-
జుట్టుకు హెన్నా పెడుతున్నారా?ఈ తప్పులు అస్సలు చేయకండి
మెహందీలో ఇవి కలిపితే... ►జుట్టుకు మెహందీ పెట్టుకునేటప్పుడు అరటిపండుని కలిపితే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మాడు దురదను తగ్గిస్తాయి. అరటిపండుని మెత్తగా చిదుముకుని మెహందీలో వేసి కలపాలి. ఈ మెహందీని జుట్టుకి పట్టించి గంట తరువాత కడిగేయాలి. ► కొబ్బరిపాలను కొద్దిగా వేడి చేసి కొన్ని చుక్కలు ఆలివ్ ఆయిల్ను వేసి కలపాలి. ఈ పాలను మెహందీలో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే... కొబ్బరి పాలలోని లారిక్ ఆమ్లం మంచి యాంటీబయోటిక్గా పనిచేసి, మాడు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. కండీషనర్స్, షాంపులలో కొబ్బరిపాలను వాడతారు. ఇలా మెహందీలో కొబ్బరిపాలు కలపడం వల్ల మెహందీ మంచి కండీషనర్గా పనిచేస్తుంది. ►టేబుల్ స్పూను హెన్నా, టేబుల్ స్పూను ముల్తానీ మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని తలలో బాగా దురదపెడుతోన్న భాగంలో రాసి, అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. హెన్నా రాసేముందు ఈ తప్పులు చేస్తున్నారా? మెహందీ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పెట్టాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. మెహందీని అప్పటికప్పుడు కలుపుకోకుండాముందు రోజు రాత్రే కనీసం 4-5 గంటల పాటు స్టోర్ చేసుకోవాలి. ఇక హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే, అంత బాగా జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు.కానీ, ఇలా ఎక్కువ సేపు ఉంచితే, హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుంది. జుట్టు విపరీతంగా పొడిగా మారుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి 1-2 గంటలకు మించి పెట్టరాదు. చాలామంది పొడి జుట్టు మీదే మెహందీని పెడుతుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. దీని వల్ల జుట్టు మరింత డ్రైగా కనిపిస్తుంది. రంగు కూడా బాగా కనిపించదు. దీని కోసం, ముందుగా హెయిర్ కండీషనర్ని వాడండి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. దీనివల్ల జుట్టు పొడిగా మారదు. అలాగే, మెహందీని అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్య ఉండదు. కొంతమందికి హెన్నా పడకపోవచ్చు. కానీ, ఇది జుట్టు రాలడం, అలెర్జీలకు దారితీయవచ్చు. అందువల్ల,జుట్టుకు రాసేముందే కాస్తంత హెన్నాను తీసుకొని చర్మంపై రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మెహందీ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కొందరు వారం రోజులకు ఒకసారి కూడా పెడుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. హెన్నాను నెలకు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. అతిగా వాడొద్దు. -
హీరోయిన్ అంజలి పెళ్లి కుదిరిందా? మెహందీ ఫోటోలు వైరల్
పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్లో కంటే కోలీవుడ్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.విభిన్నమైన పాత్రలతో తమిళంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో సినిమాలతో పాటు వెబ్సిరీస్లతోనూ ఆకట్టుకుంది. ఇక అంజలి సినిమాల విషయం పక్కనపెడితే కొంతకాలంగా ఆమె పెళ్లిపై పలు వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మెహిందీ ఫోటోలను అంజలి షేర్ చేయడంతో ఆమె పెళ్లి వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను ఎప్పటికప్పుడు పంచుకునే అంజలి తాజాగా కొన్ని మెహందీ ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అంజలికి పెళ్లి కుదిరిందా అని చర్చిస్తున్నారు. అయితే ఆ ఫోటో అంజలి మెహేంది ఫంక్షన్ కి సంబంధించినవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.తమిళ కొత్త సంవత్సరం కావడంతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన అంజలి ఇలా తన మెహందీ ఫోటోలను పంచుకుంది. దీనికి క్యాప్షన్ కూడా ఇవ్వడంతో అంజలి పెల్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
మనోజ్ మెహందీ ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మీ!
మంచు వారింట పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. రేపు(మార్చి3)న వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం. మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే మనోజ్-మౌనికల వివాహం జరగనుందట. ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా నేడు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. మనోజ్ పెళ్లి బాధ్యతను తనపై వేసుకొని దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తుంది. -
పెళ్లి కూతురు చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చే బ్రేస్లెట్ రింగ్!
పెళ్లి కూతురు అలంకరణలో రకరకాల మోడల్స్లో ఉన్న బ్రేస్లెట్ రింగ్స్ మెహెందీ చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఇక గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ వేడుకల్లో స్టైలిష్ డ్రెస్లకు మరింత స్టైలిష్ లుక్నిస్తున్నాయి ఈ బ్రేస్లెట్ రింగ్స్. అమ్మాయిల అలంకరణలో ప్రతిదీ ప్రత్యేకతను నింపుతుంది. అందమైన దుస్తులే కాదు ఆభరణాలూ అంతే ఘనంగా ఉండాలనుకుంటారు. ఏ వేడుక అయినా మెడలో హారాలు, కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు మ్యాచింగ్గా ఎంపిక చేసుకుంటుంటారు. బంగారు, వెండి లేదా ఫ్యాన్సీ ఆభరణాలను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు. వీటిలో బ్రేస్లెట్ రింగ్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ముంజేతిని చుట్టేసే బ్రేస్లెట్... దాని నుంచి వేలి ఉంగరానికి జత చేస్తూ ఉన్నట్టుగా ఉండే ఈ మోడల్స్ చేతులను మరింతగా హైలైట్ చేస్తున్నాయి. పూసలు వరసలు... ఇవి సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతున్నాయి. అంటే, సంప్రదాయ వేడుకల సమయాల్లో వీటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్బీడ్స్ వరసతో ఈ అల్లికను గమనించవచ్చు. రత్నాల రాశులు... నవరత్నాలు, డైమండ్స్ పొదిగిన బ్రేస్లెట్ రింగ్స్ పెద్ద పెద్ద వేడుకల్లో మరింత గ్రాండ్గా వెలిగిపోతున్నాయి. బంగారు హంగు... బంగారు తీగెలతో రూపుకట్టిన ఈ ఆభరణం. ఇటు సంప్రదాయ, అటు స్టైలిష్ వేర్లా కూడా పార్టీకి తగిన హంగును తీసుకువస్తుంది. వెండి జిలుగులు... వెండి జిలుగుకు పెద్ద పెద్ద స్టోన్స్ జత కలిసిన బ్రేస్లెట్ రింగ్స్ మోడర్న్ ఔట్ఫిట్స్కు స్టైలిష్ లుక్ని ఇస్తున్నాయి. ఇవి ఏ కాలమైనా యూత్ని మెప్పిస్తూనే ఉన్నాయి. -
మెహందీ పెట్టడానికి వెళ్తూ మృత్యువాత
తూర్పు గోదావరి: ఓ శుభకార్యంలో మెహందీ పెట్టడానికి అమలాపురం వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన ఎల్లే రత్నమాల (19), రాజమహేంద్రవరానికి చెందిన తమ్మనబోయి సుధారాణి స్నేహితులు. వీరు శుభకార్యాల్లో మేకప్, మెహందీ పెట్టడం చేస్తూంటారు. ఇదే క్రమంలో ఆలమూరు మండలం మోదుకూరుకు చెందిన మరో స్నేహితుడు కట్టుంగ కాశీతో కలిసి మోటార్ సైకిల్పై రాజమహేంద్రవరం నుంచి అమలాపురం మెహందీ పెట్టేందుకు శుక్రవారం బయలుదేరారు. కాశీ మోటార్ సైకిల్ నడుపుతూండగా.. ఇద్దరు యువతులూ వెనుక కూర్చున్నారు. జాతీయ రహదారిపై రావులపాలెం సీఐ కార్యాలయం వద్ద ఉన్న వంతెన మీదకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రత్నమాల కింద పడిపోయింది. తల పైనుంచి లారీ చక్రాలు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సుధారాణి ఎడమ చేతికి గాయమైంది. కాశీ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని రావులపాలెం ఎస్సై ఎం.వెంకట రమణ పరిశీలించారు. రత్నమాల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రత్నమాల పేరవరానికి చెందిన వీర్రాజు, నాగమణి దంపతుల కుమార్తె. వీర్రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం అయ్యింది. వీర్రాజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బతుకుతెరువు కోసం నాగమణి మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె రత్నమాల మెహందీ, మేకప్లు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఆమె ఈ ప్రమాదంలో మరణించడంతో తండ్రి వీర్రాజు దుఃఖానికి అంతు లేకుండా పోయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement