-
నియోజకవర్గానికో వ్యవసాయ పరిశ్రమ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యవసాయ పరిశ్రమను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఖమ్మంలో వ్యవసాయ యాంత్రీకరణ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాధారిత పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈనెల 16న కమిటీ సమావేశం కానుందని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చు తగ్గించేందుకు యాంత్రీకరణ పథకాన్ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు. ప్రతి మండలానికి పది చొప్పున 5,500 ట్రాన్స్ప్లాంటేషన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రూ.700 కోట్లను వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నట్లు చెప్పారు. ఒక్కో ట్రాన్స్ప్లాంటేషన్ మిషన్కు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.5వేల కోట్లతో నిర్మించే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు 3 పంప్హౌస్ల పనులు సాగుతున్నాయన్నారు. మార్చి నాటికి అందరికీ ట్రాక్టర్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్కుమార్, బానోత్ మదన్లాల్, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
అడిగిన వెంటనే సాగునీరు
పోటో 28బీడీఎన్202ఃఅలీసాగర్ ఎత్తిపోతలపథకం వద్ద మొక్కలు నాటుతున్న మంత్రి 28బీడీఎన్203ఃఅలీసాగర్ నీటిని విడుదలకు స్విచ్ఆన్ చేస్తున్న మంత్రి,ఎమ్మెల్యేలు నవీపేట : రైతుల పంటపొలాలకు సాగునీటిని విడుదల చేయాలని అడిగిన పది గంటల్లోపే ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేశామని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి వేచిచూడాల్సి వచ్చేందన్నారు. మండలంలోని కోస్లీ శివారులో గోదావరి నది ఒడ్డున గల అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గురువారం ఎమ్మెల్యే షకీల్ అహ్మద్తో కలిసి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటిని వదలాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటే రోజుల సమయం పట్టేదన్నారు. కానీ అలీసాగర్ ద్వారా నీటిని వదలాలని బుధవారం రైతులు కోరగా వెంటనే హైదరాబాద్ వెళ్లి సీఎంతో చర్చించానన్నారు. గోదావరిలో నీరుండడంతో వెంటనే పథకాల ద్వారా నీటిని వదలాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్తో మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకంతో నిజామాబాద్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, డిచ్పల్లి, మాక్లూర్ మండలాల్లోని 53,793 ఎకరాలు సాగులోకి వస్తాయని పేర్కొన్నారు. అందుబాటులోని చెరువులు, కుంటలు నింపుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. అలీసాగర్ నీటిని విడుదల చేయాలని బుధవారం మంత్రి పోచారంను కోరగా వెంటనే హైదరాబాద్ వెళ్లి సీఎం అనుమతి తీసుకురావడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో యాదిరెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లం, నీటి పారుదల శాఖ ఎస్ఈ గంగాధర్, డీఈఈ పంకజాదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావ్, ఎంపీటీసీ సభ్యురాలు నర్సుబాయి, నాయకులు బెలాల్ నర్సింగ్రావు, కాశి సంజీవ్, కమలాకర్రావు, భూమన్న, రుక్మయ్య, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల రాద్ధాంతం
బాన్సువాడ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధిపొందడానికే టీడీపీ, కాంగ్రెస్లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు., సోమవారం ఆ పార్టీలు పిలుపునిచ్చిన మెదక్ జిల్లా బంద్ పూర్తిగా విఫలమైందన్నారు. సోమవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలం ప్రారంభం నుంచి జూలై 24 వరకు ప్రాణహిత, ఇందిరావతి నదుల నుంచి 770 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని తెలిపారు. ఈ నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలోని కొంత భాగంలో గల 3,000 గ్రామాల్లోని 40 లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 45 సార్లు నిండుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి 40 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యం కాగా, వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 65 లక్షల ఎకరాల్లోనే పంటలను వేసారని తెలిపారు. 25 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా, 3.40 లక్షల ఎకరాల్లో వేశారని తెలిపారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులతో జీవో నెంబర్ 123 ప్రకారం ముఖాముఖిగా మాట్లాడి నష్ట పరిహారం చెల్లించడం, లేదా 2013 పార్లమెంట్ బిల్లు ప్రకారం చెల్లంచడంపై వారితోనే అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. జీఓ 123 ప్రకారం వారు ఒప్పుకోగా, మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ. 6 లక్షలు, పొలాల్లో ఉండే నిర్మాణాలు, బోర్లకు అదనంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యామని, దీనికి ఏటిగడ్డ, కిష్టాపూర్ గ్రామస్తులు అంగీకరించారని తెలిపారు. ఎవరో టీడీపీ నేత ప్రభాకర్రెడ్డి, సొంత లబ్దికోసం మిగితా గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన చేస్తూ, పోలీసులపై రాళ్లు రువ్వారని, ఇది ఎంత వరకు సమంజసమని అన్నారు. మేధావి అయిన ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కాంగ్రెస్ నేతలు దీన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాణహిత–చేవేళ్ల పథకం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు లభించాయా అని మంత్రి పోచారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని కోటి ఎకరాలకు నీరందించడమే ధ్యేయంగా కాళేశ్వరం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. గోదావరి, మంజీర నదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు అక్రమ ప్రాజెక్టులను నిర్మించడంతో నేడు నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. కాళేశ్వరంతోనే ఈ ప్రాజెక్టులకు జీవం పోయడానికి వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు. -
చెట్లతోనే వర్షాలు
♦ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన వాస్తవం ♦ మొక్కలు నాటడం అందరి బాధ్యత ♦ మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలు లక్ష్యం ♦ కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి ♦ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ♦ వీడియో కాన్ఫరెన్స్, సమీక్షలలో మంత్రి పోచారం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కరువును, దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు పచ్చదనాన్ని పెంచడమే ఏకైక మార్గమని వ్యవసాయ, ఉద్యానవన, సహకారశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కసారి మనం ఇటీవల కురుస్తున్న వర్షాలు, వర్షపాతం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అడవులున్న ప్రాంతాల్లో ఎక్కువ, చెట్లు లేని చోట తక్కువ వర్షం కురుస్తోందని, వర్షాభావానికి కేవలం అంతరించిన పచ్చదనమే కారణమన్నారు. భవిష్యత్లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాని అన్నారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక హరితహారం విజయవంతం చేయడం అందరి బాధ్యతని అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హరితహారం అమలులో కొందరు అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారం అమలు కోసం రెండు గ్రామ పంచాయతీలకు ఒక క్లస్టర్గా అధికారిని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నోడల్ అధికారిని, మున్సిపాలిటీలకు కమిషనర్లను నియమించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో 40 వేలు... ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల మొక్కలను నాటించాల్సిన బాధ్యత నోడల్ అధికారులు, క్లస్టర్ అధికారులదేనని మంత్రి పోచారం అన్నారు. గుంతలు తవ్విన తర్వాతనే నర్సరీల నుంచి మొక్కలు విడుదల చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు ఖచ్చితమైన లెక్కలతో, మొక్కలను బతికించాలని ఆదేశించారు. ఈ పనులకు ప్రభుత్వ పరంగా చెల్లించే సొమ్ము గురించి రైతులు, గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. నోడల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందరికీ అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో చెట్లు తక్కువగా ఉన్న లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, కమ్మర్పల్లి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని ఉదహరించారు. మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలను నాటించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1.7 లక్షల హెక్టార్ల అడవులను కారడవులుగా మార్చేందుకు ఒక కోటి మొక్కలను, పొలాల గట్లు, నివాస ప్రాంతాల్లో 9 కోట్ల మొక్కలు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. సుడిగాలి పర్యటన.. ‘తెలంగాణ హరితహారం పథకం భావి తరాల బాగు కోసం... మన ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు... మన దగ్గర మబ్బులు పైనుంచి పోతున్నా... వర్షాలు పడటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి.. చెట్లున్న ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి... ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా భావించండి... భావితరాల భవిష్యత్ను దష్టిలో పెట్టుకుని మొక్కలు నాటుదాం’’ అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హరితహారం ప్రారంభం నుంచి బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 11న బాన్సువాడలో మొక్కలు నాటి అధికారికంగా హరితహారం ప్రారంభించిన ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు జరుపుతూ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్.. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శాఖల వారిగా సమీక్షలు చేస్తున్నారు. అంతటా పర్యటించిన మొక్కలు నాటుతున్నారు. బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన సోమవారం కూడ కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ చైర్మన్ దపేదార్ రాజు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, సంయుక్త కలెక్టర్ రవీందర్రెడ్డి, ముఖ్య అడవీ సంరక్షణ అధికారి ఎస్కే గుప్త, డీఎఫ్వోలు, డ్వామా పీడీ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల జిల్లాకు సీఎం
♦ 1,2 తేదీల్లో కేసీఆర్ పర్యటన ♦ బీర్కూర్లోని టీటీడీ ఆలయాన్ని దర్శించుకుంటారు ♦ విలేకరులతో మంత్రి పోచారం బీర్కూర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చేనెల 1, 2 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం బీర్కూర్లోని టీటీడీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ 1న బాన్సువాడలోని తన స్వగృహంలో బసచేసి, 2న బీర్కూర్లోని టీటీడీ ఆలయాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆలయవార్షిక బ్రహ్మోత్సవాలకు రాలేకపోతున్నారని మంత్రి తెలిపారు. పరిపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం సమగ్ర ప్రణాళిక-పరిపూర్ణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీర్కూర్లోని టీటీడీ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకా రం చుడుతూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. గతంలో మూస పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం భిన ్నంగా ఆలోచించి ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించి కొత్తరాష్ట్రంలో ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలి, ఎక్కడ తగ్గించాలి అని విశ్లేషించి చక్కటి బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని పేర్కొన్నా రు. సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు కేటాయిం చారని ఇలా నాలుగేళ్లలో సుమారు రూ. లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈసారి వైద్యం కోసం ప్రత్యేకంగా రూ. 5 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. సీఎంతో పాటు ప్రతి మంత్రి వద్ద రూ. 25 కోట్లు స్పెషల్ఫండ్ కింద పెడుతున్నార న్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్కు రూ. 10 కోట్లు, ఎస్పీకి రూ. కోటి స్పెషల్ ఫండ్ ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 85 కోట్లతో నిజాంసాగర్ డీసీలు మరమ్మతులు చేయించామని, ఈసారి బడ్జెట్లో మరో రూ. 46 కోట్లు మంజూరు చేయించాని చెప్పారు. ఈసారి బడ్జెట్లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 1 నుంచి 82 వరకు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 220 కోట్లు కేటాయించిందన్నారు. మద్నూర్, సిర్పూర్ మీదుగా పోతంగల్ కోటగిరి నుంచి రుద్రూర్ బోధన్ మీదుగా నిజామాబాద్ వరకు జాతీయ రహదారి మంజూరయిందని పేర్కొన్నారు. దీంతో పాటు బాలానగర్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు నేషనల్ హైవే పనులు కూడా చేపడతామని చెప్పారు. సమావేశంలో కోటగిరి ఎంపీపీ సులోచన, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, నాయకులు ద్రొణవల్లి సతీశ్, పెర్క శ్రీనివాస్, అప్పారావు, మహ్మద్ ఎజాస్, కొత్తకొండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement