-
మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు!
చిరు(సిరి)ధాన్యాల ఆహారం ఎంతో ఆరోగ్యదాయకమన్న స్పృహ ఇప్పుడిప్పుడే తిరిగి మేలుకొంటున్న తరుణంలో చిరుధాన్యాలను పప్పుధాన్యాలతో కలిపి మిశ్రమ సాగు చేసే రైతుల సంఖ్య తెలుగునాట అంతకంతకూ పెరుగుతోంది. అయితే, శుద్ధి యంత్రాల ధరలు అందుబాటులో లేక చాలా మంది రైతులు సిరిధాన్యాలను పండించడం లేదు. పండించిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన యంత్రాలతో పని లేకుండానే, కేవలం మిక్సీతోనే ఇంటిపట్టున మహిళలు శుద్ధి చేసుకోగలిగిన సులువైన పద్ధతి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిపై సాగుబడి ప్రత్యేక కథనం.. జొన్నలు (Sorghum), రాగులు (Finger Millet), సజ్జలు (Pearl Millet).. ఈ మూడు రకాల చిరుధాన్యాలను కంకుల నుంచి రాలగొట్టి నూర్చుకుంటే చాలు.. వాడకానికి సిద్ధమవుతాయి. గింజలపైన పొట్టు ఉండదు. కాబట్టి వీటికి ప్రాసెసింగ్ సమస్య లేదు. అయితే, కొర్రలు (fox tail millet), అండుకొర్రలు (brown top milletట), సామలు (little millet), ఊదలు (Barnyard Millet), అరికలు (Kodo Millet) వంటి చిరుధాన్యాల (సిరిధాన్యాలు) సంగతి కొంచెం భిన్నంగా ఉంటుంది. వీటి ధాన్యం నూర్పిడి చేసిన అనంతరం బియ్యం పొందాలంటే ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ధాన్యం పైన పొట్టును తొలగిస్తే.. తినడానికి వీలయ్యే చిరుధాన్యాల బియ్యం సిద్ధమవుతాయి. సాంప్రదాయకంగా ఈ ధాన్యాన్ని తిరగలి (ఇసుర్రాయి)లో ఇసిరి, తర్వాత రోట్లో దంచుకొని, చెరిగి బియ్యాన్ని సిద్ధం చేసుకోవటం ఆనవాయితీ. అయితే, ఇది అధిక శ్రమ, సమయంతో కూడిన పని. కాబట్టే, ఈ మైక్రో మిల్లెట్స్ ఎంత ఆరోగ్యదాయకమైనవైనప్పటికీ కాలక్రమంలో కనుమరుగయ్యాయి. తిరగలి, రోలు అవసరం లేకుండా.. ఖరీదైన యంత్రాలతో పని లేకుండా.. మరుగున పడిపోయిన ఈ 5 రకాల (కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు) మైక్రో మిల్లెట్సే మానవాళిని ప్రాణాంతక జబ్బుల నుంచి రక్షించే నిజమైన ‘సిరిధాన్యాల’ంటూ కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ చిరకాలంగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సిరిధాన్యాలను పాత పద్ధతిలోనే ఇసుర్రాయిలో ఇసిరి, రోట్లో దంచి శుభ్రం చేసుకోవటం తప్ప మరో మార్గం లేదా? యంత్రాలు అవసరం లేకుండా బియ్యం మార్చుకోగలిగే మార్గం ఇక లేదా? సిరిధాన్యాలను సాగు చేసే చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఇల్లు దాటి వెళ్లకుండా ఈ ధాన్యాలను బియ్యంగా మార్చుకోగలిగే పద్ధతిని రూపొందించలేమా? అని డా. ఖాదర్ మదనపడేవారు. తన సోదరీమణులు మహబున్నీ, కాశింబిలతో కలిసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మహబున్నీ కొత్త ఆలోచనతో తిరగలి, రోలు అవసరం లేకుండా.. ఖరీదైన యంత్రాలతో పని లేకుండానే.. ప్రతి ఇంట్లో ఉండే మిక్సీ ద్వారానే చిరు ధాన్యాలపై పొట్టును సులభంగా తీసివేసి బియ్యంగా మార్చుకునే పద్ధతిని అన్వేషించటంలో మహబున్నీ కొద్ది నెలల క్రితం సఫలీకృతులయ్యారు. వృత్తి రీత్యా నర్సు అయిన ఆమె స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. తన సోదరిని ‘బుచ్చి’ అని పిలుచుకునే డా. ఖాదర్ ఆమె కనిపెట్టిన ఈ పద్ధతికి ‘సిరిధాన్యాలను శుద్ధి చేసే బుచ్చి పద్ధతి’ అని పేరు పెట్టారు. రైతుకు ఏడాది పొడవునా ఆదాయం సిరిధాన్యాలను సాగు చేసే చిన్న, సన్నకారు రైతులు రూ. లక్షలు వెచ్చించి యంత్రాలను ఏర్పాటు చేసుకొని ముడి సిరిధాన్యాలను శుద్ధి చేసుకోలేరు. గంపగుత్తగా వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటారు. అయితే, మిక్సీతోనే ఇంటిపట్టున అవసరం మేరకు రోజుకు 20 కిలోల చొప్పున సిరిధాన్యాల బియ్యం తయీరు చేసుకోగలిగే ఈ సదుపాయం వల్ల.. వారు అవసరమైనప్పుడు, ఇతర వ్యవసాయ పనులు లేనప్పుడు ఈ పని చేసుకుంటారు. సిద్ధమైన బియ్యాన్ని తాము తినటంతోపాటు గ్రామస్తులకు, స్థానిక మార్కెట్లలోనూ ఏడాది పొడవునా అమ్ముకొని మంచి నికరాదాయం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఎక్కువ ఎకరాల్లో పండించే రైతులైనా బుచ్చి పద్ధతిలో చిరుధాన్యాలను శుద్ధి చేయడటం ద్వారా.. తన గ్రామంలోనే మహిళలకు నీడపట్టున పని కల్పించడానికి కూడా ఇది నిస్సందేహంగా ఉపకరిస్తుంది. నిబద్ధతతో సృజనాత్మకంగా.. వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం దిశగా ముందడుగు వేస్తున్న డా. ఖాదర్, ఆయన కుటుంబ సభ్యులు, సహచర బృందానికి జేజేలు! రైతుల చేతుల్లోనే సిరిధాన్యాలు! డాక్టర్ ఖాదర్ తన సోదరి మహబున్నితో కలిసి వినూత్నమైన మిక్సీ పద్ధతిని కనుగొన్నారు. ముడి సిరిధాన్యాలకు పైన ఉండే పొట్టు తీసి బియ్యంగా తయారు చేసే ప్రక్రియ కంపెనీల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ‘బుచ్చి పద్ధతి’ ఉపయోగపడుతుంది. యంత్రాల అవసరం లేకుండా కేవలం మిక్సీతోనే రైతులు, మహిళలు కుటీర పరిశ్రమగా సిరిధాన్యాల బియ్యం తయారీని చేపట్టవచ్చు. ముడి సిరిధాన్యాల పైపొట్టు తీయడంలో ఇబ్బందుల వల్లనే సిరిధాన్యాల సాగు, వాడకం మరుగునపడిపోయింది. డా. ఖాదర్ కృషి వల్ల సిరిధాన్యాల సాగు గత రెండేళ్లలోనే రెట్టింపైంది. మిక్సీ పద్ధతితో పొట్టు తీయడం కూడా సులభమైంది. మిక్సీలతో ఇంటి స్థాయిలోనే కాకుండా, వాణిజ్య స్థాయిలో కూడా సిరిధాన్యాల బియ్యం తయారీని చేపట్టవచ్చు. ఇప్పటికే మైసూరులో, తమిళనాడులో ఇటువంటి యూనిట్లను ఏర్పాటు చేయించాము. మిక్సీ సాధారణ వేగాన్ని 2,800 ఆర్.పి.ఎం. నుంచి 1,500 ఆర్.పి.ఎం.కు తగ్గించుకోవాలి (మిక్సీలోని కాయిల్ను మార్చడం ద్వారా వేగాన్ని తగ్గించవచ్చు). కొంచెం వంచిన సింగిల్ బ్లేడును(పదును లేకుండా సానరాయితో మొండి చేసి) వాడితే నూక శాతం బాగా తగ్గినట్లు గుర్తించాం. అటవీ వ్యవసాయ(కాడు కృషి) పద్ధతిలో రసాయనాల్లేకుండా సిరిధాన్యాల సాగుపై రైతు శిక్షణా శిబిరాల్లోనే మిక్సీతో బియ్యం తయారీ పద్ధతిపైన కూడా శిక్షణ ఇస్తున్నాం. ఇటీవల రాయచూర్లో శిక్షణ ఇచ్చాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగులోనే రైతులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. – బాలన్ కృష్ణ (097405 31358), అటవీ వ్యవసాయ నిపుణుడు, మైసూరు, కర్ణాటక balan71@gmail.com మిక్సీ బర్నర్ను వెనక్కి తిప్పినట్టే తిప్పి వదలాలి..! కొర్రలు తదితర సిరిధాన్యాలకు పైన ఉండే పొట్టును తీయడానికి మామూలుగా ఇసుర్రాయితో ఇసిరి, తర్వాత రోట్లో దంచి చెరిగే వాళ్లం. మిక్సీతోనే పొట్టు తీసే పద్ధతిని కొన్ని నెలలుగా వాడుతున్నాం. ఇది చాలా సులువు. పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో ఉంటున్న వాళ్లు కూడా సిరిధాన్య బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ముడి సిరిధాన్యాలను చెరిగి మట్టిపెళ్లలు, పుల్లలు, ఇసుక లేకుండా సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జారులో సగానికి పైగా నింపుతాను. తర్వాత బర్నర్ను (ముందుకు.. అంటే 1 వైపు తిప్పకూడదు) కొంచె వెనక్కి(‘పల్స్’వైపు) తిప్పినట్టే తిప్పి వదిలేస్తాను. ఇలా 50 సార్లు చేసిన తర్వాత చేటతో చెరుగుతాను. మళ్లీ మిక్సీలో పోసి 30 సార్లు మళ్లీ వెనక్కి తిప్పి వదిలేసి, మరోసారి చెరుగుతాను. పొట్టు చాలా వరకు పోతుంది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మళ్లీ జారులో పోసి ఐదారు సార్లు పల్స్ వైపు తిప్పి వదిలేసి.. చెరిగితే సరిపోతుంది. ఇంట్లో మిక్సీ ఉన్న ఎవరైనా సిరిధాన్యాల బియ్యాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సులువుగా తయారు చేసుకోవచ్చు. – మహెబున్నీ (70930 11240), ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా సిరిధాన్యాలను రైతులే నగరాలకు సరఫరా చేయొచ్చు! సిరిధాన్యాలను పండించే రైతులు తమ గ్రామాల్లోనే తక్కువ ఖర్చుతో బియ్యం తయారు చేసుకొని, స్థానిక మహిళలకు పని కల్పిస్తూ, మంచి నికరాదాయం పొందవచ్చు. యంత్రాల అవసరం లేకుండా మిక్సీలతోనే సిరిధాన్యాల బియ్యం తయారీని రైతులు తాము తినడం కోసం మాత్రమే కాదు పట్టణాలు, నగరాల్లో నివాసం ఉండే వారి కోసం కూడా పెద్ద ఎత్తున చేపట్టవచ్చు. రెండు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకొని 20 మిక్సీలను సమకూర్చుకుంటే విద్యుత్తు సదుపాయం కూడా అవసరం లేదు. 20 మంది మహిళలతో రోజుకు 400 కిలోల వరకు సిరిధాన్యాల బియ్యాన్ని తయారు చేసుకుంటూ.. వినియోగదారులకు నేరుగా సరఫరా చేయవచ్చు. అనేక చోట్ల ఇప్పటికే ఇలాంటి యూనిట్లు ఏర్పాటయ్యాయి. – డాక్టర్ ఖాదర్వలి (94485 61472), స్వతంత్ర అటవీ వ్యవసాయ, ఆహార శాస్త్రవేత్త, మైసూరు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఇంటిప్స్
కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి సులువుగా వేరుపడాలంటే వేడి నీళ్లలో ముంచి తీయాలి.జిగురు మరీ గట్టిగా ఉండి, సీసాలోంచి రాకుండా ఉంటే అందులో నాలుగైదు చుక్కల వెనిగర్ వేయాలి. మిక్సీ బ్లేడ్లు మొండిబారకుండా ఉండాలంటే నెలకొసారి దొడ్డుప్పును మిక్సీలో వేసి తిప్పాలి. తేనె గట్టిపడితే వెడల్పాటి పాత్రలో సగం దాకా నీళ్లు మరిగించి అందులో తేనె సీసాను ఉంచాలి. -
చోరాఫలి
కావలసినవి: శనగపిండి - 1 కప్పు, మినప్పప్పు - 1/3 కప్పు, బేకింగ్సోడా - చిటికెడు, నీళ్లు - పావు కప్పు, కారం పొడి - 2 చెంచాలు, నూనె - తగినంత, చాట్ మసాలా - 1 చెంచా, ఉప్పు - చిటికెడు తయారీ: మినప్పపు్పును మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టౌ పై పెట్టాలి. వేడెక్కాక ఉప్పు, ఒక చెంచా నూనె వేయాలి. గోరువెచ్చగా అయ్యాక దించి పక్కన పెట్టాలి. ఓ గిన్నెలో శనగపిండి, మినప్పప్పు పొడి, సోడా తీసుకుని, గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. తర్వాత ఆ పిండితో చిన్న చిన్న చపాతీలు చేసి, వాటిని ఫొటోలో చూపినట్టు కట్ చేయాలి. ఆపైన వీటిని డీప్ ఫ్రై చేసుకో వాలి. చివరగా వాటిమీద ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లాలి. ఇది గుజరాతీ స్నాక్. దీపావళికి అయితే తప్పక చేసుకుంటారు. -
ఇంటి చిట్కాలు
బియ్యం పురుగుపట్టకుండా... మిక్సీలో బ్లేళ్లు పదునుగా ఉండాలంటే కొంచెం రాతి ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి. ఇలా నెలకొకసారి చేస్తే బ్లేళ్లు పదునుగా ఉంటాయి. {ఫిజ్ దుర్వాసన వేస్తుంటే గిన్నెలో కాఫీగింజలు వేసి మొదటి షెల్ఫ్లో పెడితే వాసన పోతుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం బస్తాలో వెల్లుల్లి రెబ్బలు లేదా లవంగాలు వేయాలి. కొత్తిమీర, పుదీనా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పలుచని బట్టలో చుట్టి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. దిండు గలీబులకు నూనె మరకలుంటే బంగాళదుంప ముక్కతో రుద్ది ఉతికితే మరకలు తేలిగ్గా పోతాయి. సీసాలను కడగడం కష్టంగా ఉంటే లోపల కాసిన్ని బియ్యం పోసి కొంచె వేడినీళ్లు పోసి మూత పెట్టి షేక్ చేస్తే శుభ్రం అవుతుంది. -
నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే లక్ష్యం
గ్రైఫొన్ ఎండీ రాజేష్ మోహన్ సాక్షి, హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన గృహోపకరణాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రముఖ డిస్ట్రిబూషన్ కంపెనీ గ్రైఫొన్ అప్లయెన్సెస్ ఎండీ రాజేష్ మోహన్ తెలిపారు. యూకేలో బ్రాండ్ ఉత్పత్తులుగా పేరుగాంచిన కంపెనీలు బ్లాక్ అండ్ డెక్కర్, రస్సెల్ హాబ్స్, రెమింగ్టన్ వస్తుత్పత్తులకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు సన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ డీలర్షిప్ను దక్కించుకున్న సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజేష్ మోహన్ మాట్లాడుతూ ఇటీవల కొత్తగా రైస్ కుక్కర్స్, మిక్సీ తదితర ఆరు వస్తువులను మార్కెట్లోకి తెచ్చినట్లు తెలిపారు.ఈ ఏడాది 10 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సమావేశ ప్రాంగణంలో కొత్త ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్య క్రమంలో సన్ ఎంటర్ప్రైజెస్ పార్టనర్స్ ఎండీ హమ్జద్ అలీ, అయిజాజ్ హుస్సేన్, ఎండీ, జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement