-
ఆంధ్రా అధికారి వేధింపులు ?
ఆదిలాబాద్ క్రైం : జిల్లా జైలులో ఓ ఆంధ్రా అధికారి గార్డింగ్ సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ను తీవ్రంగా వేధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన పెత్తనమే సాగాలని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఈ వేధింపులు తీవ్రం కావడంతో జైలు గార్డింగ్ సిబ్బంది, సదరు అధికారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దసరా సమయంలో సెలవు అడిగేందుకు వెళ్తే కించపరిచే విధంగా దూషించాడనే ఆరోపణలున్నాయి. ఖైదీలతో సదరు అధికారి ఇంటి పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ రోజు ఓ ఖైదీని ఇంటికి తీసుకెళ్లి వారితో వెట్టి చాకిరీ చేయించుకుని తిరిగి జైలుకు పంపిస్తున్నారనే తెలిసింది. జెలు అవసరాల కోసం దాతలు, ప్రభుత్వం ఇచ్చిన గృహోపకరణ వస్తువులను క్వార్టర్స్కు తీసుకెళ్లి ఉపయోగించుకుంటున్నారని సమాచారం. రిఫ్రిజిరేటర్, పడకలు, ఇతర వస్తువులను ఇంట్లో వినియోగించుకుంటున్నట్లు సమాచారం. జైళ్ల శాఖ డీఐజీకి ఫిర్యాదుకు సిద్ధం.. తమను ఓ అధికారి వేధిస్తున్నారంటూ జైల్ గార్డింగ్ సిబ్బంది జైళ్ల శాఖ డీఐజీని కలిసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటికే జైల్లో పనిచేస్తున్న 17మంది గార్డింగ్ సిబ్బంది మూకుమ్మడిగా ఫిర్యాదు చేసేందుకు సంతకాలతో కూడిన వినపత్రాన్ని అందజేయనున్నారు. శనివారం కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లినప్పటికీ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా జైళ్ల శాఖ డీఐజీని కలిసి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
బదిలీల కసరత్తు
జిల్లాలో 26 వేల మంది స్థానచలనానికి రంగం సిద్ధం వైద్య, ఉన్నత విద్య, ఇంటర్ బోర్డు ఉద్యోగులకు మినహాయింపు టీచర్లకు కౌన్సెలింగ్ పద్ధతిలోనే ... సెప్టెంబర్ 30లోగా పూర్తిచేయాలి రాష్ర్ట ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అన్ని శాఖలకు మార్గదర్శకాలు చిత్తూరు (టౌన్): ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు,అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. కాలపరిమితితో సంబంధం లేకుండా జిల్లా అధికారులను జీరో సర్వీసుతో బదిలీ చేయచ్చని ప్రభుత్వం నిర్దేశించింది. ఒకేచోట మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్కు మాత్రం బదిలీ తప్పదని పేర్కొంది. జిల్లాలో ఇంచుమించు 26 వేల మంది ఉద్యోగులు బదిలీకానున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఉద్యోగులకు బదిలీల్లో మినహాయింపునిచ్చింది. ఉపాధ్యాయులకు మాత్రం కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలని నిర్దేశించింది. ఈ తతంగమంతా సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అజేయకల్లం మంగళవారం జారీ చేశారు. దాంతో జిల్లాలోని అధికారులు, ఉద్యోగుల్లో గుబులు పట్టుకుంది. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో 745 మంది జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో మొత్తం 745 మంది అధికారులు, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. వీరిలో 65 మంది ఎంపీడీవోలు జీరో సర్వీసు నిబంధన కింద, 33 మంది సూపరింటెండెంట్లు, 647 మంది మినిస్టీరియల్ స్టాఫ్ మూడేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న నిబంధన కింద బదిలీకి అర్హులు. అయితే పంచాయతీరాజ్ పరిధిలో చేపట్టే బదిలీలన్నీ జెడ్పీ చైర్మన్ల పర్యవేక్షణలో జరగాల్సిందేనని ప్రభుత్వం మెలిక పెట్టింది. దాంతో జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఎంపీడీవో, ఈవోఆర్డీ తదితర అధికారుల మొదలు సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగుల బదిలీల వరకు జెడ్పీ చైర్మన్ కనుసన్నల్లోనే జరగాల్సి ఉన్నందున చైర్మన్ను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు క్యూకడుతున్నారు. బదిలీలపై నిషేధం సడలించక ముందు నుంచే జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అధికార పార్టీ నాయకులు తమ తమ ప్రాంతాల్లో బదిలీ చేయాల్సిన వారి జాబితాను చేతపట్టుకుని చైర్మన్ చుట్టూ తిరుగుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఎంపీడీవోలను నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. రెవెన్యూ శాఖలో అత్యధికం బదిలీల్లో రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 40 వేల మంది వరకు మినిస్టీరియల్ స్టాఫ్ పనిచేస్తుండగా వీరుకాకుండా ఇతర క్యాడర్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఇంచుమించు 5 వేల వరకు ఉన్నారు. అయితే వీరిలో రెవెన్యూకు చెందిన వారు దాదాపు 25 శాతానికి పైగా ఉన్నారు. వీరిలో సగం మందికి స్థానచలనం తప్పదు. మండలాల్లో తహశీల్దార్లు కీలకం కావడంతో తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంలో కొంతమంది అధికార పార్టీ నేతలు జిల్లా మంత్రిని కలిసి తమకు అనుకూలమైన తహశీల్దార్ల జాబితాను ఇప్పటికే అందజేసి ఉన్నారు. సత్తా చాటడం కోసం.. దశాబ్దకాలం తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో తమ సత్తాను చాటుకోవడం కోసం ఆ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. తమతమ ప్రాంతాల్లో పని చేస్తున్న అధికారులంతా గత పాలకవర్గాలకు అనుకూలంగా పని చేశారని, వారిని ఎలా బదిలీ చేయాలా అని ఎదురుచూస్తున్న నేతలకు బదిలీల కాలం కలిసొచ్చింది. దాంతో తమకు అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకునేందుకు జాబితాను ఇప్పటికే తయారు చేసుకున్నారు. -
కార్యాలయాలు కళకళ
నెల్లూరు సిటీ, న్యూస్లైన్ : సమ్మె విరామం ప్రకటన తరువాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం మళ్లీ సందడి నెలకొంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సకల జనుల సమ్మెలో భాగంగా వివిధ శాఖల ఉద్యోగులు 66 రోజుల పాటు తమ విధులకు దూరమయిన విషయం తెలిసిందే. కనీసం కార్యాలయం వైపు కూడా వెళ్లకుండా సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గురువారం ఏన్జీఓలు సమ్మె విరమించడంతో శుక్రవారం అన్ని కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కార్యాలయాలకు వెళ్లిన ఉద్యోగులకు తమ సీటు వద్ద దుమ్ము, ధూళి, బూజు దర్శనమిచ్చాయి. పలువురు ఉద్యోగులు ముందుగా తమ సీటు, టేబుల్ను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కార్యాలయాల అటెండర్, స్వీపర్లు సైతం సమ్మెలో కొనసాగడంతో ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం వినియోగించకపోవడంతో పలు కంప్యూటర్లో దుమ్మ, ధూళితో నిండి పోయాయి. కొన్ని కంప్యూటర్లు పనిచేయలేదు. సాంకేతిక నిపుణులు స్వల్ప పాటి మరమ్మతులు చేసిన వాటి బాగు చేశారు. విద్యాశాఖాధికారి కార్యాలయం లో మినిస్టీరియల్ స్టాఫ్ వంద శాతం విధులకు హాజరయ్యారు. రవాణా శాఖ కార్యాలయంలో సుధీర్ఘ విరామం తర్వాత కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సిబ్బంది అధికారులు అందరూ విధులకు హాజరయ్యారు. అయితే సమ్మె ముగిసిన తర్వాత తొలిరోజు దరఖాస్తుదారుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. సాధారణ రోజుల్లో వందల సంఖ్యలో వచ్చే దరఖాస్తులు శుక్రవారం అన్ని పనులకు సంబంధించి కేవలం 70 లోపు రావడం సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఎల్ఎల్ఆర్, రిజిస్ట్రేషన్, లెసైన్స్, ఎఫ్సీ, వివిధ రకాల చలానాలు కలిపినా 70 కూడా రాలేదు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement