-
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ఖమ్మం: మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య (87) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన స్వగ్రామం కల్లూరు మండలం పోచారంలో తుదిశ్వాస విడిచారు. మధిర శాసనసభ స్థానానికి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి... మరో నెలలో గడువు ముగుస్తుందనగా రాజీనామా చేశారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు. వెంకట నరసయ్య మృతి పట్ల పలువురు సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
మధిర మెచ్చేదెవరినో?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు పెట్టనికోట.. విశిష్ట రాజకీయాలకు పెట్టింది పేరు.. పాగా వేసేందుకు తహతహలాడుతున్న పార్టీలు.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేయగా.. నియోజకవర్గ ప్రజలు ఎవరిని మెచ్చుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఈసారి మధిర నియోజకవర్గంలో విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఇక్కడ విజయం సాధించేందుకు సర్వశక్తులొడ్డుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా లింగాల కమల్రాజ్ బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు 2014 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే భట్టి విక్రమార్క అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా.. కమల్రాజ్ వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం తరఫున పోటీ చేశారు. అనంతరం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆయన తొలుత వైఎస్సార్ సీపీలో చేరగా.. ఆ తర్వాత ఆయనతోపాటు టీఆర్ఎస్ గూటికి చేరారు. కమ్యూనిస్టు పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేయడం.. ఎంపీపీగా పనిచేసిన అనుభవం, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతోపాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయి అండదండలు.. టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలు తనను విజయ తీరానికి చేరుస్తాయని కమల్రాజ్ విశ్వసిస్తున్నారు. ఇక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు కీలక పాత్రను పోషిస్తూనే మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజ్తోపాటు ఎంపీ పొంగులేటి పూర్తిగా మధిర నియోజకవర్గంపై దృష్టి సారించి.. పల్లె నిద్రలు చేయడం.. ఇంటింటి ప్రచారానికి సైతం నడుం బిగించడం పార్టీ విజయానికి దోహదపడుతుందని టీఆర్ఎస్ భావిస్తుండగా.. కాంగ్రెస్కు గల సంప్రదాయ ఓటు బ్యాంకు, విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలకు ప్రజాకూటమి ద్వారా టీడీపీ, సీపీలు భాగస్వామ్యం కావడంతో తమకు నియోజకవర్గంలో అదనపు బలం లభించినట్లయిందని భావిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు భట్టి విజయం సాధించడానికి ఈ అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శలు.. ఇదే నియోజకవర్గం నుంచి సీపీఎం మద్దతుతో బీఎల్పీ అభ్యర్థిగా డాక్టర్ కోటా రాంబాబు, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కత్తుల శ్యామలరావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల అభ్యర్థిత్వం దాదాపు రెండు నెలల ముందే ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన అనేకమార్లు నిర్వహించే అవకాశం లభించింది. మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పార పడుతూ.. ప్రజాకూటమి విజయం సాధిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని.. ప్రజా సమస్యలు తీరుతాయని, కేసీఆర్ పాలనలో చేసిందేమీ లేదని.. ఆడంబరాలతో ప్రజలను మభ్య పెట్టారని విమర్శనాస్త్రాలు సంధించారు. భట్టి, పొంగులేటి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శల హోరు కొనసాగింది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజ్తోపాటు ఆయన గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న ఎంపీ పొంగులేటి సైతం ఎన్నికల ప్రచారంలో వాడీవేడిగా విమర్శనాస్త్రాలను సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి, ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన తీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ బలాబలాలను వివరిస్తూనే.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. లింగాల కమల్రాజ్ విజయం కోసం సీఎం కేసీఆర్ మధిరలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించగా.. మల్లు భట్టి విక్రమార్క విజయం కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ప్రజా గాయకుడు గద్దర్ రెండు పర్యాయాలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ఖమ్మంలో జరిగిన రాహుల్, చంద్రబాబు సభల్లో సైతం భట్టి విజయాన్ని అగ్రనేతలు కాంక్షించారు. నియోజకవర్గంలోని ముదిగొండ, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం, మధిర మండలాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు.. తమకు లభించిన ఆదరణకు అనుగుణంగా విజయం తమదంటే తమదని విశ్వసిస్తున్నారు. -
నమ్మిన వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుంది
సాక్షి, మధిర: రాయపట్నం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాల వారు ఆదివారం టీఆర్ఎస్లోకి చేరారు. వారికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. దూళిపాళ్ల వీరయ్యచౌదరి, జానీ, మస్తాన్, సైదులు, తేళ్ల మోహన్రావు, నర్సింహారావు, ఎడ్ల పూర్ణయ్య, రాయల సాంబయ్య తదితరులు టీఆర్ఎస్లోకి చేరారు. తేళ్ల కొండ, తేళ్ల వాసు, దూళిపాళ్ల వీరయ్యచౌదరి ఆధ్వర్యంలో ఎంపీ పొంగులేటికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య, కోలాట నృత్యాలతో పొంగులేటిని ఘనంగా గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం పొంగులేటిని భారీ గజమాలతో సన్మానించారు. ఆ తరువాత గ్రామంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీని నమ్మినవారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, ప్రతిఒక్కరికీ తాను అండగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశానని తెలిపారు. డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో రాయపట్నం గ్రామప్రజలు ఎంపీ పొంగులేటికి బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, చీదిరాల వెంకటేశ్వర్లు, కోనా జగదీష్, ఈదర సుబ్బారావు, కనుమూరి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, అలివేలు ఉమామహేశ్వరరెడ్డి, చావలి రామరాజు, కట్టా గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
అక్రమ పొత్తులతో ‘కూటమి’
సాక్షి, మధిర: మధిరలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న లింగాల కమల్రాజ్దే గెలుపని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆత్కూరు, రాయపట్నం, దేశినేనిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ... కాంగ్రెస్, టీడీపీ అక్రమ పొత్తు పెట్టుకొని మాయకూటమిగా ఏర్పడి ప్రజలను మాయ చేసేందుకే ముందుకు వస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. దేశమంగా గర్వించే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. మధిర గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, విషప్రచారాలు నమ్మే ప్రజలు కారని అన్నారు. నిత్యం అందుబాటులో ఉండే కమల్రాజ్ను పార్టీలకు అతీతంగా ఆదరిస్తూ కారు గుర్తుపై ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజ్, నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, నాయకులు మేకల లక్ష్మి, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, ఇక్బాల్, భోగ్యం ఇందిర, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యన్నం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
ప్రచారంలో ఎదురుపడి..
సాక్షి, మధిర: మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి(కాంగ్రెస్) తరఫున మల్లు భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ నుంచి లింగాల కమల్రాజ్ ప్రధా న పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజ్తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. అదే సమయంలో, అదే వార్డు లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి భట్టి తనయుడు మల్లు సూర్యవిక్రమాదిత్య ను వెంటబెట్టుకుని ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎదురైన వాహనాలు తప్పుకునేటప్పుడు, కార్యకర్తలు ఒకే చోటకు చేరినప్పుడు ఏమైనా వివాదం జరుగుతుందేమోనని ఒకింత ఆందోళన నెలకొంది. అయితే ఎవరికివారే ప్రశాతంగా ప్రచా రం నిర్వహించుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement