-
చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేస్తాం
చింతలపూడి: చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖా మంత్రి పీతల సుజాత తెలిపారు. గురువారం చింతలపూడి విచ్చేసిన మంత్రి సుజాతను ఎత్తిపోతల పధకం రైతులు కలిశారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం చెల్లించకుండ కాల్వ పనులు చేపడుతున్నారని చెప్పారు. అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టారని చింతలపూడి భూనిర్వాసితుల కమిటీ నాయకులు అలవాల ఖాదర్బాబురెడ్డి, సిహెచ్ అంజిబాబు, చిట్లూరి లచ్చిబాబులు ఆమె దృ ష్టికి తీసుకువెళ్ళారు. రైతులు ఆందోళన చెందవద్దని, న్యాయమైన పరిహారం అందేలా చూస్తాన ని, అప్పటి వరకు కాల్వ పనులు చేపట్టవద్దని తహశీల్దార్కు చెప్పారు. అదే విధంగా రైతులపై పెట్టిన కేసులను తక్షణం ఉప సంహరించుకోవాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆమె వెంట సిహెచ్ సీతారామయ్య, ఎం ఈశ్వర్కుమార్, బోడా భూషణం,సయ్యద్ బాబు, ఆశీర్వాదం, వీరేంద్ర, తాటి అప్పారావు , టి రామారావులు ఉన్నారు. -
కిరాతకంపై కన్నెర్ర
* ఇందుమతి మృతిపై విద్యార్థి, ప్రజాసంఘాల ధర్నా * మంత్రి సుజాత అడ్డగింత.. నన్నపనేని రాజకుమారి ఘెరావ్ * ఏలూరులో ఉద్రిక్తత ఏలూరు(ఆర్ఆర్ పేట): ప్రేమోన్మాదుల దాష్టీ కానికి బలైన పైడాల ఇందుమతి(18) ఘటన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను ఆవేదన, ఆగ్రహానికి గురిచేసింది. వివిధ విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు కన్నెర్ర చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి మేనమామ ఆత్మహత్యకు యత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఏలూరు మండలం చాటపర్రుకు చెందిన ఇందుమతిపై అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు దగ్గుమిల్లి పెదవిక్కీ, చినవిక్కీ శనివారం కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరా తీసేందుకు ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆస్పత్రికి వచ్చారు. ఇందుమతి మృతదేహాన్ని పరిశీలించి, బాధిత కుటుంబా న్ని పరామర్శించారు. తిరిగి వెళుతుండగా విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు. బాధితురాలి కుటుంబానికి ఎలాంటి హామీలు ఇవ్వకుండా, నష్టపరిహారం ప్రకటిం చకుండా వెళ్లడమేంటని ఘెరావ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహా రం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతనూ వారు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రేమోన్మాదుల దురాగతానికి ఇందుమతి బలైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మేనమామ ఆత్మహత్యాయత్నం నిందితులను తప్పించేందుకు పోలీసులు ప్ర యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇందుమతి మేనమామ సుబ్బారావు ఆస్పత్రి ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందుమతి మృతదేహానికి పోస్ట్మార్టం జరుగుతున్న సందర్భంలో మీడి యా వద్దకు వచ్చిన సుబ్బారావు.. వీడియో కెమెరాల వైర్లను మెడకు బిగించుకోగా... పోలీసులు అడ్డుకొని వెంటనే ఆస్పత్రికి తరలిం చారు. మరోవైపు పోస్టుమార్టం అనంతరం ఇందుమతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసు లు ప్రయత్నించగా, వారు నిరాకరించారు. నిందితులు ఇందుమతిని వేధిస్తున్నారని గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మృతదేహాన్ని తీసుకెళితే ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయదని నినాదాలు చేశారు. విషయాన్ని పోలీసులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన పెదపాడు తహసీల్దార్ను ఆస్పత్రికి పంపించారు. బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్తో హామీ ఇప్పించారు. దీంతో శాంతించిన ఇందుమతి కుటుంబ సభ్యులు, ఆందోళనకారులు ఆమె మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. విద్యార్థులు, గ్రామస్తులు వెంటరాగా, అశ్రునయనాల నడుమ చాటపర్రులో అంత్యక్రియలు నిర్వహించారు. కుమార్తెకు ఇష్టమైన చెరకు రసాన్ని బాటిల్ నిండా తెచ్చిన ఇందుమతి తండ్రి సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఆమె సమాధిపై పోశారు. గద్గద స్వరంతో ‘తాగమ్మా.. నీకు ఇష్టమైన చెరుకు రసం తెచ్చాను’ అంటూ ఆ తండ్రి రోదించడం అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. హత్య కేసుగా మార్పు ఇందుమతి సజీవ దహనం నేపథ్యంలో పోలీసులు తొలుత ఐపీసీ సెక్షన్ 324 (గాయపర్చడం), సెక్షన్ 509 (మహిళను అవమానపర్చడం), సెక్షన్ 506 (నేరపూరితమైన బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. అనంతరం సెక్షన్ 302 కింద హత్య కేసుగా మార్చారు. -
ఇసుక ఉచిత సరఫరాపై త్వరలో స్పష్టత
తాడేపల్లిగూడెం : ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తుందని గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. పట్టణంలో 15వ వార్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇసుక ఉచితంగా సరఫరా చేసే విధానానికి సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల నిర్మాణరంగ అభివృద్ధికి చేయూత నిచ్చినట్టేనన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, ర్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై పరిశీలన చేసిన అనంతరం ఇసుక సరఫరా విషయంలో స్పష్టమైన విధానం ప్రకటిస్తారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్యఅతిథి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ అమృత్ పథకానికి సంబంధించి రానున్న రాష్ట్ర బడ్జెట్లో మ్యాచింగ్ గ్రాంటుగా 50 శాతం నిధులను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమృత్ ద్వారా పట్టణాలలో మౌలికవసతుల కల్పన జరుగుతుందన్నారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
Advertisement