-
అన్నపూర్ణ.. అక్షయ పాత్ర
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకుంటోంది. దేశంలోనే విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా సైతం లభిస్తోంది. రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతున్న యువతకు ప్రభుత్వ పరంగా అన్నపూర్ణ భోజన పథంకం అక్షయ పాత్రగా మారింది. కేవలం రూ.5కే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన పోషక విలువలున్న భోజనం లభిస్తోంది. జీహెచ్ఎంసీ చొరవతో 2014లో అన్నపూర్ణ భోజనం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీని అమలు కోసం నిరంతరం పర్యవేక్షణ సాగిస్తోంది. ఎనిమిదేళ్లుగా.. ఎనిమిదేళ్లుగా అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53 వేల 612 మంది అన్నపూర్ణ భోజనం చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అన్నపూర్ణ భోజనానికి రూ.185 కోట్ల 89 లక్షలు ఖర్చయ్యాయి. కోవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. లాక్డౌన్ సమయంలో మధ్యాహ్నం పూట మొత్తం 373 రెగ్యులర్– మొబైల్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా అందించారు. రాత్రి పూట సైతం 259 రెగ్యులర్– మొబైల్ కేంద్రాలు పనిచేశాయి. పేదల సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ సదుపాయం కూడా కల్పించారు. మొదటి విడతగా 32 ఏరియాల్లో సిట్టింగ్ అన్నపూర్ణ కాంటీన్లను ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో భోజన వసతి
నిడదవోలు : సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో పేద రోగులకు ప్రతి రోజూ భోజన వసతి కల్పించడం వారిలో ఉన్న సేవా సంకల్పానికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ కాటంనేటి భాస్కర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సత్యపాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యసాయి నిత్యాన్న సేవా పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ రూ.6.25 లక్షల ఆర్థిక సహకారంతో ఆసుపత్రి ముఖద్వారం గేటు, ఆవరణలో నిర్మించిన సీసీ రోడ్డును కలెక్టర్ ప్రారంభించారు. పాత ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వంటశాలలో రోగులకు కలెక్టర్ స్వయంగా భోజనాలను వడ్డించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందడంతో రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నారని పేర్కొన్నారు. త్వరలో తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చామన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ నిడదవోలు రైల్వేగేటు వద్ద 6 నెలల్లో ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిత్యన్నదాన కార్యక్రమానికి మా వంతు సహాయంగా సొంత నిధులు రూ.2 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి లక్ష రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కానుమిల్లి శశి శేఖరరావు, డీసీహెచ్ఎస్ కె.శంకరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు పాల్గొన్నారు. -
పార్లపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు
నల్లగొండ రూరల్ : గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధి పార్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకపై సస్పెన్షన్ వేటు వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమొహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం అమలులో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. ప్రస్తుతం ఆమె అదే మండలంలోని వీటీనగర్ పాఠశాలలో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. -
భోజనం మంటలు
తాండవ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వివాదాస్పదంగా మారింది. నిర్వాహకుల మధ్య వివాదం తలనొప్పిగా మారడంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు మూకుమ్మడి సెలవు పెట్టేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. - ఎండీఎం నిర్వాహకుల మధ్య వివాదం - ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారిన వైనం - మూకుమ్మడి సెలవుకు నిర్ణయం నాతవరం : తాండవ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ హైస్కూల్లో తొలుత మాదాలమ్మ డ్వాక్రా గ్రూపునకు చెందిన బంగారి అచ్చుతాంబ పథకం వంటలు చేస్తుండేది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మాదాలమ్మ, గంగాలమ్మ గ్రూపులకు చెందిన ఆరుగురు వంటలు చేస్తుండేవారు. నిర్వహణ విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతో అచ్చుతాంబ, సత్యకళ, వేగి సత్యవతి ఒక వర్గంగా, సుర్ల కొండమ్మ, రాజు, సత్యవతి మరో వర్గంగా విడిపోయి గతేడాది గొడవ పడ్డారు. అప్పట్లో ఈ విషయాన్ని హెచ్ఎం కామేశ్వరరావు మండల కమిటీకి ఫిర్యాదు చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐ, విద్యాకమిటీ సభ్యుల సమక్షంలో సమావేశమయ్యారు. ఏడాదిపాటు ఒక వర్గం చొప్పున వంటలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభం రోజున ఇరువర్గాలు హైస్కూలుకు వచ్చి వంటలు చేసేందుకు పోటీపడి గొడవపడ్డారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో హెచ్ఎం కామేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవికుమార్ హైస్కూల్కు వెళ్లి తగదా లేకుండా చర్యలు తీసుకున్నారు. అదే రోజున డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎంఈవో అమృతకుమార్ భోజన పథకం నిర్వాహకులతో పాఠశాల సిబ్బంది సమావేశమయ్యారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ వారు తీరులో మార్పురాలేదు. తరచూ ఉపాధ్యాయులతో వారు గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు శుక్రవారం తహశీల్దార్ కనకారావును కలిసి సమస్యను వివరించారు. రెండు గ్రూపులను తొలగిస్తాం విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరిస్తే రెండు గ్రూపులను తొలగించి, మరొకరికి మద్యాహ్నన భోజనం నిర్వహణ అప్పగిస్తాం. - లింగేశ్వరెడ్డి, డిప్యూటీ డీఈవో మాకే ఆదేశాలు ఉన్నాయి మాకు హైస్కూల్లో వంటలు చేసేందుకు డీఈవో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. అందుకే మేమే వంటలు చేస్తున్నాం. ఈ విషయంలో తగ్గేది లేదు. - అచ్చుతాంబ, సత్యకళ, సత్యవతి (మాదాలమ్మా డ్వాక్రా గ్రూపు) మేమే వంటలు చేయాలి గతంలో మేము వంటలు చేశాం. ఇప్పుడు మాకే అవకాశం ఇవ్వాలి. అవతలి గ్రూపువారు స్థానికంగా ఉండటం లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తాండవ గ్రామంలో లేవు. - కొండమ్మ, రాజు, సత్యవతి (గంగాభవాని డ్వాక్రా గ్రూపు) మూకుమ్మడి సెలవే మార్గం నిర్వాహకుల వివాదాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించలేదు. వారినుంచి ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక మూకుమ్మడి సెలవు పెట్టాలని నిర్ణయించి, తహశీల్దార్కు తెలియజేశాం. - డి.కామేశ్వరావు, హెచ్ఎం, తాండవ హైస్కూల్ -
‘సన్న బియ్యంతో అన్నం’ షురూ
నగరంలో పథకం ప్రారంభం పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు 161 హాస్టళ్లలోని విద్యార్థులకు లబ్ధి సిటీబ్యూరో: నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పథకాన్ని గురువారం ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్పూర్ బాలికల హాస్టల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలు వేర్వేరుగా ప్రారంభించారు. మహేంద్రహిల్స్లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో మంత్రి తలసాని పథకాన్ని ప్రారంభించారు. మరో మంత్రి పద్మారావు సికింద్రాబాద్లోని సితాఫల్మండి బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కింగ్కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు. 15,652 మంది విద్యార్థులకు లబ్ధి నగరంలో 161 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 15,652 మంది విద్యార్థులకు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో.. నగరంలోని 612 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 83 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. మంచి భోజనంతో విద్యార్థులు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని హాస్టల్ వార్డెన్లు, పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి: దత్తాత్రేయ ముషీరాబాద్: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సంబంధిత అధికారులు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం కార్యక్రమాన్ని భోలక్పూర్లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ తో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, డ్రాఔట్స్ లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్లు తెరిచి అభివృద్ధిని చూడండి:నాయిని భోలక్పూర్లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వారు కళ్లు తెరిచి తాము చేపట్టే అభివృద్ధికి సహకరించాలని కోరారు. పేద విద్యార్థుల పోరాట ఫలితమిది.. అఫ్జల్గంజ్: సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం సరఫరా పేద విద్యార్థుల పోరాట విజయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం కింగ్కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలలుగా సన్న బియ్యం సరఫరా కోసం విద్యార్థులు చేసిన పోరాటానికి స్పందించిన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సన్న బియ్యం సరఫరా విషయంలో భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాధిక, బీసీ మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కె.నర్సింహ నాయక్, విద్యార్థి నేతలు పి.సతీష్కుమార్, రేపాక రాంబాబు, సీహెచ్ శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్, రతన్, వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఒకే పథకాన్ని వేర్వేరుగా ప్రారంభించిన దత్తాత్రేయ, నాయిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒకే హాస్టల్లో వేర్వేరుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి అధికారులు భోలక్పూర్లోని బాలికల ఎస్సీ వసతి గృహాన్ని ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయకు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్కు సమాచారం అందించారు. దత్తాత్రేయ, లక్ష్మణ్లు అనుకున్న సమయానికి రాగా నాయిని నర్సింహారెడ్డి కోసం దాదాపు 45 నిమిషాలు వేచి చూశారు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, లక్ష్మణ్లు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తరువాత అరగంటకు మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాస్టల్కు చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్కు సన్న బియ్యం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థుల మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం సరికాదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement