-
మేం రమ్మంటేనే రండి!
► బదిలీ అయిన ఉద్యోగులకు స్థానిక ప్రజాప్రతినిధుల బెదిరింపులు ► కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోని వైనం ► అధికార పార్టీ నేతల సిఫార్సుల కోసం ఉద్యోగుల క్యూ ► జాబితాలు సిద్ధం చేసి పంపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం క్లైమాక్స్కు చేరింది. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధి అనుమతి లేనిదేఅక్కడ ఉద్యోగంలో చేరేందుకు కుదరని పరిస్థితి. నిబంధనలు బేఖాతరు చేస్తూ తమకు అనుకూలంగా లేనివారిని వేరే చోటికి పంపించడంతో పాటు తమవారికి పోస్టింగులు ఇప్పించు కోవడానికి నేతలు రంగం సిద్ధం చేశారు. సోమవారంతో బదిలీలకు గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: రెవెన్యూశాఖలో ఇటీవల జిల్లా కలెక్టర్ నలుగురు డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. వారికి పోస్టింగ్లు ఇచ్చే క్రమంలో కొంత మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. పిట్టలవానిపాలెం, రొంపిచర్ల, నకరికల్లుకు బదిలీ అయిన తహసీల్దార్లను స్థానిక ప్రజా ప్రతినిధులు జాయిన్ కావద్దని ఒత్తిడి తేవడంతో వారికి ఎటూ పాలుపోవడంలేదు. తమకు తెలియకుండా ఎలా వస్తారని, తమకు నచ్చిన వారిని తామే ఇక్కడకు తెప్పించుకుంటామని వారితో తేల్చి చెప్పడంతో బదిలీ అయిన ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి రావెల్ కిశోర్బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో ఓ భూమి వ్యవహారంలో తహసీల్దారు కోర్టు ఆదేశాలను అమలు చేసి మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. సెలవులో వెళ్లిపోవాలని మంత్రి హుకుం జారీ చేశారు. దీంతో ఆ తహసీల్దార్కు బదిలీ తప్పేలాలేదు. రొంపిచర్ల తహసీల్దార్కు పదవీ విరమణకు గడువు కేవలం రెండు నెలలు ఉంది. పదవీ విరమణకు ఆరునెలల లోపు సర్వీసు ఉన్న వారిని అధికారికంగా బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన్ను దుర్గిరాలకు బదిలీ చేయడం గమనార్హం. జిల్లా కలెక్టర్ బదిలీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించినా ఆయన ఆదేశాలు పట్టించుకోక పోవడం గమనార్హం. రెవెన్యూ శాఖలో అధికార పార్టీ నేతల సిఫార్సుల మేరకు 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు వివరాలు పంపించాల్సిందిగా డివిజన్, మండల కార్యాలయాలకు కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బదిలీల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంపీడీవోల బదిలీల్లో సైతం... జిల్లాలో ఎంపీడీవోల బదిలీల్లో సైతం తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్నట్టు సమాచారం. బదిలీలకు సంబంధించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ సమావేశమై చర్చించినట్లు తెలిసింది. 20 శాతం అంటే దాదాపు 15 మందికి పైగా ఎంపీడీవోలకు స్థానచలనం తప్పదని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట మండల ఎంపీడీవోను బదిలీ చేయాలని సూచించినట్టు తెలిసింది. స్థానిక ఎంపీపీకి, ఎంపీడీవోకు నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. మంత్రి రావెల కిశోర్బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న వట్టిచెరుకూరు మండల ఎంపీడీవోను సైతం తమ మాట ఖాతరు చేయడం లేదని ఇప్పటికే బదిలీ చేయాలని ఆధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ స్థానంలో పిడుగురాళ్ల ఎంపీడీవోను సిఫార్సు చేసినట్టు సమాచారం. ప్రత్తిపాడు ఎంపీడీవో గుంటూరు రూరల్ ఎంపీడీవోగా వచ్చేందుకు మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మేడికొండూరు ఎంపీడీవో సైతం ఈ నెల చివరికి రిటైర్ అవుతున్నారు. బొల్లాపల్లి, మాచవరం ఎంపీడీవోలు ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. నూజెండ్ల, దాచేపల్లి, పెదనందిపాడు మండల ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాపట్ల, మంగళగిరి మండలాల ఎంపీడీవోలు బదిలీలకోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా బదిలీల ప్రక్రియ ఆన్లైనా, మాన్యువలా అన్న సందిగ్ధం ఉద్యోగుల్లో నెలకొంది. రేపటితో ముగియనున్న బదిలీల దరఖాస్తు గడువు బదిలీల దరఖాస్తు గడువు సోమవారంతో ముగుస్తుండడంతో ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో పోస్టింగ్లు ఇప్పించుకోవడం కోసం అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను పంపినట్టు సమాచారం. -
వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో దొంగ వ్యాపారం
► బీటీ పేరుతో లూటీ ► గుంటూరు అడ్డాగా యథేచ్ఛగా నకిలీ విత్తనాల విక్రయాలు ► ప్రధాన కంపెనీల బ్యాగుల పోలికతో మోసగిస్తున్న వైనం ► విజిలెన్స్ శాఖ దాడులతో వెలుగుచూస్తున్న అక్రమాలు ► పత్తి విత్తనాల విక్రయం రైతులను మోసగిస్తున్న వ్యాపారులు ► పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అసలుకు ఏమాత్రం తేడా లేకుండా విత్తనాలను తయారు చేసి అక్రమార్కులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఈ నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు విజిలెన్స్ అధికారులూ చెబుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవసాయశాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి:- నకిలీ విత్తనాలకు గుంటూరు అడ్డాగా మారింది. కర్నూలు, మహబూబ్నగర్, హైదరాబాద్, ప్రాంతాల నుంచి కొన్ని ప్రధాన కంపెనీలకు చెందిన జీవోటీ (గ్రో అవుట్ టెస్ట్)లో ఫెయిల్ అయిన విత్తనాలను తీసుకొచ్చి కొందరు వ్యాపారులు విక్రయాలు చేపట్టారు. జిన్నింగ్ మిల్లులో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని శుభ్రం చేసి అందమైన ప్యాకెట్గా, ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టి రైతులకు అమ్ముతున్నారు. గత ఏడాది నిలువునా మునిగిన రైతులు... నకిలీ విత్తనాల వల్ల గత ఏడాది పల్నాడు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. నకిలీ విత్తనాల విక్రయాల సరఫరా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని వ్యవసాయశాఖ చెబుతున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. విత్తనాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ కొంత మంది వ్యాపారులు రైతులకు మాయ మాటలు చెప్పి నిలువునా మోసం చేస్తున్నారు.. విజిలెన్స్ దాడులతో.... పిడుగురాళ్లలోని రెండు దుకాణాల్లో‘ న్యూటన్’ కంపెనీ పేరుతో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ దాడులతో వెలుగులోకి వచ్చింది. బీటీ అనుమతి లేకుండానే వర్ష 666, దివ్య 333 పేరుతో విత్తనాలను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. రెండు దుకాణాల నుంచి 946 ప్యాకెట్లు.. దాదాపు రూ.7.50 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జీఏసీ (జెనెటిక్ ఇంజినీర్ అప్రూవల్ కమిటీ)అనుమతి ఇస్తెనే బీటీ అనుమతి వస్తుంది. అలాంటి అనుమతులు ఈ విత్తనాలకు ఏమీ లేనట్టు తెలిసింది. వీరు ఓ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన విత్తనాలను మార్కెటింగ్ చేస్తున్నట్లు వ్యాపారులు విజిలెన్స్ అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. విజిలెన్స్ వారు చెప్పిన విషయాలపై ఆరా తీయగా వీరికి 2014 నుంచి ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేనట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చర్యలు తీసుకుంటున్నాం నకిలీ విత్తనాలను ఆరికట్టేందుక అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం.. పత్తి విత్తనాల కొరత లేదు.. జిల్లాలో 3.20 లక్షల ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. ఇప్పటికే జిల్లాలో 85 నుంచి 90 వేల ప్యాకెట్ పత్తి విత్తనాలు డీలర్ల వద్దకు వచ్చాయి. నకిలీ విత్తనాలతో మోసపోకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆథరైజ్డ్ డీలర్ల నుంచే బీటీ విత్తనాలు కొనుగోలు చేయాలి. - కృపాదాస్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు -
ప్రకృతి వ్యవసాయానికి చేయూత
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి కొరిటెపాడు(గుంటూరు): సహజ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక కృషిభవన్లో సహజ వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సహజ వ్యవసాయంపై రాష్ట్ర వ్యాప్తంగా 39 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు 300 మంది రైతులను కేటాయింంచి, మొత్తం 39 వేల మంది రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడింంచారు. దీనిలో భాగంగా ఆవు కొనుగోలుకు ప్రభుత్వం రూ.10 వేలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.రైతులు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని సూచించారు. పొగాకు గిట్టుబాటు ధర కోసం రైతులు, పొగాకు మ్యాన్ఫాక్చర్స్, ఎక్స్పోర్టర్లతో కలసి శుక్రవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలవనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు అధికంగా వాడే జిల్లాల్లో గుంటూరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. భూములు నిస్సారంగా మారుతున్నాయని చెప్పారు. సహజ వ్యవసాయంలో దిగుబడి తగ్గినా ధరలు అధికంగా ఉంటాయని తెలిపారు. జేడీఏ కృపాదాసు, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారి, వ్యవసాయాధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
నీ హామీ బంగారం గానూ!
తాకట్టు బంగారం.. ఇంటికి రానట్టే! నోటీసులు అందుకున్న 69 వేల మంది రైతన్నలు రూ.360 కోట్ల మేర ఇప్పటికీ మాఫీ కాని వైనం వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చేసుకోవాల్సిన దుస్థితి కొత్తపల్లి ఎస్బీఐలో ఇప్పటికే బంగారం వేలం మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారా? ఆ బంగారం మీ ఇంటికి రావాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటెయ్యండి.’ అంటూ ఎన్నికల ముందు ఎడాపెడా ప్రచారం చేసిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా జిల్లాలో ఏకంగా 69వేల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. వీరంతా బ్యాంకుల్లో ఉంచిన తమ బంగారం వేలం కాకుండా కాపాడుకునేందుకు అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు చేసి మరీ రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి వ్యవసాయం కోసం తీసుకున్న రూ.360 కోట్ల రుణాలు ఇప్పటికీమాఫీ కాకపోవడంతో వీరంతా వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకోవడమో.. ఆ పరిస్థితి లేకపోతే వేలంలో బంగారాన్ని కోల్పోవడమో జరిగింది. జిల్లాలో సుమారు 50 నుంచి 60 మేరకు వేలం ప్రకటనలు వెలువడ్డాయి. ఆత్మకూరు కొత్తపల్లి మండలంలో ఎస్బీఐ బ్యాంకు ఏకంగా 12 మందికి చెందిన బంగారు నగలను వేలం వేసి విక్రయించింది. మరోవైపు ఆస్పరి మండలంలో ఏకంగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయినప్పటికీ బంగారు నగలను వేలం వేసినట్టు తమ దృష్టికి రాలేదని అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొనడం పట్ల జిల్లా రైతాంగం భగ్గు మంటోంది. 69 వేల మందికి నోటీసులు జిల్లాలో మొత్తం లక్షా 21 వేల మంది రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి సుమారు రూ.625 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాలన్నీ కేవలం జాతీయ బ్యాంకులల్లో తీసుకున్నవే. ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టినవి వీటికి అదనం. అయితే, ఎన్నికల నేపథ్యంలో బంగారం రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో.. రుణాలను సకాలంలో చెల్లించలేదు. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత బంగారం పెట్టి తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయలేదు. ఫలితంగా సమయం మించిపోయినప్పటికీ రుణాలను చెల్లించలేదంటూ రైతులకు నోటీసుల పర్వం మొదలయింది. అంతేకాకుండా పత్రికల్లో అన్నదాతల పేర్లు కూడా ప్రత్యక్షమయ్యాయి. రుణాలు చెల్లించకపోవడంతో బంగారాన్ని వేలం వేస్తామని ప్రకటించారు. ఈ విధంగా 69వేల మందికి చెందిన రూ.360 కోట్ల రుణాలను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాకుండా వీరి పేర్లను బ్యాంకుల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. ఈ విధంగా జిల్లాలో 69 వేల మంది అన్నదాతలకు బ్యాంకర్ల నుంచి నోటీసులు అందాయి. వీరు తీసుకున్న రూ.360 కోట్ల రుణాలు మాఫీ కాలేదు. రూ.265 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయినట్టు తేల్చారు. వీరికి కూడా సదరు మొత్తం ఇంకా బ్యాంకులో డిపాజిట్ కాని పరిస్థితి. ఫలితంగా వీరిలోనూ కొందరు నోటీసులు అందుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఆత్మగౌరవంతో ఆటలు వాస్తవానికి అన్నదాతలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తారు. ఏకంగా తమ పేర్లతో పాటు పత్రికల్లో ప్రకటనలు రావడం, రుణాలు కట్టకపోతే బంగారాన్ని వేలం వేస్తామనడం, బ్యాంకుల ముందు నోటీసు బోర్డుల్లో తమ పేర్లు ప్రత్యక్షం కావడంతో ఆత్మగౌరవం దెబ్బతినింది. దీంతో అనేక మంది రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేసి మరీ రుణాలను తీర్చేశారు. మరికొంతమంది అధిక వడ్డీకి రుణాలను రీ-షెడ్యూల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆలూరు నియోజకవర్గం.. ఆస్పరి మండలంలో నాగలింగడు అనే రైతు ఎస్బీఐ బ్యాంకులో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 3 తులాల బంగారాన్ని పెట్టి తీసుకున్న రూ.28 వేల రుణం తీర్చలేదంటూ ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది వేలానికి సిద్ధం కావడంతో ఆత్మగౌరవం దెబ్బతిని ఈ పనికి పూనుకున్నారు. వడ్డీకి తెచ్చి కట్టినా.. నాకు 4 ఎకరాల పొలం ఉంది. 2012లో ఎస్బీఐ మార్కెట్యార్డు బ్రాంచ్లో రూ.35వేల అప్పు తీసుకున్నా. పెట్టుబడులకు చాలక భార్య ఆభరణాలను ఐసీఐసీఐ బ్యాంక్లో తాకట్టు పెట్టి మరో రూ.95వేలు అప్పు చేసినా. ఎన్నికల ముందు చంద్రబాబు తాకట్టు రుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పడంతో వడ్డీ కూడా కట్టలేదు. ప్రభుత్వం వచ్చినాక ఎస్బీఐలో రూ.7వేలు మాత్రమే మాఫీ అయింది. తాకట్టు అప్పును చెల్లించకపోతే నగలను వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరించినారు. దిక్కుతోచక బయట వ్యాపారి వద్ద రూ.3లకు వడ్డీకి తెచ్చి రూ.1.20లక్షలు చెల్లించినా. చంద్రబాబు మాటలు నమ్మి దారుణంగా మోసపోయినా. - రామదాసు, కల్లుబావి రైతు, ఆదోని కుమార్తె బంగారు పోగొట్టా 2013లో కుటుంబ అవసరాలు, పంటల సాగుకు భార్య సొత్తుతో పాటు అల్లునికి నచ్చజెప్పి కుమార్తెకు చెందిన 60 గ్రాముల బంగారు బ్యాంకులో పెట్టిన. రూ.1.20 లక్షల రుణం తీసుకున్నా. ఆ ఏడాది పంటలు సరిగా పండకపోవడంతో వడ్డీ కూడా కట్టలేకపోయిన. మరుసటి యేడు సాగు చేసిన పంటలు కూడా చేతికి అందల్యా. అప్పుడే వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పంట రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రాణం లేసొచ్చింది. కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తి. ప్రభుత్వం వచ్చినాక కూడా అదిగో.. ఇదిగో అని సెప్పి లాస్టుకి పైస కూడా మాఫీ చేయల్యా. మూడు సంవత్సరాలు వడ్డీ కూడా కట్టలేదని బ్యాంకోల్లు బంగారం వేలం ఏసిరి. చంద్రబాబు మాట నమ్మి నా కూతురి బంగారం పోగొట్టిన. - మూరబోయిన నరసింహుడు, తువ్వపల్లె రైతు, రుద్రవరం -
ప్రత్తిపాటి నోట... ఓటి మాట
► బంగారం రుణాలపై బ్యాంకుల నోటీసులు ► మంత్రి తెలియదనడంపై మహిళల మండిపాటు ► బాబును నమ్మినందుకు నట్టేట ముంచారని శాపనార్థాలు ► ఏడాది క్రితం తీసుకున్న అప్పులూ చెల్లించాలని అప్పుడే ఒత్తిడి తెనాలి : ‘వస్తున్నా....మీకోసం’ పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు దగాపడ్డారు. ‘ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు...మీ నగలు మీరు తీసుకుందురు’ అనే వాగ్దానాలకు పొంగిపోయిన ఆడపడుచులు తీవ్రంగా భంగపడ్డారు. అధికారంలోకి వచ్చాక బాబు తీరు మారిపోయింది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో రుణ పరిమితి తగ్గించి, వాయిదాల పద్ధతిలో మాఫీ అన్న ముఖ్యమంత్రి మాటల గారడీకి అంతా నివ్వెర పోయారు. రుణమాఫీ గురించి ప్రశ్నించినవారిపై ప్రభుత్వ పెద్దలు బుకాయింపునకు దిగుతున్నారు. బంగారు నగలపై రుణాలు తీసుకున్న ఖాతాదారులకు బ్యాంకులు మళ్లీ ఇప్పుడు వేలం నోటీసులు పంపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని బుధవారం శాసనసభలో ప్రస్తావిస్తే, అటువంటి సమాచారమేదీ తనకు తెలియదని రా్రష్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిస్సిగ్గుగా ప్రకటించటం చూసిన ప్రజలు మండిపడుతున్నారు. ఏడాదిగా కరవు ఛాయలు.. జిల్లాపై ఏడాదిగా కరవు ఛాయలు ముసురుకున్నాయి. ఖరీఫ్లో వరి, పత్తి, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గాయి. ఫలితంగా జిల్లాలోని రైతులు రూ.800 కోట్లకు పైగా నష్టపోయివుంటారని అంచనా. ప్రస్తుత రబీలోనూ పంటల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులతో తల్లడిల్లుతున్న రైతులు ఎందరికో చంద్రబాబు హామీనిచ్చినట్టు రుణమాఫీ జరగలేదు. అన్ని లెక్కలు సరిచూసుకుని మాఫీ పరిధిలోకి వచ్చిన రైతులకు తొలి విడతగా ఖాతాలో పడిన డబ్బులు కనీసం వడ్డీకి కూడా సరిపోలేదు. శాపనార్థాలు పెడుతున్న మహిళలు... గురజాల దగ్గర్లోని మాడుగులకు చెందిన కౌలురైతు సంకురాత్రి భూదేమ్మను రుణమాఫీపై కదిలిస్తే, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూడేళ్ల క్రితం గురజాల ఎస్బీఐలో నగలు తాకట్టుపెట్టి రూ.35 వేల రుణం తీసుకుంది. బాబు హామీని నమ్మినందుకు రుణమాఫీ చేయకపోగా తన నగలను వేలం వేశారని తెలుసుకుని నివ్వెరపోయినట్టు చెబుతూ శాపనార్థాలు పెట్టసాగింది. తెనాలి సమీపంలోని కొలకలూరు మహిళ రమాదేవి మూడేళ్ల క్రితం రూ.54 వేలు రుణం తీసుకున్నారు. ఇప్పటికి రూ.37 వేలు వడ్డీకింద చెల్లించినా, రుణమాఫీ కాలేదనీ, ఏం చేయాలో తెలియడం లేదన్నారు. ప్రకటన వ్యయం రైతునెత్తిపైనే... బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు కలవరపడుతూ ఏదొకవిధంగా వడ్డీ చెల్లిస్తామని వెళితే ప్రతికలో వేలం ప్రకటన వ్యయాన్ని కూడా వారినుంచి బ్యాంకులు రాబడుతున్నాయి. పత్రికలో వేసినందుకంటూ తననుంచి రూ.750 అదనంగా వసూలుచేశారని సింగరయ్య అనే మరో రైతు చెప్పటం ఇందుకు నిదర్శనం. వార్షిక సంవత్సరం ఆఖరు కావటంతో బ్యాంకులన్నీ కొద్దిరోజులుగా బంగారు ఆభరణాల నగల వేలం నోటీసులను పంపుతున్నాయి.జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల రైతులు వీటిని అందుకుంటున్నారు. బాబు రుణమాఫీ హామీ కారణంగా బ్యాంకులకు ఎదురైన చేదు అనుభవాలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాదిక్రితం తీసుకున్న రుణాలనూ చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులతో ఒత్తిడిచేస్తున్నట్టు కొలకలూరు రైతు శివనాగేంద్రం చెప్పారు. వాస్తవాలిలా ఉంటే, ఇప్పటికీ రుణాలు మాఫీ కాని రైతులు ఉన్నారనీ, నగలపై రుణాల చెల్లింపు డిమాండుతో నోటీసులు జారీచేస్తున్నారని తెలియదని స్వయానా మంత్రి చెప్పటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోటీసుల పేరుతో బ్యాంకుల ఒత్తిడి... ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులు వేలం నోటీసులు పంపటం, వేలం ప్రకటనలను పత్రికల్లో ప్రచురించటం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఖరీఫ్లో పంట రుణాలతో పెట్టుబడులు సరిపోక, స్థానికంగా ఉండే రైతులు, వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నారు. పంటలు వచ్చే ముందు చివరి విడత అవసరాలకు బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదవపెట్టి అప్పు తీసుకున్నారు. దాదాపు 2.50 లక్షల రైతులు ఈ విధంగా ఆభరణాలపై అప్పులు తీసుకుని వుంటారని అంచనా. ఈ క్రమంలో నోటీసుల పేరుతో బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనపుడు క ంగుతిన్న రైతులు పరువు పోతుందన్న గుండె గుబులుతో అందినకాడల్లా అప్పులు చేసి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించుకొన్నారు. ఆ పరపతి కూడా లేని రైతులు తమ నగలను వదిలేసుకున్నారు. నోటీసులు ఇచ్చారు 2013లో ఆంధ్రాబ్యాంక్లో బంగారంపెట్టి రూ.1.2లక్షలు తీసుకున్నాం. రుణమాఫీ కాకపోవడంతో కొంత నగదు చెల్లించాం. మిగిలిన నగదు కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలిశెట్టి సుధారాణి, కొలకలూరు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement