-
షేమ్...షేమ్!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం ముందు హోదాలు బలాదూర్ అవుతున్నాయి. వేదిక ఏదైనా తెలుగుతమ్ముళ్లు ఆశీనులవుతున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులను, అధికారులను విస్మరిస్తున్నారు. ప్రోటోకాల్ విస్మరిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం కలెక్టర్ సాక్షిగా ఉన్నతాధికారులు ఘోర పరాభవం చవిచూశారు. టీడీపీ నేతల ముందు కమిషనర్, డీఈఓ చేతులు కట్టుకొని నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఏకంగా ఇన్చార్జి మంత్రి సమక్షంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయస్థాయి పోటీపరీక్షలకు సన్నద్ధం చేసేందుకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం మున్సిపల్ హైస్కూల్స్లో ఐఐటీ, నీట్ కెరీర్ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టారు. శుక్రవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ఈ కార్యక్రమాన్ని మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. కాగా అధికారిక కార్యక్రమంలో అధికారులకు చోటు దక్కకపోగా టీడీపీ నేతలు మూకుమ్మడిగా తిష్టవేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సురేష్నాయుడు, హరిప్రసాద్, దుర్గాప్రసాద్లు వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, మంత్రి గంటా చెంతన కూర్చొని ఉండగా కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, డీఈఓ ప్రతాపరెడ్డి, హెచ్ఎం సుబ్బారెడ్డిలు నిల్చోవాల్సి వచ్చింది. సాక్షాత్తు మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో సైతం కలెక్టర్ సాక్షిగా ప్రోటోకాల్కు తిలోదాకాలిచ్చారు. కార్యక్రమం ముగిసేంత వరకూ ఉన్నతాధికారులు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోవాల్సిన వచ్చింది. తలాడించాల్సిన దుస్థితి టీడీపీ నేతలు ఎవరు స్పందించినా గంగిరెద్దులా తలాండించాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ప్రోటోకాల్ ఉల్లంఘనను కలెక్టర్ నియంత్రించాల్సి ఉంది. కాగా ఇదేవిషయమై ఓ ఉన్నతాధికారి సాక్షితో మాట్లాడుతూ అవన్నీ పట్టించుకుంటే ఇక్కడ ఉద్యోగం ఉండదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు చెప్పినట్లే ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్నా అనేక సమస్యలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారకార్యక్రమంలో సీటు దక్కకపోయినా బాధలేదు, దూషణలు లేకపోతే చాలంటూ పేర్కొనడం విశేషం. దీనిని బట్టి అధికారుల మానసిక పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
ఫిబ్రవరి 2, 3 తేదీల్లో కేంద్ర మంత్రి పర్యటన
రంపచోడవరం, న్యూస్లైన్ : కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వై.కిషోర్ చంద్రదేవ్ ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఏజెన్సీలో పర్యటించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. రెండున రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయన్నారు. మూడున పీఎంఆర్సీలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. అదే రోజు మంత్రి వ్యవసాయ, ఉద్యానవన, ఐకేపీ, రాజీవ్ యువ కిరణాలు, మండల మహిళా సమాఖ్య లీడర్లు తదితరులతో చర్చాగోష్టిలో పాల్గొంటారని తెలిపారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement