-
రిజర్వేషన్లపై ఉత్కంఠ
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుం దో లేదోననే టెన్షన్లో ఉన్నారు. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కొన్నిచో ట్ల విందు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యా యి.రిజర్వేషన్లు ఖరారైతే మరింత వేగంగా పరి ణామాలు మారే అవకాశం ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 4,31,778 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,16,008 మంది, స్త్రీలు 2,15,770 మంది ఉన్నారు. బీసీలు 2,53,384 మంది, ఎస్టీలు 64,058 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 77,076 మంది, ఓసీలు 37,277 మంది ఉన్నారు. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. రిజర్వేషన్లు 2011 గ్రామీణ జనాభా లెక్కల ప్రకారం, నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరిస్తూ ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్గా, జెడ్పీటీసీలకు జిల్లాను, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్గా తీసుకుంటారు. ఎంపీటీసీల రిజర్వేషన్లను ఎంపీడీఓలు తయారుచేస్తే కలెక్టర్ ఫైనల్ చేయనున్నారు. రాష్ట్రం, జిల్లా, మండల యూనిట్గా రిజర్వేషన్ల కేటాయింపుల్లో ముందుగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తొలుత ఎస్సీలకు, తరువాత ఎస్టీలకు రిజర్వేషన్లను కేటాయించి మిగిలినవి బీసీలకు కేటాయిస్తారు. తర్వాత జనరల్ స్థానాలను ప్రకటిస్తారు. జిల్లా నుంచి నేడు(మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు రిజర్వేషన్ల ప్రకటనల కోసం తర్జనబర్జన అవుతున్నారు. మండలం ఎంపీటీసీ స్థానాలు ఆత్మకూరు 09 చెన్నారావుపేట 11 దామెర 08 దుగ్గొండి 12 గీసుకొండ 09 ఖానాపురం 09 నడికూడ 10 నల్లబెల్లి 11 నర్సంపేట 11 నెక్కొండ 16 పరకాల 05 పర్వతగిరి 14 రాయపర్తి 16 సంగెం 14 శాయంపేట 12 వర్దన్నపేట 11 మొత్తం 178 తమకు అనుకులంగా కావాలని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు తమకు అనుకులంగా వచ్చే విధంగా చేయాలని ఇప్పటికే ఆశావహులు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా, మండల నాయకుల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అనుకులంగా రిజర్వేషన్ తీసుకవస్తే గెలుపించుకుని వస్తామని జిల్లా, మండల నాయకులు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. పార్టీ ఫండ్ సైతం ఏమీ లేకుండానే స్వంత డబ్బులు పెట్టుకుని గెలుస్తాడని హామీలు ఇస్తున్నారు. ఎంపీలు, శాసన సభ్యులు సైతం గ్రామంలో బలమైన నాయకులకు అనుగుణంగా రిజర్వేషన్ వచ్చే విధంగా పావులు కదుపుతున్నారని సమాచారం. బలమైన నాయకుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితే పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తారని అధికార పార్టీ నేతలు రిజర్వేషన్లు అనుకులంగా ఉండే విధంగా చూస్తున్నారని తెలుస్తోంది. -
మలి పోరుకు రె‘ఢీ’
సాక్షి, ఏలూరు : జిల్లా పరిషత్, మండల పరి షత్ ఎన్నికల మలిపోరు శుక్రవారం జరగనుంది. 24 జెడ్పీటీసీ, 452 ఎంపీటీసీ స్థానాల్లో ఓటరు తీర్పు కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. తొలి విడత పోలింగ్లో ఎదురైన అవాం ఛనీయ ఘటనలు ఈసారి తలెత్తకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నరసాపురం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ అభ్యర్థులు 87మంది, ఎంపీటీసీ అభ్యర్థులు 1,180 మం ది పోటీపడుతున్నారు. 11,67,231మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగిం చుకోవాల్సి ఉంది .686 ప్రాంతాల్లో 1,434 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 9వేల 414 మంది సిబ్బంది గురువారం ఆయా ప్రాంతాలకు వెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, ఇంక్ బాటిళ్లు, స్వస్తిక్ గుర్తులు, ఇతర పరికరాలు వెంటబెట్టుకెళ్లారు. 451 సమస్యాత్మక, 315 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 2,275 మంది పోలీసులతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాలను అరికట్టేందుకు రహస్య నిఘా ఈ ఎన్నికల్లో నగదు, మద్యం, ఇతర ప్రలోభాలను నిరోధించేందుకు రహస్యంగా నిఘా వేసే బృందాలను కలెక్టర్ సిద్ధార్థజైన్ రంగంలోకి దించారు. నిఘా బృందాల సభ్యులు సాధారణ జనంలా.. అవసరమైతే మారువేషాల్లో వెళ్లి అక్రమార్కుల భరతం పట్టాలని కలెక్టర్ సూచించారు. తమ వాహనాలను దూరంగా ఉంచి తనిఖీలు చేయాలని చెప్పారు. తొలి విడతలో జరిగిన లోటుపాట్లు దృష్టిలో ఉంచుకుని అలాంటివి మలి విడత పోలింగ్ ప్రక్రియలో చోటుచేసుకోకుండా చూడాలని పోలింగ్ యంత్రాంగానికి ఆయన సూచించారు. పూర్తయిన పంపకాలు : అధికారుల తనిఖీలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ముందుగానే మేల్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీని పోలింగ్ ముందు రోజు రాత్రి ముమ్మరంగా చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సహించమని అధికారులు హెచ్చరికలు జారీచేయడంతో పాటు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో రెండు రోజులు ముందునుంచే పంపకాలు ప్రారంభించారు. గురువారం ఉదయానికే చాలా చోట్ల పూర్తి చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement