-
Mahindra Thar RWD: మొన్న విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు
అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ ఇటీవల ఆర్డబ్ల్యుడి వెర్షన్గా పుట్టుకొచ్చింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు, అప్పుడే దీని ధరలు భారీగా పెరిగాయి. మహీంద్రా థార్ RWD (రియర్-వీల్-డ్రైవ్) ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ప్రారంభంలో కేవలం మొదటి 10,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. థార్ ఆర్డబ్ల్యుడి AX(O) డీజిల్ MT, LX డీజిల్ MT, LX పెట్రోల్ AT వేరియంట్లలో అందుబాటులో ఉంది. మహీంద్రా థార్ ఎల్ఎక్స్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధరలను మాత్రమే కంపెనీ రూ. 50,000 పెంచింది. కావున ఈ SUV ధరలు ఇప్పుడు రూ. 11.49 లక్షలకు చేరింది. మిగిలిన రెండు వేరియంట్ ధరలు మునుపటి మాదిరిగానే ఉన్నాయి. సరికొత్త మహీంద్రా థార్ ఆర్డబ్ల్యుడిలో ఉన్న 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ దాని 4డబ్ల్యుడి వేరియంట్ మాదిరిగా అదే పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 150 బిహెచ్పి పవర్, 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, థార్ ఆర్డబ్ల్యుడి మోడల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇది 117 బిహెచ్పి పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే ఈ డీజిల్ ఇంజిన్ కేవలం మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే అందించబడుతుంది. ఇందులో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ అందుబాటులో లేదు. మహీంద్రా థార్ ఆర్డబ్ల్యుడి బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. ఈ కొత్త ఆఫ్ రోడర్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి వాటికి సపోర్ట్ చేసే 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి కూడా ఇందులో ఉంటాయి. -
ఎం అండ్ ఎం ఛైర్మన్ వేతనం ఎంత పెరిగిందంటే..
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర వేతనం భారీగా పెరిగింది. గత ఏడాది తో పోలిస్తే మహీంద్రా జీతం 16.38 శాతం పెరిగింది. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు రూ.8 కోట్లకు చేరింది. 2016-17 సం.రానికి 7.67 కోట్ల రూపాయల జీతం అందుకోనున్నారనీ, అంతకుముందు ఆర్థిక సంవత్సరం నుంచి 16.38 శాతం పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది. తమ మధ్యస్థ ఉద్యోగుల వేతనాలకంటే ఇది 108.27 శాతం ఎక్కువ అని పేర్కొంది అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంక రూ. 7.6 కోట్ల వేతనం అందుకున్నారని తెలిపింది. ఉంది. 2016-17లో అమలుచేసిన ఈఎస్ఓపీ కారణంగా ఇది 15.86 శాతం పెరిగిందని పేర్కింది. ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే గోయెంకా యొక్క వేతనం నిష్పత్తి 104.43. సంస్థ అందించిన నివేదిక ప్రకారం, 2016-17లో సంస్థ ఉద్యోగుల సగటు వేతనం రూ.7.08 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరంలో, ఉద్యోగుల సగటు వేతనం లో 0.43 శాతం పెరిగింది. 2016-17లో నిర్వహణాధికారుల కంటే వేరే ఉద్యోగుల వేతనాల్లో సగటు తగ్గుదల 1.46 శాతంగా ఉంది, అదే సంవత్సరంలో నిర్వహణ వేతనం తగ్గి 7.35 శాతంగా ఉంది. ఎం అండ్ ఎం గ్రూప్ సిఎఫ్ఓ, సిఐఓ వి.ఎస్. పార్థసారథిలకు రూ. 3.52 కోట్లు లభించాయని, గత ఏడాది నుంచి 19.74 శాతం మేర పెరిగిందని నివేదిక పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ వేతనాలను వారి వ్యక్తిగత పనితీరు, ద్రవ్యోల్బణం, వ్యాప్తిలో ఉన్న పరిశ్రమ పోకడలు , బెంచ్ మార్క్ నిర్ణయాల ఆధారంగా నిర్ణయించబడతాయని కంపెనీ తన రిపోర్టులో వెల్లడించింది. కాగా ఇటీవల ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.766 కోట్ల లాభాలను, 3.29 శాతం వృద్ధితో రూ.12,335 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement