిన ఆహారం మనల్ని వెక్కిరిస్తుంది. అయినా ఆకలి కేకలను ఆపడానికి ఆరగించక తప్పదు. ఈ బాధ తప్పించడానికే వచ్చింది... ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్. చల్లారిన భోజనం తినాల్సిన పని లేకుండా ఈ బాక్సు మనకు భలే ఉపయోగపడుతుంది. ఈ బాక్సుకి వైరును కనెక్ట్ చేసుకోవడానికి ఓ పిన్ ఉంటుంది. బాక్సుతో పాటు వచ్చే వైరును దీనికి అమర్చి, ప్లగ్ను కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు... ఐదు పది నిమిషాల్లో ఆహారం వేడిగా అయిపోతుంది. దాంతో ఎక్కడున్నా, ఏ సమయంలో అయినా వేడి వేడి భోజనం చేయవచ్చు. దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలూ వీటిని తయారు చేసి మార్కెట్లో దింపాయి. సైజు, డిజైన్ని బట్టి రేటు. ఆన్లైన్లో ఐదారు వందలకే లభిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
Advertisement