-
ఎర్త్ టూ మార్స్.. వయా మూన్!
చంద్రుడిపై ఓ వెయ్యి గజాలు కొని పెట్టేస్తే బెటరేమో! అలాగే అమ్మాయి పేరు మీద అంగారకుడిపై ఓ ఎకరం కొని పెడితే పెళ్లి టైమ్కి పరుగులు ఉండవు మరి!! ఇక భూమ్మీద ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి కబుర్లు చెప్పుకోవలసిన సమయం దగ్గర్లోనే ఉందంటున్నారు. ఎందుకంటే.. భూమ్మీద కొన్నేళ్లుపోతే నిలబడ్డానికే చోటు ఉండదు. ఈ వెధవ కాలుష్యం... గొడవలూ ఎవడు పడతాడు. శుభ్రంగా మరో గ్రహంపై సెటిలైపోతే విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉంటుందని లెక్కలు వేసుకునే కాలం వచ్చేస్తోంది. అంగారక అలియాస్ అరుణ గ్రహం లేదంటే ఇంగ్లిష్లో మార్స్! పేర్లేవైతేనేం...అక్కడో పెద్ద మంచుగడ్డ సైంటిస్టులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మంచు నిధిని చూసినప్పటి నుంచి ఖగోళశాస్త్ర వేత్తలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. పొరుగూరి కెళ్లినంత తేలిగ్గా మార్స్ వెళ్లిపోదాం సామాను సర్దుకుని రెడీగా ఉండండంటున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో మనిషి మకాం వేయడం ఖాయమనే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మరీ ముఖ్యంగా మనిషి జీవించడానికి చంద్రుడితో పాటు.. అంగారకుడిపైనా అవకాశాలున్నాయని పరిశోధకులు టెలిస్కోప్ గుద్ది మరీ చెబుతున్నారు. భూమ్మీద ఉన్న మావయ్యని.. చందమామపై ఉన్న అత్తయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అందరూ కలిసి... అంగారకుడిపై వినోదయాత్రకు బయలు దేరదాం అని ఇప్పుడెవరైనా అంటే పిచ్చి పట్టిందేమో అని భయం భయంగా చూస్తారేమోకానీ.. మరో యాభై ఏళ్ల తర్వాత అది అత్యంత సహజమైన పరిణామమవుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది. ఆ మధ్య చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా నీటి జాడలు కచ్చితంగా ఉన్నాయని తేలడం తోనే అక్కడ మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రుడిపై గ్రామాలు కట్టేస్తారట. ఆ గ్రామాల్లో చక్కటి ఇళ్లు నిర్మించేసి భూమి నుంచి వలస వచ్చేవారి కోసం సిద్ధంగా ఉంచుతారట. చంద్రుడిపై విస్తారంగా ఇళ్లు కట్టేశాక కాలనీ కోసం అంగారకుడిపైకి వెళ్తారట. అంగారకుడి పైనా విశాలమైన కాలనీలు నిర్మించి.. మనుషులు మకాం పెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తారట. ఇదంతా ఎందుకంటే... ఇప్పటికే మితిమీరిన జనాభాతో భూమి కిక్కిరిసిపోతోంది. మరో యాభై ఏళ్లు దాటితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. భూమిపై కాలు మోపడానికి కూడా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. అప్పుడు కొత్తగా పుట్టబోయే వారికి భూమ్మీద నివసించడానికి చోటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాల భూగ్రహ వాసులు ఏం చేయాలి? దానికి సమాధానంగానే చంద్రుడు, అంగారకుడిపై దృష్టి సారించారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ కాలనీలు కానీ కట్టడం పూర్తయితే... భూమి నుంచి పెద్ద సంఖ్యలో జనం కొత్త గ్రహాలకు వలసపోతారన్నమాట! మరో వందేళ్లు దాటిందనుకోండి భూమిపై ఉన్న వారికి చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా చుట్టాలు ఉండచ్చు. భూమిపై ఉండేవారు మునుముందు తమ చుట్టాలను చూసి రావడానికి చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భూమ్మీద జనాభా పెరిగిపోవడంతో పాటు.. రోజురోజుకీ పెరిగిపోతోన్న కాలుష్యం భూమిని ప్రమాదకరమైన గ్రహంగా మార్చేస్తోంది. భూమి చుట్టూరా ఉన్న వాతావరణమంతా విషమయమై పోతోంది. అంతులేని భూతాపం భూమిపై మానవ జాతి మనుగడకే సవాల్ విసురుతోంది. గాలితో పాటు భూమిలోని నీరు, అంతరిక్షం కూడా కలుషితమైపోతున్నాయి. వీటికితోడు మానవాళి వినాశనానికి దారి తీసే అణ్వాయుధాల భయమూ పెరుగుతోంది. ఏ క్షణంలో ఏ దేశం అణు బాంబును ప్రయోగిస్తుందో తెలీని ఉత్కంఠ నెలకొంది. అడిలైడ్లో 4వేల మంది అంతరిక్ష పరిశోధకులతో జరిగిన వార్షిక సమావేశంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కొత్త గ్రహాలపై కాలనీల ఏర్పాటు గురించి ఆశావహ దృక్పథంతో ప్రచారం చేసింది. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో 17 ఏళ్లుగా నివసిస్తున్నామని ఈ సమావేశంలో స్పేస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత ఆవాసాల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందనే తాము భావిస్తున్నామని ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. రానున్న పదేళ్లల్లో చంద్రుడిపై గ్రామం నిర్మాణానికి సంబంధించి అనువైన సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు రూపొందించేందుకు మిషన్లను తయారు చేస్తున్నట్లు మెస్సినా పేర్కొన్నారు. మొత్తం మీద ‘మా పెద్దబ్బాయి భూమ్మీద పని చేస్తున్నాడు. రెండో అబ్బాయి చంద్రుడిపైనా... మా అమ్మాయి అంగారకుడిపైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు’ అని తల్లిదండ్రులు మురిసి పోయే రోజులు దూరంలో లేవన్నమాట. అప్పుడు మూడు గ్రహాలపైనా చుట్టాలుంటారు. అన్నీ బానే ఉన్నాయి కానీ... అసలు సౌర వ్యవస్థలో ప్రాణులు జీవించడానికి ఆస్కారమున్న గ్రహాలున్నాయా అని? మనిషి ఆశాజీవి కదా! అసాధ్యమన్నదే తన డిక్షనరీలో లేదనుకుంటాడు. ప్రకృతినీ తాను శాసించేయగలనని అనుకుంటూనే ఉంటాడు. సాధ్యం కాని ఎన్నో ఘనతలను ఇలాంటి ధీమాతోనే సాధించి పారేశాడు కూడా! మరయితే మనిషి వేరే గ్రహాలపై కాపురం పెట్టేస్తాడా? ఏమో... గుర్రం ఎగరావచ్చు!! -
నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరచారు!
స్పందన అక్టోబర్ 10న ‘దైవికం’లో ‘ఖగోళ అవిశ్వాసి’ అనే శీర్షికతో స్టీఫెన్ హాకింగ్ మీద మాధవ్ శింగరాజు రాసిన ఆర్టికల్కి స్పందనగా ఈ ఉత్తరం. సైన్సు అన్న పదానికి నిర్వచనం, పరిధి అవగాహన చేసుకోకుండా ఆయన దీనిని రాశారనుకోవాలి. ఒక ప్రసిద్ధ మత పెద్ద దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక ఆస్తికుడికి వచ్చేంత బాధను ఆయన అనుభవించినట్లున్నారు! స్టీఫెన్ అలా మాట్లాడకపోవడం వింత కాదని, మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహం మీదకు రాకెట్టు పంపేటప్పుడు పూజ చేయడం ఒక వైచిత్రి అని ఆయన గమనించలేకున్నారు. ‘సైన్సు లేని మతం కుంటిది, మతం లేని సైన్సు గుడ్డిది’ అన్న 20వ శతాబ్ది సువిఖ్యాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ‘దేవుడి పట్ల నమ్మకం పిల్ల చేష్ట’, ‘మతానికి చెందిన కథలు మూఢనమ్మకాలు’ అని తన చివరి రోజుల్లో ప్రకటించాడని వాల్టన్ నెజాక్సన్ ఇటీవలి ఐన్స్టీన్ బయోగ్రఫీలో ప్రస్తావించాడని తెలిస్తే ఐన్స్టీన్ని మాధవ్ గారు ఎన్ని మాటలు అని ఉండేవారో! మాధవ్ గారు సకల సృష్టినీ ఒకే కళ్లద్దాల ద్వారా చూస్తున్నట్లున్నారు. అందుకే ఆయన ‘విశ్వాసం’ అనే పదాన్ని ఆస్తికులకు ధారాదత్తం చేశారు. విశ్వాసం, నమ్మకం వంటి పదాలు పలు రకాల విషయాలకు ఆపాదితాలు అని మరిచారు. అసలు నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరవడం దారుణం. ప్రపంచమంతా దైవం, దాని ఆధారిత మతాల పట్ల నమ్మకం లేకపోవడం వల్ల గాక... ఆ నమ్మకం, విశ్వాసం ముదిరి మూఢంగా, మూర్ఖంగా తయారై సాటి జీవుల పట్ల వైషమ్యాలు, కక్షలు, హననాలకు కారణం అవుతున్నప్పుడు, ఇటువంటి వ్యాఖ్యల వల్ల (స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల ) వాటి కాఠిన్యం కాస్తయినా తగ్గి సకల సృష్టికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. - ఒక అజ్ఞేయతావాది (Agnostic) -
11.70 కోట్ల కి.మీ. దూరంలో ‘మంగళ్యాన్’!
బెంగళూరు: అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గతేడాది నవంబరులో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్యాన్) ఉపగ్రహం భూమి నుంచి 11.70 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. సెకనుకు 23 కి.మీ. వేగంతో దూసుకుపోతున్న మామ్ మరో 92 రోజుల్లో 2.40 కోట్ల కి.మీ. ప్రయాణించి మార్స్ కక్ష్యను చేరుకోనుందని ఇస్రో వెల్లడించింది. మామ్ నుంచి భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్లకు సంకేతాలు అందేందుకు 6 నిమిషాల 30 సెకన్లు పడుతోంది. ఉపగ్రహం మార్స్ వైపుగా సరైన మార్గంలోనే వెళ్లేందుకుగాను జూన్ 11న రెండో మార్గ సవరణ ప్రక్రియను నిర్వహించారు. -
భూమి, చంద్రుడి వయసు 6 కోట్ల ఏళ్లు ఎక్కువ..!
సౌరకుటుంబంలో మన భూగోళం గ్రహంగా రూపుదిద్దుకుని సుమారు 450 కోట్ల సంవత్సరాలు అయిందని అంచనా. అలాగే భూమి ఏర్పడిన కొంత కాలానికే అంగారకుడి సైజులో గల ఓ గ్రహం వంటి వస్తువు ఢీకొట్టిందని, ఫలితంగా భూమి నుంచి వేరుపడిన ముక్కలు కలిసి చంద్రుడిగా ఏర్పడ్డాయనీ శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే ఇప్పటిదాకా ఉన్న అంచనాల కంటే భూమి, చంద్రుడి వయసులు మరో 6 కోట్ల ఏళ్లు ఎక్కువగానే ఉండొచ్చంటున్నారు ఫ్రాన్స్లోని యూనివర్సిటీ ఆఫ్ లారెన్కు చెందిన అవీస్, బెర్నార్డ్ మార్టీలు. వివిధ వాయువుల(ఐసోటోపుల) శాతాలను, స్థితులను బట్టి భూమిపై వాతావరణపరంగా కీలక పరిణామాలను అంచనా వేసే రేడియో డేటింగ్ పద్ధతిలోనే తాము కూడా పరిశోధించామని వీరు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో లభించిన 340 కోట్లు, 270 కోట్ల ఏళ్లనాటి క్వార్ట్జ్ ఖనిజాలలో చిక్కుకుపోయిన జెనాన్ వాయువుపై అధ్యయనం చేసిన తాము రేడియో డేటింగ్ పద్ధతిలో కాలాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. -
అక్కడకు వెళ్లడం సాధ్యమేనా...
అంగారకుడు... అదొక గ్రహం... అక్కడ మానవాళి మనుగడ సాధ్యమే... అక్కడ నీళ్లు ఉన్నాయి... అక్కడ మట్టి ఉంది... అక్కడ వాతావరణం ఉంది... అక్కడ గాలి ఉంది... ఇన్ని ఉన్నచోటికి మనుషులు వెడితే ఎంత బాగుంటుంది! ఇది సాధ్యమేనా..? అక్కడకు వెళ్లగలమా..? మేం తీసుకువెడతాం అంటున్నారు డచ్ సంస్థవారు. అంగారకుడు... ఎర్రటి గ్రహం... ఊహించుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఒక దేశం నుంచి మరొక దేశం వెళితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటిది ఒక గ్రహం నుంచి మరొక గ్రహం మీదకు వెళ్లడమంటే మరింత అద్భుతంగా ఉంటుంది. అక్కడకు తీసుకువెళ్లడానికి కొంతమందిని ఎంపిక చేసింది డచ్ కంపెనీ. ఎంపికైనవారి మనోభావాలు... అటూఇటూ తిరగాలి... ‘‘నాకు ఏలియన్స్ని కలవాలని ఉంది. ఈ విశ్వంలో మనం మాత్రమే కాకుండా ఇంకా వేరేవారు ఉండి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం. వీలైతే నాకు భూమి మీద, అంగారకుడి మీద కూడా అటూఇటూ తిరుగుతూ నివసించాలని ఉంది’’ అంటారు ఢిల్లీలోని గుర్గావ్లో నివసిస్తున్న ఇంజనీరింగ్ చదువుతున్న 21 ఏళ్ల అమూల్య నిధి రస్తోంగీ. 2024లో డచ్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంగారకుడి మీదకు తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్నవారి కోసం పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రెండు మిలియన్ల అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుంచి 1058 మందిని ఎంపిక చేశారు. అంగారకుడి మీద నివాస స్థానాలు ఏర్పాటుచేయాలని ఈ సంస్థ ఆశిస్తోంది. ఈ సెలక్ట్ అయిన వారి నుంచి వివిధ అంశాల మీద పోటీ నిర్వహించి చివరగా ఇరవైనాలుగు మందిని ఎంచుకుని, వారిని అంగారకుడి మీదకు పంపుతారు. ఈ భారీ ప్రాజెక్టుకి, భారతదేశం నుంచి అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. అందులోనుంచి ఆరవెరైండు మందిని ఎంపిక చేశారు. ఇక్కడకు వెళ్లేవారికి ముందుగా ఏడు సంవత్సరాల ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ ప్రాజెక్టు 2015 లో ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణ వల్ల వారు శారీరకంగా, సాంఘికంగా తక్కువ మందితో ఉండటం అలవాటవుతుంది. భారతదేశం నుంచి ఎంపికైనవారిలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, స్టాక్ బ్రోకర్ల నుంచి వైట్కాలర్ ప్రొఫెషనల్స్ వరకు ఉన్నారు. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదు... కలకత్తాకు చెందిన 24 ఏళ్ల ‘ఎనర్జీ ప్రొఫెషనల్’ ఆరిందమ్ సాహా, ఈ ప్రయాణం కోసం వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ‘‘అంగారకుడి మీదకు వెడదామనుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకురారు. అందువల్ల నేను వివాహం గురించి ఆలోచన చేయట్లేదు. నాకు అమ్మాయిలతో స్నేహం కూడా లేదు. అంతేకాదు అసలు పెళ్లి మీదే వ్యామోహం లేదు’’ అన్నారు సాహా. ముంబైకి చెందిన 45 ఏళ్ల స్టాక్ బ్రోకర్ ఆశిశ్ మెహతా, ‘అంగారకుడి మీదకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను’’ అంటారు. ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను... ‘‘ఇరవయ్యో యేట నా వివాహం జరిగింది. ఇప్పుడు మా అబ్బాయికి 19, అమ్మాయికి 17. నేను ఇప్పటికి సుమారు 60 మిలియన్ల రూపాయలు దాచాను. మా కుటుంబానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానని భావిస్తున్నాను. పది సంవత్సరాల తర్వాత అంగారకుడి మీదకు బయలుదేరేటప్పటికి మా అబ్బాయికి 29, అమ్మాయికి 27 వస్తాయి. అప్పటికి వారి చదువులు, పెళ్లిళ్లు కూడా పూర్తవుతాయి. బహుశ మనవల్ని, మనవరాళ్లని కూడా చూస్తానేమో!’’ అన్నారు. ఇంకా... ‘‘వచ్చిన అప్లికేషన్లలో మమ్మల్ని ఎంచుకుని, మాకు శిక్షణ ఇప్పించినప్పటికీ, అంగారక గ్రహం మీదకు వెళ్లాక ఎలా మనగలుగుతామోననే భయం మాత్రం ఉంది. అక్కడి వాతావరణం బరువుగా కాకుండా తేలికగా, బాగా చల్లగా ఉంటుంది. నీరు గడ్డకట్టి ఉంటుంది. అది కూడా భూగర్భంలో మాత్రమే లభిస్తుంది. రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడకు వెళ్లడానికి నిధులు, సాంకేతికత ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి’’ అని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇది సాధ్యం కాదు... భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రొఫెసర్ జెరార్డ్ హూఫ్ట్, ఈ ప్రాజెక్టు గురించి విని ఆశ్చర్యపోయారు. ఎంపిక చేయబడినవారిని అంగారకుడి మీదకు పంపడానికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ‘‘వీరి ప్రయాణానికి తగిన నిధులు ఎక్కడినుంచి వస్తాయో నాకు అర్థం కావడంలేదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రణాళిక’’ అన్నారు ఆయన. అయితే అంగారక గ్ర హం కో ఫౌండర్ అయిన బాస్ లాన్స్డ్రాప్ మాత్రం, అంగారకుడి మీదికి పది సంవత్సరాల మానవులను విజయవంతంగా పంపగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా ఖర్చవుతుంది... ఈ మిషన్కు తమకు ఆరు బిలియన్ పౌండ్ల ధనం అవసరమవుతుందని, ఆ ధనాన్ని పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల నుంచి సేకరిస్తామని, అదేవిధంగా ఈ ఈవెంట్ని ప్రసారం చేసేవారి దగ్గర నుంచి కూడా కొంత సేకరిస్తామని చెప్పారు. ‘‘లండన్ ఒలింపిక్స్ ఈవెంట్ ద్వారా, వాణిజ్య ప్రకటనల ద్వారా నాలుగు బిలియన్ల డాలర్లు సేకరించగలిగితే అంగారకుడి మీదకు వెళ్లడం ఎందుకు సాధ్యం కాదు? అంటారు ఆయన. ‘‘ఒలింపిక్స్ చూసినట్టుగానే మా ఈవెంట్ను కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇదొక అద్భుతమైన సంఘటన’’ అన్నారు ఆరిందమ్ సాహా. ఈ యాత్రకు ఎంపికైనవారు అంగారకుడి మీద నివాసాలు ఏర్పడతాయని ఆశావహంగా ఉన్నారు. ‘‘నేనొక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాను’’ అంటున్నారు విద్యుత్శాఖలో పనిచేస్తున్న వినోద్ కోటియా. ‘‘భూమికి ఏదో జరిగిపోతుందని నేను ఎన్నటికీ అనుకోను. జీవితంలో లభించిన అదృషం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’’ అన్నారు వినోద్ కోటియా. - డా.వైజయంతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement