-
ఎమ్మెల్యే వర్సెస్ సబ్కలెక్టర్
ఎస్సారెస్పీ స్థలంలో ఎమ్మెల్యే డ్రైవర్ ఇంటి నిర్మాణం కూల్చివేసిన తహసీల్దార్ తిరిగి నిర్మించిన టీఆర్ఎస్నాయకులు పనులు నిలిపివేయించిన సబ్కలెక్టర్ మెట్పల్లి: ప్రభుత్వ స్థలంలో ఓ ఇంటి నిర్మాణం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సబ్కలెక్టర్ ముషారఫ్ల మధ్య వివాదానికి దారి తీసింది. పట్టణంలోని రాంనగర్లో ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వ–32కు చెందిన స్థలాన్ని ఎమ్మెల్యే వద్ద డ్రైవర్గా పని చేసే వ్యక్తి అక్రమించి కొన్ని రోజుల నుంచి ఇంటిని నిర్మిస్తున్నాడు. దీనిపై కొందరు సబ్కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన దానిని తొలగించాలని తహశీల్దార్ సుగుణాకర్రెడ్డిని ఆదేశించారు. దీంతో తహశీల్దార్ మంగళవారం సాయంత్రం సిబ్బందితో అక్కడకు వెళ్లి దానిని తొలగించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తహశీల్దార్ పట్టించుకోకుండా కూల్చివేయించారు. ఇదే విషయాన్ని నాయకులు ఎమ్మెల్యేకు తెలుపగా, ఆయన తహశీల్దార్పై తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేగాకుండా రాత్రి సమయంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు సంఘటనా స్థలానికి తరలివచ్చి తిరిగి ఇంటి నిర్మాణం చేపట్టారు. తహాశీల్దార్పై ఎమ్మెల్యే అగ్రహాం వ్యక్తం చేయడం, తిరిగి నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలుసుకున్న సబ్కలెక్టర్ నేరుగా పోలీస్ బందోబస్తుతో సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రభుత్వ స్థలంలో ఇంటిని ఎలా నిర్మిస్తారంటూ అక్కడ ఉన్న నాయకులపై అగ్రహాం వ్యక్తం చేసి ఇటుకలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. దీనికి నాయకులు అడ్డుతగిలి సబ్కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. సీఐ సురేందర్తో సబ్కలెక్టర్ ఆయనతో మాట్లాడి నిర్మాణ పనులు జరుగకుండా చూడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
‘డబుల్’ వేగం పెంచాలి
నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోండి ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ సూచన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మెట్పల్లిలో సమీక్ష మెట్పల్లి(కోరుట్ల) : పేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో మేస్త్రీల సహాయం తీసుకోవాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. మెట్పల్లిలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 1600 ఇళ్ల నిర్మాణాలకు పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా.. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవలే సిమెంట్ కంపెనీలతో మాట్లాడి సిమెంట్ బస్తాను రూ.230కి ఇచ్చేలా యజమానులను ఒప్పించారు. ఇసుకను సైతం తక్కువ ధరకు అందించేలా తాము చూస్తామని వెల్లడించారు. ఇళ్లు మంజూరైన పట్టణాలు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు మేస్త్రీలు ముందుకు వచ్చేలా చొరవ తీసుకోవాలని, వారికి అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. మేస్త్రీల సహకారంతో ఇటీవలే మరుగుదొడ్లను పూర్తిచేశామని, అదేస్ఫూర్తితో ఇళ్లనూ నిర్మించాలని సూచించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గానికి 560 ఇళ్లు కేటాయించారని, వాటిని పూర్తిచేస్తే సీఎంతో మాట్లాడి అదనంగా మరో వెయ్యి ఇళ్లను మంజూరు చేయిస్తామని వివరించారు. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 26లోపు వందశాతం నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీవోపై ఆగ్రహం ఇబ్రహీంపట్నం ఎంపీడీవో శశికుమార్ పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తిచేయడం సాధ్యం కాకపోవచ్చని ఎంపీడీవో పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇతర మండలాల ఎంపీడీవోలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు వెనుకడుగు వేస్తున్నావ్.. సాధ్యం కాదని ఎలా అంటవ్..’ అంటూ హెచ్చరించారు. సరిగ్గా పనిచేయకుంటే చర్యలు తప్పవని మందలించారు. కార్యక్రమంలో సబ్Œ కలెక్టర్ ముషారఫ్అలీ, పంచాయతీరాజ్ ఈఈ మనోహర్రెడ్డి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement