-
ఆ హీరోయిన్ పారితోషికం కేవలం 11 రూపాయలు!
ముంబై: ‘‘ఫ్లైయింగ్ సిఖ్’’గా ప్రసిద్ధి పొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫరాన్ అక్తర్, సోనం కపూర్కు మంచి గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడమే అదృష్టంగా భావించిన నటీనటులు.. నామమాత్రపు పారితోషికం తీసుకున్నారు. సోనం సైతం కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుందట. భాగ్ మిల్కా భాగ్ డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. త్వరలో విడుదల కానున్న ‘‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’’లో సోనంపై ప్రశంసలు కురిపించిన రాకేశ్ ఓంప్రకాశ్.. ‘‘ఇది లవ్స్టోరీ కాదు అని సోనంకు ముందే తెలుసు. బాల్యంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తి కథ ఇది. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించేందుకు సోనం వెంటనే ఒప్పుకొంది. సినిమాలో తను భాగం కావాలని నిర్ణయించుకుంది. అప్పటికే ఢిల్లీ-6 సినిమాలో మేం కలిసి పనిచేశాం. మా మధ్య అప్పటి నుంచి అనుబంధం ఉంది. భాగ్ మిల్కా భాగ్ గురించి చెప్పగానే తనకు 7 రోజుల సమయం కావాలని అడిగింది. కేవలం 11 రూపాయలు తీసుకుని బీరో పాత్ర పోషించింది. తన మనసు చాలా మంచిది’’ అని పేర్కొన్నాడు. కాగా 2013లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో మిల్కాసింగ్ ఇష్టసఖి పాత్రలో సోనం నటించింది. చదవండి: ఆచార్య షూటింగ్ పూర్తి.. వైజాగ్లో చికిత్స తీసుకుంటున్న మెగాస్టార్! -
ఒక్క రోజులో 86 లక్షలకు పైగా టీకాలు వేసి చరిత్ర సృష్టించాం: మోదీ
ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'మన్ కీ బాత్' ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందని తెలిపారు. కరోనా వైరస్పై దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని మోదీ చెప్పారు. ఈ పోరాటంలో మనమంతా ఓ అసాధారణ విజయాన్ని సాధించామన్నారు. కొద్ది రోజుల క్రితం మునుపెన్నడూ లేని అద్భుతాన్ని మన దేశం సాధించిందన్నారు. జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఒక రోజులో ఇంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప రికార్డు అని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. తన తల్లి వయసు సుమారు వందేళ్ళు ఉంటుందని, ఆమె కూడా రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్పై మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. రోడ్ టు టోక్యో క్విజ్లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్లయింగ్ సిఖ్గా పేరుపొందిన మిల్కా సింగ్ను మోదీ గుర్తు చేసుకున్నారు. 1964లో దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొన్న మిల్కా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడని.. ఆ స్థాయి ప్రదర్శనతోనే దేశ మన్ననలు పొందాడని తెలిపారు. కరోనా కారణంగా ఒక లెజెండరీ అథ్లెట్ను కోల్పోవడం బాధాకరమని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్ -
Milkha Singh Love Story: ఆమె ప్రేమకై అతడి పరుగు
‘నాకొచ్చిన అన్ని ట్రోఫీల కన్నా గొప్ప ట్రోఫీ నా భార్య’ అని అనేవారు మిల్ఖా సింగ్. మిల్ఖా సింగ్, ఆయన భార్య నిర్మల్ కౌర్ 59 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు. తమ ప్రేమ కథను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఆ రోజుల్లోనే కొంత సాహసం చేశారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఎంతగా ఉండలేకపోయారంటే 5 రోజుల తేడాలో ఇద్దరూ మరణించారు. జూన్ 13న నిర్మల్. జూన్ 18న మిల్ఖా. మిల్ఖా సింగ్ మరణించాక అభిమానులు ఆయన ప్రేమ కథను గుర్తు చేసుకుంటున్నారు. ఈ జూన్ నెలలో భార్య నిర్మల్ కౌర్ కరోనాతో మరణించిన ఐదు రోజులకు మిల్ఖా సింగ్ కూడా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. బహుశా ఈ లోకం ఆయనకు నిరర్థకం అనిపించి ఉండవచ్చు ఆమె లేకుండా. తన భార్య నిర్మల్ను ఎవరికి పరిచయం చేసినా మిల్ఖా ‘నా గుండె చప్పుడు’ అని అనేవారు. ఆమె లేనప్పుడు ఆయన గుండె చప్పుడు ఆగిపోవడం ఆయన దృష్టిలో సహజమే కావచ్చు. భారతదేశానికి తన పరుగు తో విశేషమైన పేరు తెచ్చిన మిల్ఖా సింగ్ తన ప్రేమ కోసం కూడా బాగానే పరుగు తీశారు. 1960 లో మొదలైన ప్రేమ కథ 1962లో పెళ్లితో సుఖాంతమైంది. అతను స్టార్ ఆమె టీచర్ మిల్ఖాసింగ్, నిర్మల్ కౌర్ల పరిచయం 1958లో కొలంబోలో జరిగింది. ఆమె వాలీబాల్ ప్లేయర్. ఇతను అథ్లెట్. ‘అప్పుడు ఆమెతో కబుర్లు చెప్పాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు’ అంటారు మిల్ఖా. ఆ తర్వాత రెండేళ్లపాటు వాళ్లు కలవలేదు. ఢిల్లీలో 1960లో అక్కడి స్టేడియంలో ప్రాక్టీస్కు వెళ్లేవారు మిల్ఖా. అక్కడే స్కూల్ పిల్లలను ప్రాక్టీసు చేయిస్తూ నిర్మల్ వచ్చేవారు. ‘అక్కడ ఆమెను చూసి చాలా సంతోషించాను. రెండేళ్ల క్రితం చూసిన నిర్మల్కు ఇప్పటి నిర్మల్కు ఎంత తేడా. ఆమె ఇప్పుడు ఇంకా నిండుగా తయారైంది’ అని తన ఆత్మకథలో రాశారు మిల్ఖా. అయితే ఆయన బిడియపడుతూ ఉంటే ఆమే అతణ్ణి బలవంతం గా కాఫీకి పిలిచింది. ఆ తర్వాత వారు కలుసుకోవడం కొనసాగింది. ‘ఒకసారి నేను ఆమె కారులో వస్తూ ఉన్నాం. నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. ఆమెతో మాట్లాడుతూ కొంచెం పరధ్యానంగా ఉండటంతో కారు కంట్రోల్ తప్పింది. రోడ్డు మీద వెళుతున్న కొంతమందికి డాష్ ఇచ్చాను. ఒకామె గాయపడింది. అది పెద్ద గొడవ అయ్యింది ఆమె ఖర్చులన్నీ భరించి కొంత డబ్బు నేను ఇచ్చినా...’ అని రాశారు మిల్ఖా. వీరిద్దరూ కలిసి తిరగడం పత్రికలకు ఎక్కింది. కాని ఇరువురూ భయపడలేదు. మిల్ఖాసింగ్, నిర్మల్ కౌర్ల పెళ్లినాటి ఫొటో చండీగఢ్ నుంచి ఢిల్లీకి ఆ సమయంలోనే మిల్ఖా మిలటరీ ఉద్యోగానికి రిజైన్ చేసి చండీగఢ్లో పంజాబ్ స్పోర్ట్స్ అకాడెమీకి ఉద్యోగిగా వెళ్లారు. కాని ఢిల్లీలో టీచరుగా పని చేస్తున్న నిర్మల్ ఆయనకు బాగా గుర్తుకొచ్చేది. ప్రతి వీకెండ్ కారు డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీకి వచ్చి ఆమెను కలిసేవారు. కొన్ని నెలలకే నిర్మల్ కూడా చండీగఢ్కు షిఫ్ట్ అయ్యారు. ఆమె కూడా పంజాబ్ స్పోర్ట్స్ అకాడెమీ ఉద్యోగి అయ్యారు. దాంతో వీరి ప్రేమ కథ ఇరు ఇళ్లల్లో తెలిసిపోయింది. మిల్ఖా సిఖ్. నిర్మల్ హిందూ. నిర్మల్ ఇంట్లో ఈ పెళ్లి మొదట ఇష్టం కాలేదు. నాటి పంజాబ్ సి.ఎం ప్రతాప్ సింగ్కు నిర్మల్ తల్లిదండ్రులు ఈ ఉదంతం పై లేఖలు రాసేవారు. దాంతో ఆయన మిల్ఖాను పిలిచి ఒకరోజు బాగా ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మిల్ఖా ఆయనకు తమ ప్రేమ గురించి పూర్తిగా వివరించి చెప్పడంతో ఏకంగా సి.ఎం. రంగంలో దిగి ఇరు కుటుంబాల వారికి చెప్పి పెళ్లి జరిపించారు. 1962లో వీరి పెళ్లయ్యింది. మిల్ఖాకు, నిర్మల్కు ఎడం 9 ఏళ్లు. కొడుకు, కోడలు, మనవడితో మిల్ఖా దంపతులు ఆమె నా సర్వస్వం పెళ్లయ్యాక మిల్ఖా తన భార్యే తన సర్వస్వం గా భావించేవారు. ‘ఎప్పుడు మేము కారులో బయటకు వెళ్లినా ఆయనే డోర్ తెరిచి నిలుచునేవారు’ అంటారు నిర్మల్. ‘నేను మెట్రిక్యులేషన్ దాటలేదు. కాని నా నలుగురు పిల్లలు బాగా చదువుకున్నారు. అందుకు కారణం నిర్మల్’ అంటారు మిల్ఖా. వీరు ఒక పిల్లాడిని కూడా దత్తత తీసుకున్నారు. అతను మిలట్రీలో పని చేస్తూ 1999లో టైగర్ హిల్ బ్యాటిల్లో మరణించాడు. వీరి ఒక కుమార్తె న్యూయార్క్లో డాక్టర్ అయితే కుమారుడు జీవ్ మిల్ఖా ప్రొఫెషనల్ గోల్ఫర్. దేశ విభజన సమయంలో దాదాపు అనాథలా పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చి స్వశక్తితో పెరిగి సైన్యంలో చేరి అక్కడే పరుగు నేర్చి భారతదేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే క్రీడాకారుడైన మిల్ఖా ఆ పరుగుతో వచ్చిన జీవితాన్ని సఫలం చేసుకోవడంలో భార్య నిర్మల్ను భాగస్వామిగా చేసుకున్నాడు. ప్రేమ మొదలయ్యే ముందు అప్పటికే కీర్తి గడించిన మిల్ఖా సింగ్ను చూసి ‘నువ్వు స్థిరం ఎరగని తుమ్మెదవు. నేను ఒంటరి చెట్టును. ఈ చెట్టు గురించి నీకు గుర్తుంటుందా’ అన్నదట నిర్మల్. ఆ తుమ్మెద ఆ తర్వాత ఆ చెట్టునే అంటిపెట్టుకుని ఉండిపోవడమే ఈ ప్రేమలోని అందం. సుగంధం. – సాక్షి ఫ్యామిలీ -
Milka Singh: ‘ఫ్లయింగ్ సిఖ్’ అయ్యాడిలా...
పాకిస్తాన్ దిగ్గజ అథ్లెట్ అబ్దుల్ ఖాలిఖ్. అప్పట్లో ఆయనకు ఆసియాలోనే అత్యంత వేగవంతమైన రన్నర్గా పేరుంది. అంతటి పరుగు వీరుడ్ని అది కూడా వారి గడ్డమీదే ఓడించిన ఘనత మన సింగ్ది. 1960లో జరిగిన ఇండోృపాక్ స్పోర్ట్స్ మీట్లో 200 మీటర్ల పరుగులో మిల్కా అతన్ని ఓడించి పసిడి పట్టాడు. సింగ్ పరుగుకు ముగ్ధుడైన అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్... ‘ఫ్లయింగ్ సిఖ్’ బిరుదుతో మిల్కాను సత్కరించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మరో రెండు స్వర్ణాలు (400 మీ., 4్ఠ400 రిలే) సాధించాడు. 1964లో రిటైరైన మిల్కా ఆర్మీ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పంజాబ్ రాష్ట్రంలోనే క్రీడాధికారిగా ఉన్నత ఉద్యోగం చేశాడు. అతని జీవిత గాథతో బాలీవుడ్లో తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. -
జీవితంలో గెలిచి.. కరోనాపై ఓడి!
న్యూఢిల్లీ: ఫ్లైయింగ్ సిఖ్గా ప్రఖ్యాతిగాంచిన అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా అనంతర లక్షణాలతో శుక్రవారం కన్నుమూశారు. కేవలం ఐదు రోజుల ముం దే ఆయన భార్య నిర్మల్ కౌర్ను కరోనా రక్కసి బలితీసుకుంది. వీరిద్దరే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది దంపతులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వయోధికులే కాదు... నిండు నూరే ళ్లు కలిసి జీవించాల్సిన యువ దంపతులూ ఎంద రో మహమ్మారి వల్ల అర్ధాంతరంగా తనువు చాలిం చారు. దశాబ్దాల క్రితం ఒక్కటైనవారు మాత్రమే కాదు, కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం మరణించడంతో వారి కుటుంబాలకు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. వారాల వ్యవధిలో.. కొన్ని సందర్భా ల్లో రోజుల వ్యవధిలోనే దంపతులు తుదిశ్వాస విడి చిన సంఘటనలు ఉన్నాయి. దంపతుల్లో ఒకరి మరణం గురించి తెలిసి మరొకరు షాక్తో కన్ను మూసిన ఉదంతాలు బయటపడ్డాయి. ఇందుకు ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ కారణమని నిపుణులంటున్నారు. అనాథలైన 3,261 మంది చిన్నారులు! కరోనా వల్ల దేశంలో ఎంతమంది దంపతులు మరణించారన్న స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవు. అయితే, కరోనా కాలంలో దేశవ్యాప్తంగా 3,261 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారినట్లు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) అంచనా వేసింది. అయితే, ఇవి 18 ఏళ్లలోపు పిల్లల గణాంకాలే. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చావుబతుకుల్లోనూ కలిసే... రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనా బారినపడ్డారు. గుర్గావ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 20న చనిపోయారు. ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే శాంతి పహాడియా(87) కూడా కరోనా కారణంగా అదే ఆసుపత్రిలో మూడు రోజుల తర్వాత మృతిచెందారు. వారిద్దరికీ బాల్యంలోనే వివాహం జరిగింది. సుదీర్ఘకాలం కలిసి బతికిన పహాడియా దంపతులు దాదాపు ఒకేసారి స్వర్గానికి చేరుకున్నారని వారి కుమారుడు ఓంప్రకాశ్ పహాడియా కన్నీటిపర్యంతమయ్యారు. సీనియర్ జర్నలిస్టులు, దంపతులైన కల్యాణ్ బారువా, నీలాక్షి భట్టాచార్య కరోనా వల్ల గుర్గావ్ ఆసుపత్రిలో మే నెలలో మృతిచెందారు. పహాడియా దంపతుల తరహాలోనే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్లోని బికనీర్ పట్టణానికి చెందిన దంపతులు ఓంప్రకాశ్, మంజుదేవీ గత ఏడాది నవంబర్లో 15 రోజుల వ్యవధిలో చనిపోయారు. వారికి 40 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా రాకాసి కరోనాను మాత్రం జయించలేకపోయారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో నంజుండే గౌడ ఈ ఏడాది ఏప్రిల్ 30న మృతి చెందారు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు భార్య మమత గర్భవతి కావడంతో ఆనంద డోలికల్లో మునిగిపోయిన నంజుండే గౌడ సంతానాన్ని చూసుకోకుండానే కన్నుమూశారు. మే 11న భార్య మమత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మూడురోజులకే ఆమె కూడా కరోనాతో కన్నుమూసింది. పూర్తిగా కోలుకునేదాకా చెప్పొద్దు భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య.. భార్య మరణాన్ని భరించలేక భర్త గుండె పగిలి మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకి ఒకరు చనిపోతే ఆ సమాచారాన్ని మరొకరికి తెలియజేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండో వ్యక్తి పూర్తిగా కోలుకునేదాకా చావు కబురు చెప్పొద్దని అంటున్నారు. ఒక్కోసారి జీవన సహచరి/సహచరుడి మరణం గురించి తెలియకపోవడం సైతం ఎంతో మేలు చేస్తుందని ముంబైకి చెందిన సైకియాట్రిస్టు హరీష్ షెట్టి అన్నారు. అధిక ఒత్తిడి, తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్కు కారణమని గుర్గావ్ సైకియాట్రిస్టు జ్యోతి కపూర్ వెల్లడించారు. దశాబ్దాలపాటు కలిసి బతికిన దంపతుల్లో ఒకరి ఎడబాటు మరొకరికి అంతు లేని దుఃఖాన్ని కలిగించడం సహజమేనని పేర్కొన్నారు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని వివరించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేనివారు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్తో మరణిస్తుంటారని అన్నారు. భార్య ఆకస్మిక మరణం వల్ల భర్త మరణించే రిస్కు 18 శాతం, భర్త ఆకస్మిక మరణం వల్ల భార్య చనిపోయే రిస్కు 16 శాతం ఉంటుం దని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement