-
మూడు రోజుల్లో రూ.8,000 కోట్లు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ డీఎల్ఎఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ గురుగ్రామ్లో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రీలాంచ్లో ఫిబ్రవరి 15–17 మధ్య కంపెనీ మొత్తం 1,137 ఫ్లాట్స్ను విక్రయించింది. వీటి విలువ రూ.8,000 కోట్లకుపైమాటే. ఒక్కో ఫ్లాట్ రూ.7 కోట్లకుపైగా ఖరీదు చేస్తున్నాయి. భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక చరిత్ర, రికార్డు అని డీఎల్ఎఫ్ సీఈవో అశోక్ త్యాగి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.15,000 కోట్ల వ్యాపారం నమోదు చేస్తుందని చెప్పారు. 2021–22లో ఇది రూ.7,273 కోట్లుగా ఉందన్నారు. పదేళ్ల విరామం తర్వాత గురుగ్రామ్ సెక్టార్ 63లో ‘ద ఆర్బర్’ పేరుతో గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ప్రీలాంచ్ చేసింది. ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్టును ఆవిష్కరించాల్సి ఉండగా వారం ముందుగానే మొత్తం ఫ్లాట్స్ను మూడు రోజుల్లో విక్రయించడం విశేషం. అతిపెద్ద కంపెనీగా.. ఫ్లాట్స్ కొనుగోలుకై సుమారు 3,600 మంది ఆసక్తి చూపగా లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేసినట్టు డీఎల్ఎఫ్ తెలిపింది. వినియోగదార్ల నుంచి రూ.800 కోట్లు ఇప్పటికే సమకూరిందని వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులే 90 శాతం ఫ్లాట్స్ను దక్కించుకున్నారు. ఎన్నారైల వాటా 14 శాతం. వచ్చే నాలుగేళ్లలో 25 ఎకరాల విస్తీర్ణంలోని ఆర్బర్లో 38–39 అంతస్తుల్లో అయిదు టవర్లను నిర్మిస్తారు. ఒక్కొక్కటి 3,950 చదరపు అడుగుల్లో 4 బీహెచ్కే ఫ్లాట్స్ రానున్నాయి. మార్కెట్ క్యాప్లో భారతదేశపు అతిపెద్ద రియల్టీ సంస్థ అయిన డీఎల్ఎఫ్.. ఈ ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ పరంగా కూడా అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. -
182 లగ్జరీ ప్రాపర్టీస్.. రూ. 2,100 కోట్లు
న్యూఢిల్లీ: ఇండియా సోథ్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ద్వారా గతేడాది దాదాపు 280 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,100 కోట్లు) విలువ చేసే 182 లగ్జరీ ప్రాపర్టీల విక్రయాలు జరిగాయి. 2020తో పోలిస్తే ఇది 47 శాతం అధికం. అప్పట్లో 190 మిలియన్ డాలర్ల విలువ చేసే 102 ప్రాపర్టీలు అమ్ముడయ్యాయి. విలువపరంగా 47 శాతం పరిమాణంపరంగా 78 శాతం అధికంగా విక్రయాలు నమోదైనట్లు సంస్థ సీఈవో అమిత్ గోయల్ తెలిపారు. విలాసవంతమైన నివాస గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరగడం ఇందుకు తోడ్పడిందని ఆయన వివరించారు. 10 మిలియన్ డాలర్లకు మించి విలువ చేసే లావాదేవీలు డజను పైగా నమోదైనట్లు గోయల్ పేర్కొన్నారు. అత్యధికంగా 15 మిలియన్ డాలర్ల విల్లా విక్రయ లావాదేవీ.. గోవాలో జరిగిందని వివరించారు. -
రూ.కోటి ఫ్లాటైనా...రెడీ
‘‘ఒకరికి మోదం- ఇంకొకరికి ఖేదం’’ అంటే ఇదేనేమో. రాజకీయ అనిశ్చితితో ఏడాది కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు మాత్రం జోరుగానే ఉన్నాయి. కోటికి పైగా విలువ చేసే ఫ్లాట్లు, విల్లాలకు ఏమాత్రం ఆదరణ తగ్గ లేదని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ఇతర మెట్రో నగరాల కంటే రాజధానిలో స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండటం ఒక కారణమైతే, డాలర్ పెరుగుదల మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భాగ్యనగరంలో జోరందుకున్న ప్రీమియం ఫ్లాట్లు, విల్లా ప్రాజెక్ట్ నిర్మాణాలపై ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.. సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లో కోటికి పైగా విలువ చేసే లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు గిరాకీ పెరుగుతోంది. రెండు, మూడేళ్లుగా పది శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రాజధానిలో ఏటా రూ.70 లక్షలకు పైగా విలువ చేసే ఫ్లాట్లు, విల్లాలు 2-3 వేల వరకు విక్రయిస్తున్నట్లు నిపుణుల అంచనా. మరీ ఎక్కువగా స్థిరాస్తి వ్యాపారం మందగించిన సమయంలో లగ్జరీ మార్కెట్ అమ్మకాలు 50 శాతంగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ అనిశ్చితి, స్థిరాస్తి ధరలు స్థిరంగా ఉండటం, డాలర్ విలువ పెరగటం వంటి అంశాలు ఐటీ, ఎన్నారైలకు కలిసొస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లకు ఎక్కువ శాతం రుణాల్ని ఇస్తుండటమూ అమ్మకాలకు ఊపునిస్తోందంటున్నారు. విల్లాల భూమి ఖరీదు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఓ స్థిరాస్తి వ్యాపారి తెలిపారు. అయితే ఈ లగ్జరీ మార్కెట్ రాష్ట్రంలోని ఏ ఇతర నగరాల్లో పెద్దగా ఉండదు. ఎందుకంటే భాగ్యనగరంలో కోటికి పైగా జనాభా ఉంటుంది. ఇందులో సింహభాగం వ్యాపారులు, పెట్టుబడిదారులే ఉంటారు. వీరు మార్కెట్ బలహీనంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టి లాభాలని ఆర్జిస్తుంటారని విశ్లేషించారు. మెట్రో రైల్, ఔటర్ రింగ్రోడ్, ఐటీఐఆర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లు అదనపు అంశాలు. ఐటీ, ఎన్నారైలే టార్గెట్.. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల అమ్మకాల్లో ఐటీ ఉద్యోగులు, ఎన్నారైలే అధికంగా ఉంటారని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. మా కంపెనీ నుంచి నెలకు 30-40 విల్లాలను విక్రయిస్తుంటే.. ఇందులో 90 శాతం అమ్మకాలు ఐటీ నిపుణులు చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్లో ఎన్నారైల వాటా 12 శాతంగా ఉందని ప్రాపర్టీ అడ్వైజర్ జేఎల్ఎల్ రిపోర్ట్ చెబుతోంది. గతేడాది దేశంలో ఎన్నారైలు రూ.2 బిలియన్ డాలర ్ల పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ఈ ఏడాది రూ.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. నగరంలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి లక్షల్లోనే ఉద్యోగులున్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వీరి వేతనాలు మెరుగ్గానే ఉన్నాయి. కొత్తగా వెబ్ డిజైనింగ్ ఉద్యోగులూ తోడయ్యారు. రెండేళ్ల క్రితం ఏడాదికి రూ. లక్ష ఆర్జించే వెబ్ డిజైనర్ ఆదాయం ఇప్పుడు దాదాపు పదిరెట్లు పెరిగింది. ఇది ఎంతో నైపుణ్యం గలిగినవారికే. వీరందరూ ఖరీదైన ఇళ్లవైపే మొగ్గుచూపుతున్నారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 16 ఎకరాల్లో 58 ప్రీమియం విల్లాలను నిర్మిస్తోంది. ఒక్కో విల్లా ధర రూ.6 కోట్లకు పైగానే పలుకుతోందంటే వీటి గిరాకీని అర్థం చేసుకోవచ్చు. రూ.80 లక్షలకు పైనే.. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల ధర సుమారుగా రూ.80 లక్షలకు పైగానే ఉంటాయి. నగరంలో రూ. నాలుగున్నర కోట్లుండే విల్లా.. శివార్లల్లో రూ.80 లక్షలకే లభిస్తోంది. అయితే వాటి విస్తీర్ణాలు, సదుపాయాల్లో వ్యత్యాసాలుంటాయి మరి. లగ్జరీ ఫ్లాటు విస్తీర్ణం తక్కువలో తక్కువగా 2 వేల చ.అ. ఉంటుంది. ఇరవై నాలుగు గంటలు విద్యుత్, నీటి సరఫరా ఉంటుంది. విశాలమైన విస్తీర్ణంలో చెట్లు, పచ్చిక బయళ్లుంటాయి. భద్రతకు ముప్పు ఉండదు. క్లబ్హౌస్, ఈతకొలను, వ్యాయామశాల, థియేటర్ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. అందమైన ఆకృతిలో భవంతులుంటాయి. అందులోని గృహోపకరణాలూ చాలా ఖరీదైనవి, విలాసవంతమైనవి కూడా. అందుకే లగ్జరీ ప్రాజెక్ట్ల మూల్యమెక్కువగా ఉంటుంది. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, నిజాంపేట, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తికావస్తే, మరికొన్ని రెండేళ్లలో పూర్తికానున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సుమారుగా పది వేలకు పైగానే లగ్జరీ యూనిట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు విశ్లేషకుల అంచనా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement