-
గిరిజనుడి హత్యచేసిన మావోయిస్టులు
ఏవోబీ సరిహద్దుల్లో మరో గిరిజన నేత హత్యకు గురయ్యాడు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. శుక్రవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు..కొడ శిఖర గైడకు చెందిన నేత సంగ్ ను పట్టుకుని కొట్టి చంపేశారు. సంగ్ ను పోలీస్ ఇన్ఫ్మార్మర్ గా పేర్కొంటూ ఓ లేఖను వదిలి వెళ్లారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దండకారణ్యంలో కందకాలు
దండకారణ్యంలో మావోయిస్టులు భారీ స్థాయిలో కందకాల తవ్వకం చేపట్టారు. పోలీసులు ఏర్పాటు చేసే బేస్ క్యాంపులను అడ్డుకోవడంలో భాగంగానే వ్యూహాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతంలో మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో.. మావోయిస్టులు తమ స్ధావరాలను సేఫ్ జోన్ లుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు కాకుండా.. ఇప్పటికే ఏర్పాటు చేసిన క్యాంపులకు సరఫరాలు అందకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు డిసెంబర్ నెలలో ఏటా జరిగే పీఎల్ జీఏ వారోత్సవాల నిర్వహణలో భాగంగానే.. ముందు జాగ్రత్త చర్యగా కందకాల ఏర్పాటు జరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఛత్తీస్గఢ్లోని కుంట, కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని అమ్మపేట - పాలచల్మ మధ్యలో శుక్రవారం రాత్రి నుంచి మావోయిస్టులు రోడ్డుమార్గంలో కందకాల తవ్వకాలు మొదలుపెట్టారు. దండకారణ్య నేత సుధాకర్ నేతృత్వంలో వందలాది మంది మిలీషియా సభ్యులు ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రహదారిపై దాదాపు పది నుంచి పదిహేను కందకాలు తవ్వినట్లు తెలుస్తోంది. రెండునెలల క్రితం పైడిగూడెం అటవీ ప్రాంతంలోని రహదారిపై మావోయిస్టులు 20 కిపైగా కందకాలు తవ్వారు. ఆ తర్వాత మావోయిస్టు విలీన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల కోసమే కందకాలు తవ్వారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
వాయు సేన దాడులపై మావోల నిరసన
చత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం రాత్రి 25 వాహనాలను దగ్ధం చేశారు. వాయుసేన దాడులను నిరసిస్తూ మావోయిస్టులు బుధవారం దండకారణ్య బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హాహాల్ది ఐరన్ఓర్ మైన్స్పై సుమారు 150 మంది సాయుధ మావోయిస్టులు దాడి చేశారు. మైన్లోని డీప్లాంట్లో ఉన్న డంపర్లు, మిక్సర్లు, లోడర్లు, జీపులు, పొక్లెయిన్లను మావోయిస్టులు తగులబెట్టారు. -
మావోయిస్టు పోస్టర్ల కలకలం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి మావోయిస్టులు కదలికలు పెరిగిపోయిన తరుణంలో.. మరో సారి మవోల పోస్టుర్లు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా చెర్ల మండలం పూసుగుప్ప గ్రామ సమీపంలోని రోటింత వాగు సమీపంలో ఆదివారం రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికేసిన మావోలు పోస్టర్లు అతికించారు. డిసెంబర్2 నుంచి 8 వరకు జరపనున్న 'పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ' వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. -
టీడీపీ ఎంపీపీ బెదిరిస్తున్నారు
అనంతపురం అర్బన్: తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ తనను బెదిరిస్తున్నాడని రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి మాదిగ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసుతో కలిసి బుధవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ చేస్తున్న దౌర్జన్యం గురించి వివరించారు. గతంలో తాను ఒక విప్లవ పార్టీకి ఆకర్షితుడై దానిలో చేరానని, ఆ తర్వాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయానని నారాయణస్వామి మాదిగ తెలిపారు. అప్పట్లో నక్సల్స్ పునరావాసం కింద ప్రభుత్వం ఉపాధి కల్పిస్తామని ప్రకటించినా తనకు న్యాయం జరగలేదన్నారు. అయితే తమ పూర్వీకుల భూమి సర్వే 207 రెండో లెటర్లో ఉన్న 5.69 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. తన భూమి గ్రామానికి సమీపాన ఉండడంతో ఆ భూమిని ఏలాగైనా సొంతం చేసుకోవాలని ఎంపీపీ తన పలుకుబడిని ఉపయోగించి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే..జిల్లాలో అనేక ప్రాంతాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవని, వాటికి వెంటనే స్థలాలు కేటాయించాలని మాదిగ జేఏసీ జిల్లా యువసేన అధ్యక్షుడు వి.రమణ మాదిగ, రాష్ర్ట కో-కన్వీనర్ చిన్నపెద్దన్న మాదిగ అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో కాంట్రాక్టు వర్కర్లకు తొమ్మిది నెలల నుంచి వేతనాలు అందలేదని ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నేతలు బండారు నాగేశ్వరరావు, సి.నారాయణ, కె.జోసఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వేతనాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలి : సకాలంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి సూచించారు. 15 రోజుల లో 50 శాతం ఫిర్యాదులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల కుటుంబాల గృహ విద్యుత్ రాయితీ కింద జిల్లాలకు 2014-15లో రూ. 13.67 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ బి.ల క్ష్మీకాంతం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అందిన 2,055 ఫిర్యాదులలో 1,845 పరిష్కరించామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న 210 పిటిషన్లను పది రోజులలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్లో 39, ఐసీడీఎస్లో 6, డీఆర్డీఏలో 7, డ్వామాలో 8, పోలీసుశాఖలో 48, ఎల్డీఎంలో 60, డీపీవో 3, ఆర్డబ్ల్యూఎస్ 7, వ్యవసాయశాఖలో 8 పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సెల్లో అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్యాద్రి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement