-
నాకు అప్పగించిన పదవికి వన్నెతెచ్చేలా పనిచేస్తా : మహాలక్ష్మి శ్రీనివాస్
-
వైఎస్ఆర్సీపీలోకి మహాలక్ష్మి శ్రీనివాస్
హైదరాబాద్ : అనంతపురం జిల్లా టీడీపీ నేత మహాలక్ష్మి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మహాలక్ష్మి శ్రీనివాస్తో పాటు కదిరి కాంగ్రెస్ నేత సిద్ధారెడ్డి , అనంతపురం టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు బి.గౌతమ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. -
టీడీపీకి మహాలక్ష్మీ శ్రీనివాస్ రాజీనామా
అనంతపురం: అనంతపురం జిల్లా అర్బన్ టీడీపీ ఇన్ఛార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం చేయలేదని, టీడీపీలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. గత పదేళ్లుగా టీడీపీకి దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారని మహాలక్ష్మి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పార్టీ టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారని గతంలో దీపక్రెడ్డి ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. -
'రూ. 10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు'
అనంతపురం/కడప: టీడీపీలో కష్టపడ్డవారికి అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్ ఆరోపించారు. రూ. 5 నుంచి రూ. 10 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారని అన్నారు. డబ్బు ప్రాతిపదికన టికెట్లు ఇస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అనంతపురంలో కార్యకర్తలతో సమావేశమైయ్యారు. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా సుమారు రూ.120కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు టికెట్లు ఇవ్వమంటే ఎలా అని వాపోయారు. సూట్కేసులు మోసినవారికే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారని, తమకు అన్యాయం జరిగితే ఇండిపెండెంట్గా బరిలో ఉంటామని ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. కడప జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రొద్దుటూరు సీటు ఇవ్వకపోతే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు ఆయన సిద్దపడుతున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలోనూ వివాదం రేగింది. మహిళలకు ఒక్క సీటే కేటాయించడంపై తెలుగు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడితో పాటు మరో స్థానాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం కోటా రద్దు: అమిత్ షా
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement