-
ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు
నాయకులు, ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని కాదు పేదల ఎజెండాగా పని చేస్తున్న ప్రభుత్వం మాది ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హన్మకొండ : ప్రజాభిప్రాయం, ప్రాసెస్ పూర్తయితేనే కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్ట త వస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శా ఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హన్మకొండలోని టీఆర్ఎస్ అర్బన్ కార్యాల యంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ల ఏర్పాటు నాయకులు, ఎమ్మెల్యేల కోసం కాదని, ప్రజల అభీష్టం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో వచ్చిన స్పందనపై సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారని, ప్రజల కోరిక మేరకే జిల్లాలుంటాయని అన్నా రు. జిల్లాలు ఏర్పాటుకు అనుగుణంగా కేం ద్రం నియోజకవర్గాల పునర్విభజన చేస్తుందని ఆశిస్తున్నామని, లేదంటే 2029 వరకు ఈ నియోజకవర్గాలే ఉంటాయని అన్నారు. ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే అధిష్టానమని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర స్థాయి చైర్మన్లను మాత్రమే కేసీఆర్ నియమిస్తారని, డైరెక్టర్లు, దేవాలయాల చైర్మన్ల ఎంపిక ఎమ్మెల్యేలదేనని చెప్పారు. చేతలతో సమాధానం ఆనాడు హేళన చేసిన నాయకులకు నేడు చేతల ద్వారా సమాధానం చెపుతున్నామని ఈటల అన్నారు. గులాబీ జెండా ఎత్తిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లలేదని, ఆనాడు వెకిలి మాటలు మాట్లాడిన పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వచ్చారని గుర్తు చేశారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించామో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు. పేదల ఎజెండాతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన తనకు అందరి మనోభావాలు తెలుసని, ప్రభుత్వం చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లో కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నవారే అసలైన నాయకులని అన్నారు. అనంతరం మంత్రి ఈటలను సన్మానించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, మర్రి యాదవరెడ్డి, కె.వాసుదేవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, మాడిశెట్టి శివశంకర్, నయీముద్దీన్, జకార్య, నారాయణ, రాజేంద్రకుమార్, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, కార్పొరేటర్లు విజయ్భాస్కర్, మిర్యాల్కార్ దేవేందర్, వి.రవీందర్, టి. విద్యాసాగర్, జోరిక రమేష్, డిన్నా, నల్ల స్వ రూపరాణి, మాధవి, మిడిదొడ్డి స్వప్న, అరు ణ, సాబియా సబాహత్ పాల్గొన్నారు. -
మంత్రి ఈటలకు తప్పిన ప్రమాదం
హుజూరాబాద్ టౌన్/శంకరపట్నం: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్కు సోమవారం ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ అనుబంధ గ్రామం మాలపల్లి వద్ద రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటల రాజేందర్ తదితరులు మిషన్కాకతీయ పనుల ప్రారంభానికి బయలుదేరారు. అయితే మంత్రి ఎప్పుడూ ప్రయాణించే బుల్లెట్ప్రూఫ్ వాహనంలో కాకుండా ఎంపీ వినోద్కుమార్కు చెందిన ఫార్చునర్లో ఎక్కారు. మంత్రి, ఎంపీ ప్రయాణిస్తున్న ఫార్చునర్ వెనుక కాన్వాయిలో బుల్లెట్ఫ్రూఫ్ వాహనం ఉండగా, శంకరపట్నం మండలం ఎరుకలగూడెం-మెట్పల్లి గ్రామాల మధ్య బుల్లెట్ఫ్రూఫ్ వాహనంకు సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టును బలంగా ఢీకొంది. దీంతో వాహనం ముందు బ్యానెట్ భాగం దెబ్బతినడంతో ఆ వాహనాన్ని ప్రమాద సంఘటన వద్దనే వదిలి వెళ్లారు. -
నేడు ఆర్థిక మంత్రుల భేటీ
జీఎస్టీ అమలుపై జైట్లీ సమీక్ష హైదరాబాద్: అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ఢిల్లీలో బుధవారం జరుగనున్న ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరవనున్నారు. జీఎస్టీ అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ఈటలతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవనున్నారు. అమ్మకపు పన్ను వాటాకు సంబంధించిన సుమారు రూ.5,600 కోట్ల బకాయిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం అందులో 42 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. 2007 నుంచి బకాయి ఉన్న ఈ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఆర్థిక సాయం కోరటంతోపాటు.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని సడలించాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో పాటు 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement