-
దివ్యా రెడ్డికి నాలుగు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ మహిళల మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ అథ్లెట్ దివ్యా రెడ్డి నాలుగు పతకాలతో మెరిసింది. గోవాలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో దివ్యా రెడ్డి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించారు. ప్లస్ 35 వయో విభాగంలో పోటీపడిన దివ్యా రెడ్డి 400 మీటర్లు (1ని:15.29 సెకన్లు), 800 మీటర్ల (3ని:03 సెకన్లు) విభాగంలో పసిడి పతకాలు గెలిచారు. 1500 మీటర్ల (6ని:41 సెకన్లు) విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దివ్యా రెడ్డి సభ్యురాలిగా ఉన్న తెలంగాణ బృందం 4100 మీటర్ల రిలే (1ని:07 సెకన్లు) రేసులో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నారు. విజేత హోదాలో దివ్యా రెడ్డి ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్లో జరిగే ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని సంపాదించారు. -
వయసును గెలిచిన రేసువీరుడు
వయసు అయిదుపదులు దాటినా.. రేసులో ఆయన చిరుతే. ఆయన పరుగు పెడితే పతకం రావలసిందే. ఆయనే వెటరన్ అ«థ్లెటిక్స్ పోటీల్లో అరుదైన సత్తా చూపుతూ, అవార్డులు సాధిస్తూ జిల్లాకు పేరు తెస్తున్న యాతం నాగబాబు. ఆరోగ్యశాఖలో చిరుద్యోగి అయిన ఆయన జాతీయస్థాయిలో పలు పతకాలు సాధించారు. అంతర్జాతీయ పోటీల్లో పతక సాధనే లక్ష్యమంటున్న నాగబాబుకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. సామర్లకోట (పెద్దాపురం): పేద కుటుంబంలో పుట్టిన నాగబాబుకు ప్రాథమిక విద్య చదివే నాటి నుంచి పరుగంటే మక్కువ. 1967లో యాతం సూర్యారావు, అచ్చుతామణిలకు పిఠాపురంలో జన్మించారు. సుమారు 25 ఏళ్ల క్రితం సామర్లకోటలో స్థిరపడ్డ ఆయన ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం మలేరియా విభాగంలో సబ్ యూనిట్ ఆఫీసరుగా పని చేస్తున్నారు. ప్రాథమిక విద్యను పిఠాపురం మండలంలో పూర్తి చేసిన నాగబాబు ఇంటర్, బీఎస్సీ డిగ్రీలను పెద్దాపురం మహారాణి కళాశాలలో పూర్తి చేశారు. 1979–80లో కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి గ్రిగ్ పోటీల్లో కబడ్డీ, ఖోఖోల్లో పాల్గొని జట్లు ప్రథమ బహుమతి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 1985లో అమలాపురంలో జరిగిన ఇంటర్ కాలేజీయేట్ పోటీల్లో 100, 200, 400 మీటర్ల, లాంగ్ జంప్, త్రిబుల్ జంప్ పోటీల్లో పాల్గొని, పతకాలు సాధించి ఆల్ రౌండర్గా గుర్తింపు పొందారు. 1988లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ మీట్లో అనేక పతకాలు సాధించి అధికారుల దృష్టిలో పడ్డారు. దాంతో 1991లో జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిరు ఉద్యోగిగా ఉద్యోగం వచ్చింది. తనకు గుర్తింపు తెచ్చిన పరుగును రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ అనేక అవార్డులు సాధిస్తున్నారు. ఇవీ దౌడుకు దక్కిన పతకాలు.. ప్రభుత్వోద్యోగులకు నిర్వహించే పోటీల్లో నాగబాబు ప్రతిసారీ ఏదో ఒక పతకాన్ని సొంతం చేసుకోవడం రివాజైంది. 2013లో కేరళలోని త్రివేండ్రంలో జరిగిన 100, 200, 400 మీటర్ల పరుగు పందెంలో రజత పతకాలు సాధించారు. 2014లో కర్నాటకలో జరిగిన 100, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు సాధించారు. 2015లో హర్యానాలోని రోహతక్లో 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించారు. అదే ఏడాది అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియాలో జరిగే వెటరన్ పోటీలకు భారతదేశం తరఫున ఎంపికైనా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్లలేక పోయారు. 2016లో ఉత్తర ప్రదేశ్లో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో రజతం, 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. 2017లో మహారాష్ట్రలో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించారు. 2017 సెప్టెంబరులో న్యూజీలాండ్లో జరిగే అథ్లెటిక్ మీట్కు ఎంపికయ్యారు. అప్పడు కూడా ఆర్థిక ఇబ్బందులే ఆయనను పోటీలకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. 2017 నవంబరులో ఛత్తీస్గఢ్లో జరిగిన పోటీల్లో 400, 800 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు సాధించారు. 2018 మార్చిలో థాయిలాండ్లో జరిగే ప్రపంచ మీట్కు ఎంపికయినా.. తిరిగి ఆర్థికంగా వనరులు లేకే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. అయినా పరుగు సాధన మాత్రం మానలేదు. ఎప్పటికైనా అంతర్జాతీయ పతకాన్ని సాధించాలనుకుంటున్న నాగబాబు ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం. అంతర్జాతీయ స్థాయిలో పతకమే లక్ష్యం...... అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకం సాధించాలని ఉంది. ఈ మేరకు నా ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ ప్రతి రోజూ ప్రాక్టీసు చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, థాయిలాండ్ పోటీలకు వెళ్లలేక పోయాను. పేద క్రీడాకారులకు దాతల ప్రోత్సాహం ఉండాలి. భార్య ఆదిలక్ష్మీదేవి, కుమారులు సూర్యకిరణ్, నాగచక్ర మణికంఠ నన్నెంతగానో ప్రోత్సహిస్తున్నారు. – యాతం నాగబాబు -
టీఎస్ఆర్టీసీకి 30 పతకాలు
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బృందం సత్తా చాటింది. భారత మాస్టర్ అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జరిగిన ఈ టోర్నీలో 27 మందితో కూడిన టీఎస్ఆర్టీసీ జట్టు మొత్తం 30 పతకాలను సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 7 రజతాలు, 19 కాంస్య పతకాలు ఉన్నాయి. మార్చి 24 నుంచి 27 వరకు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 19 రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు పోటీపడ్డారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. రమణారావు పతకాలు సాధించిన అథ్లెట్లను శనివారం అభినందించారు. బస్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రమణారావుతో పాటు క్రీడాధికారి, భారత వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ వెంకట నారాయణ కూడా పాల్గొన్నారు. విధులు నిర్వర్తిస్తూనే ఉద్యోగులు క్రీడల్లో అద్భుతంగా రాణించడం చాలా గొప్ప విషయమని రమణారావు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement