-
విద్యార్థిని ఆచూకీ లభ్యం
హైదరాబాద్: చదువుపై ఆసక్తి లేదని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన ఓ విద్యార్థిని ఆచూకీ లభించింది. మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్రావు వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలం అడ్డగుంటపల్లికి చెందిన శ్రీనివాస్ కుమార్తె సాయిప్రజ్వల(17) హైదరాబాద్ శివారులోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. ఈ నెల 10న సాయిప్రజ్వల కాలేజీలో ఉన్నప్పుడు నీరసంగా కనిపించింది. ప్రిన్సిపాల్ పిలిచి ‘ఎందుకు డల్గా ఉన్నావు’అని అడగగా నాకు చదువుకోవాలని లేదని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తండ్రి శ్రీనివాస్ బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని చెంగిచర్ల వెంకటసాయి నగర్ కాలనీలో ఉండే సాయిప్రజ్వల మామ లక్ష్మీనారాయణకు తీసుకుని రమ్మని చెప్పారు. 10వ తేదీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయానే సాయిప్రజ్వల ఇంట్లో ఉత్తరం రాసి 11.30 గంటల నుంచి కనిపించకుండా పోయింది. పది రోజులుగా నాలుగు టీంలుగా ఏర్పడి ముమ్మరంగా గోదావరిఖని, తిరుపతి, ఖమ్మం, హైదరాబాద్ నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్, ఇమ్లీబన్, మహాత్మాగాంధీ బస్స్టేషన్, జూబ్లీ బస్స్టేషన్ల్లో గాలించారు. చివరకు గురువారం రాత్రి పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని ఉప్పల్ డిపో వద్ద ఉన్న ఆరాధ్య లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఆచూకీ లభ్యమైంది ఇలా...: ప్రజ్వల కేసును పోలీసులు ఓ ఫోన్ కాల్ సమాచారం ద్వారా ఛేదించారు. మేడిపల్లి పోలీసులు 4 టీంలుగా ఏర్పడి నగరంతోపాటు తిరుపతి, గోదావరిఖని, ఖమ్మంలలో గాలించినా చిన్న క్లూ కూడా దొరకలేదు. చివరికి అమ్మాయి స్నేహితులకు, బంధువుల ఫోన్స్ సీఆర్ డాటా పరిశీలించారు. ఆరాధ్య లేడీస్ హాస్టల్ నుంచి ఓ అమ్మాయి మొబైల్ తీసుకుని ఓ ఫోన్కు తరుచుగా కాల్ చేస్తోంది. పోలీసులు ఆ డేటా ఆధారంగా ఫోన్ లొకేషన్ను బట్టి ఉప్పల్ డిపో పరిసర ప్రాంతంలో ఉన్న లేడీస్ హాస్టళ్లన్నింటినీ పరిశీలించారు. చివరికి ఆరాధ్య లేడీస్ హాస్టల్లో దొరికింది. -
పగలు ఆటోడ్రైవింగ్ రాత్రిళ్లు అఘాయిత్యాలు
* గ్యాంగ్రేప్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు * వెలుగు చూస్తున్న అరాచకాలు సాక్షి, హైదరాబాద్: మృగాళ్ల ఆగడాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఒంటరి మహిళలను నమ్మిం చి ఆటోల్లో తీసుకువెళ్లి అఘాయిత్యాలకు పాల్ప డుతుంటారు. పగలంతా ఆటోలు నడపడం, రాత్రిళ్లు అసాంఘికచర్యలకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్ల అకృత్యా లు బయటపడుతున్నాయి. భర్త, మరిదితో కలిసి కూలీ కోసం ఆటోలో వెళ్తున్న మహిళపై హైదరాబాద్ శివారులోని నారపల్లి సమీపంలో ఐదుగురు ఆటోడ్రైవర్లు గ్యాంగ్రేప్కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని మేడిపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు రవి (22)ని గురువారం అరెస్టు చేశారు. రెండు రోజులుగా పరారీలో ఉన్న రవిని విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఆటోఅడ్డా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు రెక్కీ..: నారపల్లికి చెందిన ఇమ్ము అలియాస్ అక్రమ్ (22), అబ్బాస్ (24), జుబేర్(22), ఘట్కేసర్కు చెందిన షెహనాజ్ (20), ఫిర్జాదిగూడకు చెందిన సి.రవి(22) ఆటోడ్రైవర్లే. ఉప్పల్ నుంచి ఘట్కేసర్, ఎల్బీ నగర్లకు షేరింగ్ ఆటోలు నడిపిస్తుంటారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వీరంతా ఉప్పల్లో కలుసుకుంటారు. విందులతో జల్సా చేస్తారు. రాత్రి 11 గంటలకు ఉప్పల్ బస్టాండ్కు వచ్చి ఒంటరి మహిళను టార్గెట్ చేస్తుంటారు. షెహ నాజ్ గుర్తించి మిగతా డ్రైవర్లకు సెల్ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని ఆ మహిళను నమ్మించి ఆటోలోకి ఎక్కిస్తారు. ఆ తరువాత వీరు మేడిపల్లి దాటిన తరువాత అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గ్యాంగ్రేప్లకు పాల్పడుతుంటారు. తాజా ఘటనలో గిరిజన మహిళ తన భర్త, మరిదితో కలిసి ఘట్కేసర్ వెళ్లే షేరింగ్ ఆటో ఎక్కింది. అప్పటి వరకు ఈ ముగ్గుర్ని గమనిస్తున్న నిందితులు ఆ మహిళ ఎక్కిన ఆటోను తమ ఆటోలో అనుసరించారు. బాధితులున్న ఆటోను ఓవర్టేక్ చేస్తూ వెకిలిచేష్టలతో నిందితులు ఇబ్బంది పెట్టారు. నారపల్లి ప్రాంతంలో మహిళను, ఆమె భర్త, మరిదిని నడిరోడ్డు మీద దించి ఆటోవాలా వెళ్లిపోయాడు. నిందితులు ఆ మహిళను బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement