-
‘మా తెలుగు తల్లికి’ 80 ఏళ్ళు!
తెలుగు వారి గొప్పతనాన్ని వర్ణించిన గీతాలలో ‘మా తెలుగు తల్లి’ గీతం ఒకటి. దీన్ని శంకరంబాడి సుందరాచారి రాశారు. ఆయన 1914 ఆగస్ట్ 10న జన్మించారు. 1942లో ‘దీనబంధు’ సినిమాకి తెలుగుతల్లి గీతాన్ని రాశారు. చిత్ర దర్శకుడు ఎం.ఎల్. టాండన్ సుందరాచారి రాసిన గీతాన్ని మెచ్చుకుంటూనే, తెలుగుతల్లి గీతం యుగళ గీతంగా ఉపయోగపడదని తెలిపారు. హెచ్.ఎం.వి. కంపెనీ సుందరాచారికి 116 రూపాయిలు ఇచ్చి ఈ పాటని కొని, టంగుటూరి సూర్య కుమారి చేత గానం చేయించింది. తొలుత ఈ పాటని కొన్ని పుస్తకాలలో దేవులపల్లి రాశారని ముద్రించారు. తరువాత తప్పు తెలుసుకొని శంకరంబాడి సుందరాచారి పేరు ముద్రించారు. ఇప్పటికీ ఈ పాట ప్రజల్లోకి వెళ్లినంతగా ఆయన పేరు వెళ్ళలేదు. 1975లో మా తెలుగుతల్లి పాటని అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఆయన తెలుగుతల్లికి సమర్పించిన మల్లెపూలు ఎప్పటికీ వాడి పోనివి. ఆయన జీవిత చరిత్రను ఆయన స్నేహితుడు వై.కె.వి.ఎన్. ఆచార్య రచించారు. 2020లో వి.జి ఎస్. ప్రచురణ సంస్థ పిల్లల కోసం సుందరాచారిపై మరో పుస్తకాన్ని వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత తెలుగుతల్లి గీతం నవ్యాంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం అయింది. తెలుగు వారి వైభవాన్ని వర్ణించిన గీతమిది. ఈ గీత స్పూర్తితో తెలుగు వారు తమ ఉనికిని మరోసారి గట్టిగా చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుందరాచారి తనకంటూ ఏమీ దాచుకోలేదు. ఆయన సన్నిహితులే ఆయనను మోసగించారు. 1977 ఏప్రిల్ 8న ఆయన తుదిశ్వాస విడిచారు. – ఎం. రాం ప్రదీప్, తిరువూరు (‘మా తెలుగు తల్లి’ గీతానికి 80 ఏళ్ళు) -
మా తెలుగు తల్లిని మరచిపోయారా?
మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట తెలుగువారు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుతల్లి పరిస్థితి దయనీయంగా మారిందంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న వీరమణి అనే బాలిక అద్భుతంగా పాడింది. శంకరంబాడి సుందరాచార్య కలం నుంచి జాలువారిన అసలు పాటకు టంగుటూరి సూర్యకుమారి తన గళాన్ని ఇచ్చారు. ఆ పాటే ఇన్నాళ్లూ అందరికీ తెలుసు. కానీ.. తెలుగుతల్లిని మరిచారు, ఆ తల్లి మనసు విరిచారంటూ కాకినాడ బాలిక వీరమణి కళ్లు చెమర్చేలా పాడి అందరినీ ఆకట్టుకుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ.. మా కన్న తల్లికి మంగళారతులు మన తెలుగు తల్లిని మరచిపోయారా.. మముగన్న తల్లికి మనసు విరిచారా (2) కడుపులో బంగారు.. కనుచూపులో కరుణ.. చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి కడుపులో భుగభుగలు.. కనుచూపులో దిగులు.. చిరునవ్వు కనుమరుగు.. సిరులు నిలువున తరుగు.. ఇలా ఆ పాట సాగుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement