-
గల్ఫ్ కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం
- కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ - విదేశాంగ మంత్రి సుష్మాతో భేటీ.. కార్మికుల ఇబ్బందులపై చర్చ ఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాద్రేయ శుక్రవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో భేటీ అయ్యారు. గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల రక్షణకు సంబంధించిన పలు కీలక విషయాలను ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికుల వివరాలు సేకరిస్తున్నామని సుష్మాకు దత్తాత్రేయ తెలిపారు. ఏజెంట్ల మోసాలతో టూరిస్టు వీసాలపై వెళ్ళి చాలా మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని సుష్మా దృష్టికి తీసుకెళ్లినట్లు భేటీ అనంతరం మంత్రి దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. మోసం చేసే సంస్థలు, ఏజెంట్లపైనా దర్యాప్తు చేపట్టడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుష్మా హామీ ఇచ్చారని దత్తాత్రేయ వివరించారు. హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయ ఆధునీకరణపై సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి తెలిపారు. -
ఎన్నారైల రక్షణే కర్తవ్యం
- అమెరికాకు ఉన్నత స్థాయి బృందం పంపండి - విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు వైఎస్ జగన్ లేఖ అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు అన్నివిధాలా పటిష్ట మైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోమవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరారు. జాత్యహంకార ధోరణితో ఉత్పన్న మైన సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీ లేదా విదేశాంగ మంత్రి సారథ్యంలో ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు తాము సంపూర్ణ మద్దతునిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రమంత్రికి వైఎస్ జగన్ ఒక లేఖ రాశారు. వివరాలు... మేడమ్, అమెరికాలో భారతీయ ఇంజనీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల, మేడసాని అలోక్పై జరిగిన జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ మరణించడం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, ఆవేదన నెలకొని ఉండటం బాధ కలిగిస్తోంది. అమెరికాలో నివ సిస్తున్న భారతీయుల రక్షణ, భద్రత అంశాలపై శ్రీని వాస్ సతీమణి సునయన దుమాల లేవనెత్తిన ప్రశ్నలు అమెరికా ప్రభుత్వ పరి పాలనా యంత్రాంగం తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయుల ప్రయో జనాలను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభు త్వంపై ఉంది కనుక ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. 32 లక్షల మందితో కూడిన బలమైన భారతీయ అమెరికన్ సమాజం, ప్రస్తుతం వివిధ యూనివర్సిటీల్లో చదువు కుంటున్న మరో లక్ష మంది విద్యార్థులతో అమెరికాలో మనం ఓ గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాం. ఇప్పుడు వారంతా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. తమ వ్యక్తి గత క్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తులో వ్యాపార, ఉద్యోగ అవకాశాల విషయమై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. 2016 మొదలుకుని వరసగా రెండో ఏడాదిలో కూడా అమెరికాలో విద్వేష ముఠాల సంఖ్య పెరుగు తున్నట్టుగా ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది. అమెరికా పాలకుల మారుతున్న విధానాల కారణంగా సమీప భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. అయితే ఇటీవలి దాడుల విషయంలో మీరు సత్వరమే స్పందించిన తీరును, అలాగే బాధిత కుటుం బాలకు విషాద సమయంలో అన్నివిధాలా భరోసా కల్పించడాన్ని నేను అభినందిస్తున్నాను. అదే సమయంలో ఈ సమస్య పరిష్కారం దిశగా ఉభయ ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని దాడులు పునరా వృతం అయ్యే అవకాశం ఉంది. పరిస్థితి మరింత విషమించకముందే.. భారత్ విషయంలో స్నేహపూర్వక దృక్పథంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చేలా చూడటం ద్వారా ఆ దేశంతో మన సంబం ధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ అమెరికన్లు సుదూర ప్రాంతంలో ఉంటున్నప్పటికీ భారత దేశాభివృద్ధిలో వారు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ప్రపంచ స్థాయి విజయాలతో మన దేశం గర్వపడేలా చేశారు. వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య రంగాలతో పాటు భారత గ్రామీణాభివృద్ధికి వారు చేసిన కృషి వెలకట్టలేనిది. అక్కడి మన సోదరుల ఆందోళనలో పాలు పంచుకోవ డానికి, వారిపై మన ప్రేమాభిమానాలను వ్యక్తం చేయ డానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో మనం అండగా నిలిచి మనవారి ప్రయో జనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అందువల్ల అమెరికాలోని మన వృత్తి విద్యా నిపు ణులు, వ్యాపారులు, విద్యార్థుల హక్కులు, ప్రయోజ నాలు, ప్రాణాలను కాపాడటానికి బలమైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరు తున్నాను. అమెరికా విదేశాంగ, న్యాయ, హోం శాఖలతో కలసి పనిచేయడం ద్వారా.. జాత్యహంకార నేరా లకు సంబంధించిన సమస్యలు, ఇమ్మి గ్రేషన్ అంశాలపై భారతీయ అమెరిక న్లకు ఎప్పటికప్పుడు సరైన న్యాయ సహాయం అందేలా చూడటం, ప్రయా ణాలు, బస తదితర అంశాలపై అప్రమత్తం చేసేలా హెచ్చరికల జారీ వంటి చర్యలు ఇందులో అంత ర్భాగంగా ఉండాలి. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టేలా చూసేం దుకు వీలుగా, భారత్, అమెరికా దేశాలు ఒక్కటిగా ఉన్నాయని స్పష్టం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో గానీ, మీ (సుష్మా స్వరాజ్) సారథ్యంలో గానీ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లాలి. ఇది అమెరికా ప్రజలకు, ముఖ్యంగా జాత్య హంకార ముఠాలకు.. మనం వారికి బలమే తప్ప శత్రువులం ఎంతమాత్రం కాదనే ఒక గట్టి సందేశా న్నిస్తుంది. ఈ విషయంలో మీ గట్టి జోక్యం అవసరమైన మార్పును తీసుకువస్తుందని నేను భావిస్తున్నాను. భార తీయ అమెరికన్లకు మద్దతుగా నిలిచేందుకు, అలాగే భారత్, అమెరికాల ప్రయోజనాల పరిరక్షణకు మీరు తీసుకునే అన్ని రకాల చర్యలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నాను. అభినందనలతో.... వైఎస్ జగన్మోహన్రెడ్డి -
'ఇండో-పాక్' పెళ్లికి శుభం కార్డు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ అమ్మాయి.. ఇండియా అబ్బాయి.. త్వరలో పెళ్లి.. ఇంతలోనే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత.. ఈ కారణంగా పెళ్లి బృందానికి వీసా నిరాకరణ.. దిక్కుతోచని స్థితిలో.. సహాయం చేయాల్సిందిగా ఆ యువకుడు దేశప్రధానికి, విదేశీవ్యవహారాల మంత్రికి గోడు విన్నవించుకున్నాడు. చివరికేం జరిగిందంటే.. జోథ్ పూర్(రాజస్థాన్) కు చెందిన నరేశ్ తేవానీకి కరాచీ(పాకిస్థాన్)కు చెందిన ప్రియా బచ్చానికి రెండేళ్ల కిందట పెళ్లి కుదిరింది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఈ జంట 2014లో నిశ్చితార్థం జరుపుకొంది. అప్పటి పరిస్థితుల్లో పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు లేకుండానే ఇండియాకు వచ్చి వెళ్లారు. కానీ పెళ్లికి మాత్రం సవాలక్ష అడ్డంకులేర్పడ్డాయి. నరేశ్, ప్రియల వివాహం నవంబర్ 7న జోధ్ పూర్ లో జరగాల్సిఉంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీలోని ఇండియన్ ఎంబసీ.. ప్రియాకు, ఆమె బంధువులకు వీసా నిరాకరించింది. దీంతో పెళ్లి ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం చెయ్యాలో పాలుపోని వరుడు నరేశ్ తన గోడునంతా.. ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా చేరవేశాడు. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి సుష్మా.. 'డోన్ట్ వరీ.. వీసా సమస్యను పరిష్కరిస్తాం..'అని నరేశ్ కు భరోసా ఇచ్చారు. ఇంకేముంది.. అతి త్వరలోనే ఈ ఇండోపాక్ ప్రేమపెళ్లికి శుభంకార్డు పడ్డట్టే! (పాక్ యువతకు మరింత దగ్గరైన సుష్మా) आप चिंता न करें. हम वीज़ा दिलवा देंगे. Pl do not worry. We will issue the Visa. pic.twitter.com/yubcZXcQKG https://t.co/8jUPo6VUvi — Sushma Swaraj (@SushmaSwaraj) 7 October 2016
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
లాండ్ టైట్లింగ్ చట్టం - అబద్దాలు vs నిజాలు
ఆకాశంలో అద్భుతం : అరోరా వెలుగులు, నెట్టింట వైరల్ ( ఫోటోలు)
కాంగ్రెస్కు ఆ హోదా కూడా దక్కదు: ప్రధాని మోదీ
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
సూర్య.. 1000 కోట్లు వసూలు చేస్తాడా?
రూ.947 కోట్ల మోసం.. త్వరలో బిల్డప్ బాబాయ్ ఆస్తుల వేలం.. ఎన్సీఎల్టీ నోటీసులు
టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్రెడ్డి
అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్ చల్
Watch Live: కైకలూరులో సీఎం జగన్ ప్రచార సభ
తప్పక చదవండి
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement