-
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా..
పెనమలూరు(విజయవాడ): తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మసాజ్ కేంద్రాలపై (స్పా) పోలీసులు శనివారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిసిపాలటీ పరిధిలో తాడిగడప వందడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలో పెనమలూరు పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న కిషోర్ అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఒక కేంద్రం, పోరంకిలో ఒక మసాజ్ కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. చదవండి: రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. ఈ కేంద్రాలపై నిఘా ఉంచిన పోలీసులు దాడులు చేసి, 12 మంది మహిళలు, ఏడుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కిషోర్పై ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించినట్టు సీఐ తెలిపారు. -
పైకి మసాజ్ సెంటర్లు.. లోపల షాకింగ్ దృశ్యాలు.. స్పా ముసుగులో..
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని స్పా, మసాజ్, ఫిట్నెస్ సెంటర్లతో పాటు పలు హోటళ్లపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 131 స్పా, మసాజ్ సెంటర్లు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడు కేంద్రాలను సీజ్ చేసి 23 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా కొనసాగుతున్న 93 మసాజ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, కమర్షియల్ ట్యాక్స్, ఫైర్ సేఫ్టీ అధికారులకు లేఖలు రాశారు. చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ -
అనుమతి లేని మసాజ్ సెంటర్పై దాడి
హైదరాబాద్: లక్డీకాపూల్లోని ది సెంట్ హోటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్పై సైఫాబాద్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు మేనేజర్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని పలు స్పాలపై ఇటీవల పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కళ్లు బైర్లుకమ్మే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరి కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకుండా స్పాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. పలు మసాజ్ సెంటర్ల నిర్వాహకులు లోపల జరుగుతున్న చీకటి కార్యకలాపాలు వెలుగులోకి రాకుండా నిర్వహణలోనే జాగ్రత్తలు తీసుకున్నారు. బయోమెట్రిక్ ద్వారానే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు తనిఖీలకు లోపలకు వెళ్లేలోగా అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అనుమతి లేని మసాజ్ సెంటర్లను వెంటనే మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్పాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రాథమికంగా తనిఖీలు చేపట్టామని, రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ‘సాక్షి’కి తెలిపారు. అంతా బయోమె‘ట్రిక్కే’...! స్పాల ఏర్పాటు చేసుకోవడం చట్ట పరిధిలోనే ఉంది. మానసిక, శారీరక ఒత్తిళ్లను తగ్గించేందుకు శాస్త్రీయమైన పద్ధతిలో మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సదరు థెరపిస్టులకు శిక్షణ కూడా ఉంటుంది. అయితే, నగరంలోని కొన్ని మసాజ్ కేంద్రాల్లో ఇందుకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. మసాజ్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పా నిర్వాహకులు కాస్తా పోలీసులు నేరుగా లోపలికి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ బయోమెట్రిక్ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం స్పాకు చెందిన వారు మినహా ఎవరైనా లోపలికి ప్రవేశించాలంటే కచ్చితంగా బయోమెట్రిక్ ఉపయోగించాల్సిందే. తాజాగా పోలీసుల తనిఖీల్లో కూడా ఈ స్పాల లోపలకు ప్రవేశించేలోగా మొత్తం వ్యవహారాలన్నీ చక్కదిద్దుకున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా సదరు మసాజ్ నిర్వాహకులు సభ్యత్వ కార్డును కూడా తమ వినియోగదారులకు ఇస్తున్నారు. ఈ కార్డు ఉన్నవారికి మసాజ్ ధరలో రాయితీ కూడా ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి.. నగరంలోని పలు మసాజ్ సెంటర్లలో రాష్ట్రానికి చెందిన అమ్మాయిల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రానికి చెందిన అమ్మాయిలను తీసుకొస్తున్నారు. వారికి వసతి కూడా కొన్ని మసాజ్ సెంటర్ల నిర్వాహకులు కల్పించారని తెలుస్తోంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో కనీసం అనుమతి లేకుండా కూడా మసాజ్ సెంటర్ల నిర్వహణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా తనిఖీలతో ఫోర్త్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మేఘనాథ్ స్పాను మూసేశారని పోలీసు అధికారులు తెలిపారు. అనుమతి లేని మసాజ్ సెంటర్లను మూయించడంతో పాటు ఇతర సెంటర్లల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిరంతరాయంగా తనిఖీలు విశాఖ కమిషనరేట్ పరిధిలోని మసాజ్ (స్పా) సెంటర్లలో కొద్దిరోజుల కిందట తనిఖీలు చేపట్టాం. అనుమతి లేని మసాజ్ సెంటర్లను వెంటనే మూసివేయాలని ఆదేశించాం. ఇక అనుమతి ఉన్నవాటిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – మనీష్కుమార్ సిన్హా, పోలీసు కమిషనర్ -
మసాజ్ సెంటర్ల సీజ్.. యువతులు, మహిళలను రప్పించి..
సాక్షి, చెన్నై: నగరంలో అనుమతులు లేకుండా సాగుతున్న మసాజ్ సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. మసాజ్ సెంటర్లు, స్పాలలో వ్యభిచారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఏసీబీకి చిక్కారు. మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్ల నుంచి వీరు లక్షల్లో లంచం తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక బృందాలు రెండు రోజులుగా మసాజ్ సెంటర్లు, స్పాలపై దృష్టి పెట్టాయి. ఎనిమిది మసాజ్ సెంటర్లు ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది మహిళలకు విముక్తి కల్పించారు. నగరంలో మొత్తం 151 మసాజ్ సెంటర్లు, స్పాలు ఉండగా ఇందులో 63 సెంటర్లకు అనుమతులు కూడా లేవని తేలింది. ఈ సెంటర్లకు సీల్ వేశా రు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. చదవండి: (‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement