-
సెన్సెక్స్ లక్ష్యం 27,142
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ జూన్-జూలై నెలల్లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు క్రమేపీ బలపడుతున్నాయి. తన పాలసీకి మార్కెట్లను సిద్ధంచేయడంలో భాగంగా పదేపదే వడ్డీ రేట్ల పెంపు ప్రస్తావనను ఫెడ్ అధికారులు తీసుకొస్తున్నారు. రేట్ల పెంపు అంచనాలతో తొలుత ప్రపంచ సూచీలు సర్దుబాటుకు లోనైనా, గతవారం ఆ భయాలను వదిలి ప్రపంచ సూచీలు పెరిగాయి. ఫెడ్ ఛైర్పర్సన్ కూడా ఇదే ప్రకటనను గత శుక్రవారం చేసినప్పటికీ, ఆ రోజున అమెరికా మార్కెట్ పెరుగుదలతో ముగిసింది. రేట్ల పెంపునకు ఈక్విటీ మార్కెట్ సంసిద్ధమైనట్లు ఈ ట్రెండ్ సూచిస్తున్నది. ఇందుకు అనుగుణంగా భారత్ సూచీలు కూడా గతవారం పెద్ద బ్రేక్అవుట్ సాధించాయి. అంటే...వచ్చే ఒకటి, రెండు నెలల్లో ఫెడ్ రేట్లను పెంచేవరకూ ప్రస్తుత అప్ట్రెండ్ చిన్న సర్దుబాట్లతో కొనసాగే అవకాశాలున్నట్లు భావించవచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... మే నెల 27తో ముగిసిన వారంలో వరుసగా నాలుగురోజులపాటు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,357 పాయింట్ల లాభంతో 26,653 వద్ద ముగిసింది. ఈ వారం చిన్న కరెక్షన్లు జరిగినా సెన్సెక్స్ 27,142 పాయింట్ల లక్ష్యాన్ని చేరే ఛాన్సుంది. గత ఏడాదిన్నరగా 30,025 నుంచి 22,495 వరకూ జరిగిన కరెక్షన్లో 61.8 శాతం రిట్రేస్మెంట్ స్థాయే ఈ 27,142 పాయింట్లు. ఈ లక్ష్యాన్ని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే క్రమేపీ 28,135 స్థాయిని అందుకునే వీలుంటుంది. మధ్యలో 27,620 పాయింట్ల స్థాయి చిన్నపాటి అవరోధాన్ని కల్గించవచ్చు. గతవారం మార్కెట్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్ స్థాయిలు ఈ వారం మార్కెట్ తగ్గితే మద్దతును అందించవచ్చు. తొలి మద్దతు 26,400 పాయింట్ల సమీపంలో లభిస్తుండగా, తదుపరి మద్దతు 25,940-25,897 పాయింట్ల శ్రేణి మధ్య వుంది. 30 రోజుల చలన సగటు (30 డీఎంఏ) రేఖతో పాటు 200 డీఎంఏ రేఖ కదులుతున్న 25,640 పాయింట్ల స్థాయి ప్రస్తుత అప్ట్రెండ్కు చివరి మద్దతు. 8,243 పాయింట్ల దిశగా నిఫ్టీ కొద్ది నెలల నుంచి అవరోధం కల్పిస్తున్న 8,000 పాయింట్ల స్థాయిని ఎన్ఎస్ఈ నిఫ్టీ ఎట్టకేలకు ఛేదించి చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 407 పాయింట్ల భారీలాభంతో 8,157 వద్ద ముగిసింది. గట్టి అవరోధాన్ని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించిన ఫలితంగా ఈ వారం నిఫ్టీ మరింత పెరిగే అవకాశం వుంది. తొలుత 8,243 లక్ష్యాన్ని అందుకోవొచ్చు. 9,120 నుంచి 6,825 వరకూ గతంలో జరిగిన సర్దుబాటుకు 61.8 శాతం రిట్రేస్మెంట్ స్థాయే ఈ 8,243 పాయింట్లు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే రానున్న వారాల్లో నిఫ్టీ 8,546 వరకూ ర్యాలీ జరిపే ఛాన్స్ వుంది. మధ్యలో 8,340 పాయింట్ల వద్ద ఒక అవరోధం కలగవచ్చు. ఈ వారం మార్కెట్ తగ్గితే నిఫ్టీకి 8,080 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే తదుపరి మద్దతు 7,940 పాయింట్ల వద్ద లభ్యం కావొచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 7,809-7,761 పాయింట్ల శ్రేణి మధ్య బలమైన మద్దతును పొందవచ్చు. ఇది గతవారం నిఫ్టీకి పెద్ద గ్యాప్కావడంతో పాటు 200 డీఎంఏ, 30 డీఎంఏ రేఖలు ఇదే శ్రేణి మధ్య కదులుతున్నాయి. -
25,000 స్థాయిని దాటితేనే..
మార్కెట్ పంచాంగం ఎన్నో నెలల తర్వాత ఈక్విటీలు, క్రూడ్, బంగారం, మెటల్స్...ఇలా ట్రేడయ్యే అన్ని ఆస్తుల ధరలూ పెరుగుతున్నాయి. అలాగే చైనాతో సహా ఇతర వర్థమాన దేశాల కరెన్సీలన్నీ బలపడుతున్నాయి. ఈక్విటీలు పెరిగితే బంగారం తగ్గడం, క్రూడ్ తగ్గితే షేర్లు క్షీణించడం, చైనా మార్కెట్ పతనమైతే ఇతర ప్రపంచ మార్కెట్లు పడిపోవడం, డాలరు పెరిగితే ఇతర వర్థమాన కరెన్సీలు తగ్గడం వంటి ట్రెండ్స్ అన్నీ హఠాత్తుగా మటుమాయమయ్యాయి. ఒకవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగా, మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయినా అన్నింటి ధరలూ అప్ట్రెండ్లోనే వున్నాయి. ఈ ధోరణి ఇక ఎన్నోరోజులు కొనసాగకపోవొచ్చు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు మార్చి 11తో ముగిసిన 4 రోజుల ట్రేడింగ్వారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 72 పాయింట్ల స్వల్పలాభంతో 24,718 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం వారం వరుసగా మూడురోజులపాటు 24,820 పాయింట్ల వద్ద చిన్న అవరోధం ఏర్పడినందున, ఈ వారం ఇదేస్థాయి తొలి నిరోధం కాగలదు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీగా ర్యాలీ జరిపిన నేపథ్యంతో ఈ సోమవారం ఈ స్థాయిపైన సెన్సెక్స్ ప్రారంభమైతే వెనువెంటనే 25,000 పాయింట్ల శిఖరాన్ని తాకే చాన్స్ వుంది. దాదాపు ఇదే స్థాయి వద్ద జనవరి 14, ఫిబ్రవరి 1 తేదీల్లో డబుల్టాప్ ఏర్పడినందున, ఈ స్థాయిని బలంగా దాటి స్థిరపడితేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. అటుపైన సెన్సెక్స్ 25,230 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే కొద్దిరోజుల్లో 26,256 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. ఈ వారం క్షీణిస్తే 24,440 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తుండగా, 24,380-24,280 శ్రేణి వద్ద మద్దతు సెన్సెక్స్ కీలకమైనది. మార్చి 2 నాటి గ్యాప్అప్ అయిన ఈ శ్రేణిని సూచీ కోల్పోతే ప్రస్తుత అప్ట్రెండ్ ప్రమాదంలో పడే వీలుంది. ఈ శ్రేణి దిగువన 24,044 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున 23,820 పాయింట్ల స్థాయి వద్ద మరో మద్దతు లభిస్తున్నది. నిఫ్టీ కీలక మద్దతు శ్రేణి 7,406-7,380 ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో 7,510 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్అప్తో మొదలైతే 7,550 స్థాయి వద్ద తక్షణ నిరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిపైనే నిఫ్టీ ప్రారంభమైతే వేగంగా 7,600 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితేనే నిఫ్టీ మరింత పెరిగి 7,675 స్థాయివరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదించి, స్థిరపడితే రానున్న వారాల్లో 7,980 పాయింట్ల దిశగా కదిలే అవకాశం వుంటుంది. ఈ వారం మార్కెట్ తగ్గితే నిఫ్టీకి తక్షణం 7,425 వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 7,406-7,380 పాయింట్ల మద్దతు శ్రేణి సమీపకాలంలో అప్ట్రెండ్కు కీలకం. ఈ శ్రేణిని కోల్పోతే 7,308 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 7,235 పాయింట్ల వద్దకు తగ్గే ప్రమాదం వుంటుంది. - పి.సత్యప్రసాద్ -
సెన్సెక్స్ తొలి నిరోధం 23,940 పాయింట్లు
మార్కెట్ పంచాంగం మార్కెట్ ఓవర్సోల్డ్ కండీషన్లో పడినట్లు టెక్నికల్స్ వెల్లడిస్తున్నందున, రిలీఫ్ ర్యాలీ జరగవచ్చంటూ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా మార్కెట్ పెరిగింది. చైనా మార్కెట్ పునఃప్రారంభమైన తర్వాత స్థిరంగా ట్రేడ్కావడం, అమెరికా మార్కెట్లు కూడా ర్యాలీ జరపడం ఇక్కడ షార్ట్ కవరింగ్కు దోహదపడింది. ఇక కేంద్ర బడ్జెట్ సమర్పణకు వారం రోజులే గడువు వుంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ సంకేతాలతో అల్లాడిపోయిన మన మార్కెట్ బడ్జెట్ పట్ల అంచనాల్ని ఏర్పర్చుకుని, అందుకు తగ్గ కొనుగోళ్లు, అమ్మకాలు జరపడానికి కేవలం ఐదు ట్రేడింగ్ రోజులే మిగిలివుంది. సరిగ్గా ఇదేవారంలో ఫిబ్రవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు కూడా ముగియనున్నాయి. ఇటు షార్ట్ కవరింగ్, అటు లాంగ్, షార్ట్ రోలోవర్స్ కారణంగా మార్కెట్లో ఆయా షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు ఫిబ్రవరి 19తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్ఈ సెన్సెక్స్ 22,921 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినా, ద్వితీయార్థంలో కోలుకోవడంతో అంతక్రితం వారంతో పోలిస్తే 723 పాయింట్ల లాభంతో 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మొదలైన రిలీఫ్ ర్యాలీ ఈ వారం కూడా కొనసాగితే 23,940 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన స్థిరపడితే క్రమేపీ 24,225 పాయింట్ల స్థాయివరకూ పెరిగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 23,440 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే గతవారపు కనిష్టస్థాయి అయిన 22,921 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ స్థాయి దిగువన మరోదఫా 22,600 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధం 7,275 ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 230 పాయింట్ల లాభంతో 7,211 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రిలీఫ్ ర్యాలీ కొనసాగితే 7,275 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఎదురుకావొచ్చు. అటుపైన స్థిరపడితే క్రమేపీ 7,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 7,120 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే క్రమేపీ 6,960 పాయింట్ల స్థాయి వరకూ తగ్గవచ్చు. ఆ లోపున మరోమారు 6,870 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ ముగింపు సందర్భంగా 7,300, 7,400 స్ట్రయిక్స్ వద్ద అత్యధికంగా 58,44 లక్షలు, 60.51 లక్షల చొప్పున కాల్స్ బిల్డప్ జరిగింది. అలాగే 7,200, 7,000 స్ట్రయిక్స్ వద్ద భారీగా 50,56 లక్షలు, 53.63 లక్షల మేర పుట్స్ బిల్డప్ జరిగింది. 7,300 పాయింట్ల స్థాయిని దాటితే నిఫ్టీ మరింత పెరగవచ్చని, 7,400 పాయింట్ల స్థాయిని అధిగమించడం మాత్రం కష్టసాధ్యమని ఈ డేటా వెల్లడిస్తున్నది. 7,200 స్థాయిని కోల్పోయి, ముగిస్తే 7,000 పాయింట్ల స్థాయివరకూ పెద్దగా మద్దతు లేదని కూడా ఈ డేటా సూచిస్తున్నది. -
26,250 దాటితేనే తదుపరి అప్ట్రెండ్
మార్కెట్ పంచాంగం ఇయర్ఎండ్ షార్ట్ కవరింగ్తో వరుసగా మూడోవారం భారత్ సూచీలు కూడా పెరిగాయి. దాదాపు ప్రతీ ఏడాదీ జనవరి తొలివారంలో భారత్ మార్కెట్ సానుకూలంగా వుంటుంది. కానీ పలు సందర్భాల్లో జనవరి రెండు, మూడోవారాల్లో డౌన్ట్రెండ్ను ఇన్వెస్టర్లు చవిచూస్తుండేవారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సంవత్సరాంతపు సెలవుల నుంచి తేరుకుని, కొత్త సంవత్సరం రెండోవారం నుంచి చురుగ్గా ట్రేడ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అదేట్రెండ్ పునరావృత్తమవుతుందా లేదా అనేది అంచనావేయలేముగానీ...ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వుండటం అవసరం. జనవరి తొలివారంలో వెలువడే అమెరికా జాబ్స్ డేటా తదితర కీలక గణాంకాలు రానున్న నెలల్లో అక్కడి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తీసుబోబోయే నిర్ణయాలకు బాట వేస్తాయి. సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు జనవరి 1తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ మరో 322 పాయింట్ల లాభంతో 26.161 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే క్రితం వారం వరుసగా నాలుగు రోజులపాటు గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రీతిలో 26,100-26,250 పాయింట్ల నిరోధ శ్రేణి మధ్య అవరోధాన్ని చవిచూసింది. రానున్న రోజుల్లో ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తేనే, తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. 26,250 పాయింట్లపైన 26,567 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అక్టోబర్ 26 నాటి 27,618 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి డిసెంబర్ 14నాటి 24,867 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్మెంట్ స్థాయే ఈ 26,567 పాయింట్లు. ఈ స్థాయిని దాటితే రానున్న వారాల్లో 75 శాతం రిట్రేస్మెంట్ స్థాయి అయిన 26,930 పాయింట్ల వద్దకు పెరిగే ఛాన్స్ వుంటుంది ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 25.940 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 25,700 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 25,400 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. 7,980పైన నిఫ్టీ అప్ట్రెండ్ కొనసాగింపు ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 7.963 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లానే నిఫ్టీ సైతం 7,940-7,980 పాయింట్ల శ్రేణి మధ్య గతవారం పలుదఫాలు అవరోధం ఎదుర్కొన్నది. ఈ శ్రేణిని బలంగా దాటగలిగితేనే నిఫ్టీ తదుపరి ర్యాలీ సాధ్యపడుతుంది. 7,980 పాయింట్ల పైన నిఫ్టీ వెనువెంటనే 8,036 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఇది గతంలో 8,336 పాయింట్ల నుంచి 7,551 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్మెంట్ స్థాయి. అటుపైన ముగిస్తే 75 శాతం రిట్రేస్మెంట్ స్థాయి అయిన 8,140 పాయింట్ల వరకూ నిఫ్టీ పెరగవచ్చు. ఈ వారం నిఫ్టీ 7,980 పాయింట్లపైన స్థిరపడలేకపోతే 7,890 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఈ లోపున క్రమేపీ 7,830 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 7,730 పాయింట్ల స్థాయి వద్దకు క్షీణించవచ్చు. -
25,400 దిగువన మరింత క్షీణత
మార్కెట్ పంచాంగం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి చెందడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు బలపడటం వంటి అంశాలతో భారత్ సూచీలు వరుసగా మూడో వారమూ తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాల బాట పట్టడం ఈ క్షీణతకు ప్రధాన కారణం. డాలరు బలపడటం, రూపాయి బలహీనపడటం సహజంగానే విదేశీ ఇన్వెస్టర్లను విక్రయాలకు పురికొల్పుతుంది. అయితే మూడు వారాల్లో సూచీలు 7 శాతంవరకూ నష్టపోయినందున, ఈ వారం క్షీణిస్తే కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం లేకపోలేదు. కానీ విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల వేగాన్ని పెంచితే పతనం కొనసాగవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు నవంబర్ 13తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్ వారంలో మరింత క్షీణించిన బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన 25,530 పాయింట్ల మద్దతు వరకూ తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 654 పాయింట్ల నష్టంతో 25,611 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు వారాల్లో 1,700 పాయింట్లకుపైగా సెన్సెక్స్ నష్టపోయింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు క్షీణించడం, పారిస్లో ఉగ్రవాదుల దాడులు వంటి అంశాల కారణంగా ఈ సోమవారం గ్యాప్డౌన్తో సెన్సెక్స్ మొదలైతే 25,400 పాయింట్ల వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే తదుపరి రోజుల్లో సెప్టెంబర్ 8నాటి కనిష్టస్థాయి అయిన 24,833 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. మధ్యలో 25,100 పాయింట్ల సమీపంలో మరో తాత్కాలిక మద్దతు వున్నది. తొలి మద్దతును ముగింపులో పరిరక్షించుకోగలిగితే 25,950 పాయింట్ల స్థాయివరకూ సూచీ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 26,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. అటుపైన క్రమేపీ 26,440 స్థాయికి చేరవచ్చు. నిఫ్టీ మద్దతు 7,700 గతవారం మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 7,735 సమీప మద్దతుస్థాయివరకూ తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 192 పాయింట్ల నష్టంతో 7,762 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్డౌన్తో నిఫ్టీ మొదలైతే 7,700 పాయింట్ల వద్ద చిన్న మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే క్రమేపీ 7,600 స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున తిరిగి రెండునెలల కనిష్టస్థాయి అయిన 7,540 పాయింట్ల వద్దకు పడిపోయే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే 7,850 స్థాయిని చేరవచ్చు. అటుపైన ముగిస్తే 7,930 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన పటిష్టంగా ముగిస్తే 8,005 స్థాయి వరకూ పెరగవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement