-
మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్స్
-
HYD Rains: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్మెంట్లు
సాక్షి, మేడ్చల్: భారీ వర్షాలతో గుండ్ల పోచంపల్లి పరిధి మైసమ్మగూడలో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షం నీరు ఏరులైపారుతోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్న సుమారు 30 అపార్ట్మెంట్లలో వరద నీరు చేరింది. ఒకటో అంతస్తు వరకు వరద నీరు చేరింది. పలువురు విద్యార్థులకు ఈ రోజు పరీక్షలు ఉండటంతో మునిగిపోయిన హాస్టల్ నుండి ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మైసమ్మగుడలో కాలువలు, నాళాలు కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు నీట మునగటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. రెండు జేసీబీలను రప్పించి అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. -
అతివేగం ప్రాణాలు తీసింది!
దుండిగల్: వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారి బైక్లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అనంత్ విశాల్(23), సుజిత్(21) బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. సుజిత్ స్థానికంగా ఉన్న మహాలక్ష్మీ బాయ్స్ హాస్టల్లో, విశాల్ మరో హాస్టల్లో ఉంటున్నారు. వీరిద్దరూ శనివారం రాత్రి 11 గంటల సమయంలో యమహా బైక్పై సూరారం ప్రాంతానికి వచ్చారు. తిరిగి బహదూర్పల్లి వైపు వేగంగా వెళ్తుండగా సూరారం కట్టమైసమ్మ దేవాలయం సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విశాల్, సుజిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కొడిగిరి మండలం దోమలెడిగి కాగా, తండ్రి విఠల్ పటేల్ ఎంపీటీసీ. సుజిత్ స్వస్థలం మంచిర్యాల. బైక్లో లభ్యమైన గంజాయి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న ఎరుపు రంగు బ్యాగ్లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. మైసమ్మగూడలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు రాత్రి సమయంలో సూరారం ప్రాంతానికి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంజాయిని కొనుగోలు చేసేందుకే ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు.. విద్యార్థుల వద్ద కిలో గంజాయి దొరకడంతో దుండిగల్ పోలీసులు ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు సంచరించినట్లు అనుమానిస్తున్న సూరారంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే గతంలో ఇదే తరహాలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన, విక్రయించే పాత నేరస్తుల చిట్టాను సైతం వెలికితీస్తున్నారు. దీనికి తోడు గంజాయి క్రయవిక్రయాలపై హాస్టల్లోని తోటి విద్యార్థులను సైతం విచారించే అవకాశం ఉంది. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి ఫోన్ సంఘటన స్థలంలోనే ధ్వంసంకాగా, మరో విద్యార్థి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్డేటాను పరిశీలిస్తున్నారు. బైక్ నడిపిన సమయంలో విద్యార్థులు గంజాయి సేవించారా.. లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని వారు పేర్కొంటున్నారు. -
మైసమ్మగూడను స్మార్ట్గా చేస్తా
గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్న ఎంపీ మల్లారెడ్డి తాగునీటి ఎద్దడి, సక్రమంగా లేని అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, సమస్యలకు చిరునామాగా మారింది మేడ్చల్ మండలంలోని మైసమ్మగూడ గ్రామం. నగరానికి కేవలం 20 కి.మీ. దూరంలోనే ఉన్న ఈ గ్రామం విద్యాసంస్థలతో విరాజిల్లుతున్నా.. మౌలిక సదుపాయాలు మాత్రం నామమాత్రంగా మారాయి. మైసమ్మగూడ వాసులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మైసమ్మగూడలో పర్యటించారు. టీ స్టాళ్ల నిర్వాహకులు, ఆటో డ్రైవర్లు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రైతులతో మాట్లాడారు. సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, మైసమ్మగూడను స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎంపీ: ఏం తల్లీ.. పింఛన్ వస్తోందా? నర్సమ్మ: వస్తోంది సారూ.. మొన్న మూడు నెలల పింఛన్లు ఇచ్చిన్రు. ఎంపీ: మీ సమస్యలన్నీ తెలుసుకుని, పరిష్కరించడానికే వచ్చాను. పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి. ఎంపీ: పెద్దవ్మూ.. రేషన్ వస్తోందా? లక్ష్మమ్మ: ఈ నెల రేషన్ వచ్చింది సారు. కార్డులే రాలే. ఎంపీ: ప్రభుత్వం త్వరలోనే ఇస్తుంది. గరీబోలందరికీ బియ్యం వస్తాయి. ప్రతి ఒక్కరికీ ఆరు కిలోలు వస్తయ్. ఎవరికైనా రాకుంటే అధికారులకు చెప్పి ఇప్పిస్తా. లక్ష్మమ్మ: మంచిది సారు. ఎంపీ: బిడ్డా ఏం పని చేస్తున్నరు? భవాని: వెల్డింగ్ పని చేస్తున్నాం. ఎంపీ: ఎవరెవరు చేస్తున్నరు. ఎంతమంది చేస్తున్నారు. భవాని: నేను మా ఇద్దరు చెల్లెళ్లు ఈ పని చేస్తున్నం. ఎంపీ: ఇంకా ఎవరైనా తోడుగా ఉన్నారా? భవాని: మా నాన్నతో కలిసి ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఈ పని చేసుకుంటున్నం. ఎంపీ: ఎంత వరకు సంపాదిస్తున్నారు? భవాని: మా కుటుంబం గడుస్తోంది సారు. ఎంపీ: మీరు ఎంత వరకు చదువుకున్నారు? భవాని: అంతంత మాత్రమే చదువుకున్నాం. ఎంపీ: మీరు చదువుకుంటానంటే నేను నా సొంత ఖర్చులతో చదివిస్తా. రాధ: మీరు సాయుం చేస్తానంటే పెద్ద చదువులు చదువుకుంటాం. ఎంపీ: మీకు చదువుపై ఆసక్తి ఉంటే ఉన్నత చదువులు నా కాలేజీలోనే ఉచితంగా చదివిస్తా. ఎంపీ: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? శ్రీలత: మా వెల్డింగ్ దుకాణం చిన్నగా ఉంది. మాకు గ్రామంలో ఆర్డర్లు దొరకడం లేదు సారు. ఎంపీ: మీరు కష్టపడి పనిచేస్తే వూ కళాశాలకు అవసరమైన ప్రతి ఫ్యాబ్రికేషన్ పనులను మీకే అప్పగిస్తా. ఎంపీ: ఏం పెంటయ్య బాగున్నావా... గ్రామంలో ఏమైనా సమస్యలున్నాయా? పెంటయ్య: మా గ్రామంలో కొంతమందికి రేషన్ కార్డుల లిస్టులో పేర్లు రాలేదు సార్. ఎంపీ: గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వారికి, దనవంతులకు రేషన్ కార్డులు రావు. అర్హతలున్నవారికి రేషన్ కార్డులు రాకపోతే దగ్గరుండి ఇప్పిస్తా. ఎంపీ: ఏం బాబు పింఛన్ వస్తుందా ? పరమేష్ (వికలాంగుడు): సార్.. పింఛన్ రావడం లేదు. మీరే ఇప్పించాలి. ఎంపీ: సదరమ్ సర్టిఫికెట్ ఉంటే అధికారులతో మాట్లాడి పింఛన్ అందేలా చేస్తా. ఎంపీ: ఏం పెద్ద మనిషి బాగున్నావా.. నీళ్లు సరిగా వస్తున్నాయా? రాంరెడ్డి: నీళ్ల ఇబ్బంది బాగా ఉంది సార్. ఎంపీ: అక్కడే ఉన్న సర్పంచ్ ఈశ్వర్ని పిలిచి గ్రామంలో నీటి సమస్య లేకుండా చూడండి. నిధులు లేకపోతే నా నిధుల నుంచి కేటాయిస్తాను. ఎంపీ: ఏమమ్మా కరెంట్ సరిగ్గా ఉంటోందా.. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇస్తున్నారా? యశోద: ఇప్పటికైతే మంచిగానే ఉంది సార్. ఎంపీ: ఏమయ్యూ.. పాల వ్యాపారం ఎట్లా నడుస్తోంది.. గిట్టుబాటు ధర వస్తోందా? మహంకాళి: ఫరవాలేదు సార్. లీటరుకు రూ.40 వస్తున్నాయ్. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో మేతకే ఇబ్బందిగా ఉంది. ఎంపీ: ఏం తమ్ముడు.. నీ బిడ్డకు టీకాలు ఇప్పించావా.. ఏఎన్ఎంలు గ్రామానికి వస్తున్నారా? మారుతిరెడ్డి: ఇప్పించాను సార్. నేనే దవాఖానకు తీసుకెళ్లి ఇప్పించా. ఏఎన్ఎంలు మా వైపు ఎప్పుడూ రాలేదు. ఎంపీ: ఏ తల్లీ.. ఏం చదువుతున్నావ్? పావని: బీటెక్ చదవుతున్నాను సర్. ఎంపీ: కాలేజీకి వెళ్లలేదా.. ఇక్కడేం చేస్తున్నావ్? పావని: కాలేజీలో ప్రాక్టికల్స్ నడుస్తున్నాయ్.. బస్సు కోసం నిలబడ్డాను సర్. ఎంపీ: కాలేజీలో.. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడుతున్నారా? కళ్యాణి: అలాంటిది ఏం లేదు సర్. పోలీసులు, కళాశాల సెక్యూరిటీ సిబ్బంది భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
Advertisement