-
మీడియాకు లీకేజీలపై బీసీసీఐ ఆగ్రహం
బీసీసీఐకి సంబంధించిన అంతర్గత సమాచారం మీడియాలో తరచుగా వస్తుండటం పట్ల బోర్డు కార్యదర్శి జై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు ఉద్యోగులెవరూ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడరాదని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి కాంట్రాక్ట్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంతోపాటు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కలిపి సుమారు 100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ‘బీసీసీఐ ఉద్యోగులు కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని తెలిసింది. ఇది కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేయడం వల్ల బోర్డుకు సంబంధించి రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా గానీ తమకు తెలీకుండా గానీ ఎవరైనా, ఏ రూపంలోనైనా ఇలా సమాచారం బయటకు చేరవేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వేతన చెల్లింపులు కూడా లేకుండా ఉద్యోగంలోంచి తొలగిస్తాం’ అని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్లో జై షా పేర్కొన్నారు. అయితే ఎలాంటి సమాచారం లీక్ కావద్దంటూ అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్ కూడా ఇప్పుడు మీడియాకు లీక్ కావడం విశేషం. -
సమగ్ర దర్యాప్తు జరిపించండి!
న్యూఢిల్లీ: శారదా చిట్స్ స్కాంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ లెఫ్ట్ పార్టీల నేతలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అన్ని దర్యాప్తు సంస్థలను సమన్వయం చేస్తూ ఈ తరహా మోసపూరిత స్కీములన్నింటిపై విచారణ జరిపించాలని కోరారు. శారదా కేసులో సెబీ, సీబీఐ, వంటి కేంద్ర సంస్థలు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయని, అయితే దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ స్కామ్ మూలాల్లోకి వెళ్లడానికి అన్ని సంస్థల సంయుక్త దర్యాప్తు అవసరమని సూచించినట్లు సీపీఎంనేత సీతారాం ఏచూరి మీడియాకు తెలిపారు. ప్రధానిని కలసిన వారిలో సీపీఎం నేత బిమన్బోస్, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సుర్జోకాంత మిశ్రా, ఆర్ఎస్పీ నేత అబనీరాయ్, ఫార్వర్డ్ బ్లాక్ నేత అలీఇమ్రాన్ రమ్జ్ ఉన్నారు. శారదా మీడియాతో మమతకే అత్యధిక లబ్ధి: కునాల్ కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ కునాల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేశారు. చిట్ఫండ్ స్కాంలో ఆమెకు వ్యతిరేకంగా స్థానిక కోర్టులో సోమవారం వాంగ్మూలమిచ్చారు. శారదా గ్రూప్నకు చెందిన శారదా మీడియా ద్వారా మమత అత్యధిక లబ్ధి పొందారన్నారు. 2013లో ఈ స్కాం బయటపడే నాటికి ఆ మీడియాకు కునాల్ ఘోష్ సీఈవోగా ఉన్నారు. అప్పటికి పలు పత్రికలు, టీవీ చానళ్లు శారదా మీడియా చేతిలో ఉన్నాయి. ఈ కేసులో తనను బలి పశువును చేశారని తృణమూల్ నేతలపై కునాల్ ధ్వజమెత్తారు. స్కాంలో మమత, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ హస్తముందని పునరుద్ఘాటించారు. ‘నా వద్ద సమాచారం ఉంది. సీబీఐ నన్ను ప్రశ్నిస్తే ఆ వివరాలు వెల్లడిస్తా’ అని అన్నారు. -
‘షీ’కి చిక్కారు
వారంలో 40 మంది ఈవ్టీజర్లపై కేసు నిందితులు 16-68 ఏళ్ల వయస్సు వారు సాక్షి, సిటీబ్యూరో: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన షీ టీమ్లకు వారంలో 40 మంది ఈవ్టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీ టీమ్స్ పనితీరు, ఈవ్టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ టీమ్లు ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాలలు, షాపింగ్ సెంట ర్లు, రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్టీజర్లను అదుపులోకి తీసుకుని పిటీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. పట్టుబడిన వారిలో 16 నుంచి 68 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రయివేటు ఉద్యోగులు, ఒక సర్పంచ్ ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్కుమార్, ఏసీపీ కవిత పాల్గొన్నారు. ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నంబర్కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్ను విడుదల చేశారు. షీ టీమ్లు ఈవ్టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నాయి. ఈవ్టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి మహిళలు, విద్యార్థినిలను స్వయంగా కలుసుకుని భరోసా ఇస్తున్నారు. ఈవ్టీజర్లతో అవగాహన తరగతులు.. ఈవ్టీజింగ్ను మరింత కట్టడి చేసేందకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలల్లో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు పట్టుబడిన నిందితులు అంగీకరించారు. వీరితో పాటు పోలీసులు కూడా కళాశాలలకు వెళ్లి ఈవ్టీజింగ్ చేయరాదని వారిలో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాన్ని త్వరలో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా పట్టుబడ్డారు.. 20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్లో నిల్చున్నాడు. అక్కడికి వ చ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్టీజింగ్కు పాల్పడుతూ షీ టీమ్కు చిక్కాడు. సికింద్రాబాద్లో 30 ఏళ్ల యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్కు పట్టుబడ్డాడు. అమీర్పేటలో ఓ ప్రయివేటు ఉద్యోగి (36) బస్టాప్లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడటంతో పాటు మాట్లాడుతూ ఈవ్టీజింగ్కు పాల్పడి దొరికిపోయాడు. సుల్తాన్బాజర్లో ఈవ్టీజింగ్కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు. ఈవ్టీజింగ్కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా ‘నగరంలో ఏ మూలన కూడా ఈవ్టీజింగ్ జరగడానికి వీలులేదు. ఈవ్టీజింగ్కు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారి పట్టుబడితే పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి దొరికితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం.’ -
ఒక నేతకు నివాళిగా ఒకే వాణిజ్య ప్రకటన
న్యూఢిల్లీ: మీడియాకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు నియమించిన ఓ కమిటీ పేర్కొంది. అదే సమయంలో అధికారంలో ఉన్నవారిని స్తుతించేలా ఆ ప్రకటనలు ఉండకూడదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని వాణిజ్య ప్రకటనల రూపంలో దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ మేరకు ఓ కమిటీని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో నియమించింది. ఈ విషయమై సంబంధిత కమిటీ తాజాగా సుప్రీం కు పలు సిఫారసులు చేసింది. ఏ ఏ ప్రముఖ వ్యక్తుల జయంతి, వర్ధంతికి ప్రకటనలు ఇవ్వాలనే దానిని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించాలని, ఆ ప్రకటనను ఏ విభాగం ఇవ్వాలో కూడా ఖరారు చేయాలని సూచించింది. దీనివల్ల ఒకే నేతకు నివాళిగా పలు ప్రకటనలు ఇవ్వడాన్ని నిరోధించవచ్చని పేర్కొంది. అలాగే ఆ ప్రకటనల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదని స్పష్టం చేసింది. -
చార్జిషీట్ మీడియాకు ఎలా లీకైంది?
కొన్ని పత్రికల్లో దీనిపై కథనాలెలా వస్తున్నాయి? వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ కోర్టు జడ్జి ప్రశ్న ఈ కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ న్యాయవాది హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీట్ మీడియాకు ఎలా లీక్ అయిందని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ప్రశ్నించారు. ‘చార్జిషీట్ను మీడియాకు ఎవరు ఇస్తున్నారు? నేనే ఇంకా చదవలేదు. చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలు తదితర అంశాలపై యథాతథంగా కొన్ని పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి’ అని అన్నారు. చార్జిషీట్లోని సమాచారాన్ని సీబీఐ ఇస్తోందా? నిందితుల తరఫు న్యాయవాదులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. చార్జిషీట్లోని అంశాలను పేర్కొంటూ కథనాలను ప్రచురిస్తుండడంపై జగన్ తరఫు న్యాయవాది అశోక్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిశీలనలో ఉన్న చార్జిషీట్లోని అంశాలను పేర్కొంటూ మీడియా కథనాలను ఎలా ప్రచురిస్తుందని ప్రశ్నించారు. మీడియా ట్రయల్స్ చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసినా... చార్జిషీట్ దాఖలు చేసిన వెంటనే, కోర్టు పరిశీలనలో ఉండగానే అందులోని అంశాలను పేర్కొంటూ వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ‘సీబీఐ సమర్పించిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉంది. కోర్టు నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదు. చార్జిషీట్లోని అన్ని అంశాలను, డాక్యుమెంట్లను పరిశీలించి విచారణకు స్వీకరించిన తర్వాతే నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు అందజేస్తుంది. కోర్టు నుంచి గానీ, మా నుంచి గానీ చార్జిషీట్ లీక్ అయ్యే అవకాశం లేదు. సీబీఐ మాత్రమే దాన్ని లీక్ చేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. చార్జిషీట్ మీడియాకు ఎలా అందిందో తమకు తెలియదని సీబీఐ స్పెషల్ పీపీ కోర్టుకు నివేదించారు. నిబంధనలకు లోబడే తమకు భూకేటాయింపులు జరిగాయని, ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ హెటిరో డ్రగ్స్ ఎండీ శ్రీనివాసరెడ్డి, హెటిరో సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను మంగళవారం విచారించిన సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కంపెనీల్లో ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ వాదనలు వినిపిస్తోందని జగన్ తరఫు న్యాయవాది అశోక్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అభియోగాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారంగా చూపించి, వాదనలు వినిపిస్తే వాటికి తాము వివరణ ఇస్తామని నివేదించారు. ఈ సందర్భంగా చార్జిషీట్లోని పేర్కొన్న అంశాలను సీబీఐ తరఫు న్యాయవాది చదివి వినిపిస్తూ.. నిందితులపై అభియోగాలు నమోదు చేయవచ్చని నివేదించారు. ఈ పిటిషన్పై వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement