-
'నేనేం విసిరిపారేసే చెప్పును కాదు'
బెంగళూరు: తానేం తగిలించుకొని విసిరిపారేసే చెప్పులాంటివాడిని కాదని ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత అంబరీష్ అన్నారు. తన పాపులారిటీ తనకు ఉందని అన్నారు. అంబరీష్ తో సహా 14మంది మంత్రులను తొలగించి కొత్తగా 13మందిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్లుగా గృహనిర్మాణ శాఖ నిర్వహిస్తున్నా అందులో ఎలాంటి అభివృద్ధి చూపించలేకపోయారనే కారణంతో ఆయనను తొలగిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, తనను మంత్రి పదవి నుంచి తప్పించడానికి నిరసనగా అంబరీష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ లేఖ సరైన ఫార్మాట్లో లేదని తిరిగి పంపించాలని స్పీకర్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను తొలగిస్తున్న విషయం కూడా ముందుగా ముఖ్యమంత్రి చెప్పలేదని అన్నారు. తానేం తగిలించుకుని విసిరిపారేసే చెప్పును కాదని, తన పాపులారిటీ తనకు ఉందని అన్నారు. కాగా, ఇప్పటికే ఆయనకు మద్దతుగా మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమ తమ గొంతు వినిపిస్తున్న విషయం తెలిసిందే. -
కిరణ్ విధేయులెక్కడ?
పదవులు అంటిపెట్టుకుని కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి అమాస గుడ్బై డీసీసీబీ చైర్మన్గా కొనసాగుతానని స్పష్టీకరణ పెదవి విప్పని వెంకటరమణ, జీవీ శ్రీనాథరెడ్డి, ఇంతియాజ్ అహ్మద్ సాక్షి, తిరుపతి: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన తరువాత కిరణ్కుమార్రెడ్డికి విధేయులెవరన్నది స్పష్టం కావడం లేదు. చాలామంది పదవీ కాంక్షతో ఊగిసలాట ధోరణి అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సంక్రమించిన పదవులు త్యజించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరికొందరు పదవిలో కొనసాగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీ పదవులకు రాజీనామాలు ప్రకటిస్తున్న వారు అధికారిక పదవుల విషయానికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నా రు. కిరణ్కు సంఘీభావంగా గురువారం డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి సహా కొందరు పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీ నామా చేయగా మరికొందరు చడీచప్పుడు లేకుండా జారుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డి దయాదాక్షిణ్యాలతో పదవులు పొందిన వారు ఇప్పుడు పెదవి విప్పడం లేదు. ఒకరిద్దరు మినహాయిస్తే ఎమ్మెల్యే స్థాయి కలిగిన ప్రథమ శ్రేణి నాయకులు ఇప్పటికే కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కాలంలో పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవస్థానాల ట్రస్ట్బోర్డు నియామకాలను కిరణ్ జరిపారు. వారెవరూ ఇప్పుడు పదవులు వదులుకునేందుకు సిద్ధం కావడం లేదు. వారం రోజుల కిందట తుడా చైర్మన్గాను ఆ తరువాత టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగాను నియమితులైన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ వంటివారు ఈ కోవలోకి వస్తారు. నిజానికి ఈయన తన పదవులకు కూడా రాజీనామా చేస్తారని బుధవారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తెల్లారేసరికి ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. అధికారం ఉన్నన్నాళ్లు ఆయన వెంట ఉన్నవారు ఇప్పుడు కిరణ్ పేరు చెబితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎంగా కిరణ్కుమార్రెడ్డి పట్టుదలతో సమాచార కమిషనర్గా నామినేట్ చేసిన ఇంతియాజ్ అహ్మద్, టీటీడీ ట్రస్ట్బోర్డు సభ్యుడిగా నియమితులైన జీవీ.శ్రీనాథరెడ్డి ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. తిరుపతి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం, కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళి తదితరులు కూడా ఎక్కడా కనిపించలేదు. కిరణ్ రాజీనామాపై వారి అభిప్రాయం కూడా వెల్లడించేందుకు ముందుకు రావడం లేదు. ఏడాది వ్యవధిలో జరిగిన సహకార సంఘాలు, పంచాయతీ ఎన్నికల్లో కిరణ్కుమార్రెడ్డి సహకారంతో గెలుపొందినవారు కూడా ఇప్పుడు పదవులు వదులుకునేందుకు నిరాకరిస్తున్నారు. తాము ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందినందున పదవులు వదులుకోవాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అమాస రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. కొందరు సన్నిహితుల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో కిరణ్కుమార్రెడ్డి బాటలోనే నడుస్తామని మాత్రం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్కుమార్రెడ్డికి విధేయులెవరన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయనిపిస్తోంది. పీలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో మొత్తం 62 మంది సర్పంచ్లు, సింగిల్విండో డెరైక్టర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్నిబట్టి కిరణ్కుమార్రెడ్డి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారని చెప్పకతప్పదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement