-
చంద్రబాబు పర్యటన రోజున షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ గట్టి షాక్ ఇవ్వనుంది. ఈ నెల 23న చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు రెండు రోజులుగా బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కిషన్రెడ్డి ఈరోజు ఇబ్రహీంపట్నంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్పై కిషన్ రెడ్డి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కిషన్ రెడ్డి తమ పార్టీలో చేరితే పార్టీకి లాభం చేకూరుతుందని టీఆర్ఎస్ అధిష్టాన వర్గం భావిస్తోంది. చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాలో పర్యటించే రోజునే కిషన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో రోజురోజుకు క్షీణిస్తున్న టీడీపీ పరిస్థితి కిషన్ రెడ్డి కూడా పార్టీని వీడితే మరీ దయనీయంగా మారుతుంది. -
బస్సు ఎక్కకుండా జారుకున్నారు!
టీడీపీకి తెలంగాణలో బస్సుయాత్ర కలిచొచ్చినట్టు కనబడడం లేదు. చంద్రబాబు బస్సుయాత్ర గురించి ప్రకటన చేసిన నాటి నుంచే 'సైకిల్' టైరుకు పంక్చర్ పడడం మొదలైంది. తెలుగు తమ్ముళ్లు బస్సు ఎక్కకుండానే జారుకుంటున్నారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గులాబీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బాబుగారి బస్సుయాత్ర ఆదిలోనే జావగారిపోయింది. మొత్తానికి శుక్రవారం బస్సుయాత్ర బయలుదేరింది. ఇక్కడ కూడా సైకిల్ పార్టీకి ఉలికిపాటు తప్పలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ధర్మారెడ్డి, ఆర్. కృష్ణయ్య... బస్సుయాత్రకు డుమ్మాకొట్టారు. బాబుగారి బస్సు ఎక్కకుండా జారుకున్నారు. మంచిరెడ్డి, కృష్ణయ్య కూడా సైకిల్ దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మరికొంత మంది వరుసలో ఉన్నారంటూ టీఆర్ఎస్ నాయకులు చెబుతుండడంతో టీడీపీలో గుబులు రేపుతోంది. టీడీపీ శిబిరం పూర్తిగా ఖాళీ కావాలనే లక్ష్యంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారని, త్వరలోనే మరికొందరు టీడీపీ సీనియర్లు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న సమాచారం పచ్చ పార్టీని కుదిపేస్తోంది. తమ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరకుండా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో టీడీపీ అధినేతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బస్సుయాత్ర ప్రకటన చేసిన నాటి నుంచే తమ పార్టీకి అపశకునాలు ఎదురవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు 'బాబోయ్ బస్సుయాత్ర' అంటున్నారు(ట).
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన భారత్
నైపుణ్యాన్ని వెలికితీస్తున్న చెస్ పోటీలు
ముగిసిన చెస్ పోటీలు
అన్నప్రాశన రోజే తిరిగిరాని లోకాలకు
పేరుపాలెం బీచ్లో సందడి
పచ్చిరొట్టగా జీలుగ సాగు
భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
క్రికెట్ జట్టు ఎంపిక
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
Advertisement