-
గోడ దూకితే.. గోడు మిగిలింది!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు ఆశపడి టీడీపీలోకి వెళ్లిన నేతలకు ప్రస్తుతం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు రోజుల తరబడి ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో సదరు నేతలు అసహనానికి గురవుతున్నారు. తన టికెట్ విషయంలో మొదట్లో ధైర్యంగా ఉన్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చివరకు దక్కదన్న సంకేతాలతో నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. మరోవైపు కొడుకు టికెట్ కోసం ఎంపీ టీజీ వెంకటేష్ కూడా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ సీటు వ్యవహారం నేడు తేల్చే అవకాశముంది. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యరీత్యా ఎక్కువ సమయం వేచి ఉండలేని స్థితిలోనూ తనకు ఎంపీ టికెట్ లేదా కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరేందుకు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు సర్వే ద్వారా టికెట్లు ఇస్తామని రెడీమేడ్ సమాధానం ఇవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొదట్లో ఎంపీగానే పోటీ చేస్తానని భీష్మించుకున్న ఆమె.. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఫరవాలేదన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా సమీక్షల సందర్భంగానూ పిలుపు రాకపోవడంతో ఆమె మదనపడిపోతున్నారు. పైగా ఆదోని సీటును మీనాక్షి నాయుడికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అసలు ఊసులోనే లేకుండా పోయారు. నంద్యాల సీటు విషయంలోనూ అదే మడతపేచీ కొనసాగుతోంది. మొత్తంగా పార్టీ మారిన నేతలంతా ప్రస్తుతం తమకు జరుగుతున్న ‘మర్యాద’ను తలచుకుని లోలోపల కుంగిపోతున్నారు. అయ్యో..ఎస్పీవై! నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనకు ఎంపీ సీటు ఇస్తారన్న ఆశ ఉందని పైకి అంటున్నప్పటికీ..ఖర్చు విషయాన్ని ముందుకు పెట్టి సీటు నిరాకరిస్తున్నారని లోలోపల వాపోతున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ కావాలంటే ఖర్చుల కోసం రూ.60 కోట్లు చూపించాలని టీడీపీ పెద్దలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము అంత మొత్తాన్ని చూపించలేమనే ఉద్దేశంతోనే కావాలని ఇలా అడుగుతున్నారని ఎస్పీవై వాపోతున్నారు. సీటు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకోవడంతో ఈ విధంగా చేశారని అంటున్నారు. పార్టీ మారే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ మీ కుటుంబానికే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మదనపడిపోతున్నారు. చివరకు ఇంత వయస్సులో.. ఆరోగ్యం సహకరించనప్పటికీ గంటల తరబడి వేచిచూస్తే సర్వే ద్వారా తేల్చుతామని ప్రకటించడంతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదని తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కనీసం పిలవడం కానీ, సీటు విషయం మాట్లాడటం కానీ చేయలేదని సమాచారం. అలాగే కోడుమూరు ఇన్చార్జ్గా వ్యవహరించిన విష్ణువర్దన్రెడ్డిని కనీసం పలకరించే ప్రయత్నం కూడా పార్టీ నేతలెవ్వరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన నేతలంతా చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని చూసి తమను తామే తిట్టుకుంటున్నారు. కర్నూలు సీటుపై పీటముడి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మొన్నటివరకు సీటు తనదేనని బల్లగుద్ది మరీ వాదించేవారు. పార్టీ సభ్యత్వం మొదలుకుని.. పార్టీ కమిటీల వరకూ అన్నీ తమకే అప్పగించారని పేర్కొనేవారు. తమను కాదని సీటు వేరేవారికి ఎలా ఇస్తారని గాంభీర్యంగానూ ప్రకటించేవారు. అయితే.. నాలుగు రోజులుగా టీజీ భరత్కు సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో ఎస్వీ నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. దీంతో రోజూ గంటల తరబడి వేచిచూసి.. వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మోహన్రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి చంద్రబాబు అకారణంగా తప్పించిన విషయాన్ని ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు రాజకీయ కపట నాటకాన్ని తలచుకుంటూ నేతలు కుంగిపోతున్నారు. -
శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. వీరు ఇరువురు గురువారం క్షమాపణ చెప్పటంపై వారిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసినట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ సభలో ప్రకటించారు. కాగా తమ పార్టీ సభ్యుల మీద విధించిన సస్పెన్షన్ను తొలగించాలంటూ ప్రతిపక్ష పార్టీ ఉప త జ్యోతుల నెహ్రూ బుధవారం సభలో స్పీకర్కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే సభ్యులు క్షమాపణలు చెబితే సస్పెన్షన్ తొలగించడానికి అభ్యంతరం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు షరతులతో కూడిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అయితే నిన్న ఈ ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు ఉదయం వారిపై సస్పెన్షన్ తొలగింది. -
ఇద్దరు సభ్యుల్ని సభకు అనుమతించండి
హైదరాబాద్ : అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తమ సభ్యులు శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీని తిరిగి సభకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. స్వల్ప విరామం తర్వాత సభ ప్రారంభం కాగానే ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు జ్యోతుల నెహ్రూ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అలాగే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విషయంలోనూ ఏ చర్య తీసుకోవద్దని కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించాలని బిజెపి కూడా కోరింది. సంప్రదాయానికి అనుగుణంగా వారు క్షమాపణ కోరితే సస్పెన్షన్ రివోక్ చేయవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. -
ఇద్దరు విపక్ష సభ్యుల సస్పెన్షన్
► ఆర్.శివప్రసాదరెడ్డి, మణిగాంధీపై వేటు ► బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ ► తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి యనమల ► మూజువాణిఓటుతో ఆమోదం ► స్పీకర్ పోడియం వద్ద నిలబడి వైఎస్సార్సీపీ సభ్యుల నిరసన ► విపక్ష నేతకు మైక్ ఇచ్చినట్లే ఇచ్చి కట్ చేసిన స్పీకర్ ► వెల్లో నిలబడి నినాదాలు చేసిన విపక్ష సభ్యులు ► గందరగోళ పరిస్థితుల మధ్య సభ నేటికి వాయిదా హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర ఆరోపణలు, సవాళ్లతో బడ్జెట్ సమావేశాల్లో ఏడో రోజైన మంగళవారం కూడా అసెంబ్లీ నల్లబ్యాడ్జీలు, బైఠాయింపులు, నినాదాలు, అరుపులు కేకలతో దద్దరిల్లింది. బడ్జెట్పై చర్చను ముగించేందుకు తమ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసిన డిమాండ్ను స్పీకర్ కోడెల శివప్రసాదరరావు తోసిపుచ్చడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా జరిగిన గందరగోళంలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేశారు. ఇందుకు విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, మణిగాంధీని బాధ్యులను చేస్తూ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. దీనిపై మాట్లాడుతున్న జగన్కు మైక్ కట్ చేశారు. తమ నేతకు మైక్ ఇవ్వాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో 1.28 గంటలకు సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మంగళవారం 12.15గంటలకు సభ ప్రా రంభమైన వెంటనే.. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆ దశలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేసినట్టు సిబ్బంది గుర్తిం చారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల ఉదయం 10.51 గంటల సమయంలో సభను రెండోసారి 15 నిమిషాలపాటు వాయిదా వేశా రు. అనంతరం సభ ప్రారంభం కాగా విపక్ష సభ్యులు తమ నిరసనను తెలియజేస్తున్న క్రమంలోనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘వైఎస్సార్సీపీ సభ్యులు రోజూ వెల్లోకి వస్తున్నారు. ఈరోజు స్పీకర్ మీద దాడి చేశారు. మైక్ విరగ్గొట్టారు. సభ ఆస్తులు విరగ్గొట్టిన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని తీర్మానం ప్రతిపాదించారు. సభ మూజు వాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందిందని, విపక్ష సభ్యులు ఆర్.శివప్రసాదరెడ్డి, ఎం.మణిగాంధీని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ కోరారు. ఆ వెంటనే టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. స్పీకర్ చర్యలకునిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. తమకు న్యాయం చేయాలని, విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తున్న సమయంలోనే మంత్రులు రావెల కిషోర్బాబు, పీతల సుజాత, టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడారు. వారు తీవ్ర పదజాలం, అన్పార్లమెంటరీ పదాలతో ప్రసంగాలు సాగించినా.. స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో 12.35 గంటలకు సభను 15 నిమిషాల పాటు వాయిదావేశారు. 1.15 గంటల కు సభ తిరిగి ప్రారంభమైంది. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘‘సస్పెన్షన్కు తావిచ్చే నిర్ణయాలు జరిగాయి. గత రెండు, మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరును దయచేసి గమనించండి. శాంతిభద్రతల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో... అధికార పక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామని చెబుతున్నా.. నిరసన తెలపడానికి ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వలేదు...’’ అని జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. సభను తప్పుదోవ పట్టించవద్దంటూ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పోడియం వద్ద నిలబడి తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండగానే.. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మం త్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ అవకాశం ఇచ్చా రు. తర్వాత కూడా విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో 1.28 గంటలకు సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ముగింపు వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వండి... ప్రశ్నోత్తరాల అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే బడ్జెట్పై చర్చను ప్రారంభించాల్సిందిగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావును కోరారు. దీ నికి వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జగన్ ప్రారంభించిన చర్చ పూర్తి కాలేదని, మరో పది నిమిషాలు సమయమిస్తే దాన్ని ముగిస్తారని కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. బాధ్యత కలిగిన తమ నాయకుడు తన ప్రసంగాన్ని ముగించేం దుకు అవకాశం ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్రెడ్డి స్పీకర్ను కోరారు. ఈ సందర్భంలో స్పీకర్కు వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య వాగ్వా దం జరిగింది. ‘‘మీ నాయకుడు జగన్ గంటా 55 నిమిషాలు మాట్లాడారు. అందులో 21 నిమిషాల సమయం వృథా అయింది. అది పోయినా గంటా 34 నిమిషాలు మాట్లాడినట్టు. ప్రతిపక్షానికి ఇచ్చిన సమయం గంటన్నర. ఆ సమయం లో పూర్తి చేయలేకపోయారు. ముగించేందుకు పది నిమిషాల సమయం కావాలని పొద్దున నన్ను కలిసిన మీ పార్టీ నేతలు కోరారు. దానికి నేను సరే అన్నా’’ అని స్పీకర్ చెప్పారు. ప్రజాస్వామ్యం నిజంగా ఉందా?: జగన్ స్పీకర్ వ్యాఖ్యలపై జగన్మోహన్రెడ్డి మాట్లా డుతూ ‘‘బడ్జెట్ై పె ప్రతిపక్షం మాట్లాడేందుకు గంటన్నర సమయం ఇస్తారా? ప్రజాస్వామ్యం నిజంగా ఉందా? నేను మాట్లాడుతున్నప్పుడు గంటా ఆరు నిమిషాల పాటు అంతరాయం కల్పించారు. అందుకు మీరు బాధ్యత వహించాలి’’ అని చెప్పారు. ఇంతలో శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు లేచి విపక్షంపై విరుచుకుపడ్డారు. బీ ఏసీలో నిర్ణయం మేరకే సమయం కేటాయిస్తే తిరిగి మళ్లీ కావాలనడం తమ అవకాశాన్ని అ డ్డుకోవడమేనని ఎదురుదాడికి దిగారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత సమయం ఉం టే విపక్షనేతకు ఇవ్వాలే తప్ప ముందు ఇవ్వ డం తగదన్నారు. దీనికి స్పీకర్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యు లు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్రెడ్డి అభ్యంత రం చెప్పారు. తమకు న్యాయం కావాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. తెలుగుదేశం సభ్యులు కూడా తమ సీట్లలో నుంచి లేచి నిలబడి ప్రతిపక్ష సభ్యులతో వాగ్వావాదానికి దిగారు. ఇవేవీ పట్టిం చుకోని స్పీకర్.. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేం ద్రను మాట్లాడమని కోరారు. ఓవైపు గందరగోళం, మరోవైపు నిరసన ధ్వనుల మధ్య నరేంద్ర విపక్షంపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వా త మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కాగిత వెంకట్రావ్, యనమల, కాలువ శ్రీనివాసులు కూడా ప్రతిపక్ష సభ్యుల నిరసనను తప్పుబట్టారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే వారిని సస్పెండ్ చేసైనా చర్చ కొనసాగించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. మా సమయం తీసుకోండి: బీజేపీ బీజేపీ సభ్యుడు విష్ణుకుమారరాజు మాట్లాడుతూ తమకిచ్చిన సమయంలో పది నిమిషాలను వైఎస్సార్సీపీకి ఇచ్చయినా సభను సజావుగా నడిపించాలని స్పీకర్ను కోరా రు. ఇది సమ్మతమేనని స్పీకర్ చెప్పారు. ఈ దశలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేసినట్టు సిబ్బంది గుర్తించి స్పీకర్ దృ ష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం గందరగోళం మధ్య కోడెల ఉదయం 10.51 గంటలకు రెండోసారి 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమయ్యాక మంత్రి యనమల రా మకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, మణిగాంధీని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
మీకు ప్రశ్నించే హక్కు ఉందా..?
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
తిరుపతి గ్రామదేవతకు వేడుకగా భూమన కుటుంబం సారె
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు
పాల వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
కనిపించని ఏనుగు జాడ
ఘనంగా చిన్నకొట్టాయి ఉత్సవం
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
ముగ్గురూ ఆడపిల్లలైనా..
తప్పక చదవండి
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
- Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
- Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
- 9 సీట్లలో గెలుపు ఖాయం
- అంచనాలకు మించి..
- Lok Sabha Election 2024: నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
- Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
Advertisement