-
జీఎంఆర్కు ‘ఫిలిప్పీన్స్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను జీఎంఆర్ ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించి అందిన ఫిర్యాదుపై ఫిలిప్పైన్స్లోని మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంసీఐఏఏ), అలాగే విమానాశ్రయ ఆపరేటర్ జీఎంఆర్ మెగావైడ్ సెబూ ఎయిర్పోర్ట్ కార్ప్ (జీఎంసీఏసీ) అధికారులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైనట్లు ఆ దేశ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్బీఐ) తెలిపింది. ఈ ఫిర్యాదు విషయంలో న్యాయశాఖ అధికారుల ముందు తమ యాంటీ–ఫ్రాడ్ విభాగం ఆరోపణలు దాఖలు చేసినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు ఫిలిప్పైన్స్కు చెందిన ఎంసీఐఏఏ ఉన్నత స్థాయి అధికారులు, జీఎంఆర్ గ్రూప్నకు చెందిన కొందరితోసహా పదకొండుమంది విదేశీయులు ఉన్నారని ఎన్బీఐ ఇటీవల ఒక ప్రకటన తెలిపింది. ఎన్బీఐ తెలిపిన వివరాల ప్రకారం ఐర్లాండ్, ఘనాలకు చెందిన వారూ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన కేసులో ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను జీఎంఆర్ ప్రతినిధి నిరాధారమైనవిగా పేర్కొన్నారు. కేసు నుంచి బయటపడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చట్టం ఏం చెబుతోందంటే.. ఫారిన్ ఈక్విటీ విషయంలో నియంత్రణలు, జాతీయీకరణ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనలను తీసుకువచ్చింది. మోసపూరిత ఒప్పందాలు, అవగాహనలను ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తోంది. కేసు వివరాల్లోకి వెళితే... అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన జీఎంఆర్, ఫిలిప్పీన్స్ మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కన్సార్షియంకు 2014లో విమానాశ్రయ కాంట్రాక్ట్ దక్కింది. నిర్మాణం, అభివృద్ధి, ఆధునికీకరణ, విస్తరణ, నిర్వహణకు సంబంధించి 25 సంవత్సరాల పాటు సేవలకుగాను 320 మిలియన్ డాలర్లకు ఈ కాంట్రాక్టును కన్సార్షియం దక్కించుకుంది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఫిలిప్పీన్స్ యాంటీ–డమ్మీ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు తాజాగా మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై న్యాయశాఖ అధికారుల ముందు ఫిర్యాదు దాఖలైంది. అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకూ న్యాయ విభాగం నుంచి జీఎంసీఏసీకి సమాచారం లేదు. మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ జనరల్ మేనేజర్ ఒకరిని ఈ ఆరోపణలపై ఇటీవలే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం. నిజానికి ఈ కాంట్రాక్ట్ కన్సార్షియంకు దక్కడంపై 2014లోనే ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అన్ని పత్రాలూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2016లో ఈ పిటిషన్ను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే విషయాన్ని తన తాజా ప్రకటనలో జీఎంఆర్ ప్రతినిధి ప్రస్తావిస్తూ.. ఈ కాంట్రాక్ట్ పక్రియ మొత్తం చట్టాలకు అనుగుణంగా ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పునర్నిర్మాణానికి ఓకే... ప్రతిపాదిత పునర్నిర్మాణ ప్రక్రియకు ఎక్సే్ఛంజీల అనుమతి లభించినట్టు జీఎంఆర్ ఇన్ఫ్రా (జీఐఎల్) సోమవారం తెలిపింది. పునర్నిర్మాణంలో భాగంగా ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ సర్వీసెస్ విభాగాలను జీఐఎల్ నుంచి విడదీసి జీఎంఆర్ పవర్, అర్బన్ ఇన్ఫ్రాకు బదిలీ చేస్తారు. జీఐఎల్ పూర్తి స్థాయి ఎయిర్పోర్ట్ వ్యాపార సంస్థగా కార్యకలాపాలు సాగిస్తుంది. ఎయిర్పోర్టుల వ్యాపారాన్ని విడిగా లిస్ట్ చేయనున్న ట్టు ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ వెల్లడించింది. (చదవండి: ‘మహీంద్రా’ శాంగ్యాంగ్ దివాలా) -
ఐపీవోకి జీఎంఆర్ ఎయిర్పోర్ట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ వ్యాపారాన్ని విభజించి పబ్లిక్ ఇష్యూ జారీ చేసే యోచనలో జీఎంఆర్ ఇన్ఫ్రా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా కనీసం రూ.2,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ పబ్లిక్ ఇష్యూ బాధ్యతను సిటీగ్రూపు, జేపీమోర్గాన్, యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్సీలకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జీఎంఆర్ అధికారులను సంప్రదించగా, ఇవి పూర్తిగా ఊహాగానాలని, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీఎంఆర్ ఇన్ఫ్రా దేశంలో న్యూఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్టులతో పాటు, టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టును నిర్వహిస్తోంది. జీఎంఆర్ ఇన్ఫ్రాకి చెందిన విద్యుత్, ఇన్ఫ్రా వంటి అన్ని విభాగాలు భారీ నష్టాలను అందిస్తే ఎయిర్పోర్టు వ్యాపారం లాభాలను కురిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జీఎంఆర్ ఎయిర్పోర్టు విభాగం రూ. 125 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం కూడా రూ.2,792 కోట్ల నుంచి రూ.2,870 కోట్లకు పెరిగింది. జీఎంఆర్ చేతికి ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్ రూ.2,500 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేయనున్న ఫిలిప్పీన్స్లోని మక్టన్- సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బిడ్డింగ్లో తమ కన్సార్టియం అగ్రస్థానంలో నిలిచినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది. మెగావైడ్ కార్పొరేషన్తో కలిసి ఈ బిడ్డింగ్లో పాల్గొన్నామని, గురువారం బిడ్డింగ్లు తెరిచి చూడగా తాము మొదటి స్థానంలో నిలిచినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాని ఈ సమాచారం ఇంకా అధికారికంగా అందాల్సి ఉందన్నారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
- Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
- పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
- తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
- అబద్ధాల మోదీ
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
Advertisement