-
వార్ హీరో అర్జన్ సింగ్ అస్తమయం
-
వార్ హీరో అర్జన్ అస్తమయం
► ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత ► 1965 భారత్–పాక్ యుద్ధంలో ఎయిర్ మార్షల్గా కీలక పాత్ర న్యూఢిల్లీ: 1965 భారత్–పాక్ యుద్ధ వీరుడు, భారత వాయుసేన (ఐఏఎఫ్) మార్షల్ అర్జన్ సింగ్(98) ఢిల్లీలో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన్ను ఇక్కడి ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రికి తరలించారు. చిక్సిత పొందుతూ రాత్రి 7.30 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ స్థాయి అయిన ఫైవ్ స్టార్ ర్యాంకుకు ప్రమోటైన ఏకైక అధికారి అర్జన్ సింగ్ కావటం విశేషం. రిటైర్మెంట్ తర్వాత దౌత్యవేత్తగా భారత్కు సేవలందించారు. అర్జన్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి సీతారామన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా సంతాపం వ్యక్తం చేశారు. భారత్ గొప్ప యోధుణ్ని కోల్పోయిందని రాష్ట్రపతి సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘దేశానికి అర్జన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివని.. వీరుని మృతితో యావద్భారతం విచారంలో మునిగిపోయింది’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ఉదయం అర్జన్ అనారోగ్య విషయం తెలవటంతో మోదీ, సీతారామన్, ఐఏఎఫ్ చీఫ్ దనోవా, ఆర్మీ చీఫ్ రావత్లు ఆస్పత్రిలో సింగ్ను పరామర్శించారు. భారత్ మరువని యోధుడు 1965 ఏప్రిల్లో భారత్–పాక్ యుద్ధం మొదలైంది. అప్పటికే పాకిస్తాన్పై భారత్ పైచేసి సాధిస్తోంది. కీలకమైన శిఖరాలను భారత్ ఆధీనంలోకి తీసుకుంది. భారత్ను నిలువరించే ఉద్దేశంతో 1965 సెప్టెంబర్ 1, పాకిస్తాన్ ‘ఆపరేషన్ గ్రాండ్శ్లామ్’ను ప్రారంభించింది. భారత్ తేరుకునేలోపే కశ్మీర్లోని అఖ్నూర్తోపాటు పలు భారత ఆర్మీ కేంద్రాలను పాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో సైన్యం వైమానిక సాయాన్ని అర్థించింది. పరిస్థితి ఊహించిన అర్జన్ సింగ్ యువ ఐఏఎఫ్ అధికారుల్లో యుద్ధ స్ఫూర్తి నింపారు. ఐఏఎఫ్ చీఫ్గా ఉన్నప్పటికీ.. తనే స్వయంగా యుద్ధ విమానంతో కదనరంగంలోకి దూకారు. ఊహించని రీతిలో మెరుపుదాడులతో పాకిస్తాన్ సైన్యం తోకముడిచేలా చేయటంలో కీలకపాత్ర పోషించారు. సరిహద్దులనుంచి పాక్ సైన్యాన్ని వెనక్కు పంపటంతోపాటుగా.. పాకిస్తాన్లోని పంజాబ్పై భీకరమైన వైమానిక దాడులు చేశారు. దీంతో పాక్ బలగాలన్నీ పంజాబ్ను కాపాడుకునేందుకు వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో ఆపరేషన్ గ్రాండ్శ్లామ్ విఫలమైంది. ఈ విజయంలో అర్జన్ సింగ్ పాత్ర అత్యంత కీలకం. ఇందుకుగానూ 1965లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మ విభూషణ్తో గౌరవించింది. 1964 నుంచి 1969 వరకు ఐఏఎఫ్ చీఫ్గా కొనసాగారు. ఐఏఎఫ్ను ప్రపంచ వైమానిక బలగాల్లో ఒక సమర్థవంతమైన వ్యవస్థగా, నాలుగో అతిపెద్ద వైమానిక శక్తిగా మలచిన ఘనత కూడా అర్జన్ సింగ్దే కావటం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుంచి రిటైర్మెంట్ వరకు 60కి పైగా వివిధ యుద్ధ, సైనిక రవాణా విమానాలు నడిపిన అనుభవం అర్జన్ సింగ్ సొంతం. కుటుంబమంతా సైన్యంలోనే.. అవిభాజ్య భారత్లోని పంజాబ్ (ఇప్పటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్)లో 1919, ఏప్రిల్ 15న అర్జన్ సింగ్ జన్మించారు. ఈయన తండ్రి, తాత, ముత్తాతలు బ్రిటీష్ అశ్వికదళంలో సేవలందించారు. బ్రిటన్లోని క్రాన్వెల్లో రాయల్ ఎయిర్ఫోర్స్ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకున్న అర్జన్.. అదే ఏడాది పైలట్ ఆఫీసర్గా విధుల్లోకి చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాను ఆక్రమించుకు న్న జపాన్ సేనలపై సింగ్ నేతృత్వంలోని భారత వాయుసేన భీకర దాడులు చేసింది. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్’ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ పైలట్ కూడా ఆయనే. 1969లో సింగ్ పదవీ విరమణ చేశారు. -
విషమంగా మార్షల్ అర్జన్ సింగ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎఎఫ్ మార్షల్ అర్జన్ సింగ్ (98) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆయనకు ఈ రోజు ఉదయం మాసివ్ అటాక్ రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో అర్జన్ సింగ్కు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ ధనోవా.. ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. అర్జన్ సింగ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అర్జన్ సింగ్ను చూశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్జన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అలాగే వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. We are all praying for the speedy recovery of Marshal of the Indian Air Force Arjan Singh. Doctors are doing their best. — Narendra Modi (@narendramodi) 16 September 2017 Went to R&R Hospital to see Marshal of the Indian Air Force Arjan Singh, who is critically ill. I also met his family members. — Narendra Modi (@narendramodi) 16 September 2017 భారత మిలటరీ చరిత్రలో అర్జన్ సింగ్ ఓ ఐకాన్. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైవ్ స్టార్ ర్యాంక్ దక్కిన అధికారి అర్జన్ సింగ్ మాత్రమే. ఫీల్డ్ మార్షల్తో సమానమైన డిస్టింక్షన్ను పొందిన ఏకైక ఐఏఎఫ్ అధికారి. అర్జన్ సింగ్ 1919 ఏప్రిల్ 15న (పాకిస్తాన్లోని ఫైసలాబాద్) ల్యాలాపూర్లో జన్మించారు.1949లో ఎయిర్ కమాండర్గా ఎదిగిన ఆయన 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత వాయుసేన చీఫ్గా ఉన్నారు. అర్జన్ సింగ్ సేవలకు గుర్తింపుగా పనాగఢ్ ఎయిర్ బేస్కు ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్ పేరు పెట్టడం విశేషం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
చిరు పై పోసాని సంచలన కామెంట్స్
Ragini Dwivedi: వైట్ అవుట్ ఫిట్ తో రాగిణి ద్వివేది అందాలు (ఫొటోలు)
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement