-
చిన్న హాబీయే, కానీ లక్షలు సంపాదించి పెడుతోంది
పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, ఆటలంటే చాలా ఇష్టపడే అమ్మాయి మాసూమ్ మీనావాలా మెహతా. అనుకోకుండా ఫ్యాషన్పై మక్కువ ఏర్పడడంతో.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లతో కలసి పనిచేస్తూ ఫ్యాషన్ బ్లాగర్, ఎంట్రప్రెన్యూర్గానే గాక ఇండియన్ లైఫ్స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తోంది. తన ఫ్యాషన్ స్టైల్స్తో సోషల్ మీడియాలో పదిలక్షలకు పైగా యూజర్లను ఆకట్టుకుంటోంది. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన మాసూమ్ మీనావాలా బాంబే స్కాటిష్ స్కూల్లో చదువుకుంది. స్కూల్లో ఆమెను అందరూ ‘టామ్బాయ్’ అని పిలిచేవారు. ఆటల్లో చురుకుగా ఉండే మాసూమ్ స్కూల్ పుట్బాల్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించేది. ఇంటర్మీడియట్లో ఉండగా ఫ్యాషన్పై ఆసక్తి కలిగింది. దీంతో తను రోజూ ఫ్యాషనబుల్గా రెడీ అయ్యి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టుచేసేది, కానీ∙ఫ్యాషన్ను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. బీకామ్ అయ్యాక, ఆర్ట్స్ కోర్సులో డిప్లామా చేసేందుకు చేరినప్పటికీ.. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో తరువాత బ్రాండ్ మార్కెటింగ్ ఇండియాలో ఇంటర్న్షిప్ చేసింది. ఆ తరువాత లండన్లోని ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫ్యాషన్ స్టైలింగ్లో డిప్లొమా చేసింది. ఈ సమయంలోనే ఫ్యాషన్ ప్రపంచం లో ఎదగాలని నిర్ణయించుకుంది. కోర్సు పూర్తయ్యాక ముంబై తిరిగి వచ్చి 2010లో ‘మిస్ స్టైల్ ఫియస్టా’ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ను ప్రారంభించి సరికొత్త ఫ్యాషన్ను పరిచయం చేసింది. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ఫ్యాషన్ ఇండియా లో దొరకడంలేదు. అంతర్జాతీయ ఫ్యాషన్ను ఇక్కడ పరిచయం చేయాలనుకుని స్టైల్ ఫియస్టాలో ఎక్కువ గా అంతర్జాతీయంగా ట్రెండ్ అవుతోన్న ఫ్యాషన్ను పరిచయం చేసేది. దాంతో అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్స్ ఇష్టపడేవారంతా ఫియస్టాను ఫాలో అయ్యేవారు. ఫాలోవర్స్తోపాటు ఆమె ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒకపక్క మిస్ స్టైల్ ఫియస్టా నడుపుతూనే మరోపక్క అంతర్జాతీయ ఫ్యాషన్, లగ్జరీ, బ్యూటీ, ట్రావెల్, లైఫ్స్టైల్ బ్రాండ్లపై డిజిటల్ కంటెంట్ను రూపొందించేది. జిమ్మీచూ, యవెస్ సెయింట్ లారియెంట్, డియోర్, హక్కాసన్, గుస్సి, స్టెల్లా మెక్కార్ట్నీ, జో మలోని, ఈస్టీ లాడర్, రా ప్రెసరీ వంటి బ్రాండ్లతో కలసి పనిచేసేది. మాసూమ్ ఫ్యాషన్స్టైల్, పనితీరు నచ్చిన వోగ్, కాస్మోపాలిటన్, సీఎన్ఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు అనేకసార్లు ఆమెను అభినందించాయి. సరికొత్త ఫ్యాషన్ను పరిచయం చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎన్నో మ్యాగజీన్ల కవర్లపై మాసూమ్ ఫోటో రావడం విశేషం. మోస్ట్ స్టైలిష్ బ్లాగర్గా... ఇప్పటిదాకా డిజిటల్ ఎంట్రప్రెన్యూర్, కాస్మోపాలిటన్ ఈ–టెయిలర్ ఆఫ్ ద ఇయర్, హెచ్ఎస్బీసీ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, పల్లాడియం స్పాట్లైట్ ఎథినిక్ బ్లాగర్ ఆఫ్ ది ఇయర్, ఇండియాస్ బెస్ట్ లగ్జరీ ఫ్యాషన్ బ్లాగర్, బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఫర్ సోషల్ సమోసా 30 అండ్ 30, ‘మోస్ట్ స్టైలిష్ బ్లాగర్’ వంటి అనేక అవార్డులను అందుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, అబు జైన్ అండ్ సందీప్ ఖోస్లా, సబ్యసాచి వంటి వారితో కలిసి పనిచేసింది. ‘‘చిన్న హాబీగా ప్రారంభించిన నా ఫ్యాషన్ చాలామంది ఫాలోవర్స్కు నచ్చడం... వాళ్లనుంచి పాజిటివ్ కామెంట్లు రావడంతో నన్ను ఎంతో ప్రోత్సహించినట్లు అయింది. ఒక ఆర్టిస్ట్ తన భావోద్వేగాలు, ఆలోచనలను పెయింటింగ్స్ రూపంలో ఎలా వ్యక్తం చేస్తారో.. నేను ఆ విధంగానే ఫ్యాషన్ గురించిన ఐడియాలు, అభిప్రాయాలు, డ్రెస్సింగ్ గురించి చెప్పేదాన్ని. దీంతో నా బ్లాగ్ ఫాలో అయ్యేవారికి మరింత నాణ్యతతో కూడిన కంటెంట్ను ఇచ్చేందుకు ప్రయత్నించేదాన్ని. అదే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని మాసూమ్ చెప్పింది. -
ఇన్స్టాలో దుమ్మురేపిన టీమిండియా
ముంబై: టీమిండియా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్లో రికార్డు స్థాయిలో 16 మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించి సత్తా చాటింది. టీమిండియా మెన్స్తో పాటు ఉమెన్స్ క్రికెట్ కలిపి ఈ ఫాలోవర్స్ను సాధించడం విశేషం. ఈ స్థాయిలో ఫాలోవర్స్ పెరగడానికి ప్రధాన కారణం ఆసీస్ పర్యటనే అని చెప్పొచ్చు. ఆసీస్ గడ్డపై టీమిండియా వీరోచిత ప్రదర్శన చేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడంతో టీమిండియాకు ఎనలేని క్రేజ్ వచ్చింది. చదవండి: ఒక్క టెస్ట్.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే డిసెంబర్ నుంచి టీమిండియాను ఇన్స్టాగ్రామ్లో ఆరాధించేవాళ్లు బాగా పెరిగారు. టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ హీరోలుగా మారిపోవడం.. సీనియర్లు పుజారా, రహానే, రోహిత్లకు విపరీతమైన ఫాలోయింగ్ పెరగడమే దీనికి కారణం. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ టీమిండియా అఫీషియల్ పేజీలో పోస్టును రాసుకొచ్చింది. 'ఇన్స్టాలో మాకు పెద్ద ఫ్యామిలీ లభించింది. దాదాపు 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. ఇట్స్ ఏ బిగ్ ఫ్యామిలీ.. మీ ప్రేమకు, అభిమానానికి, మద్దతుకు మనస్సూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇండియన్ క్రికెట్ టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, పుజారా, రహానే, అశ్విన్తో పాటు పలువురి ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. కాగా టీమిండియా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే.చదవండి: షమీకి భార్య హసీన్ జహాన్ మరో షాక్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
క్షణాల్లో మిలియన్ ఫ్రెండ్స్.. ఐదులక్షల లైక్లు
బీజింగ్: క్షణాల్లో మిలియన్ స్నేహితులను సంపాధించుకోవడం ఇప్పుడు సాధ్యమేనా.. సాధ్యమే అని నిరూపించారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీపెన్ హాకింగ్. చైనా వర్షన్కు చెందిన ట్విటర్ ఖాతాలో చేరిన కాసేపట్లోనే దాదాపు పది లక్షలమంది ఆయనను అనుసరించడం మొదలుపెట్టారు. ఆ సంఖ్య పెరుగుతుంది. భారత్లో ట్విట్టర్ వర్షన్ మాదిరిగా చైనాలో కూడా వైబో అనే ట్విటర్ మాధ్యమానికి చెందిన ఓ సామాజిక అనుసంధాన వేదిక ఉంది. అందులో హాకింగ్ మంగళవారం చేరారు. ఆయన చేరిన క్షణాల్లోనే అనూహ్యంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. వారి సంఖ్య పది లక్షలు దాటిపోయింది. ఇక ఆయన చేసిన తొలి పోస్టింగ్కైతే ఏకంగా ఐదులక్షల లైక్లు వచ్చాయి. 'చైనాలోని నా స్నేహితులందరికి శుభాకాంక్షలు. సోషల్ మీడియా ద్వారా చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాను. నాజీవితాన్ని గురించి నేను చేస్తున్న పని గురించి మీకు దీని ద్వారా తెలపాలని అనుకుంటున్నాను. దీంతోపాటు మీరు తిరిగి సమాధానం ఇవ్వడం ద్వారా ప్రశ్నించడం ద్వారా కూడా మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను' అని హాకింగ్ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement