-
AP: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎంటి క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)తో పాటు మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సీఈవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చేశారు. చదవండి: AP: ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువు పొడిగింపు -
జూన్ వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు వైద్యచికిత్స ఖర్చుల రీయింబర్స్మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ఈ ఏడాది జూన్ వరకు కొనసాగుతుందని పేర్కొంటూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రీయింబర్స్మెంట్ విధానంతోపాటు ఉద్యోగుల వైద్య సేవల పథకం (ఈహెచ్ఎస్) సమాంతరంగా కొనసాగుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 31తోనే మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో 2018 జనవరి 1 నుంచి ఈహెచ్ఎస్ ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు, పింఛనుదారులకు వైద్యసేవలను కొనసాగించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఈహెచ్ఎస్ నిర్వహణకు అవసరమైన ఉద్యోగులను, సిబ్బందిని నియమించకపోవడంతో వైద్యసేవల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో రీయింబర్స్మెంట్ విధానాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు ముగియడంతో తాజాగా మరోసారి పొడిగించింది. -
ఉద్యోగుల ‘రీయింబర్స్మెంట్’ బంద్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రక్రియ నిలిచిపోయింది. 2017 డిసెంబరు 31తోనే మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం గడువు ముగియగా.. దాని కొనసాగింపుపై వైద్యారోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం 2018 జనవరి నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ఉండబో దని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల వైద్యసేవల పథకం (ఈహెచ్ఎస్) ఆధ్వర్యంలోనే ఉద్యోగులు, పింఛనుదారులకు వైద్య సేవల ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నాయి. ఈ లెక్కన వెల్నెస్ సెంటర్ల ద్వారానే ఉద్యోగులు, పింఛన్దారులకు వైద్య సేవలు కొనసాగుతాయి. వెల్నెస్ సెంటర్లలో ఓపీ సేవలు అందిస్తారు. అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఆధారంగా మెరుగైన చికిత్స అవసరమని గుర్తిస్తే.. ఎంపిక చేసిన ఆస్పత్రులకు పంపుతారు. ఇందులో వీలైనంత వరకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసే విషయంలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఈహెచ్ఎస్ నిర్వహణకు అవసరమైన ఉద్యోగులు, సిబ్బందిని నియమించకపోవడంతో వైద్య సేవల నిర్వహణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. లక్షలాది మందికి ఇబ్బంది.. రాష్ట్రంలో 8,32,085 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,06,125 పింఛనుదారులు ఈహెచ్ఎస్ కింద నమోదయ్యారు. వీరికి వైద్య సేవలు అందించేందుకు ఈహెచ్ఎస్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా 200 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. 2018 జనవరి 1 నుంచి వెల్నెస్ సెంటర్లకు వెళ్లిన తర్వాతే వైద్య సేవలు పొందాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ ఏడాదిగా చెబుతోంది. వాస్తవానికి మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ముగిసేలోపు రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. 2016 డిసెంబర్ 17న హైదరాబాద్లోని ఖైరతాబాద్లో మొదటి వెల్నెస్ సెంటర్, 2017 ఫిబ్రవరిలో వనస్థలిపురంలో, ఇదే ఏడాది నవంబర్లో వరంగల్లో మరో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సిద్దిపేటలోనూ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినా.. సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు. మొత్తంగా ఈహెచ్ఎస్ విధానాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయకుండానే.. మెడికల్ రీయింబర్స్మెంట్ను నిలిపివేయడంతో ఉద్యోగులు, పింఛనుదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. -
‘వెల్నెస్’కు వెళ్తేనే వైద్యం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వైద్య సేవల విషయంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. జనవరి 1 నుంచి ఉద్యోగులు వెల్నెస్ సెంటర్లకు వెళ్లిన తర్వాతే వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం ఈ ఏడాది డిసెంబర్తో ఆగిపోనుంది. నచ్చిన ఆస్పత్రుల్లో ఉద్యోగులు చికిత్స చేయించుకునే పరిస్థితికి తెరపడనుంది. అయితే మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం ముగిసేలోగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అది జరగలేదు. ఈ విషయంలో వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జనవరికల్లా పాత జిల్లాల కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికీ రెండే వెల్నెస్ సెంటర్లు, అవీ హైదరాబాద్లోనే (ఖైరతాబాద్, వనస్థలిపురంలలో) ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత విధానంలో ఎక్కడైనా వైద్యం... రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, మరో ఏడు లక్షల మంది వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 11 లక్షల మంది ప్రభుత్వపరంగా వైద్య సేవలు పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అందుబాటులోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి బిల్లులతో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు వైద్య సేవలను అందించే ఆస్పత్రుల జాబితాను రూపొందించింది. కొన్నిసార్లు ఈ జాబితాలో లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఉద్యోగులు పెట్టిన ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. గడువులోగా వెల్నెస్ కేంద్రాలు వచ్చేనా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సేవల విషయంలో మార్పులు చేసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) ప్రవేశపెట్టింది. పథకం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలోనే వైద్య సేవలను అందించాలని నిర్ణయించింది. అలాగే జర్నలిస్టుల వైద్య సేవల పథకాన్ని దీనికి అనుసంధానించింది. ఈ పథకం ప్రకారం వెల్నెస్ సెంటర్లలో అందుబాటులో ఉండే అన్ని విభాగాల వైద్యులు... చికిత్సల కోసం వచ్చే వారిని పరిశీలించి అవసరమైన టెస్ట్లు ప్రతిపాదించి వాటి నివేదికలను చూశాక అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య సేవలు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులకు రిఫర్ చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేని వైద్య సేవల విషయంలో మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ప్రభుత్వ ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం అంతులేని జాప్యం నెలకొంది. తొలి దశలో భాగంగా 2016 డిసెంబర్ 17న హైదరాబాద్లోని ఖైరతాబాద్లో మొదటి వెల్నెస్ సెంటర్ను, 2017 ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో రెండో సెంటర్ను ఏర్పాటు చేసిన సర్కారు... మిగిలిన జిల్లాల్లో డిసెంబర్లోగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఏవీ మొదలుకాలేదు. మరో రెండు నెలల్లో అన్ని పాత జిల్లాల కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా గడువులోగా వాటి ఏర్పాటు ప్రక్రియ ముగిసే అవకాశాలు కనిపించట్లేదు. ఉన్న రెండు సెంటర్లలో విపరీతమైన రద్దీ రాష్ట్రంలో ప్రస్తుతం రెండే వెల్నెస్ సెంటర్లు ఉండడంతో ఈ కేంద్రాలకు వచ్చే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఖైరతాబాద్, వనస్థలిపురం వెల్నెస్ సెంటర్లకు రోజూ కనీసం 1,500 మంది చొప్పున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్నారు. దీంతో వైద్యుల అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే వైద్యులకు పరీక్షల నివేదికలను చూపి అవసరమైన మందులను పొందడం మరింత ఆలస్యమవుతోంది. ఈ రెండు సెంటర్లలో ఇప్పటివరకు 2,40,517 మందిని వైద్యులు పరీక్షించి వారిలో 1,33,046 మందికి ఉచితంగా మందులు ఇచ్చారు. 25,221 మందిని చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు పంపించారు. -
మరో మూడేళ్లు మెడికల్ రీయింబర్స్మెంట్ !
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, పింఛన్దారులకు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని మరో మూడేళ్లు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి గడువు ఈ నెల 31తో ముగియనుండగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. సుమారు 14 కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్కార్డుల అమలుపై స్తబ్ధత కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement