-
లాభాలొస్తున్నా.. ఫలితం సున్నా
2023 మార్చి నెలలో ఆర్టీసీకిరూ.528 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల రూపంలో వచ్చింది రూ.428 కోట్లు. ఆ నెలలో సంస్థకు అయిన మొత్తంఖర్చు రూ.605 కోట్లు. ఫలితంగా రూ.77 కోట్ల నష్టం నమోదైంది. 2024 మార్చి నెలలో సంస్థ నమోదు చేసుకున్న మొత్తం ఆదాయం 696 కోట్లు. ఇందులో టికెట్ల ద్వారా వచ్చింది రూ. 598 కోట్లు. మొత్తం వ్యయం రూ.552 కోట్లు. దీంతో రూ.144 కోట్ల ఆదాయం నమోదైంది. సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే అమలవుతున్నా ఆర్టీసీ జీరో టికెట్లు జారీ చేస్తోంది. అలా ప్రతినెలా జారీ అయ్యే మొత్తం జీరో టికెట్ల పూర్తి చార్జీని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. దీంతో దాన్ని ఆదాయంగానే భావిస్తోంది. ఫలితంగా నష్టాల ఆర్టీసీ ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చింది. నష్టం కనుమరుగై ఒకే నెలలో ఏకంగా రూ.144 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నట్టు తాజాగా లెక్కలు రూపొందించింది. మరి నిజంగా ఇది ఆర్టీసీ లాభాల ఫలితాలు అనుభవిస్తోందా..? వాస్తవం ఎలా ఉందంటే... మహాలక్ష్మి పథకం రీయింబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతినెలా ఆ మొత్తాన్ని విడుదల చేయటం లేదు. ఆ రూపంలో నిధులు ఇవ్వటం లేదు. మహిళల ఉచిత ప్రయాణం మొదలైన తర్వాత జారీ అవుతున్న జీరో టికెట్ల మొత్తాన్ని పరిశీలిస్తే, సగటున ప్రతినెలా రూ.350 కోట్ల వరకు అవుతోంది. మార్చి నాటికి ప్రభుత్వం ఆ రూపంలో రూ.1400 కోట్లు విడుదల చేయాలని కోరినట్టు, ఆర్టీసీ ఇటీవల మరో కేసు విషయంలో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. కానీ, వరుసగా గత మూడు నెలల్లో ప్రభుత్వం రూ.285 కోట్లు, రూ.285 కోట్లు, రూ.275 కోట్లు చొప్పున విడుదల చేసింది. కానీ వీటిని మహాలక్ష్మి రీయింబర్స్మెంట్గా ఇవ్వలేదు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలో పేరుకుపోయిన బకాయిలుగానే సంస్థ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన చివరి బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1500 కేటాయిస్తూ ప్రతిపాదించింది. కానీ, ఆ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గత డిసెంబరు నుంచి కొత్త ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేసింది. మార్చి నెలతో చెల్లించిన మొత్తంతో ఆ బడ్జెట్ కేటాయింపులు క్లియర్ అయ్యాయి. దీంతో వాటిని బడ్జెట్ చెల్లింపులుగానే సంస్థ భావిస్తోంది. అదే నిజమైతే, మహాలక్ష్మి పథకం రూపంలో సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు ఇవ్వనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇలా రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం జరిగితే సంస్థ మళ్లీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది. లాభాలు ఉత్తిత్తి లెక్కలే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. లాభాలకు సంబంధించి కాగితాలపై చూపిన ఉత్తుత్తి లెక్కలుగా తేలిపోతోంది. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో, ఆ లాభాల తాలూకు ఫలితాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆర్టీసీకి సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్ బకాయిలు, కరువు భత్యం బకాయిలు పేరుకు పోయి ఉన్నాయి. 2013 వేతన సవరణకు సంబంధించి ఉన్న బకాయిల్లో బాండ్ల తాలూకు చెల్లింపులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఫిబ్రవరి నెలలో రూ.280 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, వాటిల్లో కేవలం కొంతమంది డ్రైవర్లకు మాత్రమే రూ.80 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. -
మెట్రోపై ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్అండ్టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ... గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీస్ బస్స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్అండ్టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్లలో రాయదుర్గం, ఎల్బీనగర్, అమీర్పేట్, మియాపూర్ స్టేషన్ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు. వర్క్ఫ్రమ్ హోమ్ కూడా... నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. -
‘మహాలక్ష్మి పథకం’ అమలులో గ్రేటర్ ఆర్టీసీ టాప్గేర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహాలక్ష్మి పథకం టాప్ గేర్లో పరుగులు తీస్తోంది. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం విశేషం. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతేడాది డిసెంబర్ 9వ తేదీన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ప్రయాణికులు లేక సిటీ బస్సులు వెలవెలపోయాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగరంలోని అన్ని రూట్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గతంలో 4 లక్షల మందే.. ప్రతి రోజు సుమారు 10 లక్షల మందికి పైగా మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. గతంలో కేవలం 4 లక్షల మంది సిటీ బస్సుల సేవలను వినియోగించుకొనేవారు. వారిలో విద్యార్థినులే ఎక్కువ. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనే మహిళలు ఎక్కువగా ఉండేవారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల మహిళలకు సిటీ బస్సు చేరువైంది. మెట్రో లగ్జరీ వంటి బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు సైతం ఉచిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల వైపు మళ్లారు. దీంతో ఈ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఒక్కసారిగా ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. సాధారణంగా ఉదయం, సాయంత్రం మాత్రమే కనిపించే ప్రయాణికుల రద్దీ కొంతకాలంగా అన్ని వేళల్లోనూ ఉంది. ‘ఆటోలు, క్యాబ్లు వంటి వాహనాలను వినియోగించే మహిళలు కూడా సిటీ బస్సుల్లోకి మారారు. ఇప్పుడు బస్సుల సంఖ్య పెరిగితే తప్ప ప్రయాణికుల డిమాండ్ను చేరుకోలేని పరిస్థితి నెలకొంది’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి రోజు 10 లక్షల మంది ప్రయాణికుల చొప్పున మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 90 రోజుల్లో సుమారు 10 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గతంలో రోజుకు సుమారు 15 లక్షలు మాత్రమే ఉన్న ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 25 లక్షలు దాటింది. అందులో 10 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరగడంతో సిటీ బస్సుల్లో సీట్ల కొరత పెద్దసవాల్గా మారింది. మహిళల కోసం కేటాయించిన సీట్లతో పాటు, ఇతర సీట్లను కూడా మహిళలే ఆక్రమించుకోవడంతో పురుషులు, వయోధికులకు ‘స్టాండింగ్ జర్నీ’ భారంగా మారింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఒకటి, రెండు రూట్లలో నాలుగైదు ట్రిప్పులు ప్రయోగాత్మకంగా నడిపారు. కానీ అంతగా స్పందన లేకపోవడంతో ‘జెంట్స్ స్పెషల్’ బస్సుల ప్రతిపాదనను విరమించుకొన్నారు. అరకొర బస్సులే... గతంలో రోజుకు రూ.కోటి నష్టంతో నడిచిన బస్సులు ఇప్పుడు లాభాల బాట పట్టాయి. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్న దృష్ట్యా నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీకి అవకాశం లభించింది. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ మహానగరం విస్తరణకు అనుగుణంగా సిటీ బస్సుల సేవలు విస్తరించుకోవడం లేదు. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా నగర శివార్ల నుంచే వివిధ రకాల పనులపైన మహిళలు, అన్ని వర్గాల ప్రయాణికులు నగరంలోకి రాకపోకలు సాగిస్తారు. కానీ నగర శివార్ల నుంచి తగినన్ని బస్సులు అందుబాటులో లేవు. సుమారు 2500 బస్సులు మాత్రమే సిటీలో తిరుగుతున్నాయి. మెట్రోలగ్జరీ, మెట్రో డీలక్స్ వంటి బస్సులను మినహాయిస్తే కనీసం 2000 బస్సులు కూడా అందుబాటులో లేవు. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న మహిళల్లో 70 శాతం మంది నగర శివార్ల నుంచే ప్రయాణం చేస్తున్నారు. బెంగళూర్ వంటి మెట్రో నగరాల్లో 6 వేలకు పైగా సిటీ బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ ఆర్టీసీ కూడా కనీసం రెండు రెట్లు విస్తరించవలసి ఉంది. -
తెలంగాణ: ‘మహాలక్ష్మి’, ‘గృహ జ్యోతి’ ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని.. అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా చిత్తశుద్ధితో ఒక్కో పథకం అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో అభయహస్తం గ్యారెంటీల అమలులో భాగంగా.. ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన పథకం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలను అమలు చేశామని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూటికి నూరు శాతం అన్ని హామీలను అమలు చేస్తామని.. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారాయన. అలాగే.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని మరోసారి స్పష్టత ఇచ్చారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ఇస్తున్నామని, అలాగే మహాలక్ష్మీ పథకం కింద సబ్జిడీతో రూ.500 సిలిండర్ అందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ కోడ్ వల్లే.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తుక్కుగుడలో సోనియా గాంధీ హామీ ఇచ్చారు. సోనియా గాంధీ హామీ మేరకు కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. రెండు పథకాలను చేవెళ్ళలో ప్రారంభించాలి అనుకున్నాం. ఎమ్మెల్సీ కోడ్ వల్ల అక్కడి నుంచి సెక్రటేరియట్ కు మార్చాల్సి వచ్చింది. ప్రియాంక గాంధీ కోడ్ కారణంగా రద్దు చేసుకున్నారు. కట్టెలపోయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ ను ఆనాడే తక్కువకు ఇందిరా గాంధీ ఇచ్చారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ దీపం పథకం తీసుకొచ్చింది. రూ.400 కేగ్యాస్ సిలిండర్ అందించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1200కు సిలిండర్ రేటు పెరిగింది. మోదీ గ్యాస్ ధరలు పెంచితే కేసీఆర్ సబ్సీడీ ఇవ్వలేదు. .. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.. ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తాం. ఎవరు ఎలాంటి శాపాలు పెట్టినా...అపోహలు ప్రచారం చేసినా పథకాలు ఆగవు. సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం. ఆమె ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా పాలన చేస్తాం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాం అని సీఎం రేవంత్ అన్నారు. ఉచిత విద్యుత్పై ఆ ప్రచారం నమ్మొద్దు: డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల స్కీమ్ను దేశం అంతా చూస్తోందని.. ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అమలుకాని ఆరు గ్యారెంటీల హామీ కాంగ్రెస్ ఇచ్చినట్లు BRS మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే విమర్శలు చేస్తోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు జేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలని అందరం పట్టుదలతో ఉన్నాం. అరకొర నిధులతో జీతాలు ఇస్తూనే, పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రారంభించిన గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలువబోతున్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమే ఇందిరమ్మ రాజ్యం అంటే. 200 యూనిట్లు అమలు అంటే కోతలు అని ప్రచారం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు రేపు మార్చి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా కరెంట్ ఇవ్వబోతున్నాం. అర్హత కలిగిన వారందరికీ ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ఇస్తాం. బీఆర్ఎస్ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మొద్దు అని భట్టి పిలుపు ఇచ్చారు. ఇతర మంత్రులు.. భవిష్యత్తులో తెల్లకార్డు ఉండి ఎల్పీజీ కనెక్షన్ ఉంటే.. మహాలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది బల్ధిదారులున్నారని.. లబ్ధిదారుల జాబితాలో ఇప్పుడు లేనివారిని త్వరలోనే చేరుస్తామని చెప్పారాయన. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొలువుదీరాక రెండు పథకాలు.. ఇప్పుడు మరో రెండింటిని ప్రారంభించామని.. నూటికి నూరు శాతం అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు. -
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement