-
‘ముస్లింలకు సబ్ ప్లాన్ తీసుకొస్తాం’
సాక్షి, చిత్తూరు : నవరత్నాల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయటమే తన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం పుంగనూర్ నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో ముస్లింల కోసం సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. ‘ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఒక్కటే చెప్పదల్చుకున్నా. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి మరుగున పడిపోయింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది సమర్థవంతమైన పాలన. రాజకీయాలంటే విశ్వసనీయత కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు. నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి. మహానేత వారసుడిగా ప్రజల శ్రేయస్సు కోసం ఎందాకైనా వెళ్తా. అదే నా అంతిమ లక్ష్యం’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో.. ఒక్కో కులానికి హామీలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఎలా దగా చేయాలో రీసెర్చ్ చేసిన వ్యక్తి చంద్రబాబు. హామీలు నెరవేర్చకపోగా పైగా ప్రశ్నించిన వారిని ఓ వ్యక్తి తోలు తీస్తా.. తాట తీస్తా అని బెదిరిస్తున్నారు. ఇక్కడే చంద్రబాబు అసలు స్వరూపం బయటపడిందని వైఎస్ జగన్ చెప్పారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే... చంద్రబాబు మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఒక్కసారి పరిశీలిద్దాం. నిరుద్యోగ యువకులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయమన్నారు. వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంక్ ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పిస్తానని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. వీటిల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా? అని జగన్ ప్రశ్నించారు. (జనాల నుంచి లేదు అన్న సమాధానం వినిపించింది) ప్రతీ దాంట్లోనూ చంద్రబాబు మోసం స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడి దీవెనలు, మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తే ఏం చేయాలో సలహాలు, సూచనలు తీసుకుంటా. అంతకు ముందు నవరత్నాల ద్వారా వైఎస్సాఆర్సీపీ ఏం ఏం చేయదల్చుకుందో వివరిస్తానని వైఎస్ జగన్ అన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ల ప్రధాన సమస్యల్లో ఒకటి. పిల్లలు చదువు. లక్షల్లో ఫీజులు ఉంటే రీఎంబర్స్మెంట్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేస్తోంది. పండగలు వస్తే ఆయా మతాల మీద చంద్రబాబు ప్రేమ కురిపిస్తారు. కానీ, నిజమైన ప్రేమంటో నేను చెబుతున్నా విను చంద్రబాబు.. ఎంత ఖర్చైనా సరే పిల్లల చదువులకు భరోసా ఇవ్వటమే అసలైన ప్రేమ. అది నేను అందిస్తా. చదివించటమే కాదు.. వారికి ఖర్చుల కోసం 20 వేల రూపాయలను కూడా అందజేస్తానని జగన్ పేర్కొన్నారు. పేదలు అప్పులపాలు కాకుండా ఉండేందుకు సాయం చేస్తాం. ఆరోగ్యశ్రీలో అవసరమైన మార్పులు తీసుకొస్తా. ఏపీలోనే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్న ఆరోగ్యశ్రీ కిందకు వర్తింపజేస్తాం. ఆపరేషన్ తర్వాత రెస్ట్ పీరియడ్లో డబ్బులు అందజేస్తాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి 10 వేల రూపాయల పెన్షన్ అందజేస్తాం అని జగన్ వివరించారు. గతంలో అనంతపురంలో చెప్పిన విధంగా ఇమామ్లకు 5 వేల రూపాయలకు బదులు 10 వేల రూపాయలు.. మౌసమ్లకు 3 వేల రూపాయలకు బదులు.. 5 వేల రూపాయలు అందజేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇక ముస్లిం సోదరులకు ఎంత చేసినా తక్కువేనన్న జగన్.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా సబ్ ఫ్లాన్ను తీసుకొస్తానని హామీనిచ్చారు. నవరత్నాలకు అవసరమైన మార్పులను సూచించాల్సిందిగా అక్కడ హాజరైన ముస్లిం ప్రజానీకాన్ని ఆయన కోరారు. ‘మీ కష్టాలను పక్కన పెట్టి చెరగని చిరునవ్వులతో ప్రేమానురాగాలు చూపిస్తూ.. నా భుజాన్ని తడుతూ వెంట నడుస్తున్నా ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ముస్లిం సోదరులను ఉద్దేశించి వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
'మైనారిటీ సబ్ప్లాన్' కోసం సీపీఎం పోరుబాట
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల కోసం రూపొందించిన విధంగానే ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన బాటపట్టింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. కార్యకర్తలతో కలిసి సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీల అభివృద్ధికి ఎస్టీల మాదిరిగా ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ప్రత్యేకంగా 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అటు ఖమ్మం కలెక్టరేట్ వద్ద కూడా సీపీఎం ధర్నా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు ధర్నాలో పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement