-
కష్ట జీవికి కంట నీరు
సత్తెనపల్లి: మార్కెట్లో పత్తి ధర కష్ట జీవికి కంట నీరు తెప్పిస్తోంది. గత ఏడాది క్వింటా రూ. 5వేల నుంచి రూ. 6వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ. 2900 నుంచి రూ. 3,200 వరకు మాత్రమే ఉండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపించింది. పల్నాడు ప్రాంతంలో కొంత మేర ఆశాజనకంగా ఉన్నా డెల్టాలో రైతులు నష్టపోయారు. ఉన్నట్లు ఉండి పంట ఎర్రబారి తెగుళ్లు సోకడంతో పూత,పిందె రాలిపోయాయి. దిగుబడులు తగ్గడంతోపాటు మార్కెట్లో పత్తి ధరలు చూసి రైతు ఆవేదన చెందుతున్నాడు. పెట్టుబడికి దిగుబడికి తప్పిన లంకె.. పత్తి తీత ఆరంభంలో క్వింటా ధర రూ. 3500 నుంచి రూ. 4300 వరకు పలికింది. క్రమేణా ధర తగ్గింది. గత ఏడాది ఎకరం పత్తి సాగుకు పెట్టుబడి రూ. 15వేలకు మించలేదు. ఈ ఏడాది ఖర్చులు విపరీతంగా పెరగడంతో రూ. 30వేలుఅయిందంటున్నారు. కౌలు రైతు అయితే మరో 10 నుంచి రూ. 15వేలు అదనం. ప్రస్తుతం ఎకరాకు సగటున ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధర ప్రకారం రూ. 15 వేలు వస్తాయి. పెట్టుబడి రూ. 30వేలు, కౌలు రూ. 15వేలు కలిపితే, మరో రూ. 30వేలు రైతే బాకీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చేసిన అప్పులు తీరే మార్గం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. 27 నాటికి జిల్లాలో 11 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.... జిల్లాలో పత్తి రైతుల పరిస్థితిని ఆలకించిన జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శ్రీధర్ సోమవారం సాయంత్రం మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలో 11 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ మాచర్ల, పిడుగురాళ్ళ, నడికు డి, ఫిరంగిపురంలో మాత్రమే ప్రారంభించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈనెల 27నాటికి మిగిలిన ఏడు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశిం చారు. శాసనసభ్యులను ప్రారంభోత్సవాలకు ఆహ్వానించి గుంటూరు, తాడికొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, పెదనందిపాడు, సత్తెనపల్లి, క్రోసూరు మార్కెట్యార్డుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. మంగళవారం రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు పత్తి బోరాలను తీసుకొచ్చారు. ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి నేను ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరాకు రూ. 32వేలు పెట్టుబడి పెట్టా. ఇప్పటి వరకు ఐదు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. గ్రామాల్లో రూ. 3 వేలకు మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. సీసీఐ కేంద్రంలో ఆంక్షలు విధించకుండా గిట్టుబాటు ధర కల్పించాలి. మద్దతు ధర రూ.4,050లుగా, నాణ్యత తగ్గితే రూ. 3800లుగా సీసీఐ కేంద్రంలో నిర్ణయించారు. దీన్ని సవరించి కనీసం క్వింటా రూ. 5,500 నుంచి రూ. 6వేల వరకు కొనుగోలు చేస్తే రైతు కష్టాలు కొంత మేర తీరతాయి. - కుంచాల వెంకయ్య, రైతు, భీమవరం -
చక్కెర ఫ్యాక్టరీల గొంతులోచేదు గుళిక
ధర, విక్రయాలు లేక చక్కెర పరిశ్రమలు దిగాలు భారీగా పేరుకుపోయిన పంచదార నిల్వలు మార్కెట్లో దిగుమతులే కారణం గతేడాది పంచదార ఉత్పత్తి ఆశాజనకంగా వచ్చింది. అయితే ధర లేదు. డిమాండ్ అంతకన్నా లేదు. ఫలితం విక్రయాలు నిలిచిపోయాయి. లక్షలాది పంచదార బస్తాలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి ఇది. చోడవరం : ఓవైపు పంచదారకు ధర లేక.. మరోవైపు విక్రయాలు జరగక చక్కెర కర్మాగారాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. లక్షలాది బస్తాల పంచదార నిల్వలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీల్లోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది పంచదారపై లెవీ ఎత్తేయడంతో ప్యాక్టరీలు ఆర్థికంగా బాగుపడతాయని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా పంచదార ధర ఘోరంగా పడిపోయింది. గత ఏడాది మొదట్లో క్వింటాలు రూ. 3300వరకు విక్రయించగా, తర్వాత క్రమేణా ధర తగ్గుకుంటూ వచ్చింది. ఒక దశలో క్వింటాలు రూ.2600కు పడిపోయింది. ఈ ఏడాది సీజన్ మొదట్లో అయినా ఈ ధర పెరుగుతుందని భావించినా ఆశించినమేర పెరగలేదు. జులై, ఆగస్టు నెలల్లో మాత్రం క్వింటా రూ. 3100కు వెళ్లినప్పటికీ, పరిస్థితి తారుమారై ప్రస్తుతం రూ. 2900 వద్దే ఉంది. కనీసం ఈ ధరకైనా విక్రయించాలని ఫ్యాక్టరీ అనుకున్నా మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇదీ కారణం! ఇతర రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతి అవుతుండడమే ఇందుకు కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీనికి తోడు వ్యాపారులు సిండికేట్ అయిపోవడం వల్ల కూడా ధర పెరగడం లేదనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో చక్కెర కొనుగోలుకు ఎప్పట్నుంచో ఉంటున్న ‘ఆ ముగ్గురే’ తప్ప, మరెవ్వరూ రాకపోవడం కూడా ధర పెరగడానికి, అమ్మకాలకు విఘాతం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ధర తగ్గినప్పుడు తప్ప ధర పెరిగినప్పుడు బయ్యర్లు ముందుకు రావడం లేదు. దీనివల్ల గత నెలరోజులుగా జిల్లాలో అన్ని ఫ్యాక్టరీల్లోనూ పంచదార విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం రూ.2900 ధరకైనా కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అన్ని ఫ్యాక్టరీల్లోనూ లక్షలాది క్వింటాళ్ల పంచదార నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ‘గోవాడ’కు అద్దెభారం... పాత యంత్రాలైనప్పటికీ ఆపసోపాలు పడి క్రషింగ్ చేయగా, తీరా నిల్వలు పేరుకుపోవడంతో ఫ్యాక్టరీలు దిక్కుతోచని స్థితిలో గిలగిలా కొట్టుకుంటున్నాయి. గోవాడ ఫ్యాక్టరీ అయితే పంచదార నిల్వలకు అదనంగా ప్రైవేటు గోడౌన్లను అద్దెకు కూడా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో అద్దె అదనపు భారంగా మారింది. వచ్చేది పండగల సీజన్ కావడంతో ధర, డిమాండ్ కూడా పెరగొచ్చని గోవాడ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డెరైక్టర్ వి.వి.రమణారావు ఆశాభావం వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement