-
భూ రికార్డుల సమగ్ర వివరాలు ‘మీ సేవలో’
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం సవరించిన సమగ్ర రికార్డులను ‘మీసేవ’లో అందుబాటులో ఉంచుతున్నట్టు ధరణి ప్రత్యేకాధికారి రజత్కుమార్ సైనీ తెలిపారు. ‘మా భూమి ఏమైపోయిందో’ శీర్షికన రాష్ట్రంలోని భూ రికార్డులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో రికార్డుల్లో తమ భూమి ఎవరి పేరు మీద ఉందోననే ఆందోళనలో రైతాంగం ఉందని ‘సాక్షి’ ఈ నెల 23న కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు సమగ్ర భూ రికార్డుల వివరాలను మీసేవ కేంద్రాల్లోకి అందుబాటులో కి తెచ్చారు. మీసేవలో నిర్దేశిత ఫీజు చెల్లించి పహాణి, ఆర్వోఆర్1–బీ రికార్డులను తీసుకోవచ్చని రజత్కుమార్ చెప్పారు. సవరించిన రికార్డులన్నింటినీ పబ్లిక్ డొమైన్లోకి అందుబాటులో కి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుం దని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణ పరిశీలన దశలో ఉందని, పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. -
ధ్రువీకరణ పత్రాలు పొందండిలా
నిడమర్రు: విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్మెంట్ పొందేందుకు, కళాశాల, పాఠశాలల్లో ప్రవేశాలకు, పోటీ పరీక్షల దరఖాస్తులకు వివిధ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ నుంచి జారీ అయ్యే ఈ పత్రాల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ శాఖ అధికారులు (వీర్వో/ఆర్ఐ) ఇచ్చిన నివేదిక ఆధారంగా తహసీల్దార్ ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. వాటిని తిరిగి మీ సేవ కేంద్రాల నుంచి మాత్రమే పొందాలి. ఈ వివరాలు మీ కోసం.. దరఖాస్తు చేసుకుంది మొదలు జారీ వరకూ దరఖాస్తుతోపాటు ఆన్లైన్లో పొందుపరిచిన సెల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. అధికారులు విచారణ చేసి జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు బి–కేటగిరిలోకి వస్తాయి. బి–కేటగిరి పత్రాలు పొందాలంటే సర్వీస్ చార్జి కింద రూ.35 చెల్లించాలి. రూ 35 మించి వసూలు చేస్తే మీ సేవ కేంద్రం నిర్వాహకులపై ఫిర్యాదు చేయవచ్చు. ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఒక వ్యక్తి / కుటుంబ ఆదాయాన్ని అధికారికంగా ధ్రువీకరించి జారీ చేసే పత్రం. మీ సేవ కేంద్రంలో దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు/ ఓటరు గుర్తింపు కార్డు/ ఆధార్ కార్డు నకలు, ప్రభుత్వ/ ప్రై వేట్ ఉద్యోగులు/వ్యాపారులు ఆదాయ పన్ను రిటర్న్ కాపీ నకలు జతచేయాలి. నివాస ధ్రువీకరణ పత్రం .. పౌరుడు గ్రామం/టౌన్/వార్డులో శాశ్వత నివాసం ఉన్నట్లుగా నిర్ధారిస్తూ జారీ చేసే ధ్రువీకరణపత్రం (నివాస స్థలం లేదా పర్మినెంట్ ఉద్యోగస్తులకు).ఈ ధ్రువపత్రాలు రెండు రకాలుగా జారీ చేస్తారు. ఒకటి సాధారణం, రెండోది పాస్పోర్ట్ సేవలు పొందేందుకు. మీ సేవలో ఇచ్చిన దరఖాస్తుతోపాటు రేషన్/ఓటరు/ఆధార్ కార్డు నకలు.రేషన్/ ఆధార్/ ఓటరు కార్డు లేని వారికి వారు నివాసముంటున్న ఇంటి పన్ను/టñ లిఫోన్/విద్యుత్ బిల్లు, ఫొటో (పాస్పోర్ట్ సేవలు కోసం తప్పనిసరి) జతచేయాలి. ఇంటిగ్రేటెడ్ ధ్రువీకరణ పత్రం ..విద్యా/ ఉద్యోగ సంబంధిత దరఖాస్తులకు అవసరమైన కులం, నివాసం, జనన తేదీ కలిపి ఒకే పత్రంలో పొందుపరిచి జారీ చేసేది ఇంటిగ్రేటెడ్ ధ్రువీకరణ పత్రం. దరఖాస్తుతోపాటు దరఖాస్తుదారుని కుటుంబ సభ్యుల కుల ధ్రువీకరణ పత్రం, ఎస్ఎస్సీ సర్టిఫికెట్/ టీసీ/ 1 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికెట్/మునిసిపాలిటీ లేదా పంచాయతీ జారీ చేసి జనన ధ్రువీకరణ పత్రం జతచేయాలి. ఓబీసీ ధ్రువీకరణ పత్రం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న కుల రిజర్వేషన్ పొందేందుకు అధికారులు ఓబీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు /ఓటరు / ఆధార్ కార్డు, దరఖాస్తుదారుని తండ్రి/తల్లి సంపద వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ట్యాక్స్ పరిధిలో ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు ఐటీ రిటర్న్ కాపీ జతచేయాలి. ఈబీసీ ధ్రువీకరణ పత్రం.. ఆర్థికంగా వెనకబడిన ఓసీలు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న కులాలలతో సమానంగా గహ నిర్మాణ, స్థలం తదితర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు ఈబీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు/ఓటరు/ ఆధార్ కార్డు నకలు సమర్పించాలి. –––––––––––––––––– ధ్రువీకరణ పత్రం సర్వీస్ కాల ఒప్పందం మొదటిసారి ఆదాయ ఏడు రోజులలోపు నివాస ఏడు రోజులు లోపు ఇంటిగ్రేటెడ్ 30 రోజుల్లోపు ఓబీసీ 30 రోజుల్లోపు ఈబీసీ ఏడు రోజులలోపు ––––––––––––– పైన సూచించిన ఒప్పంద కాలంలో ధ్రువీకరణ పత్రం జారీ చేయడం లేదా జారీ చేయకపోవడానికి కారణాలను దరఖాస్తుదారునికి తెలియజేయాలి. లేకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు నిలిచి జారీకి ఆలస్యమైన కారణం సహేతుకం కాకపోతే సంబంధిత ఉద్యోగి జీతం నుంచి జరిమానాగా ఉన్నత అధికారులు కోత విధిస్తారు. -
రెండు రోజులపాటు వెబ్సైట్లకు అంతరాయం
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలకు అంతరాయం ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో రవాణా శాఖ వెబ్సైట్లో మార్పులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక వెబ్సైట్లను రూపొందిస్తోంది. దాంతో మార్పుల కారణంగా రేపు, ఎల్లుండి ఆ శాఖ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు వెబ్సైట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాఏ మీసేవా వెబ్సైట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement