-
అదనపు కలెక్టర్ నగేశ్ బాగోతం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టులో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశేనని ఏసీబీ వెల్లడించింది. తాను చేసే అక్రమానికి కలెక్టర్ పేరును పరోక్షంగా, ఆర్డీవో, తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్లను ప్రత్యక్షంగా వాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఎన్వోసీ ఇవ్వాలంటే కలెక్టర్కు రూ.1.12 కోట్లు లంచమివ్వాలని చెప్పిన డీల్ మాట్లాడుకున్న నగేశ్.. ఎన్వోసీ జారీ అయినా, ఆ విషయాన్ని చెప్పకుండా.. మొత్తం లంచం వసూలు చేసుకోవడానికి బాధితుడిపై పలు రకాల ఒత్తిళ్లు తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ–1గా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏ–2గా జూనియర్ అసిస్టెంట్ వాసీం, ఏ–3గా ఆర్డీవో అరుణారెడ్డి, ఏ–4గా తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఏ–5గా నగేశ్ బినామీ కోలా జీవన్గౌడ్లను పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే..? శేరిలింగంపల్లికి చెందిన శరత్ చంద్ర, సత్యనారాయణ ప్రసాద్లు ఈ భూమి ఓనర్లు. వీరితో భూమి కొనుగోలుకు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తికి ఒప్పందం కుదిరింది. సర్వే నంబరు 58, 59లలోని ఈ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్కు నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) తప్పనిసరి అయింది. దీంతో జూలై 30వ తేదీన ఈ విషయమై అడిషనల్ కలెక్టర్ నగేశ్ను లింగమూర్తి ఆశ్రయించాడు. ఎకరానికి లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ.1.12 కోట్లు కలెక్టర్ ధర్మారెడ్డికి చెల్లిస్తే.. పని అవుతుందని నగేశ్ బేరం పెట్టాడు. విధిలేక లంచం ఇచ్చేందుకు లింగమూర్తి అంగీకరించాడు. మరునాడు జూలై 31న మెదక్లోని ఏసీ నగేశ్ ఇంటికి వెళ్లిన లింగమూర్తి రూ.19.5 లక్షల నగదును లం చంగా ఇచ్చాడు. అపుడు ఏసీ నగేశ్ సర్వే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అయిన వాసీంను కలవాలని సూచించాడు. అక్కడ తనకు, ఆర్డీవోకు, తహసీల్దార్కు కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని వాసీం డిమాండ్ చేయగా.. లింగమూర్తి తన వద్ద ఉన్న రూ. 4 లక్షల నగదు ఇచ్చాడు. మిగిలిన రూ.లక్షను గూగుల్ పే ద్వారా వాసీం సూచించినట్లుగా సోమరాజాగౌడ్ అనే వ్యక్తికి మూర్తి తన భార్య, సోదరుడి ఫోన్ల ద్వారా పంపాడు. ఆగస్టు 7వ తేదీన రెండో విడతగా రూ.20.5 లక్షలను లింగమూర్తి ఏసీ నగేశ్కు అందజేశాడు. మిగిలిన రూ.72 లక్షలు ఏవని ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా సర్దలేకపో యానని లింగమూర్తి బదులిచ్చాడు. అయితే, ష్యూరిటీ కింద చెక్కులు ఇవ్వాలని ఏసీ నగేశ్ డిమాండ్ చేశాడు. దీంతో తన చందానగర్ ఐసీఐసీఐ ఖాతాకు చెందిన ఎనిమిది ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చాడు లింగమూర్తి. దాంతో అప్పటికే సిద్ధమైన ఎన్వోసీని లింగమూర్తికి అందించాడు నగేశ్. వాస్తవానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్పై జూలై 31 తారీఖునాడే నాటి కలెక్టర్ ధర్మారెడ్డి సంతకం చేశారు. మిగతా డబ్బు కోసం ఒకటే ఫోన్లు మిగిలిన డబ్బు కోసం జూనియర్ అసిస్టెంట్ వాసీంతో నగేశ్ పదేపదే ఫోన్లు చేయించాడు. దీంతో విసిగిపోయిన లింగమూర్తి ఆ ఫోన్కాల్స్ను రికార్డు చేశాడు. ఆగస్టు 14వ తేదీన మెదక్ ఏసీ నగేశ్తో లింగమూర్తి మరోసారి సమావేశమయ్యారు. మిగిలిన రూ.72 లక్షలకు సర్దలేకపోతున్నానని లింగమూర్తి చేతులెత్తేశాడు. అయితే ఎన్వోసీ జారీ అయిన 112 ఎకరాల్లో నుంచి పదెకరాలు తాను సూచించిన కోలా జీవన్గౌడ్ పేర రిజిస్ట్రేషన్ చేయాలని నగేశ్ సూచించగా, చివరికి ఐదెకరాలకు బేరం కుదిరింది. ఆగస్టు 15న జీవన్గౌడ్ పేరిట సేల్డీడ్ సిద్ధం చేసిన లింగమూర్తి వాటిని వాట్సాప్ ద్వారా వారికి పంపించాడు. ఈ లావాదేవీలో ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని నగేశ్ ముందుగానే లింగమూర్తిని ఫోన్లో హెచ్చరించాడు. అయితే ఈ సంభాషణ మొత్తం లింగమూర్తి ఫోన్లో రికార్డయింది. తరువాత సేల్ అగ్రిమెంట్ ఒరిజినల్ కాపీని ఆగస్టు 21వ తేదీన కలిసినపుడు లింగమూర్తి నుంచి ఏసీ నగేశ్ తీసుకున్నాడు. ఆగస్టు 22న ఏసీబీ ఆఫీస్కు లింగమూర్తి ఆగస్టు 7వ తేదీ నుంచే నగేశ్– లింగమూర్తి మధ్య విభేదాలు పొడసూపినట్లు సమాచారం. జూలై 31 రోజునే ఎన్వోసీ జారీ అయినా.. ఆ విషయం తనకు చెప్పకుండా రూ.20.5 లక్షలు వసూలు చేయడం, పైగా తాను కొనుగోలు చేసిన భూమిలో పదెకరాలు ఇవ్వాలనడం లింగమూర్తికి రుచించలేదు. చివరికి ఐదెకరాలకు ఒప్పందం కుదిరింది. ఆగస్టు 15వ తేదీన వాట్సాప్లో సేల్ అగ్రిమెంట్ను పంపించిన లింగమూర్తి అడిషనల్ కలెక్టర్ను వారం దాకా కలవలేదు. ఈ సమయంలో లింగమూర్తిపై అడిషనల్ కలెక్టర్కు అనుమానం వచ్చింది. తనకు ఒరిజినల్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఆదేశించడంతో ఆగస్టు 21న కలిసి ఇచ్చేశాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే జాప్యమైందని, తాను ఏసీబీని ఆశ్రయించలేదని వివరణ ఇచ్చుకున్నాడు లింగమూర్తి. చివరకు ఈనెల 9న నగేశ్ను ఏసీబీ అరెస్టు చేసింది. విచారణలో నోరువిప్పని ఏసీ..! ఏసీబీ విచారణ సందర్భంగా ఏసీ నగేశ్ నోరు విప్పలేదు. మొదట్లో అసలు లింగమూర్తి ఎవరో తనకు తెలియదన్న నగేశ్.. చిప్పలతుర్తి సమీపంలో ఫిర్యాదుదారుడు డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తి భూమి గురించి తనను కొన్నిసార్లు కలిసినట్లు తెలిపాడు. కానీ, ఆయన నుంచి రెండు దఫాల్లో తీసుకున్న రూ.40 లక్షల గురించి ప్రశ్నించగా.. ఎలాంటి డబ్బును తీసుకోలేదన్నాడు. అలాగే మిగిలిన రూ.72 లక్షలకు ఫిర్యాదుదారుడు సంతకం చేసి ఇచ్చిన చెక్కులు, ఐదెకరాల భూమికి చేసుకున్న అగ్రిమెంటు తాలూకు పత్రాల గురించి పదేపదే అడగ్గా.. బహుశా వారు «కలెక్టర్ ధర్మారెడ్డిని కలిశారేమో అంటూ సమాధానమిచ్చాడు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు. నిందితులు ఐదుగురు ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ సస్పెన్షన్ మరో నలుగురిపైనా వేటు భూ వ్యవహారంలో మెదక్ అదనపు కలెక్టర్సహా నలుగురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఘటనలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసీం అహ్మద్ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఎకరాకు రూ.లక్ష ఇస్తే 22ఏ(నిషేధిత జాబితా) నుంచి 112 ఎకరాలను తొలగిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేస్తానని నగేశ్ హామీ ఇచ్చి నట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 9న మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా ఐదుగురి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూ వ్యవహారంలో నర్సాపూర్ ఆర్డీవో, చిలిపిచెడ్ తహసీల్దార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మరో ఉద్యోగి ఉన్నట్లు తేలింది. అలాగే మరొకరు అదనపు కలెక్టర్ బినామీగా గుర్తించారు. దీంతో వీరిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదిగో బహుమతి..
పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థుల్లో ఉత్తీర్ణతశాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే విద్యార్థులను ప్రతీ రోజు పాఠశాలకు వచ్చేలా విద్యాశాఖ అధికారులు చొరవ చూపుతున్నారు. ఈ మేరకు జిల్లాలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందశాతం ఉత్తీర్ణత ఉన్న విద్యార్థినులకు సైకిళ్లను బహూకరించనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు నెలను హాజరు మాసంగా ప్రకటించారు. దీని ద్వారా వందశాతం హాజరు ఉన్న విద్యార్థినులను ప్రోత్సహించడంతోపాటు ఎక్కువ మంది విద్యార్థినులను పాఠశాలకు వచ్చేలా ఉపయోగపడనుంది. సాక్షి, పాపన్నపేట: ఈనెల 2న వనపర్తి ఉన్నత పాఠశాల విద్యార్థిని నందినికి ఊహించని బహుమతి లభించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్రెడ్డి ఆ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినిని గుర్తించారు. వెంటనే ఆమెకు అక్కడికక్కడే ఒక సైకిల్ బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇది హాజరు మాసోత్సవంలో భాగంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తీసుకున్న చర్య అని తెలిపారు.’ ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అదేబాటకు శ్రీకారం చుడుతున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.వీరిలో కొందరికి సైకిళ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాఠశాలపై ఆసక్తి కలిగించేలా.. శతశాతం హాజరు సాధించే విద్యార్థి తరగతికి తగిన సామర్థ్యాలు సాధిస్తారన్నది కాదన లేని నిజం. పాఠశాల అంటే విద్యార్థికి ఆసక్తి కలిగించే దిశగా విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి వినూత్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. హాజరు శాతం పెంచేందుకు ఆగస్టు నెలను ‘హాజరు మాసంగా’ ప్రకటించారు.ఈ క్రమంలో పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన ఒక విద్యార్థినికి సైకిల్ బహుమతి ఇచ్చిన వార్త వైరల్ అయ్యింది. ఈ ప్రోత్సాహకం సత్ఫలితాన్ని ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చేందుకు అవకాశాలు వెతుకుతున్నారు. ట్రావెల్ అలవెన్స్ ఇచ్చే అవకాశం! గతంలో 1998లో అప్పటి ప్రభుత్వం చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పాఠశాలలకు వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది బాలికా విద్య పెరగడానికి కొంత వరకు దోహద పడింది. ప్రస్తుతం 3 నుంచి 5 కి.మీ దూరం నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.300 ట్రావెలింగ్ అలవెన్స్గా ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. దాతల సహకారంతో.. హాజరు శాతం పెంచేందుకు సైకిళ్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకు గాను కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులను సంప్రదిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ రోజు ఒక్కో కంపెనీతో అధికారులు మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు.. 100 శాతం హాజరు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సైకిళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బడుల్లో నెలకొని ఉన్న మౌలిక సమస్యలు తీర్చేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఒక ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ద్వార సహాయం చేసే దాతలకు ఐటీ వెసులు బాటు ఉంటుందని అధకారులు స్పష్టం చేశారు. దీం తో ఇప్పటికే ఎల్ఐసీ, ఐకియా, సంప్రదింపులు జరిపి ఫలితాలు సాధించినట్లు సమాచారం. మెదక్ జిల్లాలో సైతం.. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఈ విషయమై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే విద్యార్థినుల వివరాలు సేకరించాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు సూచించనున్నట్లు తెలుస్తుంది. ఈనెల 15న గాని అంతకు ముందు గాని శతశాతం హాజరు గల విద్యార్థినులకు సైకిళ్ళు అందజేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.మెదక్ జిల్లాలో మొత్తం 141 ఉన్నత,133 ప్రాథమికోన్నత,623 ప్రాథమిక పాఠశాలలు,15 కేజిబివిలు,7 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 80 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.అందులో సుమారు 40వేల మంది విద్యార్థినులున్నారు. -
హరితం.. వేగిరం
హరితహారం లక్ష్యసాధనపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వర్షాలు కురుస్తుండటంతో ఇదే అదునుగా భావించిన అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో నాలుగో విడత హరితహారంలో 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇదివరకే ప్రభుత్వ శాఖల వారీగా టార్గెట్ నిర్దేశించిన కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు.. ప్రతి రోజూ ఒకటి లేదా రెండు మండలాల చొప్పున పర్యటిస్తూ మొక్కలు పంపిణీ చేస్తున్నారు. సాక్షి, మెదక్: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్లెల్లో మొక్కల పంపణీకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో 433 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 321 నర్సరీలు ఉండగా.. అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నవి 112 ఉన్నాయి. ఇప్పటికే అన్ని నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ నర్సరీల్లో పెంచిన మొక్కలు 3 కోట్లకు పైనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రెట్టింపునకు పైగా లక్ష్యంతో.. 2018లో చేపట్టిన మూడో విడత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 1.31 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పుడు 1.15 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. ఇందులో ఎన్ని బతికాయో.. ఎన్ని పోయాయో తెలియదు గానీ ప్రస్తుతం రెట్టింపు సంఖ్యకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకనుగుణంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. అయితే.. ఎప్పటికీ జూలై 31లోపు హరితహారం కార్యక్రమం ముగిసేది. ప్రస్తుతం వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఇప్పటివరకు 24,32,388 మొక్కలు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలకు హరితహారం లక్ష్యాన్ని కలెక్టర్ నిర్దేశించారు. ఇప్పటివరకు కేవలం ఐదు ప్రభుత్వ శాఖలు మొక్కలు నాటడం మొదలుపెట్టాయి. జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటాలనేది టార్గెట్ కాగా.. వ్యవసాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ, గనులు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరకు 24,32,388 మొక్కలు మాత్రమే నాటారు. కలెక్టర్ ప్రత్యేక నజర్ జిల్లాలో అటవీ శాతం పెంపు, ఇంకుడుగుంత నిర్మాణంతోపాటు పాస్టిక్ వ్యర్థాల నిర్మూలపై కలెక్టర్ ధర్మారెడ్డి ప్రత్యేక నజర్ వేశారు. ఈ మూడు కార్యక్రమాలను స్వయంగా ఆయనే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే తగని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా వాటిని సంరంక్షించే విధానంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. మొక్కలు ఎక్కడెక్కడ ఏ శాఖల ఆధ్వర్యంలో నాటారో.. వాటి బాధ్యతను సైతం ఆయా శాఖల అధికారులకే అప్పగించారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సమీక్ష సమావేశాల్లో హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. త్వరలో శాఖల వారీగా కార్యక్రమం నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని వేగిరం చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రభుత్వ శాఖల వారీగా త్వరలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, ఇతర సంస్థల సహకారంతో రోడ్ల వెంట, మైదానాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కొత్త చట్టంతో సక్సెస్ అయ్యేనా.. ప్రభుత్వం ఇటీవల నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టంలో ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాలని.. గ్రామస్తుల అవసరాలకు అనుగుణంగా పండ్లు, పూల మొక్కలు నాటాలని.. ఇంటింటికీ ఆరు చొప్పున మొక్కలు పంపణీ చేసి వాటిని సంరంక్షిచాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ బాధ్యతల్లో విఫలమైన పక్షంలో సర్పంచ్తోపాటు పంచాయతీ కార్యదర్శిపై వేటు పడు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కొత్తచట్టంతో గ్రామాల్లో హరితహారం సక్సెస్ అవుతుందని పలువురు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలి. నూతన పంచాయతీరాజ్ చట్టం పకడ్బందీ అమలుతోపాటు గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు కీలకపాత్ర పోషిస్తే ఊరువాడా హరితమయమై పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతాయనే భావన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతోంది. లక్ష్యంతో పాటు రక్షణ ముఖ్యం మెదక్జోన్: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతిగ్రామానికి మొక్కలు నాటేందుకు ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని లక్ష్యాన్ని చేరుకునేందుకు మొక్కలే నాటడం ముఖ్యం కాదని నాటిన ప్రతిమొక్కను రక్షించుకోవడమే ప్రదానమని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్లో హరితహారం కార్యక్రమం విజయవంతంకోసం జిల్లాలోని ఉపాధిహామీ పథకం సిబ్బంది. ఐకేపీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా నిర్వహించిన హారితహారం కార్యక్రమంలో ఆయా గ్రామాలకు ఇచ్చిన లక్ష్యాలను చేరుకునేందుకు గానూ ఇష్టానుసారంగా మొక్కలను నాటడమే జరిగిందని వాటి సంరక్షణ మాత్రం పట్టించుకోలేక పోయారని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ సరిగా జరగక పోవటానికి ఇదే ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం తమకు నిర్దేశించిన మొక్కలను నాటామని కాకుండా నాటిన ప్రతి మొక్క రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఉపాధి సిబ్బంది, ఐకేపీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ సీతారామరావు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బంది సమష్టి కృషితో విజయవంతం చేశారని అదే స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపాలన్నారు. నిజాంపేట మండలంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి రైతులకు వివరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను తీసుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. అనంతరం డీపీవో హనూక్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలకు విరివిగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో పద్మజారాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏడీ హార్టికల్చర్ నర్సయ్య, ఏపీడీలు ఉమాదేవి, భూమయ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. మెదక్ రూరల్: హరితహారం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మెక్కలు నాటే విధానం గురించి హైదరాబాద్ అకాడమిలో శిక్షణ పొందిన అధికారులతో గురువారం మెదక్ కలెక్టరేట్లో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు ప్రతి గ్రామంలో గామసభలను నిర్వహించి హరితహారం ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని సూచించారు. ప్రతి ఇంటికి పంపిణీ చేసే మొక్కల వివరాలను ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేసేలా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు, డీపీఓ హనూక్, డీఎఫ్ఓ పద్మజారాణి, జిల్లా అధికారులు పరుశురాంనాయక్, దేవయ్య, నర్సయ్య, సుధాకర్, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఏసయ్య, రసూల్బి తదితరులు ఉన్నారు. -
పదవిలో ఆమె.. పెత్తనంలో ఆయన
సాక్షి, తూప్రాన్: కంప్యూటర్ యుగంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వీరికి రాజకీయంగా సముచిత న్యాయం అందించడంలో భాగంగా పాలకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలుగా మహిళా ప్రతినిధులు ఎన్నికవుతున్నా వారు ఇంటికే పరిమితమవుతున్నారు. వారి భర్తలే ప్రజాప్రతినిధులుగా చెలామని అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలకే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వారి భర్తలే హాజరు అవుతున్న సంఘటనలు ప్రతినిథ్యం ఏదో ఒకచోట చూస్తూనే ఉన్నాం. ఇందుకు నిదర్శనం శుక్రవారం మండలంలోని హస్తాల్పూర్లో రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామసభ. గ్రామసభను సందర్శనకు కలెక్టర్ ధర్మారెడ్డి రాగా వెల్దుర్తి ఎంపీపీ స్వరూప భర్త నరేందర్రెడ్డి, కొప్పులపల్లి సర్పంచ్ కనకమ్మ భర్త బాల్రెడ్డిలు తామే ప్రజా ప్రతినిధులుగా పరిచయం చేసుకొని కలెక్టర్ పక్క సీటులోనే ఆసీనులయ్యారు. స్థానిక సర్పంచ్ మమత మాత్రం వీరి పక్కన కొద్దిసేపు కూర్చుండి పక్క హాలులోకి వెళ్లిపోయింది. సర్పంచ్ మమత కలెక్టర్కు దూరంగా కూర్చోగా మహిళా ప్రతినిధుల భర్తలు కలెక్టర్ పక్కన కూర్చోవడం ఎంతవరకు సమంజసమంటూ పలువురు గ్రామస్తులు చర్చించుకున్నారు. కలెక్టర్ హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలోనే ఇలా ఉంటే మండల స్థాయి అధికారులు నిర్వహించే కార్యక్రమాల్లో ఎలా ప్రవర్తిస్తారోనని మరి. మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు హాజరై దర్జా ఒలకబోయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. -
లాభసాటి వ్యవసాయం మేలు
సాక్షి, మెదక్ : ఉన్న నీటితో లాభసాటి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. నూనె గింజల ఉత్పత్తి కోసం ఎంపిక చేసిన మెదక్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం దళిత రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పండించేందుకు ఎక్కువ నీరు అవసరమని.. వాణిజ్య పంటలకు తక్కువ నీరు అవసరమని వివరించారు. ఈ మేరకు వాణిజ్య పంటల సాగు దిశగా రైతులు ముందుకు సాగాలన్నారు. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడు ఒకే రకమైన పంటలు వేయకుండా.. పంట మార్పిడి పద్ధతులు అవలంబించాలని సూచించారు. ఇందులో ఈ గ్రామం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయం : పద్మాదేవేందర్రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామం ఎంపిక కావడంలో అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. అంతేకాదు.. భూమి లేని దళిత కుటుంబాలకు నాటు కోళ్ల పెంపకానికి సంబంధించి పిల్లలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ రైతులు ఇలాంటి ఫలాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెదక్ మండల పరిషత్ అధ్యక్షురాలు లక్ష్మీకిష్టయ్య, సర్పంచ్, శాస్త్రవేత్తలు సతీష్, మంజునాథ్, పద్మావతితోపాటు జిల్లా వ్యవసాయ శాఖాధికారి పరశురాం నాయక్, ఏడీఏ నగేశ్ కుమార్, ఏపీడీ ఉమాదేవి, తహసీల్దార్ రవికుమార్, మండల వ్యవసాయాధికారి రెబల్సన్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement